breaking news
SFJ
-
‘ద్రోహి.. అలాంటోడి కాళ్లు మొక్కుతావా?’
ఖలీస్తానీ ఉగ్రసంస్థ 'సిక్స్ ఫర్ జస్టిస్' (SFJ) ప్రముఖ సింగర్, నటుడు దిల్జీత్ దోసాంజ్పై బెదిరింపులకు దిగింది. ఆస్ట్రేలియాలో నవంబర్ 1వ తేదీన నిర్వహించబోయే కచేరీని నిలిపివేయాలని.. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించింది. బాలీవుడ్ లెజెండ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడమే ఇందుకు కారణంగా ఎస్ఎఫ్జే చెబుతోంది. అమితాబ్(Amitabh Bachchan) హోస్ట్గా వ్యవహరిస్తున్న కౌన్బనేగా కరోడ్ పతి సీజన్-17కి దిల్జీత్ దోసాంజ్(Diljit Dosanjh) గెస్ట్గా వచ్చాడు. ఆ సమయంలో పంజాబ్ బిడ్డ అంటూ దిల్జీత్ను బిగ్బీ పరిచయం చేయగా.. దిల్జీత్ అమిత్ కాళ్లను తాకి ఆశ్వీరాదం తీసుకున్నాడు. ఈ ఇద్దరి ఆలింగనం తర్వాత షో కంటిన్యూ అయ్యింది. అయితే పవిత్రమైన తలపాగా ఉండగా అమితాబ్ లాంటి వ్యక్తి పాదాలను తాకడంపై సిఖ్స్ ఫర్ జస్టిస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. SFJ Demands Akal Takht’s Action Against Diljit DosanjhSikhs For Justice (SFJ) has urged Akal Takht Sahib to summon Diljit Dosanjh for touching the feet of Amitabh Bachchan on the KBC show.SFJ’s statement, however, did not mention any protest or threat regarding Diljit’s… pic.twitter.com/xhdJMX92YG— Gagandeep Singh (@Gagan4344) October 29, 2025అమితాబ్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలే.. 1984 సిక్కుల ఊచకోతకు ప్రేరణగా మారాయి. అలాంలోడి పాదాలు తాకడం అంటే బాధితులందరినీ అవమానించడమే అని ఎస్ఎఫ్జే చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ(Gurpatwant Singh Pannun) పేరిట ఒక ప్రకటన విడుదల అయ్యింది. ఇది అజ్ఞానం కాదు, విశ్వాస ఘాతకమేనని మండిపడింది. పైగా నవంబర్ 1వ తేదీని సిక్కుల ఊచకోత దినంగా గుర్తించిన నేపథ్యంలో.. అదే రోజున ఆస్ట్రేలియాలో కన్సర్ట్ నిర్వహించడం సిక్కు సమాజాన్ని అవమానించడమే తెలిపింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కన్సర్ట్ను రద్దు చేసుకోవాల్సిందేనని, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని తెలిపింది. అంతేకాదు.. ఈ చేష్టలపై దిల్జీత్ను విచారించాల్సిందేనని కోరుతూ అకాల్ తఖ్త్ జథేదార్(అత్యున్నత ధార్మిక అధికారి) గియానీ కుల్దీప్ సింగ్ గర్గాజుకు లేఖ రాసింది. పంజాబీ సింగర్ అయిన దిల్జీత్ దోసాంజ్కు మాములు క్రేజ్ లేదు. అందుకే Aura Tour పేరిట ఆస్ట్రేలియాలో కచేరీ నిర్వహించబోతున్నారు. ఈ టూర్ కోసం 800 డాలర్ల రేటుతో టికెట్లు హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. సుమారు 30 వేల మంది హాజరవుతారనే అంచనాలు ఉన్నాయి. అమితాబ్పై ఆరోపణలేంటి?.. (Is Really Amitabh Bachchan Anti Sikhs Call)1984లో ఇందిరా గాంధీని ఆమె సిక్కు బాడీగార్డులు హత్య చేశారు. అయితే ఆ తర్వాత దేశవ్యాప్తంగా సిక్కులపై హింసాత్మక దాడులు జరిగాయి(1984 సిక్కుల ఊచకోత). ఆ సమయంలో ప్రముఖ నటుడు, ఇందిరాగాంధీకి ఆప్తుడైన అమితాబ్ బచ్చన్ “ఖూన్ కా బదలా ఖూన్” (రక్తానికి ప్రతీకారంగా రక్తమే) అనే నినాదం ఇచ్చారని, ఈ వ్యాఖ్యలు అప్పటి పరిస్థితుల్లో హింసను ప్రేరేపించాయని కొన్ని వర్గాలు ఆరోపించాయి. దూర్దర్శన్లో ఆయన ఆ నినాదం ఇచ్చారంటూ జగదీష్ కౌర్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలను 2011లో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రముఖంగా ప్రచురించింది కూడా. దీంతో.. అమితాబ్ బచ్చన్ అకాల్ తఖ్త్ జథేదార్కు ఓ లేఖ రాశారు. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని.. నిరాధారమైనవని.. ఎంతో బాధ కలిగించాయని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తనను విమర్శించేవారు కూడా ఎలాంటి ఆధారాలు చూపలేకపోతున్నారని అందులో పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి.. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కోర్టు కూడా 2014లో ఆయనపై కేసు నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆ ఆరోపణలు ఇప్పటిదాకా నిరూపితం కాలేదు. -
మోదీ వీసా రికార్డులు సమర్పించండి: అమెరికా కోర్టు
న్యూయార్క్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీసాకు సంబంధించిన అన్ని రికార్డులను తమ ముందు ఉంచాలని అమెరికా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మోదీ అమెరికా రాకుండా విధించిన నిషేధం ఎత్తివేస్తూ బరాక్ ఒబామా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులు వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా సమర్పించాలని పేర్కొంది. 2016, జనవరి నెల మధ్యలో ప్రాథమిక నివేదిక సమర్పించాలని న్యూయార్క్ సదరన్ డిస్టిక్ట్ జడ్జి జాన్ కొయల్ టెల్ ఈ నెల 9న ఆదేశించారు. దీనిపై తదుపరి విచారణను ఫిబ్రవరి 29కు వాయిదా వేశారు. సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నరేంద్ర మోదీ వీసా, అమెరికాలో ఆయన ప్రవేశానికి సంబంధించిన రికార్డులు (2013 జూన్ నుంచి) ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎస్ఎఫ్జే కోర్టును ఆశ్రయించింది. -
సోనియాపై కేసు పిటిషన్ కొట్టివేత
-
సోనియాపై కేసు పిటిషన్ కొట్టివేత
న్యూయార్క్: 1984నాటి సిక్కుల ఊచకోత ఘటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై అమెరికాలో దాఖలైన ఓ పిటిషన్ను అక్కడి కోర్టు కొట్టివేసింది. ఆరోపణ దారులు దాఖలు చేసిన పిటిషన్లో పరిపక్వత కలిగిన అంశాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. సిక్కుల ఊచకోత ఘటన విషయంలో సోనియాగాంధీ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని, ఆమెపై కేసులు నమోదు చేయాలంటూ న్యూయార్క్లోని సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) అనే సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లో కొత్తగా అభివృద్ధి ఏమి లేదని, గతంలో పేర్కొన్న అంశాలే మళ్లీ చెప్తున్నారంటూ పిటిషన్ను కొట్టివేసింది. -
మన్మోహన్ సింగ్కు అమెరికా కోర్టు సమన్లు
అమెరికా పర్యటనకు భారత నాయకులు ఎవరు వెళ్లినా వాళ్లకు అక్కడి కోర్టుల నుంచి సమన్లు తప్పడంలేదు. తాజాగా, నాలుగు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన భారత ప్రధాని మన్మోహన్ సింగ్కు అక్కడి కోర్టు సమన్లు ఇచ్చింది. 1990లలో పంజాబ్ రాష్ట్రంలో ఉగ్రవాద నిరోధ ఆపరేషన్ల సందర్భంగా మానవహక్కుల ఉల్లంఘన జరిగిందంటూ.. దానికి సంబంధించి ఈ సమన్లు అందించింది. ఈ సమన్లను వైట్హౌస్ సిబ్బంది ద్వారా మన్మోహన్ సింగ్ భద్రతా సిబ్బందికి అందజేయాలని న్యూయార్క్లోని మానవహక్కుల సంస్థ 'సిఖ్ ఫర్ జస్టిస్' (ఎస్ఎఫ్జె) ప్రయత్నిస్తోంది. గతంలో అమెరికాకు చికిత్స నిమిత్తం వెళ్లిన ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి కూడా ఇదే సంస్థ సమన్లు అందజేసింది. అయితే, వాటిని అందుకోకముందే ఆమె తిరిగి భారతదేశానికి వచ్చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో గురువారం సమావేశం కానున్నారు. అయితే, ఇప్పుడు మన్మోహన్ సింగ్కు సమన్లు అందించడం కూడా ఎస్ఎఫ్జెకు అంత సులభం కాకపోవచ్చన్నది సమాచారం. ఎస్ఎఫ్జె కేవలం ప్రచారం కోసమే ఇలా ప్రముఖులకు సమన్లు ఇస్తోందంటూ న్యూయార్క్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్న న్యాయవాది రవి బాత్రా ఓ కేసు దాఖలు చేశారు.


