-
భారీగా తగ్గిన హెచ్1–బీ వీసాలు
వాషింగ్టన్: అమెరికా కలల ప్రయాణానికి కరోనా మహమ్మారి అడుగడుగునా అడ్డు పడుతోంది. భారతీయ టెక్కీల్లో అత్యధిక డిమాండ్ ఉండే హెచ్1–బీ వీసాల సంఖ్య గత దశాబ్దంలో ఎన్నడూ లేని విధంగా తగ్గిపోయింది. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాలకి కొరత లేదు. జాబ్ ఓపెనింగ్స్ భారీ సంఖ్యలో ఉన్నాయి. కానీ హెచ్1–బీ ఉద్యోగస్తుల సంఖ్య పడిపోయింది. కోవిడ్ నేపథ్యంలో అమెరికా ప్రయాణాలపై, వీసాలపై ఆంక్షలు విధించడంతో ఈ వలసేతర వీసాలు తగ్గాయి. రెండేళ్లలో 19 శాతం తగ్గిపోయిన ఉద్యోగులు అమెరికా కార్మిక శాఖ వెల్లడించిన గణాంకాలను బ్లూమ్బర్గ్ న్యూస్ విశ్లేషించింది. గత ఏడాదితో పోల్చి చూస్తే సెప్టెంబర్ 2021 నాటికి హెచ్–1బీ కేటగిరి కింద విదేశీ ఇంజనీరింగ్, మ్యాథ్మేటిక్స్ ఉద్యోగస్తులు 12.6% తగ్గిపోయారు. కరోనా ముందు అంటే 2019లో పోల్చి చూస్తే ఇదే కేటగిరిలో 19% హెచ్1–బీ వీసాలు తగ్గిపోయాయి. కరోనా కారణంగా లాక్డౌన్లు విధించడం, వీసాల జారీ ప్రక్రియ మందగించడం, కోవిడ్ ముప్పుతో అమెరికాకు వెళ్లడానికి ఇష్టపడకపోవడం వంటి కారణాలతోనే హెచ్–1బీ వీసాల సంఖ్య తగ్గిపోయిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘2020 మార్చి నుంచి కొత్త వీసాల జారీ ప్రక్రియ బాగా నెమ్మదించింది. లాక్డౌన్ ఆంక్షలతో ఒకానొక దశలో కొన్నాళ్ల పాటు దాదాపు నిలిచింది. స్టెమ్ (సైన్స్, సాంకేతికం, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) కేటగిరీలో ఉద్యోగులు తగ్గిపోయాయి. కొన్ని కంపెనీలు విదేశాల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్కి అనుమతినివ్వడంతో హెచ్–1బీ వీసాల సంఖ్య తగ్గిపోయింది’ అని కాలిఫోర్నియా యూనిర్సిటీ ప్రొఫెసర్ పేరి గోవణ్ణ చెప్పారు. ప్రతీ ఏడాది కొత్తగా 85 వేల హెచ్1బీ వీసాలు జారీ చేస్తుంటారు. స్టెమ్లో గత ఏడాది మార్చి, ఏప్రిల్లో కరోనా కారణంగా ఉద్యోగాలు పోయాయి. కానీ త్వరగానే ఆయా రంగాలు కోలుకోవడంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టుగా అమెరికా కార్మిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 4,97,000 ఉద్యోగాలు ఉన్నాయని 2020 నుంచి పోల్చి చూస్తే 9% తగ్గిందని, 2019తో పోల్చి చూస్తే 17% తగ్గిందని బ్లూమ్బర్గ్ న్యూస్ వెల్లడించింది. -
ఉద్యోగులేరీ?
