breaking news
Sitting alcohol
-
నడి రోడ్డుపై మందుబాబు హల్చల్
శ్రీకాళహస్తి: మందు తాగడానికి సరైన సిట్టింగ్ రూములు లేవంటూ ఓ మందుబాబు నడిరోడ్డుపై మద్యం సేవిస్తూ హల్చల్ చేసిన ఘటన శ్రీకాళహస్తి ఆర్టీసీ బ స్టాండ్ సర్కిల్లో శుక్రవారం చోటు చేసుకుంది. కూట మి ప్రభుత్వం వచ్చాక మద్యం షాపుల యజమానులు కుమ్మక్కై పర్మిట్ రూమ్లను ఏర్పాటు చేసి, తినుబండారాలు, ఇతర వస్తువుల రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెంచేశారని, వీటన్నింటినీ కట్టడి చేయకుంటే మళ్లీ పుల్ బాటిల్తో స్థానికంగానే తాగుతూ నిరసన వ్యక్తం చేస్తానని సదరు మందుబాబు చెప్పడం గమనార్హం. ఇంత జరుగుతున్నా సంబంధిత పోలీసు అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. అటువైపు వెళ్లే ప్రయాణికులు ఔరా..? అంటూ ముక్కున వేలేసుకోవడం కనిపించింది. దీనిపై రెండవ పట్టణ సీఐ నాగార్జునరెడ్డిని వివరణ కోరగా అతనిపై కేసు నమోదు చేశామని, మత్తులో ఉండడం వల్ల అతనిపై పబ్లిక్ న్యూసెన్స్, ఓపెన్ బూజింగ్ కేసులు నమోదు చేశామన్నారు. మత్తు దిగిన తరువాత కౌన్సెలింగ్ ఇచ్చి కోర్టులో హాజరు పరుస్తామన్నారు. -
ఎస్పీ స్టింగ్ ఆపరేషన్
తూప్రాన్:దాబా హోటళ్లలో మద్యం సిట్టింగ్, విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ సుమతి హెచ్చరించారు. తూప్రాన్లోని దాబా హోటళ్లపై బుధవారం రాత్రి 10 సమయంలో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. పట్టణంలోని బైపాస్ మార్గంలో సన్దాబాలో మద్యం సిట్టింగ్లను గమనించిన ఎస్సీ వెంటనే తన వాహనాన్ని పక్కన పెట్టించి సివిల్ డ్రెస్లో ఉన్న తన గన్మెన్లను దాబా హోటల్కు పంపించి మద్యం కొనుగోలు చేయమని ఆదేశించారు. దీంతో తన సిబ్బంది వెంటనే దాబాలోకి ప్రయాణికుల మాదిరిగా వెళ్లారు. తమకు మద్యం కావాలని కోరడంతో దాబా నిర్వహకుడు బ్లెండర్స్పైడ్ మద్యం బాటిల్ను విక్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన ఎస్సీ సుమతి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎస్ఐ.సంతోష్కుమార్లు హూటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని దాబా నిర్వహకుణ్ని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం ఎస్పీ నేరుగా పోలీస్స్టేషన్కు చేరుకుని రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. నే రాలు, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల గురించి డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దాబా హోటళ్లలో మద్యం విక్రయించినా, సిట్టింగ్లను నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే బెల్ట్ షాపులు నిర్వహించి వారిపై సైతం కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే గతంలో తూప్రాన్లోని పలు దాబాలపై పోలీసులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినా వారిలో మార్పు రాకపోవడం గమనార్హం.