-
Viral Video: మనతో మాములుగా ఉండదు.. పులిని బెంబేలెత్తించిన ఎద్దు
అడవిలో ఏ జంతువైనా పులి, సింహాన్ని చూసి భయపడాల్సిందే. వీటి దాడి నుంచి తప్పించుకోవడం కష్టం. చిన్నా పెద్ద తేడా లేకుండా వేటినైనా క్రురంగా వెంటాడి, చంపేసి ఆహరం చేసుకుంటాయి. పొరపాటున పులి కంటపడితే.. ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగు పెట్టాల్సిందే. అయితే తాజాగా ఓ జంతువు పులిని భయపెట్టించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఖాళీగా ఉన్న రోడ్డు మీద ఓ ఎద్దు దాని మానాన అది పరుగెత్తుకెళుతుంది. ఇంతలో రోడ్డు పక్కన దాక్కున్న పులి ఎద్దుని చూసి దాని మీదకు దాడి చేసేందుకు ముందుకు వచ్చింది. పులిని చూసిన ఎద్దు ఎంతమాత్రం బెదరలేదు. అంతేగాక ఎద్దు తన కొమ్ములతో పొడిచేందుకు పులిని భయపెట్టింది. దీంతో ఎద్దుని చూసి బెంబేలెత్తిన పులి తొకముడుచుకొని వెనక్కి పారిపోయింది. తర్వాత ఎద్దు వెళ్లిపోయాక పులి దాని దారిలో అది వెళ్లిపోయింది. చదవండి: కొండచిలువతో పోట్లాడుతున్న కంగారు: వీడియో వైరల్ ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ భారత అటవీశాఖ అధికారి సుశాంత నంద ట్విటర్లో షేర్ చేశారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఈ వీడియోకు వేలల్లో వ్యూస్ వచ్చి చేరుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘అన్నిరోజులు ఒకేలా ఉండవు.. పరిస్థితులు మారుతాయి. ఎవరైనా జాగ్రత్త పడాల్సిందే..’ అంటూ కామెంట్ చేస్తున్నారు. Courage is found in unlikely places… Bull scares away the tiger. This is not the behaviour apex predator that we know. Pressure of human presence is perhaps having a huge role. WA fwd pic.twitter.com/6A4kx39yVc — Susanta Nanda IFS (@susantananda3) August 30, 2022 -
దెయ్యం భయం.. ఊరు ఖాళీ!
సాక్షి, వేలేరుపాడు: ఆ ఊరి పొలిమేరల్లో ఓ పెద్ద బండరాయి.. దాని కింద ఓ సొరంగం.. అందులో ఉడుము రూపంలో ఎర్రమారి దెయ్యం.. నిత్యం బయట సంచరిస్తుంది.. కాలక్రమేణా ఆ సొరంగం మట్టితో పూడుకుపోయింది. ఇంకేం.. ఆ దెయ్యానికి కోపం వచ్చింది.. గ్రామస్తులను బలితీసుకోవడం మొదలుపెట్టింది.. అందుకే ఆ గ్రామాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు.. సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్నా ఇంకా ఇటువంటి మూఢాచారాలు జన జీవనాన్ని బెంబేలెత్తిస్తూనే ఉన్నాయనడానికి పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో మారుమూల గిరిజన గ్రామమైన కొర్రాజులగూడెం నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ఇళ్లను సైతం పడగొట్టారు గ్రామంలో మొత్తం 40 గిరిజన కుటుంబాలుండేవి. పెంకుటిళ్ల కాలనీలతో పాటు, మూడు మంచినీటి బోర్లు, లక్షలాది