breaking news
Secretarial
-
65.33 లక్షల మందికి రూ.1,800.96 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65,33,781 మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వివిధ రకాల చేతి వృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు డిసెంబర్ 1న ఠంచన్గా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,800.96 కోట్లు విడుదల చేసింది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు గురువారం పేర్కొన్నారు. పింఛన్ నగదును ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలకు పంపించినట్లు చెప్పారు. సచివాలయాల వలంటీర్లు శుక్రవారం తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ సొమ్మును అందజేస్తారని తెలిపారు. ఇందుకోసం 2.66 లక్షల మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. లబ్ధిదారులకు పింఛన్ అందజేసే సందర్భంలో గుర్తింపు కోసం ఆధార్ నిర్ధారిత బయోమెట్రిక్, ఐరిస్ తదితర విధానాలను అమలు చేస్తున్నామన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పింఛన్ అందలేదనే ఫిర్యాదు రాకుండా.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఐదు రోజుల్లోనే నూరు శాతం పింఛన్ల పంపిణీ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో 15 వేల మంది సంక్షేమ, విద్య అసిస్టెంట్, వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శులు భాగస్వాములు అవుతారని వివరించారు. రాష్ట్రంలోని అన్ని డీఆర్డీఏ కార్యాలయాల్లోని కాల్ సెంటర్ల ద్వారా పింఛన్ల పంపిణీని పర్యవేక్షిస్తామని తెలిపారు. -
సెక్రటేరియల్ స్టాండర్డ్స్ అమలుతో చాలా ప్రయోజనం
హైదరాబాద్: సెక్రటేరియల్ స్టాండర్డ్స్ అమలుతో కంపెనీలకు చాలా ప్రయోజనం కలుగుతుందని ఐసీఎస్ఐ వైస్ ప్రెసిడెంట్ మమతా బినాని పేర్కొన్నారు. ఇటీవల సెక్రటేరియల్ స్టాండర్డ్స్పై న్యూఢిల్లీలో జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) జాతీయ సదస్సులో..మమతా బినాని మాట్లాడుతూ.. సెక్రటేరియల్ స్టాండర్డ్స్ను అమలుచేస్తున్న కంపెనీలపై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ల, క్రెడిటర్ల విశ్వాసం బలపడుతుందని తెలిపారు. కంపెనీల చట్టం-2013, సెక్షన్ 118 (10) ప్రకారం కంపెనీలు సెక్రటేరియల్ స్టాండర్డ్స్ను అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సెక్రటేరియల్ స్టాండర్డ్స్ను అమలు చేయడం వల్ల చిన్న, ప్రైవేట్ కంపెనీలకు ఎలాంటి సమస్యలు ఎదురుకావని తెలిపారు. సమావేశంలో ఐసీఎస్ఐ మాజీ ప్రెసిడెంట్ పవన్ కుమార్, ఐసీఎస్ఐ కౌన్సిల్ సభ్యులు వినీత్ చౌదరీ, రంజిత్ పాండే తదితరులు పాల్గొన్నారు.