సాక్షి, సూర్యాపేట: జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కలెక్టరేట్తో పాటు జిల్లా కేంద్రంలో ఉన్న 64 ప్రధాన శాఖల్లో సుమారు 2వేల మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా కేవలం 625 మందితో కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సకాలంలో ఏ పనీ జరగడం లేదు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలుకు నోచుకోకపోగా, విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై పని భారం తప్పడంలేదు. జిల్లా ఆహార తనిఖీ కార్యాలయంలో కనీసం ఆరుగురు ఉద్యోగులు ఉండాలి. కానీ కేవలం ఒక అధికారి, అటెండర్ మాత్రమే ఉన్నా వీరిని యాదాద్రి భువ నగిరి జిల్లాకు ఇన్చార్జ్గా ని యమించారు. దీంతో ఏడాది కాలంగా కార్యాలయ తాళం తీ యడం లేదు. జిల్లాస్థాయి ప్ర భుత్వ కార్యాలయాల్లో సిబ్బం ది కొరతకు ఇది నిదర్శనం. సర్కారు పథకాలు సకాలంలో ప్రజలకు అందించాలంటే ప్రభుత్వ కార్యాలయాల్లో సరిపడా ఉద్యోగులు ఉండాలి. చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరువ చేయవచ్చని భావించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విభజన చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న ఉద్యోగులను మూడు జిల్లాలకు పంచడమే కాకుండా ఇతర జిల్లాల నుంచి కొంత మంది ఎంప్లాయీస్ను సూర్యాపేట జిల్లాకు ఆర్డర్టు సర్వ్ పేరుతో పంపింది. అయితే తగినంతమందిని కేటాయించకపోవడంతో జిల్లా స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగుల కొరత పట్టిపీడిస్తోంది. ఒకటి రెండు శాఖల్లో ఉద్యోగుల కొరత ఉంటేనే పరిస్థితి దారుణంగా ఉంటుంది. అలాంటిది అన్ని శాఖల్లో అలాంటి పరిస్థితే ఉండడంతో సకాలంలో పనులు జరగడంలేదు. జిల్లా ఏర్పడి మూడేళ్లు కావొస్తున్నా ఉద్యోగుల సమస్య మాత్రం తీరడం లేదు. శాఖల్లో పరిస్థితి.. జిల్లా సమీకృత కలెక్టరేట్తో పాటు జిల్లా కేంద్రలో ఉన్న 64 ప్రధాన శాఖల్లో సుమారు 2 వేల మంది ఉద్యోగులు ఉండాలి. కానీ కేవలం 625 మందితో నెట్టుకురావాల్సిన దుస్థితి నెలకొంది. సమీకృత కలెక్టరేట్లో ఉన్న జిల్లా కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత స్పష్టంగా కనబడుతోంది. అన్ని శాఖల్లో ప్రధాన్యత కలిగిన జిల్లా రెవెన్యూ కార్యాలయంలో వివిధ సెక్షన్లలో కలిపి 54 మంది ఉద్యోగులు అవసరం ఉండగా 30 మంది మాత్రమే ఉన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయలంలో 15 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా 8 మంది ఉద్యోగుల మాత్రమే ఉన్నారు. జిల్లా ఆహార తనిఖీ కార్యాలయంలో కనీసం ఆరుగురు ఉద్యోగులు ఉండాల్సి ఉండగా కేవలం ఒక అధికారి, అటెండర్ మాత్రమే ఉన్నా వీరు కూడా ఇతర మరో జిల్లాలకు ఇన్చార్జ్గా నియమించడంతో గత సంవత్సరం నుంచి కార్యాలయ తాళం తీయడం లేదు. ఇక జిల్లా కార్మిక శాఖలో 12 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా కేవలం ఒక జిల్లా అధికారి, ఒక డివిజన్ అధికారి, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కలిపి మొత్తం నలుగురు మాత్రమే ఉన్నారు. అదే విదం గా గ్రామ పంచాయతీ కార్యాలయం, ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయం, సివిల్ సప్లయ్, పౌరసంబంధాలశాఖ, వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ, సహకారశాఖ, భూ కొలతలు, పంచాయతీరాజ్ ఇలా అన్ని శాఖల్లో ఉద్యోగుల కొరత వేధిస్తోంది. సక్రమంగా అమలు కాని ప్రభుత్వ పథకాలు ఉద్యోగుల కొరత వల్ల ప్రభుత్వ పథకాలు స క్రమంగా అమలు కావడం లేదు. చిన్న జిల్లాలు ఏర్పడినా ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగక తప్పడం లేదు. ఇదిలా ఉంటే ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా అధికారులతో పాటు సీనియర్ అసిస్టెంట్లపై అధికభారం పడుతోందని ఆయా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నేరుగా బయటకు చెప్పకున్నా తమలో తమే బాధపడుతున్న సందర్భాలూ ఉన్నాయి. -
నీటిపారుదల శాఖలో ఇంజినీర్ల కొరత
మోర్తాడ్(బాల్కొండ): చిన్న తరహా నీటిపారుదల శాఖ లో ఇంజినీర్ల కొరత వేధిస్తోంది. ఖాళీ అయిన పోస్టులలో ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో ఇన్చార్జులతోనే శాఖలోని పనులను అధికారులు నెట్టుకొస్తున్నారు. ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకం పనులకు తీరని ఆటంకం కలుగుతోంది. క్షేత్ర స్థాయిలో పని చేయడానికి ఒక్కో మండలానికి ఒక ఏఈ ఖచ్చితంగా అవసరం. కొత్త మండలాల వారీగా కాకపోయినా పాత మండలాల వారిగానైనా ఏఈలు ఉండాల్సి ఉంది. అయితే పోస్టులు భర్తీ కాలేక పోయాయి. పదవీ విరమణ చేసిన అధికారుల స్థానంలో కొత్తగా ఉద్యోగులను నియమించకపోవడంతో ఖాళీలు పేరుకు పోతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో నీటిపారుదల శాఖను పాలించే ఎస్ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఎస్ఈగా పని చేసిన దామోదర్ మాల్ ఏప్రిల్లో పదవీ విరమణ పొందారు. దీంతో నిర్మల్ జిల్లా ఎస్ఈగా పని చేస్తున్న మురళీధర్కు ఇక్కడ పదవీ బాధ్యతలను అదనంగా అప్పగించారు. రెండు జిల్లాల బాధ్యతలను ఒక్క అధికారే పర్యవేక్షించాల్సి ఉంది. బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించి రెగ్యులర్ ఏఈ ఒక్క కమ్మర్పల్లి మండలానికి మాత్రమే ఉన్నారు. మోర్తాడ్లో పదవీ విరమణ పొందిన ఏఈ గంగాధర్ను తాత్కాలిక పద్ధతిలో నియమించారు. ఏర్గట్ల, భీమ్గల్, బాల్కొండ మండలాలతో పాటు కొత్తగా ఏర్పడిన ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల మండల బాధ్యతలను మోర్తాడ్ బాధ్యతలను నిర్వహిస్తున్న అధికారే పరిశీలించాల్సి వస్తోంది. ఆర్మూర్ నియోజకవర్గంలో మాక్లూర్, ఆర్మూర్లకు మాత్రమే ఏఈలు ఉన్నారు. నందిపేట్ మండలంలోని పోస్టు ఖాళీగానే ఉంది. ఆర్మూర్ ఏఈ నందిపేట్ అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నందిపేట్ మండలం భౌగోళికంగా చాలా పెద్దదిగా ఉండగా ఒకే అధికారి రెండు మండలాల బాధ్యతలను నిర్వహించడం కష్టంగానే ఉంది. నిజామాబాద్ రూరల్ మండలంలో డిచ్పల్లి, సిరికొండ మండలాల్లోనే ఏఈలు ఉన్నారు. ధర్పల్లి, ఇందల్వాయి, నిజామాబాద్ రూరల్, మోపాల్ మండలాల్లో పోస్టులు ఖాళీగా ఉండటంతో ఉన్న ఇద్దరు ఏఈలకు అదనపు బాధ్యతలను అప్పగించారు. నిజామాబాద్ అర్బన్కు సంబంధించి ఒక్కరే ఏఈ ఉన్నారు. ఇక్కడ సౌత్, నార్త్, సెంట్రల్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక్కరే అధికారి అదనపు బాధ్యతలను నిర్వహించాల్సి వస్తోంది. ఒక్క బోధన్ డివిజన్లో మాత్రం ఏఈ పోస్టుల్లో రెగ్యులర్ ఇంజినీర్లు ఉన్నారు. మిషన్ కాకతీయకు కీలకమైన నీటిపారుదల శాఖలో ఇంజినీర్ల కొరత ఉండటంతో చెరువుల పునరుద్ధరణ పనులు అటకెక్కాయి. రెండు, మూడు విడతల పునరుద్ధరణ పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఖాళీ పోస్టుల కారణంగా చెరువుల పునరుద్ధరణ ఆశించినంత మేర వేగంగా సాగడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. మిషన్ కాకతీయ పథకం పనులు పూర్తి కావాలంటే ఏఈలు ఎంతో అవసరం. ఈ ఖాళీ పోస్టులను భర్తీ చేస్తే నిరుద్యోగ సమస్య పరిష్కరించడంతో పాటు గ్రామాల్లో చెరువులు అభివృద్ధి చెందుతాయి. జిల్లా పరిషత్ ద్వారా ప్రభుత్వానికి ఈ సమస్యను విన్నవిస్తాం. ఖాళీ పోస్టులు భర్తీ అయ్యే వరకు ఉద్యమిస్తాం. – గుల్లె రాజేశ్వర్, జెడ్పీటీసీ సభ్యుడు, ఏర్గట్ల -
ఆ ఒక్కరే దిక్కు
వనపర్తి: రోజురోజుకు తగ్గిపోతున్న వనాలు, వన్యప్రాణుల సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించింది. ఫారెస్టు చట్టాలను మరింత కఠినతరం చేయడమే కాకుండా అటవీప్రాంతాన్ని కాపాడటంతో పాటు పచ్చదనం పెంచేందుకు ఊరుకో నర్సరీని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 139 గ్రామాల్లో డ్వామా, ఫారెస్టు శాఖల ఆధ్వర్యంలో నర్సరీలు పెంచుతున్నారు. వచ్చే వర్షాకాలం నాటికి మొక్కలు నాటే దశకు వస్తాయి. కానీ అటవీ ప్రాంతా న్ని రక్షించే వనమాలి(బీట్ ఆఫీసర్) మాత్రం జిల్లాలో ఒక్కరే ఉన్నారు. ఫారెస్ట్ శాఖ లో ఉద్యోగుల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. జిల్లాలో 11,083 హెక్టార్లలో అటవీప్రాంతం విస్తరించి ఉంది. ఈ పచ్చని ప్రాంతంలో వివిధ రకాల చెట్లు, మొక్కలు, అడవి జంతువులు, నెమళ్లు, జింకలు, కుందేళ్లతో పాటు ఇతర జంతువులు ఉన్నాయి. అడవిలో ఉండే చెట్లు, మొక్కలతో పాటు వన్యప్రాణులను సంరక్షించేందుకు జిల్లా అటవీశాఖ అధికారులు mahaమొత్తం అటవీ ప్రాంతాన్ని 26 బీట్లుగా విభజించారు. ఒక్కో బీటుకు ఒక్కో అధికారి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలి. ఒక్కో బీట్ అధికారికి సుమారుగా 500 నుంచి 700 హెక్టార్ల భూభాగాన్ని కేటాయించారు. వారికి కేటాయించిన ప్రాంతంలోని చెట్లు, వన్యప్రాణులను నిరంతరం రక్షిస్తూ ఉండాలి. ఆ ఒక్కరే దిక్కు జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని కాపాడేందుకు 26 వనమాలీలు (బీట్ అధికారులు) ఉండాల్సి ఉండగా.. కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారు. సెక్షన్ అధికారులకు విధులను కేటాయించి వనసంరక్షణ చర్యలు చేపడుతున్నారు. చట్టాలను కఠినతరం చేస్తూ వనాలు, వన్యప్రాణుల రక్షణపై అధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అటవీ ప్రాంతాన్ని కాపాడటం, చెట్లు తక్కువగా ఉన్న ప్రాంతంతో పాటు రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటించి పెంచడం, ఆయా బీట్ల పరిధిలో వన్యప్రాణులను రక్షించడం వనమాలి విధులు. ‘వనాల’పర్త జిల్లావ్యాప్తంగా 11,083 హెక్టార్లలో అటవీప్రాంతం ఉండగా వనపర్తి మండలం, ఖిల్లాఘనపురం మండలం, గోపాల్పేట మండలం బుద్దారం, పాన్గల్ మండలం, పెద్దమందడి మండలాల్లోని ప్రాంతాల్లో అటవీప్రాంతం ఎక్కువగా ఉంది. వనపర్తి సంస్థానాధీశులు ఫారెస్ట్ కోసం ఇచ్చిన భూభాగమే ఎక్కువగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం వనపర్తి మండలం శ్రీనివాసపురం, సవాయిగూడెం, చందాపూర్, దత్తాయపల్లి తదితర ప్రాంతాలను కలుపుకుని ఉన్న అటవీ ప్రాంతాన్ని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నించగా, కేంద్ర రక్షణ బలగాలు ఇక్కడ కొన్నాళ్లూ క్యాంపులు వేసి ఈ భూమిని ఫారెస్టుశాఖకు వర్తింపజేసేలా నీలగిరి చెట్లు, ఇతర రకాల మొక్కలను నాటించి వెళ్లారు. నాటినుంచి భూమి ఫారెస్ట్శాఖ ఆధీనంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.! నియామకాల ఊసేది? ఫారెస్టు శాఖలో సెక్షన్, బీట్ అధికారుల నియామకం కోసం ఏడాదిన్నర క్రితం ఉద్యోగ అర్హత పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఉద్యోగులను ఎంపిక చేశారు. కారణాలు ఏవైనా వారికి ఇప్పటి వరకు నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. కొత్త చట్టాలను పకడ్బందీగా అమలుకు ఉద్యోగులను నియమించాల్సి ఉందని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. అడవి రక్షణకు చర్యలు ప్రస్తుతం అమల్లో ఉన్న 1967 ఫారెస్టు చట్టంలో మార్పులు చేస్తూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ఫారెస్టుశాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చట్టాలను మరింత కఠినతరం చేస్తూ ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు పంపించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వనాలు, వన్యప్రాణులు, పచ్చదనం పెంచడం తదితర అశాలపై సుదీర్ఘచర్చ జరిగే అవకాశం ఉంది. పకడ్బందీగా చట్టం అమలు మారుతున్న ఫారెస్టు చట్టాల ప్రకారం గతంలో అడవిలో చెట్లు నరికితే ఏడాది కాలం జైలు శిక్ష ఉండేది. మారిన చట్టాల ప్రకారం కనీసం మూడేళ్లు జైలుశిక్ష, రూ.ఐదువేల జరిమానా విధించే అవకాశం ఉంది. ఇక నుంచి ప్రభుత్వం, ప్రైవేట్ ప్రదేశాల్లో ఎక్కడ చెట్లు నరికినా కఠినచర్యలు తప్పవు. చట్టాలను పకడ్బందీగా అమలుచేయాలంటే అవసరమైన సిబ్బందిని నియమిస్తే బాగుంటుంది. – బాబ్జిరావు, జిల్లా అటవీ అధికారి, వనపర్తి -
పల్లెల్లో పాట్లు
పాల్వంచరూరల్: నూతన గ్రామపంచాయతీలు సమస్యల లోగిళ్లుగా మారాయి. గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు, కనీస వసతులు లేవు. పంచాయతీ కార్యాలయాలకు పక్కా భవనాలు లేక పలు గ్రామాల్లో అద్దె భవనాల్లోనే కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో ఇటీవల కొత్త సర్పంచ్లు, వార్డు సభ్యులు కొలువుదీరినా.. అభివృద్ధి పనులు చేయడం వారికి సవాల్గానే మారింది. దీనికి తోడు గ్రామ కార్యదర్శుల కొరత కూడా వేధిస్తోంది. జిల్లాలో 479 గ్రామ పంచాయతీలు ఉండగా.. కార్యదర్శులు 88 మంది మాత్రమే పని చేస్తున్నారు. దీంతో ఒక్కొక్కరు మూడు, నాలుగు గ్రామాల బాధ్యతలు చూడాల్సి వస్తోంది. ఫలితంగా ఏ గ్రామంలోనూ వారు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. అభివృద్ధి కోసమే పునర్విభజన... చిన్న పంచాయతీలు అయితేనే అభివృద్ధి మరింతగా సాధ్యమనే ఉద్దేశంతో ప్రభుత్వం పంచాయతీల పునర్విభజన చేసింది. 500 మంది జనాభా ఉన్న తండాలు, చిన్న గ్రామాలను కూడా ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. జిల్లాలో గతంలో 203 (భద్రాచలం, సారపాక మినహా) గ్రామ పంచాయతీలు ఉండగా.. పునర్విభజన తర్వాత 479కి పెరిగింది. అన్ని గ్రామాలకు ఈనెల 2వ తేదీన కొత్త పాలకులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటున్నాయి. కొత్త పంచాయతీలకు భవనాలు కరువు.. జిల్లాలో నూతనంగా ఆవిర్భవించిన 276 గ్రామపంచాయతీలకు పక్కా భవనాలు కరువయ్యాయి. పాత వాటిలోనూ 43 గ్రామాల్లో సరైన కార్యాలయాలు లేవు. కొత్తగా ఏర్పడిన వాటిలో 20 పంచాయతీలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కొత్త పంచాయతీల ఏర్పాటుపై శ్రద్ధ చూపిన ప్రభుత్వం..పక్కా భవనాల నిర్మాణంలో పట్టనట్టుగా వ్యవహరిస్తోందని పలువురు సర్పంచ్లు ఆరోపిస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు మంజూరు చేసిన నిదులను కొత్త పంచాయతీలకు కూడా జమ చేయాలని, ఆయా గ్రామాల్లో నెలకొన్న సమ స్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు. వేధిస్తున్న కార్యదర్శుల కొరత... గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ అధికారిగా వ్యవహరించే కార్యదర్శులు ప్రతి పంచాయతీకి ఒకరు ఉండాలి. కానీ జిల్లాలో 387 గ్రామాల్లో కార్యదర్శు లు లేరు. జిల్లా వ్యాప్తంగా 88 మంది మాత్రమే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఏ అభివృద్ధి జరగాలన్నా కార్యదర్శులు పర్యవేక్షించాలి. వీధి లైట్లు, పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరపరా, ఇంటి పన్నుల వసూళ్లు, జనణ, మరణ ధ్రువీకరణ పత్రాల జారీతో పాటు ఇతర సంక్షేమ పథకాల అమలు బాధ్యత కూడా వీరిపైనే ఉంటుంది. అయితే అన్ని గ్రామాల్లో కార్యదర్శులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
Advertisement