రూపాయలు వెచ్చించి రహదారి కూడా నిర్మించారు. తొమ్మిదేళ్ల కిందట పక్కా పాఠశాల భవనాన్ని కూడా నిర్మించారు. గతేడాది మరో అదనపు పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఆ ఊరి పొలిమేరల్లో ఉన్న ఓ పెద్ద బండరాయి కింద ఉన్న సొరంగం రెండున్నరేళ్ల కిందట మట్టితో పూడిపోయింది. అదే ఏడాది గ్రామంలో వివిధ వ్యాధులతో కారం లక్ష్మయ్య, పరిశక లక్ష్మయ్య, బందం తమ్మయ్య, మిడియం రాములు మృతి చెందారు. మళ్లీ ఆరు నెలలకు మడివి చిన్నయ్య, కారం చిన్నక్క, సోడే రాజమ్మలు అనారోగ్యంతో మృతి చెందారు. ఇంకేముంది దీనికి ఎర్రమారి దెయ్యం ఆగ్రహమే కారణమని భయపడిన గ్రామస్తులు ఊరుని ఖాళీచేసి వెళ్లిపోయారు. గ్రామంలోని 30 పెంకుటిళ్లను సైతం పడగొట్టి.. కిలోమీటర్ దూరంలోని తారురోడ్డు ప్రాంతంలో పూరిగుడిసెలు నిర్మించుకున్నారు. అందుకే బలితీసుకుంటోంది.. ‘మా గ్రామంలో దెయ్యం ఉన్న సొరంగం మట్టితో పూడిపోవడంతో అది ఆగ్రహించి మా ఊరివాళ్లను బలితీసుకుంది’ అని ఆ గ్రామ పెద్దకాపులు తెల్లం సాయిబు, సోడే ముత్యాలు, కారం గంగులు ‘సాక్షి’తో చెప్పారు. అందువల్లనే ఊరు ఖాళీ చేశామని, ఇప్పుడు తమకు ప్రశాంతంగా ఉందన్నారు. గతంలో ఊరు అక్కడున్నప్పుడు 46 మంది విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలో చదువుకునేవారు. గ్రామస్తులు కొత్తగా ఇళ్లు నిర్మించుకున్న ప్రాంతానికి అరకిలో మీటర్ దూరంలో ఉన్న ఈ పాఠశాలకు విద్యార్థులు వెళ్లకపోవడంతో ప్రభుత్వం మూసేసింది. దీంతో కొర్రాజులగూడేనికి చెందిన 18 మంది విద్యార్థులు కాలినడకన కిలోమీటరు దూరంలో ఉన్న చాగరపల్లి పాఠశాలకు వెళ్తున్నారు. బతుకుజీవుడా అంటూ బయటపడ్డాం.. ఆ దెయ్యం వల్ల మా వాళ్లను కోల్పోయాం. ఇంకా అక్కడే ఉంటే మమ్మలికూడా ఆ అది మింగేసేదే. అందుకే బతకుజీవుడా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాం. వేరే చోట కొత్త ఇళ్లు కట్టుకున్నాం. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. – కణితి శ్రీరాములు కొర్రాజులగుడెం గ్రామస్తుడు నన్నూ భయపెట్టారు.. ఈ పాఠశాలలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్గా పనిచేయడానికి ఇక్కడకొచ్చాను. ‘మీరు పాఠశాలకు ఎలా వెళుతున్నారు.. అక్కడ దెయ్యం ఉంది’ అంటూ నన్ను భయపెట్టారు. మొదట్లో కొంత భయపడ్డాను. తర్వాత నెమ్మదిగా భయం వీడి పాఠశాలకెళ్లాను. తర్వాత పాఠశాలను ప్రభుత్వమే మూసేసింది. ఇక్కడి విద్యార్థులను కిలోమీటరు దూరంలోని చాగరపల్లి పాఠశాలలో విలీనం చేశారు. ప్రస్తుతం చాగరపల్లి పాఠశాలలో పర్మినెంట్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నా. కొర్రాజులగూడెం విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. – గుజ్జా శిరీష, అకడమిక్ ఇన్స్ట్రక్టర్ -
ప్రేమంటే అందరికీ భయమే!
లాస్ ఏంజిల్స్: ప్రేమ ఎంతటి వారినైనా గాయపరిచే అవకాశం ఉంది కాబట్టి అదంటే అందరికీ భయమే అంటున్నాడు ప్రముఖ సింగర్, సాంగ్ రైటర్ జాన్ లెజెండ్. మోడల్ క్రిస్సీ టీజెన్ను పెళ్లాడిన ఈ 'ఆల్ ఆఫ్ మి' హిట్మేకర్.. రిలేషన్లో తమ భావోద్వేగాలను వెల్లడించడం పురుషులకు కష్టంతో కూడుకున్నది అని కూడా ఒప్పుకున్నాడు. ఎందుకంటే పురుషులు తమ ఎమోషన్ను బయటకు కనిపించకుండా ఎప్పుడూ ఓ కవచాన్ని పెట్టుకుంటారని.. దాని నుంచి బయటపడి మహిళల వలే వారు ఎమోషన్ను స్వేచ్ఛగా చూపించరని బీబీసీతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు. ఇక తన కొత్త ఆల్బమ్లో మూడేళ్ల కూతురు లూనాకు సంబంధించిన ఓ పాట ఉందని.. అది తనను ఎంతగానో ఉద్వేగానికి గురిచేసిన పాట అని, అది విన్న ప్రతిసారీ తనకు మంచి అనుభూతి కలుగుతోందని జాన్ లెజెండ్ తెలిపాడు. -
టపాసులకు కుక్కలు భయపడుతాయా?
న్యూఢిల్లీ: ఓ మనిషికి సాలె పరుగులంటే భయమనుకుందాం. సాలె పురుగులు గూళ్లు కట్టుకున్న ఓ గదిలోకి ఆ మనిషిని పంపించి తలుపులు మూసేశాం అనుకోండి. ఆ మనిషికి కదల్లేని స్థితి కూడా ఉందనుకోండి. అప్పుడు ఆ మనిషికి ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి? దీపావళి టపాసులకు భయపడే కుక్కలకు ఏసీపి డ్రగ్ (అసెపోమజైన్)ను ఇచ్చినట్లయితే వాటి పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంటుంది. బాణాసంచా పేలుళ్లకు 45 శాతం కుక్కలు తీవ్రంగా భయపడుతాయి. ఆ శబ్దాలకు భయపడి గోలగోల చేస్తాయి. ఇల్లుపీకి పందిరేస్తాయి. ఆ బాధ నుంచి వాటిని తప్పించేందుకు జంతు వైద్యుల వద్దకెళితే వారు సాధారణంగా అసెపోజైన్ అనే మత్తు మందును సూచిస్తారు. ఆ మందును కుక్కలకు ఇవ్వడం వల్ల వాటి వినికిడి జ్ఞానం మరింత పెరుగుతుంది. అదే సమయంలో శరీరం మొద్దుబారిపోయి కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. బాణాసంచా పేలుళ్ల శబ్దాలు మరీ ఎక్కువగా వినిపించడం వల్ల అవి మానసికంగా అంతకుముందుకన్నా ఎక్కువగా ఆందోళన చెందుతాయి. ఆ శబ్దాలను దూరంగా పారిపోవాలనుకుంటాయి. అందుకు కాళ్లు, శరీరం సహకరించవు. కదలకుండా ఉండిపోతుంది. వాటిని చూసే యజమానులకు అవి ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తాయి. బాణాసంచా పేలుళ్లకు భయపడకుండా ఉండేందుకు ‘డెక్సిమెడెటోమిడైన్’ అని మందును ఇవ్వాలంటూ ఇటీవల టీవీల్లో యాడ్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ మందు వల్ల వాటి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని ఇంగ్లండ్లోని నట్టింగమ్ ట్రెంట్ యూనివర్శిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా పేలుళ్ల భయాందోళనల నుంచి పెంపుడు కుక్కలను రక్షించాలంటే ఏం చేయాలి? ఏ ప్రాంతంలో ఉంటే తన సురక్షితంగా ఉంటుందని ఆ కుక్క భావిస్తుందో అక్కడే దాన్ని ఉంచాలి. కుక్కకు ఓ ప్రత్యేక డెన్ ఉండి, చీకటి పడకముందే అ డెన్లోకి వెళ్లే అలవాటు ఉంటే అందులోకి తీసుకెళ్లాలి. యజమాని దగ్గరుంటేనే సురక్షితంగా ఉంటుందనుకుంటే ఆ యజమాని దగ్గరుంచాలి లేదా ఇంట్లోకి శబ్దం ఎక్కువ రాని గదిలో ఉంచి, తలుపులు, కిటికీలు మూసెయ్యాలి. వీలయితే మ్యూజిక్, లేదా టీవీ కార్యక్రమాలు బాణాసంచా పేలుళ్లు వినిపించని స్థాయిలో పెట్టాలి. వీటన్నింటికన్నా ఉత్తమమైన మార్గం కుక్క పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే వాటికి బాణాసంచా పేలుళ్ల శబ్దాలను క్రమంగా అలవాటు చేయాలి. అంటే దీపావళి పండుగకు రోడ్లపైకి తీసుకెళ్లడం కాదు. సీడీలు లేదా యూట్యూబ్ ద్వారా బాణాసంచా పేలుడు శబ్దాలను చిన్న స్థాయిలో వినిపిస్తూ క్రమంగా వ్యాల్యూమ్ పెంచుతూ పోతూ వాటికి అలవాటు చేయాలి. కొన్ని రోజుల్లోనే అవి ఆ సబ్దాలకు అలవాటు పడతాయి. -
నిబంధనలకు నీళ్లు
– ప్రైవేటు విద్యాసంస్థల్లో కరువైన సదుపాయాలు – తరచూ ప్రమాదాల బారిన పడుతున్న విద్యార్థులు హిందూపురం టౌన్ : తాగునీటి సౌకర్యం ఉండదు.. ఆటస్థలం ఉండదు.. మరుగుదొడ్డి ఉండదు.. అర్హత ఉన్న ఉపాధ్యాయులు ఉండరు.. ఇలా ఏ సౌకర్యం లేకున్నా విద్యాశాఖ అధికారులు నిబంధనలకు నీళ్లు వదిలి పాఠశాల, కళాశాలలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. పాఠశాల లేదా కళాశాలకు అనుమతి ఇవ్వాలంటే ఎన్నో నిబంధనలు ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క నిబంధన పాటించకపోయినా విద్యాశాఖ వారు అనుమతి ఇస్తూ విద్యార్థుల ప్రమాదాలకు కారణమవుతున్నారు. అన్ని దానాల్లో విద్యాదానం గొప్పదని చెబుతున్నారు. కానీ కొంతమంది ప్రైవేటు, కార్పొరేటు శక్తులు విద్యాశాఖ అధికారులను మామూళ్ల మత్తులో ముంచి అనుమతులు పొందుతున్నార నే ఆరోపణలు లేకపోలేదు. రూ.వేల ఫీజులు దండుకుంటూ తమ విద్యాసంస్థల్లోనే పుస్తకాలు, యూనిఫాం కొనాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. వారి పిల్లల జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు విధిలేక చెల్లిస్తున్నారు. పట్టణంలో మూడు కార్పొరేటు పాఠశాలలు, ఒక కార్పొరేటు కళాశాల, సుమారు 10 ప్రైవేటు కళాశాలలు, 52 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 50 శాతం విద్యాసంస్థలకు కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేవు. అయినా విద్యాశాఖ అధికారులు మాత్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి– చంద్రశేఖర్రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి పట్టణంలో నిబంధనలు అతిక్రమిస్తున్న విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. విద్యాసంస్థల నిర్లక్ష్యంతో విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారు. అయినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement