breaking news
Six-year old child
-
ఆరేళ్ల చిన్నారిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం
పోలాకి: అభం, శుభం ఎరుగని ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో వ్యక్తి. మానవత్వం మరిచి చిన్నారిని చెరచబోయాడు. వివరాలిలా.. నరసన్నపేటలోని పురుషోత్తమనగర్కాలనీకు చెందిన వర్రు యర్రయ్య(40) ఆటో నడుపుతుంటాడు. మంగళవారం ఉదయం పోలాకి మండలంలోని గుప్పెడుపేటలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆటోలో పల్స్పోలియో వ్యాక్సిన్ తీసుకువచ్చాడు. ఆరోగ్య కేంద్రం తాళాలు వేసి ఉండటంతో స్వీపర్ ఇంటికి వెళ్లి తాళాలు అడిగాడు. ఆమె తన కుమార్తె(6)తో తాళాలు పంపించింది. అంతలోనే మృగంగా మారిన యర్రయ్య ఆ చిన్నారిని ఆస్పత్రిలోకి లాక్కువెళ్లి అత్యాచారం చేయబోయాడు. బాధిత చిన్నారి సోదరుడు గమనించి గ్రామంలోని స్ధానికులకు తెలియజేశాడు. వెంటనే వారు ఆస్పత్రిలోకి వెళ్లి ఆటోడ్రైవర్ను పట్టుకుని చితకబాదారు. కరెంట్ స్తంభానికి కట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధిత చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. నరసన్నపేట పోలీసులు కేసు విచారిస్తున్నారు. బాధిత చిన్నారి ఆరోగ్యం బాగానే ఉందని వైద్య పరీక్షలు చేసిన వైద్యాధికారి బలగ మురళి చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తున్నామన్నారు -
రూ.10 లక్షలు చెల్లించండి
సాక్షి, చెన్నై: బస్సు రంధ్రం నుంచి పడి మృతి చెందిన ఆరేళ్ల చిన్నారి శ్రుతి కుటుంబానికి రూ. పది లక్షలు నష్ట పరిహారం చెల్లించే విధంగా సియాన్ స్కూల్ యాజమాన్యానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల్లోపు ఈ మొత్తం చెల్లించాలని పేర్కొంది. 2012 జూలై 25వ తేదీ సాయంత్రం తాంబరం - ముడిచ్చూర్ మార్గంలో చో టు చేసుకున్న ఓ ఘటన రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రైవేటు స్కూ లు బస్సుల్లో పిల్లలకు కల్పించిన భద్రత ఏ పాటిదో ఈ ఘటన స్పష్టం చేసింది. తాంబరం సమీపంలోని సియాన్ మెట్రిక్యులేషన్ స్కూల్కు చెందిన బస్సు ముడిచ్చూర్ మార్గంలో వెళ్తుండగా, ఆ బస్సు లో ఉన్న రంధ్రం ఓ ఆరేళ్ల చిన్నారి పాలి ట మృత్యువుగా మారింది. ముడిచ్చూర్ ప్రాంతానికి చెందిన ముక్కు పచ్చలారని విద్యార్థిని శ్రుతి రోడ్డు మీదున్న జనం చూస్తుండగానే రంద్రం నుంచి కింద పడి చక్రాల కింద చిద్రం కావడం ఆగ్రహావేశాలకు దారి తీసింది. అంతే కాదు, కోర్టు ఆగ్రహంతో ప్రైవేటు స్కూలు బస్సుల కంటూ ప్రభుత్వం ప్రత్యేకంగా నిబంధనలు విధించే స్థాయికి ఈ ఘటన తీసుకెళ్లింది. నేటికీ ప్రతి ఏటా విద్యా సంవత్సరం ఆరంభంలో అన్ని బస్సుల్ని తనిఖీ చేయాల్సిందే. తనిఖీల అనంతరం ఇచ్చిన అనుమతితోనే ముందుకు సాగాల్సి ఉన్నది. ఈ ఘటన ఎందరో పిల్లల భద్రతకు బాసటగా మారినా, ఆ చిన్నారి శృతి తల్లిదండ్రుల్ని నేటికీ ఓదార్చలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తన బిడ్డ మృతికి సియాన్ స్కూల్ యాజమాన్యం కారణం అని శ్రుతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఆ యజమాని విజయన్ అరెస్టు అయ్యారు. కొన్నాళ్లకు ఆయన బయటకు వచ్చేశారు. తదుపరి శ్రుతి కుటుంబం గురించి ఆలోచించే వాళ్లెవ్వరు. తన బిడ్డ మృతికి కారణమైన సియాన్ యాజమాన్యంపై కోర్టులో సమరానికి ఆ కుటుంబం సిద్ధమైంది. నష్ట పరిహారం కోసం శ్రుతి తండ్రి సేతుమాధవన్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ మైలాపూర్లోని రాష్ట్ర వినియోగ దారుల ఫోరంలో సాగుతూ వచ్చింది. వాదనలు ముగిశాయి. తుది తీర్పు, ఆదేశాల కోసం ఆ కుటుంబం ఎదురు చూసింది. ఆ మేరకు బుధవారం న్యాయమూర్తి జయరామన్, ఫోరం సభ్యురాలు భాగ్యవతిలతో కూడిన బెంచ్ శృతి కుటుంబానికి రూ. పది లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని సియాన్ స్కూల్ యాజమాన్యాన్ని ఆదేశించారు. రెండు నెలల్లోపు ఈ మొత్తాన్ని చెల్లించాలని, లేని పక్షంలో వడ్డీ సహా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ విచారణను ముగించారు. -
ఐఫోన్ కోసం చిన్నారి కిడ్నాప్.. హత్య..
న్యూఢిల్లీ: ఐఫోన్ కోసం ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి.. పాశవికంగా హత్య చేసిన ఘటన ఢిల్లీలో జరిగింది. ఈ ఘాతుకానికి పాల్పడింది కూడా ఓ 17 ఏళ్ల బాలుడే. రంజిత్ నగర్కు చెందిన పండ్ల వ్యాపారి కుమారుడు గణేష్(6). గురువారం సాయంత్రం ఇంటి నుంచి ఆడుకోవడానికి వెళ్లిన గణేష్ కనిపించలేదు. అయితే అతనిని కిడ్నాప్ చేశామని, రూ. 1.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అదే రోజు రాత్రి గణేష్ తండ్రికి ఫోన్ రావడంతో అతను పోలీసులను ఆశ్రయించారు. శుక్రవారం సాయంత్రం నారాయనాలోని సత్యా పార్క్లో గణేష్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో చిన్నారి చివరిసారిగా ఎవరితో ఉన్నాడనే విషయం పరిశీలించగా.. అతని ఇంటికి సమీపంలో నివసిస్తున్న బాలుని(17)తో ఆడుకున్నట్టు గుర్తించారు. దీంతో ఆ బాలుడిని అతని తల్లిదండ్రుల సమక్షంలోనే ప్రశ్నించగా.. తానే గణేష్ను హత్య చేసినట్టు అంగీకరించాడు. ఐఫోన్ కొనుగోలుకు.. విలాసంగా జీవించేందుకే హత్యకు పాల్పడినట్టు వెల్లడించాడు.