-
చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం గుర్తురాదు
-
మిత్ర ధర్మం పాటించి ఇన్నాళ్లూ ఊరుకున్నాం
గుంటూరు : మిత్ర ధర్మాన్ని పాటించి ఏపీలో అక్రమాలు, అవినీతిపై ఇన్నాళ్లూ నోరు మూసుకుని ఉన్నామని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ..ఇసుక మాఫియా, దందాపై ఎప్పటికప్పుడు లెక్కలు అడిగినందుకు టీడీపీ బయటికి వెళ్లిందని ఆరోపించారు. సెవెన్ స్టార్ హోటల్స్, ఈవెంట్ మేనేజ్మెంట్సకే డబ్బులు తగలేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో అడ్డమైన హామీలు ఇచ్చి, ఒక్కటీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. ఏపీలో అవినీతి, అసమర్థపాలన సాగిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం టీడీపీని నమ్మి మోసపోయిందని వ్యాఖ్యానించారు. టీడీపీ అసమర్థతతోనే ఏపీకి అన్యాయం జరిగిందని అన్నారు. జల్సాగా స్పెషల్ ఫ్లయిట్లో దేశ దేశాలు తిరిగి..చివరికి రాజధాని ప్లాన్ కోసం రాజమౌళి వద్దకు వచ్చారని విమర్శించారు. పోలీసులను టీడీపీ కార్యకర్తల్లా వాడుకుని ఏదైనా అడిగితే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు తాత్కాలిక సీఎం అని..అందుకే తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సెక్రటేరియట్లను నిర్మించారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీని ఎన్టీఆర్ భవన్ అనుకుంటున్నారా ? అమిత్ షా లేఖ రాస్తే అసెంబ్లీలో ఎలా చదువుతారు ? అసెంబ్లీలో ఏనాడైనా ప్రజల సమస్యలపై చర్చించారా? అని చంద్రబాబునుద్దేశించి ప్రశ్నించారు. ఏపీని మోసం చేసింది సీఎం చంద్రబాబేనని, పార్లమెంటులో చర్చ జరిగితే చంద్రబాబు అవినీతి బయటకు వస్తుందని భయపడుతున్నారని విమర్శించారు. -
బాబుపై తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది: సోము
అనంతపురం జిల్లా : ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు , టీడీపీ నేతలకు ప్రధానమంత్రి పై తిరగబడండి అని చెప్పడం చూస్తుంటే ఎంత నీచ స్థితికి దిగజారాడో అర్థం అవుతుందని..అసలు ప్రధానమంత్రి పైకాదు..ప్రజలే చంద్రబాబు పై తిరగబడే రోజు దగ్గర్లో ఉందని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఘాటుగా వ్యాఖ్యానించారు. తాడిపత్రి పట్టణంలో బీజేపీ జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ను అవినీతి ఆంద్రప్రదేశ్గా మార్చిన ఘనత ఒక్క చంద్రబాబుకే సాధ్యమైందన్నారు. అనంతపురం జిల్లాకు కియా కార్ల పరిశ్రమ తనవల్ల వచ్చిదని చెప్పుకుంటున్నాడని, కానీ ఇది ప్రధాన మంత్రి గారి వల్ల వచ్చిందే తప్ప చంద్రబాబు వల్ల కాదని అన్నారు. ఆంద్రప్రదేశ్కు కడప ఉక్కు పరిశ్రమ రావాలన్నా, విశాఖకు రైల్వే జోన్ రావాలన్నా, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు సంబంధించి నిధులు రావాలన్న ఒక్క ప్రధానమంత్రితోనే సాధ్యమవుతుంది తప్ప..అవినీతి చంద్రబాబు వల్ల కాదని విమర్శించారు. -
ప్రజల గుండెల నుంచి తొలగించలేవు:కేవీపీ
విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించిన చోటు నుంచి తొలగించిన సీఎం చంద్రబాబు కోట్లాది ప్రజల హృదయాల్లో నుంచి ఆయన్ను తొలగించలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు. సీఎం తన చౌకబారు పనులను మానుకుని వెంటనే విగ్రహాన్ని పోలీస్ కంట్రోల్ రూం సెంటర్లో పునః ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని ఆంధ్రరత్నభవన్లో పార్టీ నేతలు దేవినేని నెహ్రూ, మల్లాది విష్ణు, కొలనుకొండ శివాజీ, దేవినేని అవినాష్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు అనువుగా ఆరోగ్య శ్రీ పథకాన్ని రూపకల్పన చేసినా, ఆపదలో ఉన్న వారికి సత్వర వైద్య సాయం అందేలా ఆసుపత్రులకు తరలించేందుకు 108 అంబులెన్స్ సేవలు ప్రారంభించినా, అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినా.. వైఎస్ను ప్రజల గుండెల్లో నుంచి తీసి వేయలేరనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. మైనారిటీలకు విద్య, వైద్యరంగాల్లో రిజర్వేషన్లు కల్పించిన, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా పేదలకు ఉన్నత విద్య అందించిన రాజశేఖరరెడ్డి ప్రజల మదిలో చిరకాలం ఉంటారని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్తును పొందుతున్న కోట్లాది రైతుల హృదయాల్లోంచి వైఎస్ను చంద్రబాబుతో సహా ఎవ్వరూ తొలగించలేరన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు. పోగాలం దాపురించినపుడు ఎవరైనా కనరు, వినరని... ఐదు లక్షల మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు అహంకార ధోరణికి ఇది అద్దంపడుతోందని విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించినా చంద్రబాబు గుండెల్లో నిద్రపోయి ఆయనకు బుద్ధి వచ్చేలా చేస్తారన్నారు. గోదావరి నది నీళ్లను పట్టిసీమ ద్వారా కష్ణా నదికి తీసుకొచ్చానని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు వాస్తవాలను గమనించాల్సిన అవసరం ఉందన్నారు. రాజశేఖరరెడ్డి పోలవరం కుడికాలువ నిర్మించకపోతే పట్టిసీమ నుంచి గోదావరి నీళ్లు కృష్ణాకు ఎలా వచ్చేవో సమాధానం చెప్పాలన్నారు. పులిచింతల ప్రాజెక్టు కూడా రాజశేఖరరెడ్డి చలవేనని అన్నారు. గోదావరి నీళ్లు కృష్ణాలో ఎలా కలిశాయో పోలవరం కుడి కాల్వ వెంట ఉన్న ప్రజలందరికీ తెలుసని స్పష్టం చేశారు. చంద్రబాబును ప్రపంచంలో ఎవ్వరూ మోసం చేయలేరని, ఆయన ఎవ్వరినీ నమ్మరు కాబట్టే ఇది సాధ్యమన్నారు. ఎవరైనా మరొకరిని నమ్మితేనే మోసగించగలరని అన్నారు. చంద్రబాబు నమ్మిన వారినందరినీ మోసం చేశారని చెప్పారు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచారని, తోడల్లుడికి ఉపముఖ్యమంత్రి పదవి అంటూ మోసం చేశారని చెప్పారు. బావమరిదిని ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసి ఆ తరువాత ఎన్నికలు జరగకుండా అడ్డుకుని ఆరు నెలల్లోనే ఇంటికి పంపించారని అన్నారు. బావమరిదికి నువ్వే కాబోయే పార్టీ అధ్యక్షుడివి, బీ ఫారంలు వచ్చే ఎన్నికల్లో నీ చేత్తోనే ఇస్తావని చెప్పి చివరకు మోసం చేశారని వివరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
'ప్రసన్నవదనం' బ్యూటీ చాలా ఘాటు గురూ.. రాశి సింగ్ (ఫొటోలు)
ఈ సమ్మర్ సీజన్లో.. నేరుగా 'చల్లని పెరుగుతోనే వెరైటీ కర్రీలు'!
వల్లభనేని వంశీ తో సాక్షి స్ట్రెయిట్ టాక్
ఆ విషయం తెలిశాక ఖుష్బు తట్టుకోలేకపోయింది: సుందర్
బిగ్ క్వశ్చన్: వాలంటీర్లపై కక్ష..అవ్వాతాతలకు శిక్ష
శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
తగ్గిన ప్రపంచ నం1 కంపెనీ విక్రయాలు.. భారత్లో మాత్రం..
‘శబరి’ మూవీ రివ్యూ
Tirumala: తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ
నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే
తప్పక చదవండి
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- బీజేపీతో జోడీ లేకపోతే ఈడీ
- సెలబ్రిటీలతో ఎయిర్బీఎన్బీ జట్టు..
- మోసాల బాబు మరో అబద్ధం..
- మోసాల బాబు మరో అబద్ధం..
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం
- ‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
- Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
- భువనగిరి ఖిలాపై ఏ జెండా ఎగిరేనో?
Advertisement