breaking news
siddi ramaiah
-
సినిమా టికెట్ ధర రూ. 200 దాటొద్దు.. ప్రభుత్వ కీలక నిర్ణయం
సినిమా టికెట్ ధరలు ప్రతి రాష్ట్రంలో కూడా పెద్ద చర్చనియాంశంగా ఉంటుంది. ఈ విషయంలో మన పొరుగు రాష్ట్రం కర్ణాటక కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కర్ణాటకలో విడుదలైన సినిమా బడ్జెట్ ఎంతైనా సరే టికెట్ ధర రూ. 200కు మించి ఉండకూడదని కర్ణాటక ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. సింగిల్ స్క్రీన్స్తోపాటు మల్టీప్లెక్స్ల్లోనూ ఇదే వర్తించనుందని పేర్కొంది. ఇతర భాష చిత్రాలకు కూడా ఇదే వర్తిస్తుందని అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో తెలియజేయాలని ప్రభుత్వం కోరింది.కన్నడ చిత్ర పరిశ్రమ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2025-26 బడ్జెట్ ప్రసంగంలో మల్టీప్లెక్స్లతో సహా రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ప్రతి షో టికెట్ ధరను రూ. 200కి పరిమితం చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సామన్య ప్రజల నుంచి కన్నడ ప్రభుత్వంపై అభినందనలు వచ్చాయి. ముఖ్యంగా బెంగళూరులో వీకెండ్ టికెట్ రేట్లు భారీగా ఉంటాయి. ఏకంగా ఒక్కొ టికెట్ ధర రూ. 1000 నుంచి 1500 వరకు ఉంటుంది. దీంతో అక్కడ తీవ్రంగా వ్యతిరేఖత వచ్చింది. ఇప్పుడు ఈ దెబ్బతో రూ. 200 రూపాయలకు టికెట్ ధర రానుంది. అయితే, పాప్ కార్న్ వంటి స్నాక్స్ ధరలను కూడా తగ్గించాలనే డిమాండ్స్ ఊపందుకున్నాయి.తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువసినిమా టికెట్ ధరలను ఇప్పుడు ఒక్కో రాష్ట్రం తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు కూడా ఇదే బాటలో అడుగులేస్తుంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రేట్లు కాస్త ఎక్కువే వున్నాయి. పైగా స్పెషల్ షోలు, ప్రీమియర్లు అంటూ అదనపు రేట్లు వాయించేస్తున్నారు. ఈ అంశం మీద ఇండస్ట్రీతో పాటు రాజకీయంగా కూడా చాలా చర్చలు నడిచాయి. కోర్టు కేసులు కూడా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా టికెట్ ధరలు అందుబాటులోకి తెస్తే బాగుంటుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.సినీ పరిశ్రమ బతకాలన్నా, థియేట్రికల్ వ్యవస్థ కళకళలాడాలన్నా టికెట్ రేట్లు అందుబాటులో ఉండాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో తొలిసారి టికెట్ రేట్లను తగ్గించారు. అయితే, ఇండస్ట్రీలో ఉన్న కొందరికి నచ్చలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అంటూ పలు వేదికల మీద వారే మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో పలు రాష్ట్రాలు కూడా టికెట్ ధరలు నియంత్రించే పనిలో ఉండటంతో గతంలో వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం ఇదే కదా అంటూ గుర్తుచేస్తున్నారు. టికెట్ రేట్లు అందరికీ అందుబాటులో వుండాలి అనేది జనం మాట.. ప్రతి సినిమాకు టికెట్ రేట్లు అదనంగా పెంచుకుంటూ పోతే జనం థియేటర్కు దూరం అయిపోతారనేది థియేటర్ యజమానులు చెప్పే మాట. కానీ, నిర్మాతలు వాదన మరోలా ఉంటుంది. కోట్లకు కోట్లు ఖర్చు చేశాం.. ఆ డబ్బు అంతా మొదటి వారంలోనే రావాలని ఆశిస్తారు. -
MUDA: ముడా స్కాంలో కీలక మలుపు
కర్ణాటక,సాక్షి: కర్ణాటక (Karnataka)లో ప్రకంపనలు సృష్టించిన మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన సతీమణి బీఎం పార్వతీకి కర్ణాటక హైకోర్టు నోటీసులు జారీ చేసింది.తాజాగా, కర్ణాటక సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ (Snehamayi Krishna) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో ముడా స్కాం కేసును రాష్ట్ర లోకాయిక్త పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయాలని పేర్కొన్నారు. ఆ పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది.విచారణలో భాగంగా సీఎం సిద్ధరామయ్య దంపతులకు నోటీసులు పంపింది. ఆర్టీఐ యాక్టివిస్టు దాఖలు చేసిన పిటిషన్లపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. -
కాంగ్రెస్ పార్టీ ‘మేధోమథన సదస్సు’
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలో పార్టీ పూర్వవైభవం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ‘మేధోమథన సదస్సు’ నిర్వహిస్తోంది. ఇబ్రహీంపట్నం మండలం శ్రీ ఇందూకాలేజీలో జరిగే ఈ సదస్సుకు అతిరథమహారథులు హాజరవుతున్నారు. కేంద్రం, రాష్ర్టంలో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్ పార్టీ.. ఓట మికి దారితీసిన పరిస్థితులను ఈ సమావేశంలో సమీక్షించనుంది. రెండు రోజుల ఈ సదస్సులో పది అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. గ్రూపుల వారీగా చర్చించడం ద్వారా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికకు తుదిరూపు ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మండల/బ్లాక్/ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఇటీవల ఎన్నికల్లో గె లుపొందిన, ఓడిపోయిన అభ్యర్థులుసహా టీపీసీసీ కార్యవర్గం, అనుబంధ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. దాదాపు 1300 మంది ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు దానం నాగేందర్, క్యామ మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి భారీ ఏర్పాట్లు చేశారు. కళాశాల ఆవరణను పార్టీ తోరణాలతో, బెలూన్లతో అలంకరించిన కాంగ్రెస్ శ్రేణులు.. ఇప్పటికే సభా ప్రాంగణాన్ని అందం గా ముస్తాబు చేశారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి జరుగుతున్న ప్లీనరీ ఏర్పాట్లను శనివారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్, ఏఐసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ కొప్పుల రాజు, ఏఐసీసీ ప్రతినిధి కుంతియా, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పరిశీలించారు. తప్పులను సమీక్షిస్తాం: దిగ్విజయ్ ఇటీవల ఓట మికి కారణమైన అంశాలను సదస్సులో సమీక్షిస్తామని దిగ్విజయ్సింగ్ స్పష్టం చేశారు. కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని, భవిష్యత్తులో తప్పులు పునరావృతంగాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నైరాశ్యంలో ఉన్న కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపేందుకు మేధోమథన సదస్సు దోహపడుతుందని, అందుకనుగుణంగా పలు అంశాలపై తీర్మానాలను చేయనున్నట్లు వెల్లడించారు. అగ్రనేతల రాక! రెండు రోజుల సదస్సుకు కాంగ్రెస్ ముఖ్యనేతలు తరలిరానున్నారు. సిద్దిరామయ్య, గులాం నబీ అజాద్, సచిన్పెలైట్, జ్యోతిరాదిత్య సిందియా, జైరాం రమేశ్ తదితరులు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిపారు. పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ పర్యటనల షెడ్యూల్ను మాత్రం ఇంకా ఖరారు కాలేదని తెలిసింది. వచ్చేనెల 21న ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సదస్సు హైదరాబాద్: ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఆధ్వర్యంలో సెప్టెంబర్ 21న సదస్సు నిర్వహించనున్నట్టు విరసం నేత వరవరరావు తెలిపారు. శనివారం హైదర్గూడలోని ఎస్ఎస్ఎస్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్ల ఐక్య విప్లవ ఉద్యమానికి జేజేలు పలుకుతూ ఈ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. కమ్యూనిస్టు నేత ఎంటీ ఖాన్కు ఈ సందర్భంగా నివాళులర్పిస్తామన్నారు. విప్లవంలో మూడు మూలిక నిర్మాణాలు, ఈ దశాబ్ది విప్లవ పోరాటాలు, విప్లవోద్యమం-బోల్షివీకరణ అనే అంశాలపై వక్తలు పాణీ, అమిత్ భట్టాచార్య, సీఎస్ఆర్ ప్రసాద్ ప్రసంగిస్తారని చెప్పారు.