-
వెల్కం బ్యాక్ ఇండియన్ ట్రావెలర్స్.. ఆకట్టుకుంటున్న ఎస్ఎఫ్వో వీడియో
కరోనా దుర్దినాలు వచ్చిన తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలు ఆగిపోయాయి. ఎప్పుడైనా పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు ప్రారంభమైనా కొత్తగా కోవిడ్ వేవ్ వచ్చి పడటంతో పూర్తి స్థాయిలో ప్రయాణాలు సాధ్యం కాలేదు. అయితే రెండేళ్ల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు (ఎస్ఎఫ్వో) ఇండియన్ ట్రావెలర్స్కి స్వాగతం పలుకుతూ రిలీజ్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. భారతీయ అమెరికన్ సంస్కృతులను ప్రతిబింబించేలా ఎస్ఎఫ్వో ప్రత్యేకంగా వీడియో రూపొందించింది. ఇందులో నటులందరూ భారతీయ మువ్వెల జెండాతో స్వాగతం పలుకుతూ కనిపించారు. ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ కెచప్కి బదులు సమోసా పూదీన చట్నీ, బేస్ బాల్ బదులు క్రికెట్, పీట్స్ కాఫీ బదులు ఛాయ్ ఇలా అన్నింటా భారతీయులకు అనుగుణంగా మార్పులు చేశామంటూ హృదయ పూర్వక స్వాగతం పలుకుతూ వీడియోను రూపొందించింది ఎస్ఎఫ్వో. After 2 years, India has resumed regular international flights. As a major gateway for travelers to and from India, SFO can't wait to welcome back Indian travelers!#WelcomeBack#flySFO ✈️#travel#sanfranciscotravel 🌉#sfowagbrigade pic.twitter.com/hq2nHPZjBM — San Francisco International Airport (SFO) ✈️😷 (@flySFO) April 6, 2022 -
మ్యూచువల్ ఫండ్స్ నుంచి త్వరలో12 కొత్త పథకాలు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతుండడంతో దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పలు సంస్థలు సైతం అడుగులు వేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 12 కొత్త పథకాలకు(ఎన్ఎఫ్ఓ) సంబంధించి అనుమతులు కోరుతూ వివిధ మ్యూచువల్ ఫండ్ సంస్థలు సెబీ వద్ద దరఖాస్తు చేశాయి. వీటిలో ఈక్విటీ, డెట్, ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లు ఉన్నాయి. సుందరం, ఎడెల్వీజ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, రిలయన్స్, డీఎస్పీ బ్లాక్రాక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐడీఎఫ్సీ సంస్థలు నూతన పథకాలను తీసుకురానున్నాయి. సెబీ అనుమతులు ఇచ్చిన వెంటనే ఈ పథకాలకు సంబంధించి చందాలను ఫండ్ సంస్థలు స్వీకరిస్తాయి. ఇటీవల వచ్చిన కొత్త పథకాల పట్ల ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన రావడంతో ఫండ్ సంస్థలు కొత్త పథకాలను తీసుకురావడంలో మరింతగా తలమునకలై ఉన్నట్టు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది తాము రిటైల్ ఇన్వెస్టర్లపై మరింత దృష్టి సారించనున్నట్టు క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) జిమ్మీ పటేల్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్ నమోదుకు పేపర్ రహిత ఆన్లైన్ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించడం సైతం ఈ రంగానికి కలసివస్తుందన్నారు. గతేడాది మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు సెబీ వద్ద మొత్తం 106 పథకాలకు సంబంధించి దరఖాస్తులు దాఖలు చేశాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement