-
భర్తను హత్య చేసిన భార్యకు జీవిత ఖైదు
సాక్షి, విజయవాడ స్పోర్ట్స్: తన జల్సాలకు అడ్డుపడుతున్న భర్తను హత్య చేసిన భార్యకు జీవిత ఖైదు విధిస్తూ విజయవాడ ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డి.లక్ష్మీ శుక్రవారం తీర్పు చెప్పారు. 2016 నవంబర్ 23న కొత్తపేట (టూ టౌన్) పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ ఘటన అప్పట్లో నగర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన జమలమ్మకు జి.కొండూరు మండలం వెంకటాపురానికి చెందిన ఏడుకొండలు(32)కు 16 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కొన్నాళ్లకు జమలమ్మ చెడు వ్యసనాలకు బానిసైంది. వీటిపై ప్రశ్నిస్తున్న భర్త ఏడుకొండలును అడ్డు తొలగించుకోవాలనే నిర్ణయాన్ని తన చెల్లెలు లక్ష్మికి వివరించింది. అదే గ్రామంలో హత్య చేస్తే అనుమానం వస్తుందనే ఉద్దేశంతో కాపురాన్ని టుటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పి.నైనవరం గ్రామానికి మార్చింది. అంబాపురంలో కొత్త ఇంట్లోకి ప్రవేశించిన రోజునే చెల్లెలు లక్ష్మి, న్యూఆర్ఆర్ పేటకు చెందిన ఒడియార్ గణేష్, జక్కంపూడికి చెందిన బాలసాని తిరుపతి సాయంతో జమలమ్మ తన భర్త ఏడుకొండలు మెడకు తాడు చుట్టి చంపేసిందని పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు. మూడు రోజుల తర్వాత ఆ గది నుంచి వస్తున్న దుర్వాసను పసిగట్టిన ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో జమలమ్మకు కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది. మిగిలిన నిందితులపై నేరం రుజువు కాకపోవడంతో నిర్దోషులుగా విడుదలయ్యారు. (చదవండి: పేపరు మీద లెక్కలు.. చూస్తే బోగస్ సంస్థలు!) -
రాహుల్ గాంధీ పిటిషన్ ను కొట్టేసిన సూరత్ సెషన్స్ కోర్టు
-
గర్భస్రావమయ్యేలా దాడి.. భర్త, బంధువులకు జైలుశిక్ష
మైసూరు: గర్భిణిపై దాడి చేసి గర్భపాతానికి కారణమైన ఐదుమందికి మైసూరు ఐదవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు 10 సంవత్సరాల కఠిన జైలు శిక్షను విధించింది. నంజనగూడు తాలూకాలోని హొసకోటె గ్రామానికి చెందిన భర్త మహేశ్, అత్త చిక్క కుసుమ, బంధువులు కుసుమ, కాంతరాజు, మహాదేవమ్మ జైలు శిక్ష పడిన వారు. భార్య పుట్టసౌమ్యను మరింత కట్నం తేవాలని భర్త మహేష్, ఇతర బంధువులు వేధించేవారు. 2015 ఫిబ్రవరి 7వ తేదీన పుట్ట సౌమ్య ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా గర్భవతి అని తెలిపారు. నాకు చెప్పకుండా ఎందుకు ఆస్పత్రికి వెళ్లావు అని మహేశ్ బంధువులు ఆమెను తీవ్రంగా కొట్టడంతో అక్కడే గర్భస్రావమైంది. దాంతో బాధితురాలు బదవనాళు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి చార్జిషీటు వేశారు. కోర్టు విచారణలో మహేశ్అ త్తమామల నేరం రుజువైంది. దీంతో జడ్జి మల్లికార్జున దోషులకు తలా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.22 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. (చదవండి: నకిలీ పత్రాలతో రూ.95 లక్షల లోన్ ) -
Navneet Rana: నవనీత్ కౌర్ దంపతులకు బెయిల్
ముంబై: మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త రవి రానాలకు ఊరట లభించింది. అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఆ జంటకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. బుధవారం షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది సెషన్స్ కోర్టు. సీఎం ఉద్దవ్ థాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ ముంబైలో ఉద్రిక్తతలకు కారణం అయ్యారు ఈ ఇండిపెండెంట్ ఎంపీ, ఎమ్మెల్యే భార్యాభర్తలు. ఈ తరుణంలో ఏప్రిల్ 23వ తేదీన ఖర్ స్టేషన్ పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బైకులా జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఈ జంట బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ముంబై సెషన్స్ కోర్టు.. మీడియాతో మాట్లడవద్దని నవనీత్ కౌర్ దంపతులను ఆదేశించింది. చదవండి: ఎస్సీ కావడంతో నాకు నీళ్లు కూడా ఇవ్వలేదు: నవనీత్ కౌర్ -
అప్పుడో లెక్క.. ఇప్పుడో లెక్క!: రూ.13 లక్షల బంగారం.. రూ. 8 కోట్లుగా తిరిగొచ్చింది!
Mumbai Police returns family's stolen gold worth ₹8 cr: నిజానికి దొంగలపాలైన సొమ్ము దొరకడం చాలా కష్టం. చాలా మటుకు పోలీసులు విచారించిన మన సొత్తు మనకు తిరిగి లభించడం అనేది అత్యంత అరుదు. అలాంటిది కోట్లు ఖరీదు చేసే సొమ్ము ఐతే ఇక ఆలోచించాల్సిన అవసరమే లేదు. దొరికే అవకాశం ఉంటుందనే ఊహ కూడా ఉండదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అలాంటి ఘటన ఒకటి ముంబైలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే....ముంబైలోని ప్రముఖ చరగ్ దిన్ వ్యవస్థాపకుడు అర్జున్ దాస్వానీ కుటుంబం పై ఒక ముఠా కత్తులతో దాడి చేసింది. అతన్ని అతని భార్యను తాళ్లతో కట్టేసి ఆ ముఠా రూ.13 లక్షల విలువైన బంగారాన్ని దొంగిలించింది. ఆ తర్వాత పోలీసులు ఆ ముగ్గురిని అరెస్టు చేశారు. 1998లో ఆ సొత్తు మొత్తం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1999లో విచారణలో ఆ ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేశారు. అయితే ఈ కేసుకి సంబంధించిన మరో ముగ్గురు నిందుతులు పరారీలో ఉన్నారు. అప్పటి నుంచి ఆ డబ్బు పోలీసుల ఆధీనంలోనే ఉంది.కానీ ఆ కేసులో పెద్దగా పురోగతి లేకపోవడంతో సుదీర్ఘంగా నిరీక్షించాల్సి వచ్చింది. ఈ కేసును విచారించిన సెషన్ కోర్టు.. ఫిర్యాదుదారునికి సొత్తు ఇవ్వకుండా సుమారు 19 ఏళ్లుగా నిరీక్షించేలా చేయడం న్యాయాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు సొత్తును షరుతులతో కూడిన నిబంధనలకు లోబడి అందజేయాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అర్జన్ దాస్వానీ కొడుకు రాజు దాస్వాని ఆస్తికి సంబంధించిన బిల్లులను సమర్పించి తమ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అయితే 22 ఏళ్ల నిరీక్షణ తర్వాత సొంతం అయిన ఆ ఆస్తి విలువ కాస్త ఇప్పుడు రూ 8 కోట్లు పైనే కావడం విశేషం. (చదవండి: అక్కడ తండ్రులు వ్యాక్సిన్లు వేసుకోకపోతే పిల్లలతో గడపనివ్వరట!)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement