-
స్వతంత్ర భారతి: మూడు రాష్ట్రాల అవతరణ
మణిపుర్, త్రిపుర, మేఘాలయలు ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాయి. 1947లో మణిపుర్ స్వతంత్ర రాజ్యమయ్యింది. మణిపుర్ రాజు మహారాజా ప్రబోధచంద్ర మణిపుర్ రాజ్యాంగాన్ని ఏర్పరచి, ఎన్నికలు నిర్వహించి, ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికారు. 1949లో మణిపుర్ రాజ్యం భారతదేశంలో విలీనం అయింది. 1956 నుండి కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న మణిపుర్ 1972లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైంది. త్రిపుర కూడా భారతదేశ స్వాతంత్య్రానికి ముందు ఒక రాజ్యంగా ఉండేది. 1949 లో భారత్లో విలీనమయ్యే వరకు గిరిజన రాజులు త్రిపురను శతాబ్దాలుగా పరిపాలిస్తూ వచ్చారు. చదవండి: చైతన్య భారతి: డిగ్రీ లేని మేధావి రాచరిక పాలనకు వ్యతిరేకంగా గణముక్తి పరిషద్ ఉద్యమం ప్రారంభమైనది. ఈ ఉద్యమ ఫలితమే త్రిపుర భారతదేశంలో విలీనం అవడం. దేశ విభజన తీవ్ర ప్రభావం చూపిన ప్రాంతాలలో త్రిపుర కూడా ఒకటి. రాష్ట్రంలో ఇప్పుడు బెంగాలీలు (ఇందులో చాలామంది 1971లో బంగ్లాదేశ్ యేర్పడిన తర్వాత పారిపోయి ఇక్కడ ఆశ్రయం పొందినవారే), స్థానిక గిరిజనులు పక్కపక్కనే సహజీవనం సాగిస్తున్నారు. త్రిపుర 1972లో ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. మేఘాలయ 1972 ముందు వరకు అస్సాంలో భాగంగా ఉండేది. మణిపుర్, త్రిపురలతో పాటు ప్రభుత్వం 1972 జనవరి 21 మేఘాలయకు రాష్ట్ర ప్రతిపత్తిని ఇచ్చింది. -
రెచ్చగొట్టడం సరికాదు
కేసీఆర్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి పశ్చిమకృష్ణా ఎన్జీవోల సంఘం విజయవాడ, న్యూస్లైన్ : సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాల్సిందే అంటూ టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ఎన్జీవోల సంఘం పశ్చిమకృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత సీమాంధ్రుల ప్రయోజనాలు కాపాడతామంటూ ఎన్నికల ముందు చెప్పిన కేసీఆర్ ఈ విధంగా మాట్లాడడం తగదన్నారు. స్థానిక ఎన్జీవో హోంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. అంతగా ఉద్యోగులపై ఒత్తిడి తెస్తే ఆంధ్రలో ఉన్న తెలంగాణ ఉద్యోగుల విషయంలోనూ ఇక్కడి ప్రభుత్వం అదే తీరుగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో లక్షలాది ఉద్యోగాలను సీమాంధ్రులు దోచుకుంటున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారని గుర్తు చేశారు. తీరా రాష్ట్రం విడిపోయాక ఉద్యోగుల సంఖ్య వందల్లోనే ఉండడంతో అక్కడి ప్రజలను మభ్యపెట్టేందుకు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్నికల్లో లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని అక్కడి యువతను మోసగించారని, ఎన్నికల్లో గెలిచాక ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లోనే సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సచివాలయంలో ఉన్న ఉద్యోగులంతా తెలంగాణలో జన్మించిన వారేనని విద్యాసాగర్ స్పష్టం చేశారు. ఈ విషయం కేసీఆర్కు తెలిసి కూడా అనుచితంగా వ్యవహరిస్తున్నారన్నారు. కేవలం ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి వైదొలిగేందుకు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ నిజస్వరూపం తెలంగాణ ప్రాంత ప్రజలకు, యువతకు అర్థమైందన్నారు. తప్పడు ప్రచారం, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాష్ట్ర విభజనకు కారకుడైన కేసీఆర్ ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నాడన్నారు. లక్ష ఎకరాలకు నీరందిస్తామంటూ కేసీఆర్ చేసిన హామీ నెరవేరే పరిస్థితి కనుచూపుమేరలో లేదన్నారు. సీమాంధ్ర ఉద్యోగుల విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా పెడతామన్నారు. విభజన తర్వాత స్థిరాస్తి పంపకాల్లో సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా అటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరాజు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకుడు శ్రీనివాసరావు, వాసు, సిటీ అధ్యక్షుడు కోనేరు రవి తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Chicken
YSRCP మరో అడుగు.. ఇక ఇంటింటికీ మేనిఫెస్టో
దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..
అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు
టీ20 వరల్డ్కప్ కోసం జట్టును ప్రకటించిన కెనడా
ఇచ్చేవాడినే కానీ..లాక్కునేవాణ్ని కాదు..
పవన్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్
ఒడిశా నుంచి జార్ఖండ్ మాజీ సీఎం సోదరి పోటీ!
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సింగర్ కన్నుమూత!
తప్పక చదవండి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
Advertisement