breaking news
severity of the disease
-
పేగు ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు
నా వయసు 32 ఏళ్లు. నేను కొంతకాలంగా మలబద్దకంతో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి, మంట, మలంలో రక్తం కనిపిస్తున్నాయి. డాక్టర్ను సంప్రదించాను. కొన్ని పరీక్షలు నిర్వహించి యానల్ ఫిషర్స్ సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. నా సమస్య హోమియో మందులతో పూర్తిగా నయం అవుతుందా?– శివకుమార్, నరసరావుపేట దీర్ఘకాలికంగా మలబద్దకం లేదా తరచూ విరేచనాలు అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కొనేవారు ఈ యానల్ ఫిషర్స్ బారిన పడే అవకాశం ఎక్కువ. ఇటీవలి కాలంలో ఉన్న పని ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వంటి అంశాలు జీర్ణవ్యవస్థౖపై ప్రభావం చూపి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా వంటి సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. వీటి గురించి తెలుసుకుందాం. పైల్స్: మలద్వారంలో ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి వాపునకు గురై తీవ్రమైన నొప్పిని కలగజేస్తాయి. రక్తస్రావం కూడా కనిపిస్తుంది. సమస్యలను పైల్స్ అంటారు. కారణాలు: దీర్ఘకాలిక మలబద్దకం, పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం, దీర్ఘకాలిక దగ్గు, మహిళల్లో గర్భధారణ సమయంలో పడే ఒత్తిడి, కాలేయ సంబంధిత వ్యాధులు పైల్స్ను కలగజేసే అవకాశం ఉంది. ఫిషర్స్: మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను యానల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక వల్ల ఈ ప్రాంతంలో ఉండే కండర కణజాలం బహిర్గతం కావడం వల్ల ఇది మలవిసర్జన సమయంలోగానీ, మలవిసర్జన తర్వాత గానీ తీవ్రమైన నొప్పిని, రక్తస్రావాన్ని కలగజేస్తుంది. కారణాలు: దీర్ఘకాలిక మలబద్దకం, తరచూ విరేచనాలు, పేగులకు ఇన్ఫెక్షన్ కలిగించే వ్యాధులు (ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్), ప్రసవ సమయంలో పెద్దపేగు చివరి భాగం... పురీషనాళానికి (రెక్టమ్కు) రక్తప్రసరణ తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఈ ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది. ఫిస్టులా: రెండు ఎపిథీలియల్ కణజాలాల మధ్య ఒక గొట్టంలా ఏర్పడే నిర్మాణాన్ని ఫిస్టులా అంటారు. ఇది శరీరంలో ఎక్కడైనా ఏర్పడవచ్చు. అయితే సాధారణంగా ఇది మలద్వారానికి ఒక పక్కగా ఏర్పడుతుంది. దీన్ని యానల్ ఫిస్టులా అంటారు. మొదట అక్కడి చర్మంపై చిన్న మొటిమలాగా ఏర్పడి నొప్పి, వాపు కనిపిస్తాయి. రెండు మూడు రోజులలో అది పగిలి చీము స్రవిస్తుంది. దానివల్ల తీవ్రమైన నొప్పి, చీము, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తూ ఇబ్బంది పెడతాయి. దీని తీవ్రతను బట్టి వారంలో లేదా నెలలో 1, 2 సార్లు తిరగబెడుతూ ఉండవచ్చు. కారణాలు : ఊబకాయం, గంటల తరబడి కదలకుండా ఒకేచోట కూర్చొని పనిచేయడం, తీవ్రమైన మలబద్దకంతో బాధపడేవారిలో ఈ సమస్య ఏర్పడే అవకాశాలు ఎక్కువ. చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా వంటి సమస్యలను హోమియో మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. సంపూర్ణంగా చికిత్స అందించడం ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండానే వాటిని తగ్గించి, అవి మళ్లీ తిరగబెట్టకుండా చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ అలర్జీకి కారణాలనేకం మా పాప వయసు 12 సంవత్సరాలు. వాతావరణంలో మార్పులు కనిపించగానే ఆమెను తుమ్ములు, జలుబు, ముక్కుదిబ్బడ వంటి సమస్యలు వేధిస్తున్నాయి. స్కూలుకు సరిగా వెళ్లలేకపోతోంది. మా పాప సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – ప్రమోద్, ఏలూరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ పాప అలర్జీ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మనకు ఏదైనా వాతావరణంగానీ, ఆహారంగానీ సరిపడకపోతే వచ్చే సమస్యను అలర్జీ అని చెప్పవచ్చు. మన రోగనిరోధక వ్యవస్థ అతిగా ప్రతిస్పందించడంతో వేధించే సమస్యే అలర్జీ. ఈ సమస్య ఉన్నవారిలో తుమ్ములు, దగ్గు మాత్రమే కాకుండా ఒక్కోసారి శ్వాసతీసుకోవడం కష్టం కావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో వచ్చే జలుబు, దగ్గు సహజంగా ఒక్కోసారి వైరల్ జ్వరాలకు దారితీయవచ్చు. మన ఆధునిక జీవనం, పారిశ్రామిక ప్రాంతాలతో పాటు వాతావరణ కాలుష్యం కూడా అలర్జీకి కారణాలే. అలర్జీ కారణంగా వచ్చే బాధలు వర్ణనాతీతం. వయసుతో నిమిత్తం లేకుండా చిన్నా, పెద్దా అందరూ అలర్జీల బారిన పడుతున్నారు. అలర్జీని కలిగించే పదార్థాలను అలర్జెన్స్ అంటారు. అలర్జీలతో బాధపడేవారిలో వారికి సరిపడని పదార్థాల సంపర్కంలోనికి వచ్చినప్పుడు వారి శరీరంలోని యాంటీబాడీస్ వల్ల హిస్టమిన్ అనే పదార్థం విడుదల అవుతుంది. దీనివల్లనే వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరు లక్షణాలు కనిపిస్తాయి. శరీరతత్వం, వాతావరణం, వంశచరిత్ర, గాలి, నీరు, ఆహారం... వీటిలోని మార్పులు వంటి అనేక అంశాల వల్ల రక్తంలో కలిగే మార్పుల వల్ల కొందరిలో అలర్జీ కనిపిస్తుంది. అలర్జీకి కారణాలు: దుమ్ము ∙పుప్పొడి రేణువులు ∙పెంపుడు జంతువులు, వాటి వెంట్రుకలు ∙ఘాటువాసనలు ∙చల్లటిగాలి ∙శీతలపానియాలు, ఐస్క్రీమ్స్ ∙మస్కిటో రిపల్లెంట్స్ ∙వాతావరణ మార్పులు ∙వంశపారంపర్యంగా రావచ్చు. లక్షణాలు: ∙తుమ్ములు ∙ఉబ్బసం, ఆయాసం శ్వాసలో ఇబ్బందులు ∙వాంతులు ∙ముక్కుకారడం ∙ఒంటిపై ఎర్రని దద్దుర్లు ∙కళ్లలో దురద, కంట్లో ఏదో గుచ్చుకున్నట్లు ఉండటం చికిత్స: హోమియోలో అలర్జీ సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం కలిగించే మందులు ఉన్నాయి. చికిత్సతో అన్ని రకాల అలర్జిక్ సమస్యలు దూరమవుతాయి. రోగనిరోధక శక్తి పెంచి, పూర్తిగా వ్యాధిని నయం చేయడం హోమియో ప్రక్రియలో సాధ్యమవుతుంది. ఈ సమస్యకు ఆర్సినిక్ ఆల్బ్, రస్టాక్స్, బెల్లడోన, అలియమ్ సెపా వంటి మందులు ఉన్నాయి. నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో ఈ మందులు వాడితే అలర్జీ పూర్తిగా నయమవుతుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ వెన్ను నొప్పి తగ్గుతుందా? నా వయసు 37 ఏళ్లు. గత ఏడాది కాలం నుంచి తీవ్రమైన మెడనొప్పి, నడుమునొప్పితో బాధపడుతున్నాను. దగ్గరలో ఉన్న డాక్టర్ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అంటున్నారు. దీనికి మందులు వాడుతున్నాను. నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. దీనికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా?– సువర్ణకుమార్, భీమవరం స్పాండిలోసిస్ అనేది వెన్నెముకకు సంబంధించిన సమస్య. స్పాండిలోసిస్ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అంటారు. కారణాలు: ∙కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు. ∙జాయింట్స్లో వాటర్ తగ్గడం వల్ల కూడా నొప్పి రావచ్చు. ∙స్పైన్ దెబ్బతిని కూడా నొప్పి రావచ్చు. ∙వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి దారి ఉంటుంది. ఆ దారి సన్నబడితే నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. లక్షణాలు సర్వైకల్ స్పాండిలోసిస్ : ∙మెడనొప్పి, తలనొప్పి తల అటు –ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది. లంబార్ స్పాండిలోసిస్ : నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి ఒకవైపు కాలు, పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి సప్లై అయ్యే చోటు మొద్దుబారడం, దాంతో నడవడానికి కూడా ఇబ్బందిపడటం వంటి సమస్యలు వస్తాయి. నిర్ధారణ: ∙వ్యాధి లక్షణాలను బట్టి ∙ఎక్స్–రే ∙ఎమ్మారై, సీటీ స్కాన్ నివారణ: వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం. హోమియో చికిత్స: హోమియో ప్రక్రియలో ఎలాంటి ఆరోగ్య సమస్యలకైనా పరిష్కారం ఉంది. రోగి వ్యక్తిగత లక్షణాలను బట్టి వారి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని చికిత్స ఇస్తారు. ఇలా కాన్స్టిట్యూషనల్ చికిత్స అందిస్తే క్రమంగా రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాధి తీవ్రత క్రమంగా తగ్గుతుంది. దాంతో క్రమక్రమంగా పూర్తిగా వ్యాధి నివారణ జరుగుతుంది. డాక్టర్ టి. కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
సేవల్లేవ్!
వైద్య శాఖలో అరకొరగా సిబ్బంది కీలక పోస్టులు ఖాళీ.. అలంకారప్రాయంగా పీహెచ్సీలు {V>Ð]l*ÌZÏ అందని ప్రభుత్వ వైద్యం ఎంజీఎం : వర్షాకాలం మొదలైంది. ముసుర్లతో అంటు వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. పల్లెలు మంచం పట్టే ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిస్థితుల నుంచి ప్రజలను గట్టెక్కించాల్సిన వైద్య శాఖ మాత్రం సిబ్బంది లేక ఇబ్బంది పడుతోంది. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో అవి అలంకారప్రాయంగా మారుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం లేదు. జిల్లాకు ఐదు సివిల్ సర్జన్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం రెండు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ సివిల్ సర్జన్ 20 పోస్టులు ఉంటే రెండు ఖాళీగా ఉన్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 154 ఉంటే వీటిలో తొమ్మిది ఖాళీలు ఉన్నాయి. ఉన్నవారిలోనూ 11 మంది పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తి చేసేందుకు వెళ్లనున్నారు. వీరంతా ఏజెన్సీ ప్రాంతంలోని వారే. ఫార్మసిస్టు పోస్టులు 75కు 24 ఖాళీగా ఉన్నాయి. 65 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులలో 26 ఖాళీగా ఉన్నాయి. గ్రామాల్లో వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, చికిత్స అందించే హెల్త్ అసిస్టెంట్ పోస్టులు పురుషుల కేటగిరీలో 327 ఉండగా, అందులో 156, మహిళా కేటగిరీలో 546 పోస్టులకు గాను 140 ఖాళీగా ఉన్నాయి. కొత్త పీహెచ్సీలు ఖాళీ... గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ)లోనూ సేవలు అందుబాటులోకి రావడం లేదు. 2014-15లో జిల్లాలో కొత్తగా ప్రాథమిక వైద్య కేం ద్రాలను నిర్మించారు. కొన్నింటిని ప్రజాప్రతినిధులు హడావుడిగా ప్రారంభించారు. అరుుతే ఏ ఒక్కదాంట్లోనూ వైద్య సేవలు మొదలు కాలేదు. పీహెచ్సీలో ఒక వైద్యాధికారి, స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు, ఏఎన్ఎం, సహాయ సిబ్బంది ఉండాలి. కానీ, ఏ ఒక్క అధికారి, సిబ్బంది ఇప్పటి వరకు విధుల్లో చేరలేదు. తాడ్వాయి మండలం కాటాపూర్, హన్మకొండ మండలం పైడిపల్లి, కొండపర్తి, హసన్పర్తి మండలం సిద్ధాపూర్, చేర్యాల మండలం ముత్యాల, మంగపేట మండలం బ్రాహ్మణపల్లి, మహబూబాబాద్ మండలం మల్యాల, స్టేషన్ఘన్పూర్ మండలం తాటికొండ, ఇప్పగూడ, జనగామ మండలం ఓబుల్కేశ్వాపూర్, మరిపెడ మండలం ఉగ్గంపల్లిలో కొత్తగా పీహెచ్సీలను నిర్మించారు. అసరమైన సామగ్రిని సమకూర్చారు. వైద్య సేవలు అందించే సిబ్బంది మాత్రం లేకపోవడంతో ఇవన్నీ అలంకారప్రాయంగానే మిగిలాయి. -
అశ్రద్ధ చేస్తే ప్రాణం పోతుంది
పాడి-పంట: జి.కొండూరు (కృష్ణా) : వర్షాకాలం వచ్చిందంటే చాలు... పశు పోషకులు కలవరపడుతుంటారు. ఎందుకంటే ఈ సీజన్లో పశువులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సూక్ష్మజీవుల కారణంగా గొంతువాపు, జబ్బవాపు వంటి వ్యాధులు సోకడంతో పాటు ఈగలు, దోమల దాడి కూడా పెరుగుతుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు రైతులు సకాలంలో తగిన యాజమాన్య చర్యలు చేపట్టాలని, పశువులకు వైద్య చికిత్సను అందించాలని సూచిస్తున్నారు కృష్ణా జిల్లా జి.కొండూరు మండల పశు వైద్యాధికారి డాక్టర్ కె.నరసింహారావు. ఆ వివరాలు... లేత గడ్డి ప్రమాదం తొలకరి వర్షాలకు మొలిచే లేత గడ్డి మొక్కలను పశువులు ఆబగా తింటుంటాయి. అయితే ఎదిగీ ఎదగని లేత గడ్డిలో హైడ్రో సైనైడ్ అనే విష పదార్థం ఉంటుంది. ఇలాంటి గడ్డిని మేసిన 15 నిమిషాలకే పశువులో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వెంటనే తగిన చికిత్స చేయించకపోతే పశువు మృత్యువాత పడే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు సాధ్యమైనంత వరకూ పచ్చిక బయళ్లలో పశువులకు లేత గడ్డిని అతిగా మేపకుండా ఉండడమే మంచిది. గురక వ్యాధి సోకితే... వర్షాకాలంలో పశువులకు సోకే ప్రాణాంతక వ్యాధుల్లో గొంతువాపు (గురక) ఒకటి. ముఖ్యంగా వయసులో ఉన్న గేదె జాతి పశువుల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వ్యాధి సోకిన పశువుకు అకస్మాత్తుగా అధిక జ్వరం వస్తుంది. పశువు మేత మేయదు. గొంతు పైన, మెడ కింద వాపు కన్పిస్తుంది. పశువు ఆయాసపడుతూ శ్వాస పీల్చుకుంటుంది. ఆ సమయంలో గురక శబ్దం వస్తుంది. నోరు, ముక్కు నుంచి ద్రవం కారుతుంది. పశువు వణుకుతూ ఉంటుంది. కళ్లు ఎర్రబడి నీరు కారుతుంటుంది. పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గుతుంది. వ్యాధి తీవ్రత ఎక్కువైతే పశువు ఎడతెరిపి లేకుండా దగ్గుతూ, చివరికి అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోతుంది. వ్యాధి సోకిన పశువును వెంటనే మంద నుంచి వేరు చేయాలి. దాని మలమూత్రాలను, అది తినగా మిగిలిన గడ్డిని తీసి కాల్చేయాలి. పశువుల పాక/షెడ్డును ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. వ్యాధి సోకిన పశువు మరణిస్తే ఊరికి దూరంగా తీసికెళ్లి, గొయ్యి తవ్వి, అందులో సున్నం వేసి పూడ్చేయాలి. గురక వ్యాధి లక్షణాలు కన్పించిన వెంటనే పశు వైద్యుడి సలహా మేరకు పశువుకు గ్లూకోజ్, యాంటి బయటిక్ మందు, నెప్పి నివారణ మందు ఇవ్వాలి. ఎంత త్వరగా వైద్యం చేయిస్తే పశువు అంత త్వరగా కోలుకుంటుంది. వ్యాధి ముదిరిన తర్వాత చికిత్స చేసినా ఫలితం ఉండదు. జబ్బ వాపూ ప్రమాదమే వయసులో ఉన్న ఆరోగ్యవంతమైన పశువుల్లోనూ, తెల్ల జాతి పశువుల్లోనూ జబ్బవాపు వ్యాధి ఎక్కువగా కన్పిస్తుంది. వ్యాధి సోకిన పశువు అధిక జ్వరంతో బాధపడుతుంది. మేత మేయకుండా పడుకొని ఉంటుంది. జబ్బ భాగం వాచి, నల్లగా కములుతుంది. అక్కడ కండరాలు ఉబ్బుతాయి. వాటిలో గాలి బుడగలు, నీరు చేరి పశువు తీవ్రమైన నెప్పితో బాధపడుతుంది. వాచిన చోట చేతితో తాకితే గరగరమని శబ్దం వస్తుంది. సకాలంలో వైద్యం అందకపోతే పశువు నీరసించి, చనిపోతుంది. వ్యాధి సోకిన పశువుకు పశు వైద్యుని సలహా మేరకు పెన్సిలిన్ మందు ఇవ్వాలి. నెప్పి, జ్వర నివారణ మందులతో పాటు రక్తనాళాల ద్వారా గ్లూకోజ్ ద్రావణాన్ని అందించాలి. గురక, జబ్బ వ్యాధులు సోకకుండా రైతులు ముందుగానే పశువులకు టీకాలు వేయించడం మంచిది. వ్యాధి సోకిన వెంటనే అశ్రద్ధ చేయకుండా పశు వైద్యశాలకు తీసికెళ్లి తగిన చికిత్స చేయించాలి. ఈగలు-దోమలు దాడి చేస్తే... నేల చిత్తడిగా-వాతావరణం అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో, నీరు నిల్వ ఉన్న గుంతల్లో, మురుగు నీటి కాలువల్లో ఈగలు, దోమలు ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి ఆహారం కోసం పశువులను పట్టి పీడిస్తుంటాయి. వర్షాకాలంలో వీటి తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈగలు, దోమలు పశువుల శరీరంపై వాలి రక్తాన్ని పీలుస్తాయి. వీటి తాకిడి కారణంగా పశువులు పడుకోలేవు... నిలబడలేవు. వాటిని వదిలించుకోవడానికి తోకను అటూ ఇటూ కొట్టుకుంటూ, చెవులు ఊపుతూ అసహనానికి గురవుతాయి. కడుపు నిండా మేత మేయలేవు. ఫలితంగా పశువులు రక్తహీనతకు లోనవుతాయి. ఈగలు, దోమల కాటు వల్ల పశువు శరీరంపై పుండ్లు పడతాయి. వీటి ద్వారా సూక్ష్మక్రిములు పశువు శరీరంలో ప్రవేశించి ఇతర వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గుతుంది. పశువులకు అంటువ్యాధులు వచ్చే ప్రమాదమూ ఉంది. ఏం చేయాలి? ఈగలు, దోమల నివారణకు నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో కిరోసిన్ను పిచికారీ చేయాలి. మురుగు నీరు చేరే చోటును, చిత్తడి ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ బ్లీచింగ్ పొడి చల్లాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో పశువుల పాకలో ఎండు పిడకలు, వేపాకుతో పొగ పెట్టాలి. వైద్యుల సలహా మేరకు పశువు శరీరంపై కీటక నాశనులను పిచికారీ చేయాలి. సాయంకాలం వేళ పశువుల శరీరంపై వేపనూనె రాయాలి. అలాగే వేపాకు, పసుపు కలిపి మెత్తగా నూరి శరీరానికి పట్టించాలి.