-
స్కూల్స్ ఆఫ్ ఎక్స్లెన్సులుగా హైస్కూళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ హైస్కూళ్లను ‘స్కూల్స్ ఆఫ్ ఎక్స్లెన్సు’లుగా తీర్చిదిద్దేందుకు పాఠశాల విద్యా శాఖ అడుగులు వేస్తోంది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నూతన విద్యావిధానంలోని లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు కదులుతోంది. విద్యార్థి కేంద్రంగా పాఠ్య, బోధన ప్రణాళికలు, ఫౌండేషన్ విద్యలో నిర్దేశించిన త్రిలక్ష్య సాధన, హైస్కూల్ విద్యార్థులకు సంపూర్ణ సామర్థ్యాలు సమకూరేలా సబ్జెక్టులవారీ బోధన.. అంతిమంగా ప్రతి విద్యార్థి ప్రపంచస్థాయి ప్రమాణాలను అందుకునేలా ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇందుకోసం అందుబాటులో ఉన్న మానవ, మౌలిక సదుపాయాల వనరులన్నిటినీ సమర్థంగా వినియోగించుకునేలా కార్యాచరణ చేపట్టింది. ఇందుకోసం పాఠశాలలను ఆరంచెల విధానంలో ఏర్పాటు చేస్తోంది. 2023–24 నాటికి వీటిని పూర్తి స్థాయిలో అమల్లోకి తేవాలని నిర్ణయించింది. ఉన్నత ప్రమాణాలతో విద్యే లక్ష్యం.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే లక్ష్యంతో పాఠశాల విద్యలో అనేక సంస్కరణలు, కార్యక్రమాలు చేపట్టింది. అన్ని స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. విద్యార్థులకు మంచి ఆరోగ్యం, ప్రవర్తనలను అలవర్చడం, భావవ్యక్తీకరణ సామర్థ్యాలను పెంచడం, అభ్యసనం పట్ల ఆసక్తిని పెంచుతూ భాగస్వాములను చేయడం అనే లక్ష్యాలతో ఫౌండేషనల్ విద్యకు ఏర్పాట్లు చేయించింది. రాష్ట్రంలో 2025 నాటికి ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ (అంకెల పరిజ్ఞానం)ని సాధించడమే వీటి ఉద్దేశం. ఇక 3వ తరగతి నుంచి విద్యార్థులకు సబ్జెక్టు అంశాలను బోధిస్తూ.. వారికి పూర్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు అలవడేలా హైస్కూళ్లకు అనుసంధానిస్తోంది. వీటిని ‘స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్సులు’గా అభివృద్ధి చేస్తూ ఆరంచెల స్కూలింగ్ విధానాన్ని చేపట్టింది. మౌలిక వసతులతో అనేక కార్యక్రమాలు ఫౌండేషనల్ స్కూళ్లను అభివృద్ధి పర్చడంతోపాటు హైస్కూళ్లను స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్సులుగా తీర్చిదిద్దేలా పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మనబడి నాడు – నేడు కింద మౌలిక వసతులను ఏర్పాటు చేసింది. మంచి అలంకరణలతో తరగతి గదులు, రన్నింగ్ వాటర్తో టాయిలెట్లు, తాగునీరు, మరమ్మతులు, ప్రహరీలు, విద్యుత్, ఫ్యాన్లు, లైట్లు, విద్యార్థులు–టీచర్లకు డ్యూయెల్ డెస్కులు, కుర్చీలు, అల్మారాలు వంటి ఫర్నిచర్, గ్రీన్చాక్ బోర్డులు, ఇంగ్లిష్ ల్యాబ్లు, కిచెన్ షెడ్లు నిర్మించింది. జగనన్న అమ్మ ఒడితోపాటు జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద కార్యక్రమాలనూ అమలు చేస్తోంది. అలాగే ఫౌండేషనల్ స్కూళ్లలో ముగ్గురు అంగన్వాడీ వర్కర్, సహాయకులతోపాటు ఒకరు లేదా ఇద్దరు ఎస్జీటీ టీచర్లు ఉంటారు. హైస్కూళ్లలో సీబీఎస్ఈ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 10 నుంచి 15 మంది సబ్జెక్టు టీచర్లు ఉంటారు. ల్యాబ్లు, గ్రంథాలయాలు, వర్చువల్ డిజిటల్ తరగతి గదులు కూడా అందుబాటులో ఉంటాయి. 2023 నాటికి పూర్తి స్థాయిలో ఆరంచెల విధానం.. ఆరంచెల విధానానికి అనుగుణంగా 2023–24 నాటికి పూర్తి అయ్యేలా స్కూళ్ల మ్యాపింగ్ ప్రక్రియను అధికారులు ఇప్పటికే చేపట్టారు. ప్రస్తుతం 2,835 ప్రైమరీ స్కూళ్లను ఫౌండేషనల్ స్కూళ్లుగా తీర్చిదిద్దారు. 2,682 హైస్కూళ్లకు 3–5 తరగతుల విద్యార్థులను అనుసంధానించారు. ప్రభుత్వ, జెడ్పీ స్కూళ్ల నుంచి 1,73,441 మంది, మున్సిపల్ స్కూళ్ల నుంచి 30,013 మంది మొత్తం 2,03,454 మంది విద్యార్థులు హైస్కూళ్లకు అనుసంధానమయ్యారు. 2022–23లో కిలోమీటర్ పరిధిలోని ప్రైమరీ స్కూళ్లలో 3–5 తరగతుల విద్యార్థులను సమీపంలోని ప్రీ హైస్కూల్, హైస్కూళ్లకు అనుసంధానిస్తారు. వాటిలో అదనపు తరగతి గదులు నిర్మిస్తారు. ఇక జూనియర్ కాలేజీలు లేని 202 మండలాల్లోని హైస్కూళ్లలో +2 తరగతులు ప్రారంభిస్తారు. 2023–24లో 2 నుంచి 3 కిలోమీటర్ల పరిధిలోని ప్రైమరీ స్కూళ్ల 3–5 తరగతుల విద్యార్థులను ప్రీ హైస్కూల్, హైస్కూళ్లలో అనుసంధానం చేస్తారు. ఈ హైస్కూళ్లను స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్సులుగా మార్చేందుకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తారు. ఈ ప్రక్రియలో ఏ ఒక్క స్కూల్, అంగన్వాడీ కేంద్రం మూతపడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే ఏ ఒక్క టీచర్, అంగన్వాడీ వర్కర్ పోస్టూ పోకుండా జాగ్రత్తలు తీసుకుంది. -
వీఐపీ రిపోర్ట్ కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి
సంస్థాన్నారాయణపురంలోని సర్వేల్ గురుకులం దేశానికే తలమానికం.. అఖిల భారత సర్వీసుకు ఎంతో మందిని అందించిన సరస్వతీ నిలయం.. అవిభాజ్య రాష్ట్రంలోనే మొట్టమొదటి గురుకుల విద్యాలయం. 1971లో నాటి ముఖ్యమంత్రి పీవీ నర్సింహారావు చేతుల మీదుగా పురుడు పోసుకుంది. తెలంగాణ పది జిల్లాలకు స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్గా పనిచేస్తోంది. వంద మందికిపైగా ఈ పాఠశాల విద్యార్థులు దేశంలోనే అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, డాక్టర్లుగా ఎంపికై, దేశవ్యాప్తంగా సేవ చేస్తున్నారు. అంతటి ఘన చరిత్ర కలిగిన గురుకులం మనుగడకే ప్రస్తుతం ప్రమాదం ఏర్పడింది. సమస్యల వలయంలో కొట్టు మిట్టాడుతోంది. ఆ గురుకులాన్ని, పక్క గ్రామానికే చెందిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆదివారం సాక్షి ప్రతినిధిగా మారి అక్కడి సమస్యలను అడిగితెలుసుకున్నారు. సర్వేల్ గురుకులం నుంచి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి వీఐపీ రిపోర్ట్... కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి: మీ పేరేమిటి? గురుకులంలో ఏమేం సమస్యలున్నాయి? ప్రిన్సిపాల్: నాపేరు కేవీఎన్ ఆచారి. అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గెస్ట్ టీచర్లతో కాలం వెళ్లదీస్తున్నాం. 40ఏళ్ల క్రితం నిర్మిం చిన రేకుల షెడ్లలో తరగతులు నిర్వహిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన ఈ పాఠశాలలో మోడల్ స్కూల్ భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు 2, 3కోట్ల రూపాయలు అవసరమవుతాయి. తాగునీటి సమస్య ఉంది. కూసుకుంట్ల: మీ ఎమ్మెల్యే ఇక్కడ బోరు వేయించిండు అంటున్నరు. మోటారు పెట్టిండ్ర. ఆచారి: పెట్టలే, మోటారు మంజూరు ఇప్పియ్యలే. కూసుకుంట్ల: మరి మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా? ఆచారి: తీసుకెళ్లలేదు. కూసుకుంట్ల : మరి.. ఆయనను కలిసి మోటారు పెట్టించాల్సిన బాధ్యత మీదే కదా. ఆచారి : నాదే బాధ్యత సర్. కూసుకుంట్ల: అధ్యాపక పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి. ఎంతకాలం నుంచి ఉన్నాయి? ఆచారి: ఏడెనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 1996 నుంచి ఇదే పరిస్థితి. గెస్ట్ టీచర్లతో బోధన చేయిస్తున్నాం. కూసుకుంట్ల: ఎందుకు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? ఆచారి : ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. ఇటీవల గురుకుల పాఠశాలల కార్యదర్శి శేషుకుమారి దృష్టికి తీసుకెళ్లా. కూసుకుంట్ల: గురుకులం గతంలో ఎంతో మందిని అఖిల భారత సర్వీసులకు అందించింది. ఇప్పుడెందుకు ఎంపిక కావడంలేదు. ఆచారి : 100మందికి పైగా ఈ పాఠశాల విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లకు ఎంపికయ్యారు. లాటరీ పద్ధతిలో విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడమే కొంపముంచింది. ఆ తర్వాత పక్కనే ఉన్న ఓ విద్యార్థితో మాట్లాడారు. కూసుకుంట్ల: బాబు నీ పేరేమిటి? ఎక్కడినుంచి వచ్చావు? విద్యార్థి: సార్! నాపేరు అశోక్. మాది మిర్యాలగూడ. కూసుకుంట్ల: మీ నాన్న ఏంచేస్తారు. పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నావు? అశోక్: వ్యవసాయం చేస్తాడు, గొప్ప ఇంజినీర్ కావాలనుకుంటున్నాను. కూసుకుంట్ల: బాబు నీపేరేమిటి? మీకు ఏమేం సమస్యలున్నాయి?(మరో విద్యార్థినిని ప్రశ్నిస్తూ) విద్యార్థి: సార్, నా పేరు సతీష్. అన్ని బాగానే ఉన్నాయి. అనంతరం పదో తరగతి గదిలోకి వెళ్లారు. కూసుకుంట్ల: సార్! మీ పేరేమిటీ? ఏం బోధిస్తారు? టీచర్: సార్ నాపేరు శంకరయ్య. గణితం బోధిస్తాను. కూసుకుంట్ల: ఇది ఏ తరగతి, ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? శంకరయ్య: పదో తరగతి సార్, రెండు సెక్షన్లున్నాయి. 