-
సీతారామం హీరోయిన్ రచ్చ రెచ్చిపోతున్న ఫ్యాన్స్
-
మరింత వేగంగా..
సాక్షి, కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సీతారామ ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ తుది అనుమతులు రావడంతో మరింత ముందడుగు పడినట్టయింది. నీటిపారుదల ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో సీఎం కేసీఆరే దీనిపై స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కాళేశ్వరం తర్వాత ఆయన అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది సీతారామకే. ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల రైతులకు మేలు కలుగనుంది. సీఎం మొదటి సమీక్ష ప్రాజెక్టులపై చేయడంతో పాటు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. దీంతో వెంటనే తుది పర్యావరణ అనుమతులు వచ్చాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రూ.11 వేల కోట్ల నిధుల సేకరణ సైతం పూర్తయిందని సీఎం ప్రకటించారు. ప్రాజెక్టు పనులు ఏ దశలో ఉన్నాయో తెలుసుకునేందుకు ఇటీవల రిటైర్డ్ ఇంజినీర్ల బృందాన్ని పంపించిన కేసీఆర్, వారి ద్వారా నివేదిక తెప్పించుకున్నారు. ఇక తాజాగా తుది పర్యావరణ అనుమతులు సైతం రావడంతో మరింత నజర్ పెట్టనున్నారు. అంచనా వ్యయం రూ.13,884 కోట్లు.. జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన దుమ్ముగూడెం రాజీవ్సాగర్ ప్రాజెక్ట్ను తెలంగాణ ప్రభుత్వం రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్ట్గా నామకరణం చేసింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఖమ్మం, భదాద్రి, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని 6.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. భవిష్యత్తులో ఆయకట్టును 9.36 లక్షల ఎకరాలకు పెంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మొదట 5 లక్షల ఎకరాలకు నీరందించాలని అనుకున్నప్పటికీ, ఆ తర్వాత 6.75 లక్షల ఎకరాలకు పెరగడంతో అంచనా వ్యయాన్ని రూ.7,926 కోట్ల నుంచి రూ.13,884 కోట్లకు ప్రభుత్వం పెంచింది. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం గ్రామంలోని దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది. కుమ్మరిగూడెం నుంచి పాల్వంచ మండలం కోయగుట్ట, ములకపల్లి మండలం కమలాపురం, ఇల్లెందు మండలం చీమలపాడు, రోళ్లపాడు చెరువు, బయ్యారం పెద్ద చెరువు ద్వారా పాలేరు రిజర్వాయర్కు నీరు తరలించేందుకు సీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద హెడ్ రెగ్యులేటర్ నిర్మిస్తున్నారు. మొత్తం 372 కిలోమీటర్ల కాలువ నిర్మించనున్నారు. అశ్వాపురం మండలం భీమునిగుండం కొత్తూరు వద్ద మొదటి దశ పంప్హౌస్, పాల్వంచ మండలం నాగారం వద్ద కిన్నెరసాని నదిపై నిర్మిస్తున్న అక్విడెక్ట్, ములకలపల్లి మండలం ఒడ్డురామవరం వద్ద రెండోదశ పంప్హౌస్, కమలాపురం వద్ద మూడోదశ పంప్హౌస్ పనులు జరుగుతున్నాయి. వీటిల్లో మొదటి, రెండో దశ పంప్హౌస్లతో పాటు కిన్నెరసానిపై అక్విడెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వచ్చే జూన్ నెలాఖరు కల్లా భీమునిగుండం కొత్తూరు వద్ద నిర్మాణంలో ఉన్న మొదటి దశ పంప్హౌస్ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ములకలపల్లి మండలంలోని కమలాపురం వద్ద జరుగుతున్న మూడోదశ పంప్హౌస్ పనులు మాత్రం ఆలస్యం అవుతున్నాయి. ఫేజ్–1లో 110 కిలోమీటర్ల కెనాల్కు గాను 40 కిలోమీటర్ల వరకు కెనాల్ పనులు వేగంగా నడుస్తున్నాయి. సీతారామ ఎత్తిపోతల పథకం మొదటి దశ ద్వారా 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు, 2వ దశ ద్వారా 3.25 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేసే లక్ష్యంతో పనులు చేస్తున్నారు. ఫిబ్రవరిలో డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులకు టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్ కెనాల్ కింద 80 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం ఏన్కూర్ వద్ద ఒక లింక్ ఇవ్వనున్నారు. భవిష్యత్తులో నాగార్జునసాగర్ ద్వారా సాగునీటి సరఫరాలో ఇబ్బందులు వచ్చినప్పటికీ.. ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సీతారామతో అనుసంధానం చేయాలని, సాగర్ చివరి ఆయకట్టుకు సీతారామ ద్వారా నీరందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నుంచి మొత్తం 372 కిలోమీటర్ల పొడవున కాలువ నిర్మించనున్నారు. ఆ దారిపొడవునా అనేక చోట్ల చెరువులు నింపేలా డిజైన్ రూపొందించారు. -
ఆలయ ప్రహారీ నిర్మిస్తా
కాగజ్నగర్రూరల్(సిర్పూర్) : కాగజ్నగర్ మండలం భట్పల్లిలోని భక్తాంజనేయ స్వామి ఆలయ ప్రహరీని నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తానని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హామీ ఇచ్చారు. సోమవారం మందిరం ఆవరణలో ప్రహారీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మందిరంలో నిర్వహించిన సీతారాముల కల్యాణానికి ఆయన సతీమణి రమాదేవితో కలిసి ఆయన హాజరయ్యారు. ఇందులో మాజీ ఎంపీటీసీ పిర్సింగుల పోచయ్య, భక్తులు పాల్గొన్నారు. కన్నుల పండువగా కల్యాణం మండలంలోని భట్టుపల్లి, రాస్పెల్లి, సారసాలతో పాటు ఆయా గ్రామాల్లోని దేవాలయాల్లో సీతారాముల కల్యాణాన్ని సోమవారం నిర్వహించారు. భట్టుపల్లిలో నిర్వహించిన కల్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆయన సతీమణి రమాదేవి హాజరయ్యారు. రాస్పెల్లి ఆంజనేయస్వామి ఆలయం, సారసాలలోని సీతారామాంజనేయ దేవాలయంలో అంగరంగ వైభవంగా కల్యాణాన్ని నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. -
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
నేటి నుంచి ఉత్తర తెలంగాణలో వర్షాలు హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా ఆదివారం సాయంత్రం నుంచి ఉత్తర తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఇన్చార్జి డెరైక్టర్ సీతారామ్ ‘సాక్షి’కి తెలిపారు. ఐదు రోజులపాటు ఈ అల్పపీడన ప్రభావం ఉంటుందని వివరించారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు. వాయవ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయానికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
మతశక్తులకు కాంగ్రెస్కు ఊతం: ఏచూరి
కోజికోడ్: దేశంలో మతశక్తులు పెరిగిపోవడానికి కాంగ్రెస్ విధానాలే కారణమని సీపీఎం నేత సీతారాం ఏచూరి విమర్శించారు. మతతత్వ శక్తుల నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు వామపక్ష ప్రజాతంత్ర లౌకిక ప్రత్యామ్నాయం అవసరమని ఉద్ఘాటించారు. ఏచూరి శనివారమిక్కడ ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని మతతత్వ ముప్పు నుంచి కాపాడాలంటే.. వామపక్ష ప్రజాతంత్ర లౌకిక ప్రత్యామ్నాయం అవసరం ఉందన్నారు. ఢిల్లీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖా రీ కాంగ్రెస్కు మద్దతు పలకడాన్ని ఏచూరి ఎద్దేవా చేశారు. ఇదే వ్యక్తి 2004 ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు పలకగా బీజేపీ ఓటమి పాలైందని గుర్తు చేశారు.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
- వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
Advertisement