-
అమ్మ కావాలని.. ఎక్కడున్నావంటూ..
ఎవరితో వచ్చిందో... ఎందుకు వదిలి వెళ్లారో... అందరూ తన చుట్టూ ఎందుకు గుమిగూడారో... ఈ పోలీసుల హడావుడి ఏమిటో తెలియని అమాయకత్వం. వచ్చీ రాని మాటలతో తన వివరాలుగానీ, తల్లిదండ్రుల సమాచారం కానీ, కనీసం ఊరూ పేరు కూడా చెప్పలేకపోవడంతో ‘కంటేనే అమ్మ, నాన్నలు కాదు మనసున్న మేమూ తల్లిదండ్రులమే’నంటూ అక్కున చేర్చుకున్నారు పిల్లలు లేని ఓ దంపతులు. చట్టప్రకారం దత్తత తీసుకోవాలే తప్ప ఇలా కాదంటూ పోలీసు స్టేషన్లో కొంతసేపు ఉంచి...తరువాత కాకినాడలోని శిశువిహార్కు అప్పగించారు. అమ్మా...ఎక్కడమ్మా అంటూ ఆ చిన్నారి ఏడుస్తూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. సాక్షి, తూర్పుగోదావరి : అమాయకపు చూపులతో.. అటు.. ఇటూ.. వెళ్లే వారిని చూస్తూ... తాటిపాక సెంటరులోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న గుర్తు తెలియని రెండేళ్ల చిన్నారిని మంగళవారం రాజోలు పోలీసులకు స్థానికులు అప్పగించారు. ఆ బాలికను ఎస్సై ఎస్.శంకర్ రాజోలు ఐసీడీఎస్ సీడీపీఓ వై.కె.డి.రమాదేవికి అప్పగించారు. దీంతో బాలికను సీడీపీఓ రమాదేవి కాకినాడ శిశువిహార్కు తీసుకుని వెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. తాటిపాక సెంటరులోని విక్టరీ బజార్ సమీపంలో గత రెండు రోజులుగా ఓ రెండేళ్ల పాప వర్షంలో తడుస్తూ ఏడుస్తుండగా మాజీ ఎంపీటీసీ గెడ్డం సురేష్, దళిత నాయకుడు బొంతు మణిరాజులు గుర్తించారు. పాపను చేరదీసి ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూశారు. చిన్నారి చిరునామా తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేసినా ఫలి తం లేకపోవడంతో పొదలాడకు చెందిన డ్రైవర్ రాజు ఇంటి వద్ద పెట్టారు. ‘అమ్మ కావాలని, అమ్మా ఎక్కడున్నావంటూ అప్పుడప్పుడూ విలపిస్తోంది. ‘తనకు పిల్లలు లేరని, పాపను దత్తత తీసుకుంటా’నని రాజు చెప్పగా...దత్తత తీసుకునేందుకు ఇది సరైన మార్గం కాదని సురేష్, మణిరాజులు చెప్పి రాజోలు ఎస్సై శంకర్కు అప్పగించారు. పాప సమాచారం తెలిసే వరకు పాపను ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో క్షేమంగా ఉంటుందని ఎస్సై వివరించారు. పాప ఆచూకీ తెలిసిన వారు రాజోలు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. ఐసీడీఎస్ సీడీపీఓ రమాదేవి, సూపర్వైజర్లు డి.ప్రసన్నరాణి, కె.చంద్రకళ, అంగన్వాడీ యూనియన్ లీడర్ పి.అన్నపూర్ణలు చిన్నారిని కాకినాడ శిశువిహార్కు తీసుకుని వెళ్లారు. -
అమ్మానుషం
కడప అర్బన్: మానవవత్వం మంటగలుస్తోంది.. అమ్మతనం అపహాస్యమవుతోంది.. కన్ను తెరిచి ఈ లోకంలోకి వచ్చిన కొన్ని రోజులకే కొందరు అనాథలుగా మారుతుండగా.. మరికొందరు జంతువులకు ఫలహారమవుతున్నారు. కడప నగరంలో గురువారం వెలుగు చూసిన సంఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. రిమ్స్లో పదిరోజుల పసికందును గుర్తు తెలియని మహిళ వదిలేసి వెళ్లింది. చీటీ రాయించుకుని వస్తానని చెప్పి అక్కడి నుంచి అలాగే ఉడాయించింది. నవమాసాలు మోసి కన్న తన చిన్నారిని ఒంటరి చేసి వెళ్లిపోయింది. రిమ్స్ సీఐ నారాయణ ఆ పసికందును ఐసీడీఎస్ ఆధ్వర్యంలోని శిశువిహార్కు అప్పగించారు. డాక్టర్ నరసింహారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండున్నర నుంచి నాలుగు కిలోల బరువుతో చిన్నారులు జన్మిస్తారన్నారు. రిమ్స్లో వదిలేసి వెళ్లిన శిశువు కేవలం ఒకటిన్నర కిలోలు ఉందన్నారు. బుగ్గవంకలో మరో మృతదేహం మెత్తటి పరుపుపై ఆ పసిపాప నిద్రపోతున్నట్లుంది. అయితే ఆ పాపలో చలనం లేదు. ఊపిరి ఎప్పుడో ఆగిపోయింది. తమకు భారం అనుకున్నారో.. ఇంకేమిటో గానీ బుగ్గవంకలో గురువారం ఈ చిన్నారి మృతదేహాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. రెండు నెలల వయస్సున్న ఈ చిన్నారి ఎలా మృతి చెందింది అన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం దహనసంస్కారం చేస్తామని పోలీసులు చెప్పారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement