breaking news
Shigella Infection
-
‘షిగెల్లా’ మళ్లొచ్చింది.. ఇద్దరు చిన్నారులకు పాజిటివ్
కోజికోడ్: కేరళలోని కోజికోడ్ జిల్లా పెరుమన్నలో ఇద్దరు చిన్నారులకు షిగెల్లా ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణ అయింది. రెండుమూడేళ్ల వయస్సు గల ఈ ఇద్దరు చిన్నారులు ప్రస్తుతం కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పెరుమన్న పంచాయతీ పరిధిలోని పరక్కండం, పుతియోటిల్ ప్రాంతాలకు చెందిన ఈ చిన్నారులకు అనారోగ్య లక్షణాలు కనిపించడంతో, మొదట స్థానిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని మెడికల్ కాలేజీకి తరలించారు.తీసుకుంటున్న జాగ్రత్తలుషిగెల్లా నిర్ధారణ కావడంతో ఆ ప్రాంతంలో ఆరోగ్య శాఖ, పంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణమే నివారణ చర్యలు చేపట్టారు. గతంలో కోజికోడ్లోని పెరువయల్ గ్రామ పంచాయతీలో షిగెల్లా ప్రబలి, ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోగా, నివారణ చర్యలతో దానిని అదుపులోకి తెచ్చారు. అదే తరహా చర్యలను ఇప్పుడు పెరుమన్నలో కూడా అమలు చేస్తున్నారు.షిగెల్లా అంటే ఏమిటి?‘షిగెల్లా’ బ్యాక్టీరియా గ్రూపు వల్ల కలిగే పేగు సంబంధిత ఇన్ఫెక్షన్నే ‘షిగెల్లోసిస్’ అని పిలుస్తారు. ఇది చాలా వేగంగా వ్యాపిస్తుంది. ప్రధానంగా విరేచనాలు, తీవ్రమైన సందర్భాల్లో రక్తంతో కూడిన విరేచనాలు దీని ప్రధాన లక్షణాలు. ఈ వ్యాధి వల్ల కలిగే ‘డీహైడ్రేషన్’ అత్యంత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సకాలంలో చికిత్స అందకపోతే ఇది ప్రాణాపాయానికి దారితీయవచ్చు. ఐదేళ్ల లోపు పిల్లలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే, సరైన సమయంలో చికిత్స అందిస్తే దీనిని పూర్తిగా నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.లక్షణాలుషిగెల్లా బ్యాక్టీరియా పేగు పొరలకు సోకినప్పుడు, అది ‘షిగెల్లా టాక్సిన్’ అనే విషాన్ని విడుదల చేస్తుంది. ఇన్ఫెక్షన్ సోకిన ఒకటి నుండి మూడు రోజులలోపు (కొన్ని సందర్భాల్లో వారం రోజులలోపు) లక్షణాలు కనిపిస్తాయి.* రక్తం, శ్లేష్మంతో కూడిన విరేచనాలు* తీవ్రమైన కడుపు నొప్పి* వాంతులు, వికారం* మల విసర్జన తర్వాత కూడా ఇంకా అవ్వాలనే భావన కలగడం* కొన్ని సందర్భాల్లో ఫిట్స్ వంటి నాడీ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు.చికిత్సడీహైడ్రేషన్ నివారణ: శరీరంలో కోల్పోయిన నీరు, లవణాలను భర్తీ చేయడం ప్రధాన చికిత్స. ఓఆర్ఎస్ ద్రావణం, ఉప్పు కలిపిన గంజి నీటిని ఎక్కువగా తీసుకోవాలి. సాధారణ విరేచనాలకు యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు. కానీ షిగెల్లోసిస్ విషయంలో ఇన్ఫెక్షన్ తీవ్రతను, వ్యాప్తిని తగ్గించడానికి వైద్యులు వీటిని సూచించవచ్చు. సకాలంలో వ్యాధిని గుర్తించకపోవడం వల్లే సమస్య తీవ్రమవుతోందని, రోగులు ఆసుపత్రికి వచ్చేసరికి తీవ్రమైన నిర్జలీకరణకు లోనవుతున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఒక్క కాఫీ.. చిన్న పేస్ట్రీ.. పెద్ద ఉపశమనం! -
కేరళలో మరోసారి షిగెల్లా కేసు.. ప్రాథమిక లక్షణాలు ఇవే!
తిరువనంతపురం: కేరళలో మరోసారి షిగెల్లా కేసు వెలుగుచూసింది. కోజికోడ్లోని పుత్తియప్పలో ఏడేళ్ల బాలికలో ఈ వ్యాధిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 27నే కేసు నమోదైందని, ఇంకా ఎవరికీ వ్యాపించలేదని పేర్కొన్నారు. ఏప్రిల్ 20న బాలికలో షిగెల్లా లక్షణాలు కనిపించాయని, పొరుగింట్లోని మరో చిన్నారిలోనూ వ్యాధి లక్షణాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నారు. షిగెల్లా అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఇది ఒకరినుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందుతుంది. జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, అలసట మొదలైనవి షిగెల్లా వ్యాధి ప్రాథమిక లక్షణాలు. ఐదేళ్లలోపు పిల్లలకు ఈ వ్యాధి సంక్రమిస్తే ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. చదవండి👇🏿 భానుడి భగభగలతో బతకలేం బాబోయ్! ఆరెంజ్ అలర్ట్ జారీ విద్యార్థులకు ఫ్రీ హెయిర్ కటింగ్ చేయించిన టీచర్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే!


