breaking news
Shabbir Ahmed
-
మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అహ్మద్ మృతిపై వైఎస్జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: మాజీ ఎమ్మెల్సీ మౌలానా హాఫిజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ సాహెబ్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షబ్బీర్ అహ్మద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. షబ్బీర్ అహ్మద్ నిస్వార్థమైన నాయకుడు. తన జీవితాన్ని సమాజ శ్రేయస్సుకే అంకితం చేశారు. షబ్బీర్ సేవలు శాశ్వతంగా గుర్తుంటాయి.ఇక, మౌలానా హాఫిజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ సాహెబ్.. జమియత్ ఉలేమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు. ఆయన సుప్రసిద్ధ ఆలిమ్-ఎ-దీన్ (మత గురువు), నిస్వార్థమైన నాయకుడు. ఆయన తన జీవితాన్ని పూర్తిగా మిల్లీ (జాతి), విద్యారంగం, సామాజిక సేవలకు అంకితం చేశారు. ముఖ్యంగా జమియత్ ఉలేమా ఆధ్వర్యంలో కౌమ్ (జాతి), మిల్లత్ (సమాజం) శ్రేయస్సు కోసం, అలాగే మతపరమైన, జాతీయ హక్కుల పరిరక్షణ కోసం ఆయన కృషి చేశారు. -
దైవదూషణ చేశాడన్నందుకు.. చేయి నరుక్కున్నాడు
ఇస్లామాబాద్: ఓ బాలుడ్ని (15) హింసకు పురికొల్పాడనే నేరం కింద షబ్బీర్ అహ్మద్ అనే మసీదు ఇమామ్ను పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దైవదూషణ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ బాలుడు ఇంటికివెళ్లి తన చేతిని నరుక్కున్నాడు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఈ ఘటన జరిగింది. షబ్బీర్ ఓ గ్రామంలో మతోపన్యాసం చేస్తూ.. 'మీలో ఎవరైనా మహ్మద్ ప్రవక్తను ప్రేమించని వారు ఉన్నారా' అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నను సరిగా వినని బాధిత బాలుడు చేయి పైకెత్తాడు. షబ్బీర్ ఆ బాలుడ్ని బయటకు వెళ్లమని ఆదేశిస్తూ.. దైవదూషణ చేశాడని దూషించాడు. ఇంటికి వెళ్లాక ఆ బాలుడు తనను తాను శిక్షించుకున్నాడు. ఈ చర్యను బాలుడి తండ్రి అభినందించాడు. అంతేగాక మతబోధకుడిని అరెస్ట్ చేయరాదని పోలీసులను కోరాడు. పోలీసులు షబ్బీర్ అహ్మద్పై ఉగ్రవాద నిర్మూలన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అవిద్యావంతులైన మసీదు ఇమామ్లు ఉపన్యాసాలు ఇచ్చేందుకు అనుమతించబోమని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.