breaking news
Sheikh Imran
-
రేషన్ వాహనాలపై సర్కారు వేటు.. డ్రైవర్కు గుండెపోటు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: చంద్రబాబు ప్రభుత్వం తమ జీవనాధారాన్ని దూరం చేయడంతో ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్న వాహనాల(ఎండీయూ) డ్రైవర్లు, హెల్పర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గౌరవంగా బతుకుతున్న తమను ఈ ప్రభుత్వం రోడ్డుపాలు చేస్తోందనే వేదనతో కుమిలిపోతున్నారు. ఈ క్రమంలో రేషన్ వాహనంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గుంటూరుకు చెందిన డ్రైవర్(ఆపరేటర్) షేక్ ఇమ్రాన్ శనివారం గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతనిని గుంటూరు సమగ్ర ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఇమ్రాన్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎనిమిది నెలల కిందటే అతని తల్లి మెహమూదాబేగానికి క్యాన్సర్ ఆపరేషన్ జరిగింది. ఈ కుటుంబం మొత్తం రేషన్ వాహనంపై వచ్చే ఆదాయంతోనే జీవనం సాగిస్తోంది. ఇమ్రాన్ గుండెపోటుకు గురయ్యాడనే విషయం తెలియగానే పెద్ద సంఖ్యలో రేషన్ వాహనాల డ్రైవర్లు, హెల్పర్లు గుంటూరు కలెక్టరేట్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఇన్చార్జి కలెక్టర్ భార్గవ్తేజను కలిసి తమను కొనసాగించాలని వినతిపత్రం ఇచ్చారు.నా బిడ్డను కాపాడండినా బిడ్డ గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేషన్ వాహనం ఆపరేటర్గా ఎంపికయ్యాడు. అప్పటి నుంచి దానిపైన వచ్చే ఆదాయంతోనే మా కుటుంబం జీవిస్తోంది. నాకు 8 నెలల కిందటే క్యాన్సర్ ఆపరేషన్ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రేషన్ వాహనాలను రద్దు చేస్తున్నామని చెప్పిన వార్త విని నా బిడ్డ ఇమ్రాన్ తీవ్ర వేదనకు గురయ్యాడు. జీవనం కష్టమని బాధపడుతూ గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రిలో చేర్చాం. ఈ ప్రభుత్వ నిర్ణయం వల్ల మా లాంటి నిరుపేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. నా బిడ్డ ఇమ్రాన్ను, మా కుటుంబాన్ని ప్రభుత్వమే కాపాడాలి.– మెహమూదాబేగం, ఇమ్రాన్ తల్లి మమ్మల్ని రోడ్డున పడేసిన కూటమి ప్రభుత్వంఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వాహనాలను జూన్ ఒకటో తేదీ నుంచి రద్దు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కూటమి ప్రభుత్వం రేషన్ వాహనాలపై ఆధారపడిన దాదాపు 18,500 కుటుంబాలను రోడ్డుపాలు చేసింది. మాకు 2027 జవనరి నెల వరకు ప్రభుత్వంతో అగ్రిమెంట్ ఉన్నప్పటికీ ఆకస్మికంగా రద్దు చేయడం బాధాకరం. కూటమి ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. – చుండూరు సాంబశివరావు, రేషన్ వాహనాల ఆపరేటర్ల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడుఏలూరులో రేషన్ వాహనాల డ్రైవర్ల ధర్నాఏలూరు (టూటౌన్): కరోనా, వరదలు వంటి తీవ్ర విపత్తుల సమయంలో ప్రజలకు విశేష సేవలు అందించిన తమను ఒక్క కలం పోటుతో రాత్రికి రాత్రే తొలగించడం దారుణమని రేషన్ పంపిణీ వాహనాల డ్రైవర్లు ఆవేదన వ్యక్తంచేశారు. ఇంటి వద్దకే రేషన్ పంపిణీ వ్యవస్థను కొనసాగించాలని కోరుతూ డ్రైవర్లు, హెల్పర్లు శనివారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు డ్రైవర్లు మాట్లాడుతూ ముగ్గురు రేషన్ డీలర్లు చేసే పనిని తాము ఒక్కరమే