breaking news
shutting down
-
హిండెన్ బర్గ్ సంస్థ మూసివేత.. ఫౌండర్ నాథన్ అండర్సన్ ప్రకటన
-
పారిశ్రామిక మేడలు..!
ఎచ్చెర్ల క్యాంపస్: పేరుకు పారిశ్రామిక వాడలు.. అక్కడ వెలుస్తున్నాయి కమర్షియల్ మేడలు.. నిరుద్యోగిత ముసుగులో కొంతమంది వ్యాపారులు దర్జాగా వాణిజ్య వ్యాపారం చేసుకుంటున్నారు. శ్రీకాకుళం నగరానికి ఆనుకుని, 16వ నంబరు జాతీయ రహదారి పక్కన ఉండటంతో పారిశ్రామిక వాడ స్థలాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. గత టీడీపీ పాలనలో అప్పటి ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతోపాటు ఏపీఐఐసీ అధికారులతో లాలూచీ పడి పరిశ్రమల ఏర్పాటు కోసం స్థలాలు పొందినట్టు తెలుస్తోంది. ఇదీ ఏపీఐఐసీ లక్ష్యం... నిరుద్యోగులను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా పోత్సహించాలి. సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. నిరుద్యోగి పది మందికి ఉపాధి కల్పించాలి. ఇదీ ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక వసతుల కల్పన శాఖ (ఏపీఐఐసీ) లక్ష్యం. అధికారుల పర్యవేక్షణ లోపం, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులు సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటు కంటే వ్యాపారులకు వాణిజ్య సముదాయాలు నిర్మాణం, అద్దెలకు ఇచ్చేందుకు ఈ పారిశ్రామికవాడ ఉపయోగపడుతుంది. ఆన్లైన్ వ్యాపార గోదాములు, కార్యాలయాలు వంటివి నిర్వహణకు అద్దెకు ఇచ్చుకునేందుకు అనువైన స్థలం కావటంతో ఎక్కువ మంది వ్యాపార సముదాయాల నిర్వహణకు ఆసక్తి చూపిస్తున్నారు. పారిశ్రామిక వాడలో కమర్షియల్ కాంప్లెక్స్లు.... కుశాలపురం సమీపంలోని నవభారత్ పారిశ్రామికవాడ 16.37 ఎకరాలు విస్తరించి ఉంది. నిరుద్యోగ యువతకు పరిశ్రమల ఏర్పాటు కోసం స్థలాలు కేటాయిస్తారు. పరిశ్రమలు మూతపడితే స్థలాలు ఏపీఐఐసీ స్వా«దీనం చేసుకుని, మరొకరికి ఇవ్వాలి. ప్రస్తుతం 55 పరిశ్రమలు ఉండగా, ఇందులో 12 పరిశ్రమలు మూతపడ్డాయి. స్టీల్, గ్రానైట్, అల్యూమినియం, గార్నటైట్, రంగులు, రీ ట్రైడ్ వంటి పరిశ్రమలు ఉన్నాయి. గత ప్రభుత్వం సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించకపోవటం, ఖాయిలా పడ్డ పరిశ్రమల పునరుద్ధరణకు చర్యలు తీసుకోకపోవటం వంటి అంశాల వల్ల కొన్ని పరిశ్రమలు మూత పడ్డాయి. ఇదేక్రమంలో నిబంధనలకు వ్యతిరేకంగా కమర్షియల్ కాంప్లెక్స్ (వాణిజ్య సముదాయాలు)ను నిర్మిస్తున్నారు. గతంలో పరిశ్రమల కోసం తీసుకున్న స్థలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా, బహుళ అంతస్తులు నిర్మాణాలు చేపడుతున్నారు. కొన్ని అద్దెకు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం ఐదు కమర్షియల్ కాంప్లెక్స్లు ఈ పారిశ్రామిక వాడలో ఉండటం గమనార్హం. పరిశ్రమల స్థాపన పేరిట రాయితీలు... పరిశ్రమల ఏర్పాటు పేరుతో బ్యాంకుల నుంచి రాయితీ రుణాలు సైతం కొందరు తీసుకుంటున్నారు. వీటితో వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారు. నిర్మాణ సమయంలో ఏపీఐఐసీకి దరఖాస్తు చేసుకున్న విధంగా పరిశ్రమ నిర్మాణం చేపట్టాలి. లేదంటే అధికారులు స్థల మంజూరును రద్దు చేయాలి. ఇలా చేయడం లేదు. దీంతో నిరుద్యోగుల స్థానంలో వ్యాపారులు ప్రయోజనాలు ఎక్కువుగా పొందుతున్నారు. ఇలా ఒకరిని చూసి మరొకరు వాణిజ్య సముదాయాలు నిర్మాణం చేపడుతున్నారు. ఏపీఐఐసీ శాఖ స్పందించకుంటే భవిష్యత్తులో ఇక్కడ సూక్ష్మ పరిశ్రమలు సైతం పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. నిబంధనల అమలుకు కృషి వాణిజ్య సమదాయాల నిర్మాణం నిబంధనలకు వ్యతిరేకం. స్థలాలు పొందిన వారు నిబంధనలు పక్కాగా పాటించాలి. స్థలాలు తీసుకున్నప్పుడు దరఖాస్తులో పేర్కొనేలా నిర్మాణాలు, పరిశ్రమల ఏర్పాటు ఉండాలి. దీనిపై ప్రత్యేక దృష్టి పెడతాం. – సుధాకర్, ఏపీఐఐసీ, జోనల్ మేనేజర్ -
ఫేస్బుక్కు మరో టెక్ దిగ్గజం షాక్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ యూజర్ల డేటాలీక్ దుమారం మరింత ముదురుతోంది. ఇప్పటికే పలు టెక్ కంపెనీలు, టెక్ దిగ్గజాలు వినియోగదారుల గోప్యతా వివరాలు లీక్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రియన్ ఆక్టన్ డిలీట్ ఫేస్బుక్ అంటూ సంచలనానికి తెరతీయగా ఇపుడు ఈ కోవలోకి మరో టెక్ దిగ్గజం చేరారు. ఆపిల్ కో ఫౌండర్ స్టీవ్ వోజ్నియాక్ ఫేస్బుక్ ఖాతాను తొలగించి తన నిరసనను ప్రకటించారు. తాజాగా ఫేస్బుక్ స్వయంగా ప్రకటించిన వివరాల ప్రకారం పొలిటికల్ డేటా అనాలసిస్ కంపెనీ కేంబ్రిడ్జ్ అనలిటికా యూజర్ల అనుమతి లేకుండా అమెరికాలో దాదాపు 87కోట్లు, ఇండియాలో 5లక్షలకుపైగా యూజర్ల లీక్ అయిందన్నవార్త ప్రకంపనలు రేపింది. ఈ సంక్షోభం నేపథ్యంలో మల్లగుల్లాలుపడుతున్న ఫేస్బుక్కు ఇపుడు వోజ్నియాక్ రూపంలో మరో షాక్ తగిలింది. ఆపిల్ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ తన ఫేస్బుక్ అకౌంట్ను క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఫేస్బుక్ పై పలు విమర్శలు గుప్పించారు.యూజర్లు అందించిన వ్యక్తిగత వివరాలతో ప్రకటనల ద్వారా భారీ మొత్తంలో డబ్బులు దండుకుంటోందని ఆయన మండిపడ్డారు. యూజర్ల సమాచారం ఆధారంగానే ఈ లాభాలు సాధించింది.కానీ వినియోగదారులకు ఎలాంటి లాభాలు ముట్టలేదంటూ ఆయన విమర్శించారు. యాపిల్ సంస్థ తన ఉత్పత్తుల ద్వారా లాభాలనార్జిస్తోందన్నారు. మరోవైపు గోప్యతా కుంభకోణం, ఇతర దుర్వినియోగాల నేపథ్యంలో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ విచారణను ఎదుర్కోనున్నారు. మంగళ, బుధవారాల్లో తన సాక్ష్యాన్ని నమోదు చేయనున్నారు. -
ఉన్నవి పోతున్నాయ్.. కొత్తవి రాకున్నాయ్!
రాష్ట్రంలో మూడేళ్లలో పరిశ్రమలు మూతలే మూతలు సాక్షి, అమరావతి: లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల సంఖ్యలో ఉద్యోగాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, వాస్తవ పరిస్థితికి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. కొత్త పరిశ్రమలు దేవుడికెరుక.. ఎప్పటినుంచో ఉన్న పరిశ్రమలు సైతం మూతపడుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గత మూడేళ్లలో 120కి పైగా యూనిట్లు మూతపడ్డాయి. ఒక్క కర్నూలు జిల్లాలోనే 125 పరిశ్రమలు మూతపడినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో రవాణా, ఆర్థిక, వ్యవసాయ రంగాలు కుదేలయ్యాయి. ఆయా జిల్లాల్లో వందల సంఖ్యలో పరిశ్రమలు మూతపడడంతో వేలాది మంది రోడ్డున పడ్డారు. పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి భిక్షమెత్తుకుంటున్నట్లు వస్తున్న వార్తలు పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నాయి. రవాణా రంగానికి పంక్చర్.. ఉమ్మడి రాష్ట్రంలో రవాణా రంగానికి విజయవాడ కేంద్రంగా భాసిల్లింది. అనేక ప్రైవేట్ ట్రావెల్స్ విజయవాడ కేంద్రంగా వ్యాపారాన్ని చేపట్టి ఇతర రాష్ట్రాలకు విస్తరించాయి. అయితే ప్రస్తుతం అనేక సంస్థలు మూతపడుతున్నాయి. లింగమనేని గ్రూపు 2013లో విజయవాడ కేంద్రంగా ‘ఎయిర్కోస్టా’ పేరుతో ప్రాంతీయ విమాన సర్వీసులు ప్రారంభించి అనతికాలంలోనే ప్రాంతీయస్థాయి నుంచి జాతీయస్థాయికి ఎదిగింది. కానీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిర్కోస్టా తమ సర్వీసులను ఆపేసింది. ఒకపక్క విజయవాడ ఎయిర్పోర్టు ప్రయాణికుల వృద్ధిరేటులో మొదటిస్థానంలో ఉండగా.. మరోపక్క ఇదే కేంద్రంగా సర్వీసులు నిర్వహిస్తున్న ఎయిర్కోస్టా మూతపడటం గమనార్హం. సీఎం చంద్రబాబు సింగపూర్, మలేషియన్ ఎయిర్లైన్స్లాగా రాష్ట్రం నుంచి ‘అమరావతి ఎయిర్లైన్స్’ నడపాలన్న కొద్దిరోజులుకే ఎయిర్కోస్టా మూతపడటం కాకతాళీయం. కానీ ఇదే లింగమనేని గ్రూపు రియల్ ఎస్టేట్, ఆతిథ్య రంగాల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోవడం గమనార్హం. ప్రైవేటు ట్రావెల్స్లో ప్రత్యేక ఇమేజ్ను సృష్టించుకుని సుదీర్ఘకాలంగా ఇదే వ్యాపారాన్ని నిర్వహిస్తున్న టీడీపీ ఎంపీకి చెందిన కేశినేని ట్రావెల్స్ మూసేయడం పెద్ద సంచలనంగా మారింది. దీని కంటే ముందే కాళేశ్వరి ట్రావెల్స్ కూడా సర్వీసులను ఆపేసింది. దీంతో వేలాది మంది డ్రైవర్లు, క్లీనర్లు, టికెట్ బుకింగ్ ఏజెంట్లు ఉపాధి కోల్పోయారు. బోర్డు తిప్పేస్తున్న ఆర్థిక సంస్థలు ఆర్థిక మోసాల సంగతైతే చెప్పక్కర్లేదు. అధికార పార్టీ అండదండలతో ఫైనాన్స్ సంస్థలు ప్రజలు దాచుకున్న వేలాది కోట్ల రూపాయలకు శఠగోపం పెట్టేశాయి. మూడేళ్లలో పదికిపైగా ఫైనాన్స్ సంస్థలు రూ.12,109 కోట్ల ప్రజల సొమ్మును దోచుకున్నాయి. అగ్రిగోల్డ్, అభయగోల్డ్, అవనిగోల్డ్, గోల్డ్క్వెస్ట్, అక్షయగోల్డ్, బొమ్మరిల్లు, శ్రీ పూజిత, సిరిగోల్డ్, సిమ్స్, వీర్ చిట్స్ సంస్థలు బోర్డులు తిప్పేయడంతో ఇన్వెస్టర్లు ఆర్థికంగా నష్టపోవడమేగాక వాటిల్లో పనిచేస్తున్న వేలాదిమంది ఉపాధి కోల్పోయారు. ఇక కేశవరెడ్డి పాఠశాలలు అయితే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.700 కోట్లు అక్రమంగా సేకరించి బోర్డు తిప్పేయడం విదితమే. ఈ ఆర్థిక సంస్థల మోసాల కేసుల్లో అధికార పార్టీ నేతల హస్తమున్నట్లు పెద్దఎత్తున విమర్శలొస్తున్నాయి. సంక్షోభంలో వ్యవసాయం.. రాష్ట్ర విభజన తర్వాత వ్యవసాయాధారిత పరిశ్రమలు ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా జూట్, స్పిన్నింగ్, రైస్మిల్లుల పరిస్థితి దారుణంగా ఉంది. పెరిగిన ముడిసరుకుల ధరలు, విద్యుత్ చార్జీల బాదుడుతో యూనిట్లు మూతపడుతున్నాయి. ఉత్తరాంధ్రలో మొత్తం 14 జూట్ మిల్లులుండగా తొమ్మిది మూతపడ్డాయి. అలాగే గుంటూరు జిల్లాలోని భజరంగ్ జూట్ మిల్లూ మూతపడింది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి ధరలు పెరిగి, దానికి తగ్గట్టుగా యార్న్ ధరలు పెరగకపోవడంతో స్పిన్నింగ్ మిల్లులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం, పెరిగిన విద్యుత్ చార్జీలు అగ్రి అనుబంధ పరిశ్రమలు మూతపడటానికి కారణమని మార్కెట్ వర్గాలంటున్నాయి. దీంతో ఈ మూడు రంగాల్లోనే 50,000 మందికిపైగా ఉపాధి కోల్పోయారు. ముఖం చాటేస్తున్న పీఎస్యూలు గతంలో భారీ ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలతో ముందుకొచ్చిన ప్రభుత్వరంగ సంస్థలు ఇప్పుడు వెనుకంజ వేస్తున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశాఖపట్నం–కాకినాడ మధ్య ఏర్పాటు చేయదల్చిన పెట్రో కెమికల్ ఇన్వెస్ట్మెంట్ (పీసీపీఐఆర్) ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం అటకెక్కించింది. రూ.3.43 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణతో, 12 లక్షల మందికి ఉపాధి కల్పించేలా రూపొందించిన ఈ ప్రాజెక్టు పట్ల ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించనందున ఆపేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అదేవిధంగా వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో చిత్తూరు జిల్లా మన్నవరంలో రూ.6,000 కోట్ల పెట్టుబడితో బీహెచ్ఈఎల్–ఎన్టీపీసీ యూనిట్కు అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్తో శంకుస్థాపన చేయించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టును రూ.361 కోట్లకు పరిమితం చేసి మిగిలిన విస్తరణను వేరే రాష్ట్రానికి తరలించినా మిన్నకుండిపోయింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు వరప్రదాయినిగా ఉన్న వైజాగ్స్టీల్ (ఆర్ఐఎన్ఎల్) ఇప్పుడు ఆర్థికంగా కష్టాల్ని ఎదుర్కొంటోంది. దీంతో గతంలో చేద్దామనుకున్న రూ.22,000 కోట్ల భారీ విస్తరణ ప్రణాళికలను తాత్కాలికంగా నిలిపేసినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అలాగే విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నష్టాల్లో ఉందన్న సాకుతో ప్రైవేటుపరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.