breaking news
Shri Krishna Janmashtami
-
షాహీ ఈద్గా కాంప్లెక్స్ సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఆమోదం
లక్నో: ఉత్తరప్రదేశ్ మధురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్ ప్రాథమిక సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతినిచ్చింది. కోర్టు పర్యవేక్షణలో ముగ్గురు సభ్యుల అడ్వకేట్ కమిషనర్ల బృందం సర్వే నిర్వహిస్తుందని నిర్దేశించింది. ఇందుకు తగిన విధివిధానాలను డిసెంబర్ 18న నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. 'షాహీ ఈద్గా మసీదును అడ్వకేట్ కమిషనర్తో సర్వే చేయించాలనే మా అభ్యర్థనను అలహాబాద్ హైకోర్టు ఆమోదించింది. మసీదు లోపలి భాగంలో హిందూ దేవాలయాల చిహ్నాలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని తేల్చడానికి అడ్వకేట్ జనరల్ అవసరం. ఇది చరిత్రాత్మక తీర్పు.' అని న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. మధురలో దాదాపు 13.37 ఎకరాల భూమిలో ఉన్న శ్రీ కృష్ణుని ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు షాహీ ఈద్గా మసీదును నిర్మించాడని హిందూ తరుపున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్థలాన్ని శ్రీ కృష్ణ విరాజ్మాన్కు చెందినదిగా ప్రకటించాలని కోరుతున్నారు. మరోవైపు మసీదు ప్రాంతాన్ని కూల్చివేయవద్దని పిటీషన్లు దాఖలయ్యాయి. ఇదీ చదవండి: నిందితుల ఎంట్రీ పాస్లపై ఎంపీ ప్రతాప్ సింహ వివరణ -
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
న్యూఢిల్లీ : శ్రావణ బహుళ అష్టమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు బుధవారం ఘనంగా జరుగుతున్నాయి. కృష్ణుడి ఆలయాలన్నీ శ్రీకృష్ణ నామంతో మార్మోగాయి. శ్రీకృష్ణుడి జన్మస్థానమైన ఉత్తరప్రదేశ్లోని మధురలో భక్తజన సంద్రం ఉప్పొంగింది. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పాలు, పెరుగు, వెన్నతో చిన్నికృష్ణయ్యకు భక్తులు అభిషేకం చేస్తున్నారు. మరోవైపు కొంతమంది గురువారం కృష్ణాష్టమి జరుపుకోనున్నారు. అష్ట అంటే ఎనిమిది. ఈ అంకెతో శ్రీ కృష్ణుడికి చాలా సంబంధం ఉంది. దశావతారాల్లో ఎనిమిదవ అవతారం ఆయనది. ఓం నమో నారాయణా య.. అని శ్రీకృష్ణుడిని ధ్యానిస్తారు. ఇది ఎనిమిది అక్షరాల మంత్రం కావడం విశేషం. దేవకీదేవికి శ్రీకృష్ణుడు ఎనిమిదవ సంతానం. ఆయనకు ఎనిమిది మంది ధర్మపత్నులున్నారు. శ్రీకృష్ణభగవానుడు దేవకీ గర్భం నుంచి ఉదయించిన పవిత్రదినాన్ని శ్రీ కృష్ణ జ న్మాష్టమిగా జరుపుకోవడం ఆనవాయితీ. కృష్ణాష్టమి రోజు జనులు అభ్యంగ స్నానమారించి, నూతన వస్త్రాలు ధరించి ఉపాసనం సంకల్పిస్తారు. తమ ఇళ్లను తోరణాలతో అలంకరించి, ఇళ్ల ముంగిళ్లలో బాలకృష్ణడి పాదముద్రలను బయటి నుంచి ఇంటిలో ఉన్న దేవిని గృహం వరకు వేయడం వల్ల బాలకృష్ణుడు బుడిబుడి అడుగులతో తమ గృహాలను విచ్చేస్తాని విశ్వాసం. చెలిమికి, ప్రేమకు, దుష్టశిక్షణకు శ్రీకష్ణుడు ప్రతీక. శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఇస్కాన్ దేవాలయాలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయి. ఢిల్లీ, ముంబై, లక్నో, ఛండీగఢ్, కోల్కతా, జమ్మూ, హర్యానా, హైదరాబాద్.. తదితర ప్రాంతాల్లో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. చిన్న పిల్లలు శ్రీకృష్ణ వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఢిల్లీ ఇస్కాన్ మందిరంలోనూ భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహించారు. భజనలు చేస్తూ తన్మయులయ్యారు.