చేస్తున్నామని చెప్పారు. ఈ వ్యవస్థను వైఎస్ జగన్ ఏర్పాటు చేశారనే కక్షతోనే తమను పక్కన పెట్టాలని నిర్ణయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంటి వద్దకే రేషన్ పంపిణీ వ్యవస్థను రద్దు చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 18,500 కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తంచేశారు. వీరిలో అత్యధికం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు ఉన్నారని తెలిపారు. తక్షణమే కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తమ జీవనోపాధిని కాపాడాలని కోరారు. ఈ ధర్నాకు వైఎస్సార్సీపీ, ఏఐటీయూసీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల ఇంటికి రేషన్ వద్దు.. మద్యం ముద్దు అన్నట్లు కూటమి ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. ఏఐటీయూసీ జిల్లా నాయకులు బండి వెంకటేశ్వరరావు, పి.కిషోర్, రేషన్ పంపిణీ వాహనాల ఆపరేటర్ల యూనియన్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఎస్.జయరాజు తదితరులు పాల్గొన్నారు.దొంగలుగా చిత్రీకరించడం బాధాకరంరేషన్ వాహనాల డ్రైవర్లను కూటమి ప్రభుత్వం దొంగలుగా చిత్రీకరించడం బాధాకరం. మాకు నెలకు ఇచ్చే రూ.21 వేలతోనే వాహనం ఈఎంఐ కట్టుకుంటున్నాం. ఆయిల్ ఖర్చులు భరిస్తున్నాం. మిగిలిన డబ్బులతో మా కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఇప్పటి వరకు రేషన్ డీలర్లపై ఆరువేలకు పైగా 6ఏ కేసులు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే రేషన్ అక్రమ రవాణా ఎవరు చేస్తున్నారో అర్థమవుతుంది.– అంబేడ్కర్, రేషన్ వాహనాల ఆపరేటర్ల సంఘం గుంటూరు నగర అధ్యక్షుడు -
అది చెప్పుల దుకాణదారుల కుట్ర
వీడిన రూ. 30 లక్షల దోపిడీ కేసు ఆరుగురు నిందితుల అరెస్ట్ రూ. 26.7 లక్షల స్వాధీనం చాంద్రాయణగుట్ట: కలెక్షన్ ఏజెంట్ కళ్లల్లో కారం చల్లి... రూ. 30 లక్షల దోపిడీ కేసును ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఛేదించారు. చెప్పులు దుకాణదారులే ఈ దోపిడీకి కుట్రదారులని తేల్చారు. ఆరుగురిని అరెస్టు చేసి... వారి వద్ద నుంచి రూ. 26.70 లక్షల నగదు, కత్తి, రెండు బైక్లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పురానీహవేళీలోని దక్షిణ మండలం డీసీపీ కార్యాలయంలో గురువారం నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... పహాడీషరీఫ్ ఠాణా పరిధిలోని జల్పల్లికి చెందిన షేక్ ఇమ్రాన్(21) చెత్తబజార్లో ‘ఎంఎస్ గ్రాండ్ ’ పేరిట చెప్పుల దుకాణం నడుపుతున్నాడు. మీర్చౌక్ లక్కడ్కోట్కి చెందిన విద్యార్థి షెహ్బాజ్ ఖాన్ (20) తండ్రి కూడా చెత్తబజార్లోనే డాలర్ చెప్పుల షాపు నిర్వహిస్తున్నాడు. చెత్త బజార్లోని దుకాణదారుల నుంచి శ్యాం సుందర్ అనే కలె క్షన్ ఏజెంటు ప్రతి రోజు రూ. 20 నుంచి రూ. 30 లక్షల వరకూ వసూలు చేసి సుల్తాన్బజార్లో బ్యాంక్లో జమ చేస్తుంటాడు. ఇది గమనించిన షేక్ ఇమ్రాన్, షెహ్బాజ్ ఖాన్లు అతడి నుంచి డబ్బు దోచుకోవాలని పథకం వేశారు. ఇందులో భాగంగా మూడు నెలల క్రితం ఛత్రినాక లిమ్రా కాలనీలో ఉండే పండ్ల వ్యాపారి మహ్మద్ ఇమ్రాన్ (21)తో కలిసి రెక్కీ నిర్వహించారు. ఆ తర్వాత ఇమ్రాన్ ఛత్రినాకలో ఉండే బీటెక్ విద్యార్థి మహ్మద్ జీషాన్అలీ (22), శాలిబండకు చెంది మహ్మద్ అబ్దుల్ ఖాదర్ అన్సారీ (24), డిగ్రీ విద్యార్థి మహ్మద్ సల్మాన్ఖాన్ (20)లతో కలిసి దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అనంతరం నలుగురూ కలిసి శ్యాంసుందర్ కదలికలపై రెక్కీ నిర్వహించారు. ఆగస్టు 23న చెత్త బజార్లో డబ్బు వసూలు చేసుకొని బైక్పై వెళ్తున్న శ్యాంసుందర్ను కోఠిలోని 94 బస్టాప్ లైన్ వరకు రెండు బైక్లపై అనుసరించారు. అక్కడ శ్యాం సుందర్ బైక్ను అడ్డగించి.. అతడి కళ్లల్లో కారం చల్లి, తలపై కత్తితో దాడి చేశారు. అతడి వద్ద రెండు బ్యాగ్లలో ఉన్న రూ. 30 లక్షలు దోచుకెళ్లారు. ఈ మొ త్తాన్ని ఆరుగురూ పంచుకున్నారు. మొదట్లో బాధితుడు రూ. 40 లక్ష లు పోయినట్టు సుల్తాన్బజార్లో ఫిర్యాదు చేశాడు. అయితే, పోలీ సులు అతడి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించగా దోపిడీకి గురైంది రూ. 30 లక్షలని తేలింది. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ ఎస్సై ఎ.సుధాకర్ గురువారం లిమ్రా కాలనీలో ఉన్న నలుగురు నిందితులతో పాటు చెత్తా బజార్ షేక్ ఇమ్రాన్, షానబాజ్ ఖాన్లను అరెస్ట్ చే శారు. వారి వద్ద నుంచి రూ. 26.7 లక్షల నగదు, కత్తి, బైక్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో చొరవ చూపిన ఎస్సై సుధాకర్కు కమిషనర్ అభినందనలు తెలిపి నగదు పురస్కారంఅందించారు. కాగా నిందితులను ‘నిందితుల గు ర్తింపు పరీక్ష’ కోసం మీడియా ముందు ప్రవేశపెట్టలేదు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను సుల్తాన్బజార్ పోలీసులకు అప్పగించారు. విలేకరుల సమావేశంలోఅదనపు పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, జాయింట్ కమిషనర్ (ఎస్.బి) మల్లారెడ్డి, దక్షిణ మండలం డీసీపీ సర్వశ్రేష్ట త్రిపాఠీ, నగర టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ కోటిరెడ్డి, దక్షిణ మండలం అదనపు డీసీపీ బాబురావు, ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్సైలు శేఖర్ రెడ్డి, రవికుమార్ పాల్గొన్నారు. జల్సాల కోసం చోరీల బాట... ఈ ఆరుగురు నిందితులలో ఇద్దరు విద్యార్థులు న్నారు. వీరిలో బీటెక్ ఫైనలియర్ చదివే మహ్మద్ జీషాన్ అలీ, బీకాం సెకండ్ ఇయర్ విద్యార్థి సల్మాన్ఖాన్, షహబాజ్ ఖాన్ ఉన్నారు. వీరికి ఫీజు రీయింబర్స్మెంట్, తల్లిదండ్రుల నుంచి డబ్బులు వస్తున్నప్పటికీ కూడా జల్సాల కోసం చోరీల బాట పట్టి కటకటాలపాలయ్యారు. వడ్డీ వ్యాపారులపై పీడీ యాక్ట్ : కమిషనర్ పాతబస్తీలో పేదల నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తూ వేధిస్తున్న వడ్డీ వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. పాతబస్తీలో ప్రత్యేక నిఘా పెట్టి ప్రజలను పీడిస్తున్న వడ్డీ వ్యాపారాలను అరెస్ట్ చేస్తున్నామన్నారు. అలాగే, సూడో పోలీసులు, చైన్స్నాచర్లు, ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే వారందరిపై కూడా పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. హుమాయన్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన కోసం ప్రత్యేక విచారణ కమిటీ, బంగారం దోపిడీ ఘటనలో కేసు దర్యాప్తు కొనసాగుతుందని విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. కలెక్షన్ ఏజెంట్లు కూడా ఇలా పెద్ద ఎత్తున డబ్బులను తీసుకెళ్లరాదని....ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొబైల్ బ్యాంకింగ్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.