43మంది చొప్పున విద్యార్థులున్నారు. కూసుకుంట్ల: గత ఏడాది ఎంత మందికి 10 జీపీఏలు వచ్చాయి? శంకరయ్య: సార్ 80శాతం మందికి 10పాయింట్లు వచ్చాయి. మిగతావారికి 9.8, 9.7 చొప్పున వచ్చాయి. తరగతిలో ఉన్న ఓ విద్యార్థి దగ్గరికి వెళ్లి బాబు నీ పేరేమిటి? బోధన ఎలా ఉంది? విద్యార్థి: సార్ నాపేరు రవీంద్రబాబు, బాగా అర్థమవుతోంది. కూసుకుంట్ల: టీచర్ల ఖాళీలున్నాయని చెబుతున్నారు, అన్ని సబ్జెక్టులు చెబుతున్నారా? రవీంద్రబాబు: అన్ని సబ్జెక్టులు చెబుతున్నారు. కానీ, ఇంగ్లిష్, గణితం, ఫిజికల్ సైన్స్, తెలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గెస్ట్ టీచర్లతో చెప్పిస్తున్నారు. తరగతి గదిలొఓ ఇద్దరు ముగ్గురు విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడినుంచి గ్రౌండ్ దగ్గరికి వెళ్లారు. కూసుకుంట్ల: బాబు నీ పేరేమిటి?, ఆట వస్తువులున్నాయా? విద్యార్థి: నాపేరు బూటాసింగ్, సరిగా లేవు, సొంత డబ్బులతో కొనుకుంటున్నాం. కూసుకుంట్ల: పీఈటీ గారు ప్రభుత్వం ఇవ్వడంలేదా? పీఈటీ: సార్ నాపేరు అజయ్కుమార్, ప్రభుత్వం ఏడాదికి రూ.5వేలే ఇస్తోంది. అందులోనే అన్నీ కొనుగోలు చేయాలి. గ్రౌండ్లు బాగు చేసుకోవాలి. అక్కడినుంచి సమీపంలోని తాగునీటి ట్యాంకు వద్దకు వెళ్లారు. కూసుకుంట్ల: బాబు నీ పేరు ఏమిటి? పాఠశాలలో తాగునీటి సమస్య ఉందా? విద్యార్థి: సార్ నాపేరు నరేశ్, కృష్ణాజలాలు 10, 15రోజులకోసారి వస్తున్నాయి. 40వేల లీటర్ల సామర్థ్యమున్న ఓవర్హెడ్ ట్యాంకును పడగొట్టారు. 20వేల లీటర్లదే నిర్మించారు. ఏ మాత్రమూ సరిపోవడంలేదు. కూసుకుంట్ల: సీఎం కేసీఆర్ ఏదో వాటర్ గ్రిడ్ అంటున్నారు. తెలుసా? నరేశ్: కేసీఆర్ ఆలోచనలు, నిర్ణయాలు చాలా బాగున్నాయి. వాటర్గ్రిడ్ గురిం చి తెలుసు. వాటర్గ్రిడ్ ఏర్పాటుతో మా నీటి సమస్య రుతుంద నుకుంటున్నా. ఎమ్మెల్యే ఏం హామీలిచ్చారంటే.. మోడల్ స్కూల్ భవన నిర్మాణానికి, ఆట వస్తువుల కొనుగోలుకు, గ్రౌండ్ అభివృద్దికి నిధులిప్పిస్తా. నిత్యం కృష్ణాజలాలు వచ్చేలా కృషి చేస్తా. ఓవర్హెడ్ వాటర్ ట్యాంకు నిర్మించడంతో పాటు వాటర్గ్రిడ్ నుంచి కనెక్షన్ ఇప్పిస్తా. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకీ కృషిచేస్తా. విద్యార్థుల భోజనానికి సన్నబియ్యం ఇప్పిస్తా. పక్కనే ఉన్న జెడ్పీ హైస్కూల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశ పెట్టడంతో పాటు కేజీ నుంచి పీజీ వరకు పాఠశాల స్థాయిని పెంచుతా. అఖిలభారత సర్వీసులకు 100మందికి పైగా.. సర్వేల్ గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించిన ఎంతోమంది విద్యార్థులు నేడు అఖిల భారత సర్వీసుల్లో దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఈఎస్, ఐఆర్టీఎస్, ఐటీఎస్ ఇలా ఏ రంగంలో చూసినా ఈ పాఠశాల పూర్వ విద్యార్థులుంటారు. గతంలో ఎస్సెస్సీలో ఈ పాఠశాల విద్యార్థులదే రాషస్థ్రాయి ర్యాంకుల పంట. ఇక్కడి విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్లుగా కేంద్ర, రాష్ట్ర సర్వీసులలో ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొంత మంది శాస్త్రవేత్తలుగా, వైద్యులుగా, ఇంజినీర్లుగా దేశవిదేశాలలో పనిచేస్తున్నారు. ప్రస్తుత హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి, ఐజీ వై.నాగిరెడ్డి, జిల్లా ఎస్పీ డాక్టర్ టి.ప్రభాకర్రావు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్, హైదరాబాద్ జాయింట్ కమిషనర్ బి.మల్లారెడ్డి, సీనియర్ ఐఏఎస్లు బి.వెంకటేశ్, ఏ.దినకర్బాబు, ఎల్.శశిధర్, జినుకల బాబు, ఐఎఫ్ఎస్ డాక్టర్ డీఎన్.రాం బాబు, ఐఆర్ఈఎస్ రణదీర్రెడ్డి , ఐఆర్ఎస్ పి.అంజన్కుమార్ త దితరులు ఈ పాఠశాలలో విద్యార్థులే. -
ప్రాణం తీసిన నిర్లక్ష్యం
హన్వాడ, న్యూస్లైన్: చిన్నారులంతా ఆడుతూ పాడుతూ పాఠశాల వెళ్లారు. బడి ముగిసింది.. మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరుతామనుకునేలోపు మృత్యువు ఆటో రూపంలో ఓ బాలుడిని కబళించింది. స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాదకర సంఘటన బుధవారం మండలంలోని పెద్దర్పల్లి గ్రామంలో జరిగింది. బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన యాదయ్యగౌడ్, అశ్వినిల ఒక్కగానొక్క కొడుకు గున్న ప్రణీత్(5) చిన్నదర్పల్లిలోని అభయా స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్లో నర్సరీ చదవుతున్నాడు. ప్రణీత్ బుధవారం ఎప్పటిలాగే అందరితో కలిసి ఆటోలో పాఠశాలకు వెళ్లాడు. పాఠశాల ముగిసిన వెంటనే మళ్లీ అదే ఆటోలో ఇంటిముఖ ం పట్టారు. కిక్కిరిసిన ఆటోలో ఉన్న ప్రణీత్ గ్రామ సమీపంలోని పల్లెమోనికాలనీ వద్ద ప్రధాన రహదారిపై ఆటో వేగానికి అదుపుతప్పి జారి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. ఆటో వెనకనుంచి వస్తున్న కొందరు గుర్తించి 108 అంబులెన్స్కు ఫోన్చేశారు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రణీత్ను మరో ఆటోలో జిల్లా ఆస్పత్రికి తరలించిన కొదిసేపటికే ప్రాణాలు వదిలాడు. ఆటోలో 60 మంది చిన్నారులు ఇదిలాఉండగా, పెద్దర్పల్లి నుంచి చిన్నదర్పల్లిలోని అభయా స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ ప్రైవేటు పాఠశాలకు 60మంది చిన్నారులు వెళ్తారు. వీరంతా గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు చింతకింది రాములు ఆటోలోనే నిత్యం వెళ్లి వస్తుంటారు. ఇలా ఒక్కోట్రిప్కు 30మంది చిన్నారులను తరలిస్తారని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి బస్సు వేయాలని గతంలో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యాన్ని కోరినా వారు వినిపించుకోలేదు. తీరా వారి నిర్లక్ష్యమే ప్రణీత్ ప్రాణాలను బలిగొందని తల్లిదండ్రులు, గ్రామస్తులు కంటతడిపెట్టారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement