breaking news
secreat files
-
ప్రపంచానికి షాక్.. భారత్ సహా విదేశీయులపై చైనా సీక్రెట్ మిషన్?
బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ యూ... ఈ మాట చైనా విషయంలో నిజమవుతోందా?. విదేశీయుల పాస్పోర్ట్ నుంచి ఆస్పత్రి రికార్డులు.. విమాన టికెట్లు నుంచి గ్యాస్ బిల్లుల వరకు వేలాది వ్యక్తిగత వివరాలను ఒకే ప్లాట్ఫామ్లో చైనా భద్రపరిచినట్లు వెల్లడైంది. మీరు ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా.. ఎవరిని కలిసినా.. ఆ సమాచారం అంతా ఒక రహస్య డేటాబేస్లో చేరుతుందనే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. వందలాది విదేశీయుల వ్యక్తిగత జీవితాలను అక్షరాలా ‘డిజిటల్ ఫైల్’గా మార్చిన ఈ నిఘా వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా కొత్త భయాలకు తెరతీస్తోంది. ఓ సైబర్ పరిశోధకుడు అనుకోకుండా కనిపెట్టిన ఈ రహస్య డేటాబేస్ ఇప్పుడు ప్రపంచాన్ని షాక్కు గురిచేస్తోంది. ఈ డేటాబేస్లో భారతీయులతో పాటు వందలాది మంది విదేశీయుల సమాచారం ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.ఈ సంచలన విషయాన్ని మాజీ విదేశీ పాత్రికేయుడు, సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు మార్క్ హోఫర్ గుర్తించారు. చైనాకు సంబంధించిన డిజిటల్ వ్యవస్థలను పరిశీలిస్తున్న సమయంలో ఆయనకు ‘డైనమిక్ కంట్రోల్ ప్లాట్ఫామ్ ఫర్ ఓవర్సీస్ పర్సనల్’ అనే వెబ్సైట్ కనిపించింది. వెబ్సైట్ తెరిచిన వెంటనే స్క్రీన్పై తన ఫొటో, పాస్పోర్ట్ నంబర్, ఒకప్పుడు చైనాలో ఉపయోగించిన మొబైల్ నంబర్ కనిపించడంతో ఆయన షాక్కు గురయ్యారు. తనకు కనిపించిన సమాచారం నిజమైనదేనని, అది కేవలం నమూనా డేటా కాదని ఆయన పేర్కొన్నారు. ఈ అనుభవం తనకు హాలీవుడ్ చిత్రం మైనారిటీ రిపోర్ట్ గుర్తు చేసిందని వ్యాఖ్యానించారు.ఆ డేటాబేస్లో జాంగ్జియాకౌ నగరంతో సంబంధం ఉన్న 700 మందికి పైగా విదేశీయుల సమాచారం, మొత్తం దాదాపు 12 వేల రికార్డులు ఉన్నట్లు గుర్తించారు. అందులో విదేశీ జర్నలిస్టులు, విద్యార్థులు, హాంకాంగ్, తైవాన్కు చెందిన వ్యక్తులు, పోలీసులు వెతుకుతున్న కొందరి వివరాలు ఉన్నాయి. ఆశ్చర్యకరంగా, ఆ నగరానికి ఎప్పుడూ వెళ్లని కొంతమంది విదేశీయుల పేర్లు కూడా అందులో కనిపించాయి. ఈ డేటాబేస్లో కేవలం పేరు, ఫోన్ నంబర్, పాస్పోర్ట్ వివరాలు మాత్రమే కాదు.. ఇంటి చిరునామా, ముఖ గుర్తింపు సాంకేతికత ఆధారంగా నమోదైన సీసీటీవీ కదలికలు, ఆసుపత్రి సందర్శనలు, గ్యాస్ బిల్లుల చెల్లింపులు, విమానాలు, రైలు ప్రయాణాల వివరాలు, సీటు నంబర్లు, తరచూ వెళ్లే ప్రదేశాలు వంటి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం కూడా నమోదు చేసినట్లు వెల్లడైంది.చైనాలో పలు యూనివర్సిటీలో చదువుతున్న భారత్, పాకిస్తాన్కు చెందిన విద్యార్థుల వివరాలు కూడా ఈ డేటాబేస్లో ఉన్నట్లు గుర్తించారు. వారు ఏ కోర్సు చదువుతున్నారు, వారి మతం, వైవాహిక స్థితి, యూనివర్సిటీ గేటు ఎప్పుడు దాటారు, కెమెరాల్లో ఎప్పుడు నమోదయ్యారు వంటి వివరాలు కూడా అందులో ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పౌరులను "ఫైవ్ ఐస్ అలయన్స్" పేరుతో ఒకే విభాగంలో వర్గీకరించగా, ఈజిప్ట్, ఇరాన్, ఇజ్రాయెల్, మొరాకో, పాకిస్తాన్, సూడాన్ వంటి దేశాల వారిని "కీ కంట్రీస్"గా గుర్తించారు. హాంకాంగ్, తైవాన్ ప్రజలకు వేర్వేరు ఫోల్డర్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది.ఈ వెబ్సైట్ లాగిన్ చరిత్రలో అనేక పోలీసు స్టేషన్ల నుంచి యాక్సెస్ చేసిన ఆనవాళ్లు కనిపించాయని హోఫర్ తెలిపారు. దీంతో ఇది సాధారణ సాఫ్ట్వేర్ కాదని, అధికారిక నిఘా వ్యవస్థలో భాగమై ఉండే అవకాశం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఈ డేటాను చైనా పోలీసులు వాస్తవంగా ఎలా ఉపయోగించారనే విషయంపై స్పష్టమైన ఆధారాలు బయటకు రాలేదు. మరో ఆందోళనకర విషయం ఏమిటంటే.. ఈ డేటాబేస్కు సంబంధించిన లాగిన్ పేజీలో యూజర్నేమ్, పాస్వర్డ్ ముందే నమోదు చేసి ఉండటాన్ని హోఫర్ గుర్తించారు. అంటే వందలాది మంది వ్యక్తిగత సమాచారం తగిన భద్రత లేకుండా ఇంటర్నెట్లో అందుబాటులో ఉండే పరిస్థితి ఏర్పడిందని ఆయన భావించారు. జనవరిలో ఈ సమాచారాన్ని భద్రపరిచిన ఆయన, మే నెల నాటికి ఆ వెబ్సైట్ పూర్తిగా అదృశ్యమైనట్లు తెలిపారు.ఈ ఘటన చైనా డిజిటల్ నిఘా వ్యవస్థపై మరోసారి అంతర్జాతీయ స్థాయిలో ప్రశ్నలు లేవనెత్తింది. విదేశీయుల రోజువారీ జీవితానికి సంబంధించిన అనేక అంశాలను ఒకేచోట సమీకరించే సామర్థ్యం ఉన్న వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయన్న దానిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నిర్దిష్ట డేటాబేస్ను చైనా అధికారులు అధికారికంగా ఎలా ఉపయోగించారనే విషయం ఇప్పటికీ స్పష్టంగా నిర్ధారించబడలేదు. ఈ వివరాలు ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన పరిశోధన ఆధారంగా వెలుగులోకి వచ్చాయి. -
నేతాజీ 'రహస్యం' పెద్ద జోకా?
న్యూఢిల్లీ: 'సాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ సుభాష్ చంద్రబోస్ విదేశాల్లో అంతర్థానమయ్యారు. ఆ ఘటనకు సంబంధించిన రహస్యాలు వెలుగులోకి వస్తే పలు దేశాలతో మనకున్న దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతింటాయి' అని చిన్నప్పటి నుంచి స్కూల్, కాలేజీల్లో చదువుకున్నాం. నాటి జవహర్ లాల్ ప్రభుత్వం నుంచి నేటి మోదీ సర్కార్ దాకా అందరికి అందరూ ఇదే విషయాన్ని చెబుతూవచ్చారు. కాలం సమీపించడంతో నేతాజీకి సంబంధించిన రహస్య ఫైళ్లను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే బహిర్గతం చేసింది. అయితే ముందునుంచీ భయపడ్డట్లు దీనిపై ఇటు రష్యాగానీ, అటు జపాన్ గానీ ఒక్కమాటైనా మాట్లాడలేదు. వాళ్లతో భారత్ సంబంధాలు తెగిపోనూలేదు. అంటే ఇన్నాళ్లూ నేతాజీ విషయంలో ప్రభుత్వాలు చెప్పినవన్నీ అబద్ధాలా? నేతాజీ అంతర్థానం, దాని వెనకున్న రహస్యం పెద్ద జోకా?' అంటూ పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని నిలదీశారు బిజూ జనతాదళ్(బీజేడీ) ఎంపీ బతృహరి మహతాబ్. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాధాలు చెప్పే తీర్మానంలో భాగంగా శుక్రవారం లోక్ సభలో మాట్లాడిన ఎంపీ మహతాబ్.. నేతాజీ అంతర్థానం, రహస్య ఫైళ్ల వెల్లడిలో ప్రభుత్వాలు అనుసరించిన తీరును ఘాటుగా విమర్శించారు. విడతల వారీగా ప్రభుత్వం వెల్లడిస్తోన్న రహస్య ఫైళ్లలో కొత్త విషయాలేవీ లేవని, అందులో ఉన్నదంతా దేశప్రజలకు ఇదివరకే తెలుసునని, గొప్ప యోధుడి విషయంలో ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవపట్టించడం దారుణమని మహతాబ్ అన్నారు. అటల్ బిహారీ ప్రధానిగా ఉన్నప్పుడు ఏర్పాటుచేసిన ఎం కె ముఖర్జీ కమిషన్ నివేదికను ప్రస్తావిస్తూ.. నేతాజీ అంతర్థానం అయ్యారని భావిస్తున్న ప్రాంతంలో విమాన ప్రమాదమేదీ జరగలేదని ఆ కమిటీ పేర్కొందని, మిగతా ఫైళ్లు మాత్రం ప్రమాదం జరిగిందని నివేదించడం గమనార్హమన్న ఆయన.. ఇప్పటికైనా ఈ విషయంలో అన్ని విషయాలు వెల్లడైనట్టా? లేక ఇంకేవైనా రహస్యాలను ప్రభుత్వం దాచిపెడుతోందా? అని ప్రశ్నించారు. లోక్ సభలో మాట్లాడుతున్న బీజేడీ ఎంపీ బతృహరి మహతాబ్. -
నేతాజీ రహస్య ఫైళ్ల వెల్లడిలో కీలక మలుపు
-
నేతాజీ రహస్య ఫైళ్ల వెల్లడిలో కీలక మలుపు
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్థానానికి సంబంధించిన రహస్య ఫైళ్లలోని వివరాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా అధికారిక రహస్యాల చట్టాన్ని పునఃసమీక్షంచేందుకు సిద్ధమైంది. ప్రధాని కార్యాలయం, రా, ఐబీ, కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక పరిశీలన బృందాన్ని ఏర్పాటుచేయనున్నట్లు బుధవారం ప్రకటించింది. నేతాజీ కుటుంబ సభ్యులపై దివంగత ప్రధాని నెహ్రూ నిఘా కొనసాగించారని ఇటీవలే వెలుగులోకి వచ్చిన అంశం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. నేతాజీకి సంబంధించిన రహస్య ఫైళ్లను వెలికితేవాలని పలు సంస్థలు, వ్యక్తులు డిమాండ్ చేస్తుండగా, అవి వెలుగులోకి వస్తే మిత్రదేశాలతో సంబంధాలు చెడిపోతాయని ప్రధానమంత్రి కార్యాలయం సమాధానం ఇస్తూవచ్చింది. ఈ నేపథ్యంలో ఫైళ్ల పరిశీలన సాధ్యాసాధ్యాలపై ప్రత్యేక ప్యానల్ ఏర్పాటు ప్రధాన్యం సంతరించుకుంది.


