-
'ప్రవచనం' కాలక్షేపం కోసం కాదు!
తూర్పుగోదావరి/రాజమహేంద్రవరం: రామకథ యథార్థ తత్త్వాన్ని తెలియచెప్పడమే లక్ష్యంగా తాను రామాయణాన్ని ప్రవచిస్తున్నానని, కాలక్షేపం కోసం కాదని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ ఉద్ఘాటించారు. రాజమహేంద్రవరంలోని హిందూ సమాజంలో రుషిపీఠం మండల దీక్షగా శ్రీరామ మహాయజ్ఞం నిర్వహిస్తోంది. 42 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో ఇరవై నాలుగు వేల శ్లోకాల రామాయణ సారాన్ని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ప్రవచించి, రామభక్తులను పులకింపచేస్తున్నారు. జనవరి 23వ తేదీ వరకు రోజూ సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఈ ప్రవచన మహాయజ్ఞం సాగనుంది. సీతారామలక్ష్మణుల పాదస్పర్శతో పునీతమైన గోదావరీ తీరం రామకథా ప్రవచన, స్మరణాలతో మారు మోగుతోంది. ‘రాజ’మహేంద్రి ‘రామ’మహేంద్రిగా మారింది! ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో సామవేదం ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... ఉత్తరకాండ అవాల్మీకం కాదు.. లోకంలో ఉత్తరకాండ వాల్మీకి మహర్షి విరచితం కాదనే మాట గట్టిగానే వినపడుతోంది. యుద్ధకాండలో పట్టాభిషేక సర్గలో ఫలశృతి చెప్పాక, తదనంతరం కథ ఉండదని వీరి వాదన. బాలకాండలో మహర్షి స్వయంగా చెప్పారు, షట్కాండలు రచించిన అనంతరం ఉత్తరకాండ రచించినట్లు....‘తచ్చకారోత్తరే కావ్యే వాల్మీకిర్భగవాన్ ఋషి’....బాలకాండలో స్పష్టంగా చెప్పారు. రామాయణంలో 24 వేల శ్లోకాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ఉత్తరకాండలోని శ్లోకాలు కలుపుకుంటేనే ఈ సంఖ్య వస్తుంది. పురాణాదులలో అవతార పురుషుల ఆవిర్భావం చెప్పినట్లు, అవతార పరిసమాప్తి కూడా చెప్పడం సంప్రదాయం. రామావతార పరిసమాప్తి ఉత్తరకాండలో చూస్తాం. రామాయణంలోని కొన్ని సందేహాలకు మనకు ఉత్తరకాండలో సమాధానాలు కనపడతాయి–ఉదాహరణకు సుందరకాండలో హనుమంతుడిని చూసిన రావణుడు వచ్చినవాడు నందీశ్వరుడా అని అనుమానపడతాడు. రావణ, నందీశ్వరుల నడుమ జరిగినది మనకు ఉత్తరకాండలోనే గోచరిస్తుంది. ఉత్తరం అనే మాటకు సమాధానం అని అర్థం చెప్పుకోవచ్చు. నేటికీ చెదరని రామాయణ ప్రాధాన్యం! ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని విమర్శలు, దాడులు చేసినా రామాయణం ప్రాచుర్యం, ప్రాధాన్యం కోల్పోదు. త్రేతాయుగమైనా, కలియుగమైనా, ఏ యుగమైనా మానవధర్మం శాశ్వతమైనది. రాగద్వేషాలు, మానవ సంబంధాలు మారవు. మన స్వభావాలను తీర్చి దిద్దేది రామాయణం. ఈ భూమిపై చెట్లు, పర్వతాలు, నీరు ఉన్నంత కాలం రామాయణం ప్రచలితం కాక మానదు. ఇది బ్రహ్మవాక్కు. -
స్త్రీని ఉపాసించే సంస్కృతి మనది
మానవుడిని మాధవుడిగా మార్చే సనాతన ధర్మంలోని గొప్పతనాన్ని సామాన్యుల చెంతకు తీసుకువెళ్లాలి ... తద్వారా సమాజంలో శాంతిని నెలకొల్పాలి అనే లక్ష్యంతో ఆధ్యాత్మిక ప్రవచన జ్ఞానయజ్ఞాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు సామవేదం షణ్ముఖశర్మ. గుంటూరులో యోగవాశిష్టం పై ప్రవచనం చేస్తున్న సందర్భంగా ‘మానవుడు ఆధ్యాత్మిక మార్గంలో ఎందుకు నడవాలి’, ‘పురాణాలలో స్త్రీమూర్తికి ఇచ్చిన స్థానం ఏంటి’ తదితర సందేహాలకు వారు ఇచ్చిన సమాధానాలు సాక్షికి ప్రత్యేకం. ఆధ్యాత్మికం అంటే ? శరీరం, ప్రాణం, మనస్సే కాకుండా ఆత్మ అనే వస్తువు ఉంది అనే జ్ఞానానికే ఆధ్యాత్మికం అని పేరు. ఆత్మ అనేది ఎప్పుడూ నశించనిది, సత్యమైనది. దాని గురించి తెలుసుకున్నవాడు భౌతిక జీవితంలో ఆనందంగా, శాంతంగా జీవించగలుగుతాడు. సైన్సు భౌతికవిజ్ఞానాన్నే చెబుతుంది. పరా విద్య ఆధ్యాత్మికం, పరమాత్మ గురించి చెబుతుంది. మనిషిలో వివేకాన్ని రగిల్చి అశాశ్వతమైన భౌతిక సుఖాల కోసం అవినీతికి, అధర్మానికి పాల్పడకుండా కాపాడే శక్తి ఆధ్యాత్మిక విజ్ఞానానికే ఉంది. ఆధ్యాత్మిక మార్గం అంటే ? భౌతికప్రపంచంలో ధర్మపరమైన అనుబంధం ఉండాలి. అంతరంగంలో ఆత్మస్వరూపుడైన భగవంతుడున్నాడనే స్పృహ ఉండాలి. ఆ స్పృహæతో భౌతిక జీవిత ధర్మాన్ని పాటించినట్లయితే అది వ్యక్తికి, సమాజానికి క్షేమం. సైన్సు సాధించలేనిది ఆధ్యాత్మికత సాధించగలదు. శరీరం పోయినా నువ్వు ఉంటావు అనే భరోసా సైన్సు ఇవ్వలేదు. ఆధ్యాత్మిక శాస్త్రం ఇస్తుంది. తప్పు, ఒప్పు గమనించే పరమాత్మ ఒకరు ఉన్నారని తెలిసాక తప్పు చేయడానికి వెనుకాడతాము. మంచి చేయడానికే ప్రయత్నిస్తాము. ఆధ్యాత్మిక మార్గం అధర్మాన్ని చేయనివ్వదు. ఒక ఓర్పును,ౖ ధైర్యాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మికం జీవితానికి అతీతమైనది కాదు. సరైన జీవితం ఆధ్యాత్మికం. భగవంతుడు అన్నిటికీ ఆతీతుడని ఋషిప్రోక్తం పురాణ కథలలో దేవతలు మానవుల్లా కోపతాపాలకు, రాగద్వేషాలకు గురయినట్లు కనబడుతుంది. దీనిని అర్థం చేసుకోవడం ఎలా ? పురాణాలను అర్థం చేసుకోవడానికి ప్రత్యేక అధ్యయనం అవసరం. మామూలు కథలలాంటివి కాదు. వాటిలో అనేక సంకేతాలు, సందేశాలు ఉంటాయి. యోగశాస్త్రం మంత్రశాస్త్రం, ధర్మశాస్త్రం, జ్యోతిశ్శాస్త్రం, తత్వశాస్త్రం, మనస్తత్వ శాస్త్రం కథల రూపంలో ఇమిడి ఉంటాయి. శివుడు, విష్ణువు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. వారి భావాలు మనలా ఉండటాన్ని లీల అంటారు. మనలా ప్రవర్తించారనడం సరికాదు. మనకు అర్థమయ్యేలా ఋషులు బోధించారు. మానవుడి స్థాయిలో జరిగితే కర్మ అంటారు. భగవంతుడి స్థాయిలో జరిగితే లీల అని చెప్పుకుంటాం. పురాణాలలో భగవంతుని లీలలు చెప్పబడ్డాయి. లీలల్లో సందేశాలు ఉంటాయి. జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం మనకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ఋషులు మనకు కథల రూపంలో అందించారు. కోపాలు, తాపాలు, భావాలు అన్ని లోకాల్లో ఉంటాయి. పశువులు, మానవులు, దేవతలు వారి వారి స్థాయికి తగ్గట్టుగా ఆ భావాలు, స్పందనలు వ్యక్తమవుతాయి. దేవతలకు కలిగే భావాలు, స్పందనలు లోకక్షేమానికి దారితీస్తాయి. అంతుపట్టని భగవత్ తత్వం కూడా ఇలాంటి కథల వలన సామాన్య మానవుడికి చేరువ అవుతుంది. పురాణాలలో స్త్రీకి తక్కువ స్థానం ఇచ్చారని కొందరు విమర్శిస్తారు మీలాంటి ప్రవచకులు గొప్పస్థానాన్ని ఇచ్చారని చెబుతారు ఏది సత్యం ? భారతీయ సంస్కృతిలో స్త్రీకి ప్రాధాన్యం ఎక్కువగా ఉంది. ఇంచుమించు అన్ని పురాణాల్లో స్త్రీ పాత్రలు గొప్పగా చూపబడ్డాయి. వేదాలలో ఋషులు ఎలా ఉన్నారో, ఋషికలు అలాగే ఉన్నారు. బ్రహ్మ వాదులు ఎలా ఉన్నారో బ్రహ్మవాదినిలు ఉన్నారు. తత్వశాస్త్రంలోనూ గొప్ప స్త్రీ మూర్తులు ఉన్నారు. రాజ్యాలను నడిపేవారు, గృహసామ్రాజ్యం నడిపే పాత్రలు కోకొల్లలు కనపడతాయి. దత్త చరిత్రలో–మదాలస, త్రిపురరహస్యంలో–హేమలేఖ, యోగవాశిష్టంలో – పద్మలీల, మార్కండేయ పురాణంలో– రాజ్యాలేలిన రాణుల చరిత్ర కనపడతాయి. ప్రపంచాన్ని నడిపే శక్తిగా స్త్రీ రూపాన్ని ఉపాసన చేస్తున్నాము. స్వామి వివేకానంద స్త్రీని మాతృమూర్తిగా గౌరవించడం మన సాంప్రదాయమని బోధించారు. పురాణాలలో, వేదాలలో, ధర్మశాస్త్రంలో స్త్రీకి ఒక గౌరవస్థానం రక్షణస్థానం ఇవ్వబడ్డట్లుగా స్పష్టంగా కనపడుతుంది. ప్రశ్న భక్తులకు మీ సందేశం ? మనకున్న సంస్కృతి యుగాలనాటిది. మనిషికి కావలసిన ఇహపరమైన అన్ని విషయాలు మన గ్రంథాలలో చెప్పబడ్డాయి. అనేక శాస్త్రాల విజ్ఞాన సమన్వయం హిందూ ధర్మశాస్త్రాలలో కనపడుతుంది. వాటి ఎడల ముందుగా గౌరవభావం ఏర్పడితే తరువాత తెలుసుకోవడం జరుగుతుంది. మనిషి బౌద్ధికంగా, ఆధ్యాత్మికంగా ఎదగడానికి కావాల్సిన పూర్ణజ్ఞానం మహర్షులు మనకు ఇచ్చారు. దీనిని మతదృష్టితో కాకుండా విజ్ఞానదృష్టితో గ్రహిస్తూ దానిని ఆచరించే ప్రయత్నం చేయాలి. భారతీయులందరికీ తమ ధర్మంపై, విజ్ఞానంపై భక్తి, గౌరవ భావం ఏర్పడాలి. ఎవరి ధర్మాన్ని వారు ఆచరిస్తూ ఇతరుల ధర్మాన్ని గౌరవించాలి. ఇంకొకరి ధర్మాన్ని నిందించడం వ్యక్తిత్వ లోపమని తెలుసుకోవాలి’’ అంటూ అనుగ్రహ భాషణ చేశారు సామవేదం షణ్ముఖ శర్మ. – కోలుకొండ శ్రీకర్, సాక్షి, గుంటూరు ఈస్ట్ -
అట్లాంటాలో ముగిసిన షణ్మఖ శర్మ ప్రవచనాలు
అట్లాంటా: నగరంలో ఈ నెల 14వ తేదీ నుంచి హిందూ టెంపుల్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జరిగిన ప్రవచనాల ప్రవాహంలో పాల్గొని భక్త జనం పులకరించారు. ఇందులో భాగంగా శివుని విలాసం-శక్తి వైభవంపై బ్రహ్మశ్రీ సామవేదం షణ్మఖ శర్మ ప్రవచించారు. ఉపనిషత్తుల సారం మొదలు శివపురాణం, శ్రీనాధ హరవిలాసం, పోతన భాగవతం, కాళిదాసు కుమార సంభవాలను సమన్వయపరుస్తూ అద్భుతంగా ఆవిష్కరించారు. మహాశివుడి లీల, లాస్యం, తత్వం, కరుణ, కారుణ్యాలను షణ్ముఖ శర్మ భక్తులకు విశదీకరించారు. రుద్రునిగా, వీర భద్రునిగా, సుందరేశునిగా, కామేశునిగా, పరమేశ్వరునిగా మహాశివుడి లీలను కళ్లకు కట్టినట్లు వివరించారు. షణ్ముఖ శర్మ ప్రవచనాలు భక్తుల సందేహాలను పటాపంచలు చేశాయి. ఈ కార్యక్రమానికి అట్లాంటా నుంచే కాకుండా.. కొలంబస్, అలబామా, చికాగోల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. హిందూ టెంపుల్ ఆచార్యులు పవన్ కుమార్ కిష్టపాటి శివపార్వతులకు కళ్యాణం నిర్వహించారు. అనంతరం అట్లాంటా హిందూ దేవాలయ అధ్యక్షులు కొట్టె కుసుమ ఆలయం తరఫున షణ్మఖ శర్మను ఘనంగా సత్కరించారు. ఐదు రోజుల పాటు సాగిన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఇందుకు సన్షైన్ పిడియాట్రిక్స్, శేఖర్ రియల్టర్ రాజేసింగ్, లాజిక్ లూప్స్, స్వప్న రెస్టారెంట్, కృష్ణ విలాస్, రమేష్ వల్లూరి, హనుమాన్ నందపాటి, డా.రవి వర్మ, డా.బీకే మోహన్, సురేష్ సజ్జా, నేమాని సోమయాజులు, ప్రూడెన్షియల్ ఇన్సూరెన్స్, శ్రీనివాస్ మేడూరి, దివాకర్ జమ్మలమడుగు, కృష్ణ కాళకూరి, పార్థ రామరాజు, కొండల్ నల్లజర్ల, శంకర్ బోనాలి, శశి ఉప్పల తదితర దాతలు సాయం చేశారు. కాగా, అమెరికాలో 68 రోజుల పర్యటనలో భాగంగా 15 నగరాల్లో షణ్మఖ శర్మ ప్రవచనాలు ఇస్తున్న విషయం తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement