-
నల్గొండలో ప్రేమ పేరుతో యువతిపై దాడి చేసిన యువకుడు అరెస్టు
సాక్షి, నల్లగొండ : ప్రేమ పేరుతో యువతిని వేధింపులకు గురి చేస్తూ, కత్తితో దాడి చేసిన ప్రమోన్మాది మీసాల రోహిత్ను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి బుధవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. రోహిత్, బాధితురాలు క్లాస్మెట్స్ అని తెలిపారు. ప్రేమించాలని రోహిత్ ఒత్తిడి చేసేవాడని, గతంలోనూ గ్లాస్ పీస్తో అమ్మాయిని బెదిరించేవాడని పేర్కొన్నారు. యువతి ఒప్పుకోక పోవడంతోఫ్రెండ్తో ఫోన్ చేయించి పార్క్కు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ‘బాధితురాలు తన స్నేహితురాలుతో కలిసి పార్క్ వద్ద వెళ్లగా.. అక్కడ కొద్ది సేపు అందరూ కలిసి మాట్లాడుకున్నారు. తరువాత నిందితుడు పర్సనల్గా మాట్లాడాలని చెప్పి బాధితురాలిని పక్కకు తీసుకెళ్లాడు. ముందస్తు ప్లాన్ ప్రకారం కూరగాయల కత్తితో వచ్చిన రోహిత్ బాధితురాలిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. కడుపు, చేతులు, కాళ్లు, మొహం, పైన పొడిచి గాయపరిచి అక్కడినుండి పరారయ్యాడు. సంబంధిత వార్త: ప్రేమించ లేదని.. కత్తితో పొడిచి.. నల్లగొండలో ప్రేమోన్మాది ఘాతుకం మంగళవారం మధ్యాహ్నం నల్గొండ పట్టణంలోని ఫారెస్ట్ పార్క్లో అమ్మాయిపై హత్యాయత్నం జరిగిందని సమాచారం వచ్చింది. వెంటనే ఈ కేసు విచారణను డీఎస్పీకి అప్పగించాం. రోహిత్ను అరెస్ట్ చేశాం. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నాం’ అని వెల్లడించారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన నల్లగొండ డీఎస్పీ నరసింహరెడ్డి, సీఐ గోపి, ఎస్ఐ వెంకట రెడ్డి, సిబ్బంది షకీల్, శ్రీకాంత్ అభినందించారు. చదవండి: సినిమాకేం తీసిపోదు.. తాళి కట్టే సమయానికి పెళ్లిని అడ్డుకున్న యువతి -
వరంగల్: యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది అజహర్ అరెస్ట్
సాక్షి, వరంగల్ జిల్లా: హన్మకొండ గాంధీనగర్లో యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది అజహర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అజహర్పై హత్యాయత్నంతో పాటు బెదిరింపు వేధింపులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నేడు(శనివారం) కోర్టులో హాజరుపర్చనున్నారు. ఇదిలా ఉండగా ప్రేమోన్మాది ఘాతుకంతో గాయపడిన అనూషకు వరంగల్ ఎంజీఎంలో వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అనూష కోలుకుంటోందని, ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు. కాగా హనుమకొండ గాంధీనగర్లో శుక్రవారం ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడిన విషయం విదితమే. ప్రియురాలు గొంతుకోసి పారిపోయాడు. నర్సంపేట మండలం లక్నేపల్లికి కి అనూష కేయులో ఎంసిఏ ఫైనలియర్ చదువుతూ, హైదరాబాద్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఈరోజు ఎంసిఏ ఎగ్జామ్ ఉండడంతో గాంధీనగర్లో కుంటుంబ సభ్యుల వద్దకు వచ్చింది. చదవండి Warangal Premonmadi: వరంగల్లో ప్రేమోన్మాది ఘాతుకం.. చున్నీతో చేతులు కట్టేసి.. అనూష వచ్చిన విషయం తెలుసుకున్న అజహర్ ఆమెను వెంబడించి చున్నీతో ముఖాన్ని చుట్టేసి ముందుగానే తనవెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర గాయంతో అరుచుకుంటూ బయటకు వచ్చిన ఆమెను స్థానికులు 108లో ఎంజీఎంకు తరలించారు. తాను పనికి వెళ్లి వచ్చేసరికి ఈ ఘోరం జరిగిపోయిందని విద్యార్థిని తల్లి రేణుక విలపించింది. తన కుమారుడు మూడేళ్ల క్రితం కేన్సర్తో మృతి చెందాడని, ఇప్పుడిలా జరిగిందంటూ ఆమె రోదించింది. -
కాబోయే భర్త పీక కోసిన కేసు.. నోరు విప్పిన పుష్ప
సాక్షి, అనకాపల్లి: కాబోయే భర్తపై యువతి హత్యాయత్నానికి ప్రయత్నించిన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. బాధితుడు రామునాయుడిపై దాడి చేసినట్లు నిందితురాలు పుష్ప పోలీసుల ముందు ఒప్పుకుంది. తనకు అసలు పెళ్లే వద్దని చాలాసార్లు తల్లిదండ్రులకు చెప్పానని, అయినా వాళ్లు వినలేదని పుష్ప పోలీసులకు వెల్లడించింది. అయినా తల్లిదండ్రుల బలవంతంతో రామునాయుడితో వివాహానికి సిద్ధపడింది పుష్ప. ఈ క్రమంలో ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక ఆమె డిప్రెషన్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. బాధితుడిపై ఘోరానికి పాల్పడిందట. చాలా కాలంగా భక్తి మైకంలో ఉన్న పుష్ప.. తనకు పెళ్లి వద్దని, దేవుడి భక్తురాలిగా ఉండిపోతానంటూ తల్లిదండ్రులకు పలుమార్లు చెప్పిందట. అయితే ఇప్పటికే రెండు పెళ్లి చూపులు రద్దు కావడంతో మూడోసారి ఎలాగోలా పుష్పను ఒప్పించారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో కాబోయే భర్తను బయటకు తీసుకెళ్లి చంపాలని పుష్ఫ ప్లాన్ వేసింది. సరదాగా బయటకు వెళ్దామంటూ కోరింది. కత్తి కనిపించకుండా కూడా వెంట తీసుకెళ్లింది. గుడి దగ్గర రామునాయుడు కళ్లకు చున్నీ కట్టి.. సర్ప్రైజ్ అంటూ గొంతు కోసేసింది. టైం బాగుండి.. ప్రాణాలతో బయటపడ్డాడు రామునాయుడు. ఈ ఘటన జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకర్షించగా.. సోషల్ మీడియాలో ఈ ఘటనపై మీమ్స్ పేలుతున్నాయి. గాయపర్చిన తర్వాత కూడా.. దాడి తర్వాత రక్తంతో రామునాయుడు షర్టు తడిచిపోవడంతో.. పుష్ప భయందోళనకు లోనైంది. రక్తం కారకుండా పుష్ప చున్నీనే గొంతుకు కట్టుకుని ఆమె కూడా బైక్ ఎక్కించుకుని రామునాయుడు రావికమతం ఆస్పత్రికి బయలుదేరాడు. మార్గంమధ్యలో పరిస్ధితి విషమంగా ఉండటంతో బైక్ను రోడ్డు పక్కన ఆపి సొమ్మసిల్లిపోయాడు. అక్కడ ఉన్న ఓ యువకుడు రామునాయుడు పరిస్ధితిని చూసి.. రావికమతం ఆస్పత్రిలో ఇద్దరినీ విడిచి వెళ్లిపోయాడు. -
Crime News: ప్రియురాలి ఉసురు తీసిన సెల్ఫోన్ గిఫ్ట్
ప్రేమలో ఉన్నప్పుడు పరస్పరం కానుకలు ఇచ్చుకోవడం సహజం. అలాగే ప్రేమలో బ్రేకప్లు కూడా సర్వసాధారణమే. కానీ, మరో యువతితో పెళ్లి ఫిక్స్ కావడంతో బ్రేకప్ చెప్పిన ఆ ప్రియుడి తీరును ఆమె తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో.. ప్రియురాలిపై కోపంతో దాష్టీకానికి పాల్పడ్డాడు. తాను కానుకగా ఇచ్చిన సెల్ఫోన్.. తిరిగి ఇవ్వడం లేదన్న కోపంతో ప్రియురాలిని ఏకంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. జార్ఖండ్లోని పాకుర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 20 ఏళ్ల యువకుడు, సదరు బాధిత యువతి రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో కూడా తెలుసు. అబ్బాయి ఇంట్లో అభ్యంతరాలు చెప్పకపోతే ఈ ఏడాదిలో వీళ్లద్దరికి వివాహం చేయాలని అనుకున్నారు కూడా. అయితే.. ఈ మధ్యే ఆ యువకుడికి మరో యువతితో నిశ్చితార్థం జరిగింది. దీంతో ప్రియురాలికి దూరంగా ఉంటూ వస్తున్నాడు. అంతేకాదు తాను కొనిచ్చిన కాస్ట్లీ ఫోన్ను తిరిగి ఇచ్చేయాలంటూ ఆమెను అడుగుతూ వస్తున్నాడు. ఆమె అంగీకరించకపోవడంతో కోపం పెంచుకున్నాడు. ఆదివారం ఉదయం స్థానిక మైదానంలో జరిగే ఫుట్బాల్ మ్యాచ్ చూద్దామంటూ ఆమెను బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె గొంతు కోసి సెల్ఫోన్ తీసుకెళ్లాడు. రక్తపు మడుగులో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. సోమవారం ఉదయం మృతదేహాన్ని గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తులో ప్రియుడే ఆమెను బయటకు తీసుకెళ్లినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దీంతో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గట్టిగా నిలదీయడంతో నేరం ఒప్పుకున్నాడు నిందితుడు. -
ప్రాణం తీసిన చైనా మాంజా.. మంచిర్యాలలో విషాదం
సాక్షి, మంచిర్యాల: సంక్రాంతిపూట గాలిపటాల పండుగ ఓ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. చైనా మాంజా ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది. మంచిర్యాల జిల్లాలోని పాత మంచిర్యాల జాతీయ రహదారిపై బైక్పై వెళ్తున్న దంపతులకు గాలిపటం (చైనా మాంజ) దారం అడ్డు తగిలింది. ఆ దారం మెడకు చుట్టుకోవడంతో భీమయ్య అనే వ్యక్తి గొంతు కోసుకుపోయింది. దీంతో భీమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్యకు కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి స్వస్థలం జగిత్యాల జిల్లా గొల్లపల్లిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో యువతి.. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో శనివారం గాలిపటంలోని చైనా మాంజా 20 ఏళ్ల యువతి గొంతు కోయడంతో ప్రాణాలు కోల్పోయింది. ఉజ్జయినిలోని మాధవ్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని జీరో పాయింట్ బ్రిడ్జి వద్ద ఓ మహిళ తన స్నేహితుడితో కలిసి బైక్పై వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గాలిపటం దారం గొంతును కోసేయడంతో తీవ్ర రక్తస్రామై యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
ధర్మాగ్రహం ముందు నిలవని దాదాగిరి
కన్నీటి సుడులు.. కరిగె మారాజు
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement