breaking news
Shilpa Shirodar
-
మహేశ్ బాబు మరదలికి తృటిలో తప్పిన ప్రమాదం
బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ (Shilpa shirodkar) రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఇదే విషయాన్ని తెలుపుతూ సోషల్మీడియాలో ఆమె పోస్ట్ చేసింది. ఈ క్రమంలో తన కారు ఫోటోలను కూడా పంచుకుంది. మహేశ్బాబు మరదలు, నమత్రా శిరోద్కర్కు ఆమె సోదరి అవుతారనే విషయం తెలిసిందే. 'బ్రహ్మ' సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన ఆమె పలు హిందీ సీరియళ్లలో కీలక పాత్రలు పోషించింది. ఆపై ‘బిగ్బాస్ 18’ (హిందీ) కంటెస్టెంట్గా కూడా మెప్పించింది.ముంబైలో తాను ప్రయాణిస్తున్న కారును ఒక ప్రైవేట్ బస్సు ఢీ కొట్టిందని శిల్పా శిరోద్కర్ పేర్కొంది. అయితే, ఈ ప్రమాదంలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని చెప్పింది. కానీ, తన కారుకు మాత్రమే డ్యామేజ్ అయిందని ఆమె ఇలా చెప్పింది. ఆ బస్సు ఏ కంపెనీ కోసం అయితే పనిచేస్తుందో ఆ యాజమాన్యంపై శిల్పా ఫిర్యాదు చేసింది. అయితే, ఎవరికీ గాయాలు కాలేదు కదా అంటూ.. ఈ సంఘటనకు తమ కంపెనీ బాధ్యత వహించడానికి సిద్ధంగా లేదని సదరు కంపెనీ చెప్పినట్లు ఆమె పేర్కొంది. ముంబైలోని ఆ ఆఫీసుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు యోగేష్ కదమ్, విలాస్ ఇది తమ కంపెనీ బాధ్యత కాదని, డ్రైవర్ బాధ్యత అని వెళ్లిపోయారని శిల్పా శిరోద్కర్ పేర్కొంది. ఈ వ్యక్తులు ఎంత క్రూరంగా ఉన్నారు..? డ్రైవర్ ఎంత సంపాదిస్తున్నాడు..? అని సోషల్మీడియాలో ఆమె రాసింది. ఈ విషయంలో ముంబై పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారని వారు సరైనా న్యాయం చేశారని ఆమె తెలిపింది. -
ఈ హీరోయిన్ను గుర్తుపట్టగలరా?
టాలీవుడ్తో సైతం సంబంధాలున్న ఈ హీరోయిన్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఎప్పుడో 14 ఏళ్ల కిందటే వెండితెరకు దూరమైన ఈమె.. గత మూడేళ్ల నుంచి టీవీ సీరియళ్లలో నటిస్తోంది. షూటింగ్ లకు తప్ప ఇతర వేదికలకు దూరంగా ఉంటోన్న ఆమె.. ఇటీవల ముంబైలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు హాజరైంది. గుర్తుపట్టలేనట్లు తయారైన ఈ హీరోయిన్ ను చూసి సహనటులే ఆశ్చర్యపోయారట! మాజీ మిస్ ఇండియా, మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పెద్దక్క శిల్పా శిరోద్కరే ఈ ఫొటోలో కనిపిస్తోన్న నటి శిల్పా శిరోద్కర్! మరాఠీ కుటుంబానికి చెందిన శిల్ప.. 1989లో బ్రష్టాచార్ సినిమతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కిషన్ కన్హయ్య, త్రినేత్ర, హమ్, ఖుదాగవా, ఆంఖే, పెహ్చాన్, బేవఫా సనమ్, మృత్యుదండ్ తదితర సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. తెలుగులో మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన ‘బ్రహ్మ’లో హీరోయిన్ గా నటించారు. మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రలో ఎంఎఫ్ హుస్సేన్ రూపొందించిన ‘గజగామిని’ శిల్పా శిరోద్కర్ నటించిన ఆఖరి చిత్రం. పదమూడేళ్ల విరామం తర్వాత తిరిగి నటన ప్రారంభించిన శిల్ప.. జీ, స్లార్ ప్లస్ లలో ప్రసారమైన పలు టీవీ సీరియళ్లలో పాత్రలు పోశించారు.