breaking news
Setires
-
పవన్, బాబులపై మంత్రి కొట్టు సత్యనారాయణ అదిరిపోయే పంచులు..
-
ఆర్థికమంత్రి వ్యాఖ్యలు : నెటిజనుల దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: ఆటో మొబైల్ రంగం రోజు రోజుకు సంక్షోభంలోకి జారుకోవడంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త వాదన తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆటోరంగం మందగమనానికి యువత ఒక కారణమని, ఈ రోజుల్లో యువత ఓలా, ఉబెర్ లాంటి క్యాబ్స్ ను ఆశ్రయిస్తున్నారని, సొంతకార్లవైపు మొగ్గు చూపడం లేదని, ఈఎంఐ భారం మోసేందుకు ఇష్టపడటం లేదని, మిలీనియల్స్(యువత) క్యాబ్స్లపై ఆసక్తి చూపడంతో ఆటోమొబైల్ పరిశ్రమ ఒడిదుడుకులకు లోనవుతోందన్నారు. దీంతో సోషల్ మీడియాలో సేఇట్ సీతారామన్తాయి లైక్, బాయ్కాట్ మిలీనియల్స్ హ్యాష్ట్యాగ్లు దుమారం రేపుతున్నాయి. ఆర్థికమంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. యువతకు పానీ పూరీ ఇష్టం...అందుకే బీహెచ్ఈఎల్ 15 ఏళ్ల కనిష్టానికి పడిపోయిందంటూ బాయ్కాట్ మిలీనియల్స్ ట్రెండ్స్ హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు నిజమే..సొంత వాహనం ఉంటే డబ్బుల దండగ. డబ్బుని మిగిలించుకోవాలి కదా అనే కమెంట్స్ చేస్తున్నారు. పనిలో పనిగా కొత్త మోటారు సవరణ చట్టంపై కూడా సెటైర్లు పేలుతున్నాయి. డ్రైవింగ్ టెన్షన్స్, నిబంధనల ఉల్లంఘనల చలాన్లు, పార్కింగ్ ఇబ్బందులు ఉండవు. అందుకే వాహనాలు కొనుగోలు చేయటం లేదంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడం విశేషం. నిరుద్యోగులు ఉద్యోగం చేసేందుకు ఇష్టపడకపోవడం వల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని ఓ నెటిజన్ సెటైర్ వేశాడు. డాలర్ను ప్రిఫర్ చేయడం వల్లే రూపాయి విలువ పడిపోతోంది. ‘రోడ్లు బాగా లేవు అందుకే లారీల విక్రయాలు పడిపోయాయి. అంతేకదా మంత్రి గారు’. ప్రతీదానికి యువతనెందుకు ఆడిపోసుకుంటారు...ఇలా ఒకటి కాదు రెండుకాదు, సీతారామన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో అప్రతిహతంగా పంచ్ లు పేలుతున్నాయి.. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 100 రోజుల పాలనముగింపు సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఆటో రంగం మందగించడం వెనుక ఒక ప్రధాన అంశం మిలీనియల్స్ మనస్తత్వం మారడమే అని పేర్కొన్నారు. బీఎస్6 ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ రుసుము అంశాలతోపాటు యువత ఎక్కువగా క్యాబ్, మెట్రో రైళ్లపై ఆధారపడుతుండటం కూడా ఆటోమొబైల్ రంగంలో మందగమనానికి కారణమని వ్యాఖ్యానించారు. ద్విచక్ర వాహనాలు, కార్లు,లారీల విక్రయాలు ఇటీవల రికార్డు స్థాయిలో క్షీణించిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆటోమొబైల్ రంగంలో ఈ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. మరోవైపు మారుతీ సుజుకీ, అశోక్ లేలాండ్ లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తమ ఉత్పత్తులకు డిమాండ్ పడిపోవడంతో తమ ఫ్లాంట్లను తాత్కాలికంగా మూసివేశాయి. అశోక్ లేలాండ్ అయిదు ప్లాంట్లలో 16 రోజుల పాటు తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన సంగతి విషయం తెలిసిందే. చదవండి : పెట్టుబడులపై టాస్క్ఫోర్స్ దృష్టి.. దారుణంగా పడిపోయిన అమ్మకాలు : మరింత సంక్షోభం Oxygen crisis will be occur because millennial inhale more oxygen in the morning. #BoycottMillennials pic.twitter.com/0LKxC8u3BW — Muhammd Ali (@alikarwi00) September 11, 2019 BHEL is at its lowest in 15 years because millennials prefer "Paani puri". #BoycottMillennials #SayItLikeNirmalaTai — ERVJ 🇮🇳 (@iam_vjoshi) September 10, 2019 #BoycottMillennials as they are preferring live-in relationships instead of marriages. Result: brahmins, pandits and jyotish, are becoming jobless. — Check_Mate (@IndianScooter) September 10, 2019 The market for 'Gobar' is down, because millennials ain't buying 'no shit'.#SayItLikeNirmalaTai #BoycottMillennials — Anoop Tomer (@anooptomer) September 10, 2019 -
మనం అడిగితే సీటిస్తారంటావా..!
అప్పారావు: ఏందిరో సుబ్బారావు ఏదో ఆలోచనలో పడ్డావ్. సుబ్బారావు: ఏం లేదురా! ఏ పనీపాటా లేదని ఇంట్లో వాళ్లు రోజూ తిట్టరాని తిట్లు తిడుతున్నారు. ఏదైనా పనిలో చేరదామని ఆలోచిస్తున్నారా. ఏం చేయమంటావ్! అప్పారావు: ఓ పనిచేయరా. రాజకీయాల్లోకి వస్తావా! సుబ్బారావు: ఏం రా. ఎగతాళి చేస్తున్నావా. రాజకీయాల్లోకి మనలాంటోళ్లని ఎవర్రానిస్తారా..! అప్పారావు: ఒరేయ్ పిచ్చి సుబ్బిగా అది ఒకప్పుడ్రా. ఇప్పుడు సీట్లిస్తాం బాబూ...పోటీ చేయండంటూ బోలేడు పార్టీలొస్తున్నాయిరా. సుబ్బారావు: అవున్లేరా. చిన్నా చితకా పార్టీలు...ఊరూ పేరూ లేని పార్టీలు తరఫున నిలబడితే మన ఓట్లు మనకే పడవు కదరా. అప్పారావు: అరే వెర్రివెంగళప్పా. ఊరు...పేరు లేని పార్టీలు కాదురా. వందేళ్లపైగా చరిత్ర ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తావా.! సుబ్బారావు: ఒరేయ్ మరీ వెర్రోడ్ని సేయమాకు. దేశాన్ని ఏకధాటిగా పాలించిన కాంగ్రెస్ మనలాంటోళ్లకి సీట్లిచ్చిద్దా...చెవిలో పూలు పెట్టమాకురా.! అప్పారావు: సుబ్బిగా నేను చెబుతుంది నిజంరా. రాష్ట్రాన్ని చీల్చిందని ఆపార్టీలో ఉన్న చిన్నా..పెద్దా.. తేడా లేకుండా అందరూ ఖాళీ చేసి వెళ్లారు. ఉన్న నాయకులను ఆపార్టీ తరఫున పోటీచేయమని అడిగితే ఇప్పుడే వస్తామని మళ్లీ కనిపించడం లేదంటా. సుబ్బారావు: ప్చ్..కాంగ్రెస్కు అంత పరిస్థితా..! అయితే మనం అడిగితే సీటిస్తారంటావా..! అప్పారావు: అడక్కుండా ఇస్తున్నారు. ఒకసారి ప్రయత్నిద్దామా..! ఏందీ. సుబ్బారావు: ఎన్నికల్లో నిలబడాలంటే డబ్బు కావాలి కదరా..! ఎలా కుదురుతుంది. అప్పారావు: ఒరేయ్ పిచ్చి మొఖమా...కాంగ్రెస్ పార్టీ జాతీయపార్టీ...పైగా డబ్బున్న పార్టీ. పార్టీ ఫండ్ కింద మూడు, నాలుగు కోట్లిస్తుంది. అందులో సగం ఖర్చు పెట్టినా మిగిలిన సగంతో ఎంచక్కా బతికిపోవచ్చు. సుబ్బారావు: అయితే నేను నిలబడతారా. అప్పారావు: ఒరేయ్ అప్పిగా నువ్వు కూడా నాకుమాదిరిగానే పనీపాట లేకుండా ఖాళీగా ఉన్నావ్గా. నువ్వు కూడా ఏదో నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యరా... అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సీట్లు ఖాళీగా ఉన్నాయంటున్నావుగా....అదే మాదిరిగా మన ఆవారా బ్యాచ్గాళ్లకు కూడా చెప్పు పోటీ చెయ్యమని! –సాక్షి, చీరాల -
కత్రినాపై సెటైర్
‘‘సినిమా పరిశ్రమలో ఏదీ శాశ్వతం కాదు. ఇవాళ స్టార్ అనిపించుకున్నవాళ్లు ఎప్పటికీ అదే హోదాలో ఉంటారనిగ్యారంటీ లేదు’’ అని దీపికా పదుకొనె అన్నారు. వృత్తిపరంగా తనకు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు తన మాజీ ప్రియుడు రణబీర్ కపూర్తో ప్రేమాయణం కొనసాగిస్తున్న కత్రినాకైఫ్ గురించి ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడారు దీపికా. కత్రినా జెట్ వేగంతో దూసుకెళ్లడం మీకెలా అనిపిస్తోంది? అనే ప్రశ్న దీపికా ముందుంచితే - ‘‘కత్రినా గొప్ప అందగత్తె మాత్రమే కాదు ప్రతిభావంతురాలు కూడా. తనిప్పుడు మంచి హోదాలో ఉంది. అందుకు పూర్తి అర్హురాలు. కానీ, నేనెవరి స్థాయినీ సీరియస్గా తీసుకోను. ఈ ఏడాది ఒకరి హవా సాగితే.. వచ్చే ఏడాది వేరే తారది ఉంటుంది. సో.. ఇవాళ కత్రినా దూసుకెళుతోందని నేను కంగారుపడను’’ అన్నారు. ఈ మాటలు విన్నవాళ్లు ఓవైపు కత్రినాని పొగుడుతూనే మరోవైపు ఆమె దూకుడు ఎన్నాళ్లు? అని సెటైరికల్గా దీపికా చెప్పిందని, ఎంతైనా ఈవిడగారు ‘బ్యూటీ విత్ బ్రైన్’ అని అంటున్నారు.