breaking news
Shein
-
షీఇన్లో రిలయన్స్ ఉత్పత్తులు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ వేదిక అయిన షీఇన్ ఇండియా ఫాస్ట్ ఫ్యాషన్ యాప్లో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ అనుబంధ కంపెనీ నెక్ట్స్జెన్ ఫాస్ట్ ఫ్యాషన్ తయారు చేసిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. భారత్కు చెందిన రెడీమేడ్స్ తయారీ కంపెనీల నుంచి ఈ ఉత్పత్తులను నెక్సŠట్జెన్ కొనుగోలు చేస్తోందని పరిశ్రమ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రధానంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలు వీటిలో ఉన్నాయని చెప్పారు. అయిదేళ్ల నిషేధం తర్వాత రిలయన్స్ రిటైల్ ద్వారా షీఇన్ భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశించింది. ‘కొత్త షీఇన్ ఇండియా ఫాస్ట్ ఫ్యాషన్ యాప్ భారత్లో రూపుదిద్దుకుంది. దీని యాజమాన్యం, నియంత్రణ ఎల్లప్పుడూ రిలయన్స్ రిటైల్ చేతుల్లోనే ఉంటుంది. భారత కంపెనీలో షీఇన్కు వాటా లేదు. భారత్ నుంచి అప్లికేషన్ను నడిపిస్తున్నారు. కొత్తగా అందుబాటులోకి వచి్చన షీఇన్ ఇండియా ఫాస్ట్ ఫ్యాషన్ యాప్తో షీఇన్ గతంలో నిర్వహించిన షీఇన్.ఇన్ వెబ్సైట్తో సంబంధం లేదు’ అని ఆయన చెప్పారు. అయిదేళ్ల నిషేధం తర్వాత.. రిలయన్స్ రిటైల్ నుండి షీఇన్ ఇండియా ఫాస్ట్ ఫ్యాషన్ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్లో 10,000కి పైగా డౌన్లోడ్స్ నమోదయ్యాయి. యాపిల్ స్టోర్లో ఫ్యాషన్ ఈ–కామర్స్ కంపెనీల్లో టాప్ 10లో స్థానం పొందింది. చైనాతో ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత జూన్ 2020లో ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిషేధించిన యాప్లలో షీఇన్ ఒకటి. భారత్లో దాదాపు మూడు సంవత్సరాల నిషేధం తర్వాత బిలియనీర్ ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్తో షీఇన్ను ప్రమోట్ చేస్తున్న రోడ్గెట్ బిజినెస్ 2023లో భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్వదేశీ ఈ–కామర్స్ రిటైల్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేయడానికి రోడ్గెట్ బిజినెస్తో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ సాంకేతిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ నుంచి వచి్చన అభ్యర్థన మేరకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదించిన అనంతరం ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ప్రతిపాదనపై ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని పరిశ్రమ ప్రతినిధి వివరించారు. -
రిలయన్స్తో ఒప్పందం.. భారత్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న చైనా కంపెనీ?
చైనాకు చెందిన ఫ్యాషన్ దుస్తుల దిగ్గజం షీఇన్ (Shein) భారత్లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. దేశ సరిహద్దుల్లో డ్రాగన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు గల్వాన్ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించింది. ఆ దేశానికి చెందిన యాప్స్, సంస్థలపై నిషేధం విధించింది. వాటిలో షీఇన్ సంస్థ సైతం ఉంది. షీఇన్ ప్రపంచంలో అతి పెద్ద ఆన్లైన్ ఫ్యాషన్ దుస్తుల విక్రయాల కంపెనీ. 2022 ఏప్రిల్ నాటికి 150 దేశాల్లో దాని లావాదేవీల విలువ 100బిలియన్ డాలర్లు. ఫ్యాషన్ దుస్తులను తక్కువ ధరలతో అందుబాటులోకి తెచ్చి కుర్రకారుకు దగ్గరైన సదరు సంస్థ అనేక దేశాల నుంచి మార్కెట్లో దుస్తులను కొనుగోలు చేసి విక్రయించటంలో పేరుగాంచింది. దాని వెబ్సైట్, యాప్తోనే లావాదేవీలు జరుపుతుంది. అయితే, భారత్ షీఇన్ విభాగం దేశీయంగా ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ గ్రూప్తో ఒప్పందం కుదుర్చుంది. ఈ ఒప్పందం తర్వాత దేశీయంగా చైనా కంపెనీ తన కార్యకలాపాల్ని పున:ప్రారంభించనుందని.. ఈ అంశంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. షీఇన్పై రీటైల్ చూపు రీటైల్ రంగంలో దూసుకెళ్తున్న రిలయన్స్ రీటైల్ భారత్ నిషేధం విధించిన షీఇన్ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది. 25,000 చిన్న మరియు మధ్య తరహా స్థానిక ఉత్పత్తి దారుల నుంచి కొనుగోలు చేసి వాటిని ఆన్లైన్లో విక్రయిస్తుంది. ఈ సంస్థను దక్కించుకుంటే ఫ్యాషన్ విభాగంలో మరింత వృద్ది సాధించవచ్చని రిలయన్స్ భావించింది. అందుకే ఆ సంస్థను కొనుగోలు చేసి ప్రపంచ వ్యాప్తంగా షీఇన్ బ్రాండెడ్ ఉత్పత్తుల్ని అమ్మే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. పెరగనున్న మేడ్ ఇన్ ఇండియా వస్తువుల వాటా కానీ రిలయన్స్ షిఇన్ను కొనుగోలు చేయకుండా.. ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో షీఇన్ తన ప్లాట్ఫారమ్లో మేడ్ ఇన్ ఇండియా దుస్తులు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ ఒప్పందం, పున ప్రారంభం వంటి అంశాలపై ఇటు షీన్ ప్రతినిధులు, అటు రిలయన్స్ ఇతర వివరాల్ని వెల్లడించలేదు. నిషేధించబడిన యాప్లు గాల్వాన్ ఘర్షణలనేపథ్యంలో 2020లో భారత్ నిషేధించిన చైనీస్ యాప్లలో షీన్ కూడా ఒకటి. చైనాలో తన దుస్తులను విక్రయించని షీన్ 2021లో దాని ప్రధాన కార్యాలయాన్ని సింగపూర్కు మార్చింది. షీన్ యాప్ ద్వారా జరిగే కార్యకలాపాలకు సంబంధించిన డేటా అంతా భారత్లో స్టోర్ అవుతుంది. డేటా భద్రతా సమస్యలపై భారత ప్రభుత్వ కఠినమైన నిబంధనలకు అనుగుణంగా ఆన్లైన్ రిటైలర్ (షీఇన్)కు అందుబాటులో ఉండదు. స్టాక్ మార్కెట్తో ప్రమేయం లేనందున షీఇన్కు రిలయన్స్ సంస్థ లైసెన్స్ రుసుముల్ని చెల్లించనుంది. రిలయన్స్ రిటైల్ రిలయన్స్ రిటైల్ (Reliance Retail) బిజినెస్ కింద రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ స్మార్ట్ పాయింట్, జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్, జియో స్టోర్, రిలయన్స్ ట్రెండ్స్, ప్రాజెక్ట్ ఈవ్, ట్రెండ్స్ ఫుట్వేర్, రిలయన్స్ జువెల్స్, హామ్లేస్, రిలయన్స్ బ్రాండ్స్, రిలయన్స్ కన్జ్యూమర్ బ్రాండ్స్, 7-ఇలెవన్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. చదవండి👉 ఈషా అంబానీకి సరికొత్త వెపన్ దొరికిందా?