-
లోన్ ఇవ్వనందుకు ఎస్బీఐకి మొట్టికాయ
సాక్షి, హైదరాబాద్: ఇంటి కొనుగోలుకు అవసరమైన రుణం మంజూరు చేయనందుకు బాధితుడికి రూ. 20 వేల ఖర్చును వడ్డీతో పాటు చెల్లించాలని, పరిహారం కింద మరో రూ. 50 వేలు చెల్లించాలని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా వినియోగ దారుల ఫోరం–3... 2018లో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ఎంఎస్కే జైస్వాల్ బుధవారం తాజా ఉత్తర్వులు ఇచ్చారు. టీఎస్ఆర్టీసీలో ఉద్యోగిగా పని చేస్తున్న గుడవల్లి భాస్కర్బాబు.. మలక్పేటలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు రూ. 10 లక్షల రుణం కావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీఎస్ఆర్టీసీ బ్రాంచ్లో 2017 జూన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగి కావడంతో అవసరమైన డాక్యుమెంట్లు, న్యాయ సలహా, ఫ్లాట్ విలువ వివరాలను నిపుణుల నుంచి తీసుకొని ఎస్బీఐకి సమర్పించారు. దరఖాస్తుదారుడి వివరాలను పరిశీలించిన ఎస్బీఐ కేవలం రూ. 4,35,000 మాత్రమే మంజూరు చేసింది. దీంతో భాస్కర్బాబు లక్ష రూపాయల పరిహారం, జరిగిన నష్టానికి రూ. 50,000 చెల్లించాలని జిల్లా వినియోగదారుల ఫోరం–3ని ఆశ్రయించారు. తాను రుణం కోసం అవసరమైన డాక్యుమెంట్లు, న్యాయ సలహా, వాల్యుయేషన్ సర్టిఫికేట్ తదితర వాటి కోసం చేసిన ఖర్చు వివరాలను పొందుపరిచారు. దీనిపై విచారించిన జిల్లా వినియోగదారుల ఫోరం–3 ఫిర్యాదుదారుడికి ఖర్చుల కింద రూ.40 వేలు, రుణం విషయంలో వేధింపులకు గాను రూ.50 వేలు, మరో 3వేలు ఇతర ఖర్చులకు ఇవ్వాలని 2018 డిసెంబర్ 12న ఆదేశించింది. దీనిపై ఎస్బీఐ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను ఆశ్రయించింది. ఈ మేరకు ఫిర్యాదుదారుడు, ఎస్బీఐతో పాటు ఈ వివాదంతో సంబంధం ఉన్న వ్యక్తులను, సంస్థలను విచారించిన కమిషన్, భాస్కర్బాబుకు ఖర్చుల కింద రూ.20 వేలు, పరిహారంగా రూ.50 వేలు చెల్లించాలని బుధవారం ఆదేశించింది. రూ. 20 వేలకు జూన్ 2017 నుంచి ఇప్పటివరకు 6 శాతం వడ్డీ కూడా చెల్లించాలని పేర్కొంది. -
సెంచరీ పూర్తి చేసుకున్న సెకండ్వేవ్
ముంబై: కోవిడ్ను సమర్థంగా అరికట్టడం వ్యాక్సినేషన్తోనే సాధ్యమని, లాక్డౌన్లతో సాధ్యం కాదని ఓ నివేదిక తెలిపింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ 100 రోజులపాటు కొనసాగే అవకాశాలున్నాయని అంచనావేసింది. గత నెల నుంచి దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నివేదికలోని అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వ్యాక్సినేషన్ను భారీగా వేగంగా అమలు చేసి వైరస్ వ్యాప్తిని ఆపొచ్చని ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్యకాంతి ఘోష్ ఒక నివేదికలో స్పష్టం చేశారు. ‘గత ఏడాది ఇదే సమయంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సమయంలో కేసుల సంఖ్య 500లోపే. అయితే, లాక్డౌన్లను పొడిగించుకుంటూ పోయిన కొద్దీ కేసుల సంఖ్య పెరుగుతూ పోయింది’అని ఆయన పేర్కొన్నారు. ‘1918–19 సంవత్సరాల్లో సంభవించిన స్పానిష్ ఫ్లూ సమయంలో కూడా ఆయా దేశాల్లో లాక్డౌన్లు విధించి స్కూళ్లు, చర్చిలు, థియేటర్లను మూసివేశారు. కానీ, లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేశాక పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది’ అని విశ్లేషించారు. దేశంలో ప్రధాన రాష్ట్రాల్లోని ఎక్కువగా ఈ వ్యాధి వ్యాప్తి చెందిన జిల్లాల్లో మరణాలు, కేసుల సంఖ్యను తగ్గించడంలో లాక్డౌన్లు విఫలమయ్యాయన్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో లాక్డౌన్ల కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమైనట్లు గూగుల్ మొబిలిటీ డేటా చెబుతోంది. కానీ, ఈ రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయన్నారు. దేశంలో కరోనా వ్యాప్తిని టీకా పంపిణీతోనే నిలువరించగలమని ఆయన తెలిపారు. జనవరి నుంచి కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కారణంగా సెకండ్ వేవ్లో కేసులు 25 లక్షలకు మించకపోవచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల తీవ్రతను మొదటి వేవ్ తీవ్రస్థాయిలో ఉన్నప్పటి పరిస్థితితో పోల్చి చూస్తే ఏప్రిల్ రెండో అర్ధభాగంలో కేసులు అత్యధిక స్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయని సౌమ్యకాంతి ఘోష్ అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మొదలైన సెకండ్ వేవ్ దేశంలో 100 రోజుల వరకు కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈ తీవ్రతను ఎదుర్కొనేందుకు టీకా పంపిణీ వేగవంతం కావాలన్నారు. ఇప్పటి వరకు రాజస్తాన్, గుజరాత్, కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 60 ఏళ్లుపైబడిన 20% మంది వ్యాక్సినేషన్ పూర్తయిందనీ, అయితే వృద్ధుల జనాభా ఎక్కువగా ఉన్న పంజాబ్, తమిళనాడు, మహారాష్ట్ర, బెంగాల్ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ చాలా తక్కువగా అమలైందని తెలిపారు. రెండో వేవ్ తీవ్రంగా ఉన్నా టీకా అందుబాటులోకి వచ్చినందున కేసులు తగ్గే ఛాన్స్ ఉందన్నారు. -
గతవారం బిజినెస్
టోకు ద్రవ్యోల్బణం యూ టర్న్ తయారీ రంగం, కొన్ని ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల ఫలితంగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం క్షీణదశ నుంచి పెరుగుదల బాటలోకి ‘యూ’ టర్న్ తీసుకుంది. ఏప్రిల్లో 0.34 శాతం రేటు నమోదయ్యింది. అంటే సూచీ 2015 ఏప్రిల్తో పోల్చితే 2016 ఏప్రిల్లో 0.34 శాతం పెరిగిందన్నమాట. 2015 ఏప్రిల్లో ఈ రేటు -2.43 శాతం. విలీనానికి ఎస్బీఐ గ్రూప్ సిద్ధం ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మంగళవారం కీలక ప్రతిపాదనను కేంద్రం ముందు పెట్టింది. తన ఐదు అనుబంధ బ్యాంకులు అలాగే భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ)ని విలీనం చేసుకోడానికి అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే (2016-17) ఈ ప్రక్రియ పూర్తవ్వాలన్నది తన ఉద్దేశంగా తెలిపింది. క్రాష్ టెస్ట్లో ఐదు కార్లు ఫెయిల్ భారత్లో విక్రయమవుతున్న ఐదు కార్లలో ప్రయాణికుల భద్రతా ప్రమాణాలు తగిన విధంగా లేవని గ్లోబల్ ఎన్సీఏపీ(న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్స్) వెల్లడించింది. మారుతీ సెలెరియో, ఈకో, రెనో క్విడ్, మహీంద్రా స్కార్పియో, హ్యుందాయ్ ఇయాన్...ఈ ఐదు కార్లు తమ క్రాష్ టెస్ట్ల్లో విఫలమయ్యాయని పేర్కొంది. కాగా భారత ప్రభుత్వ భ ద్రత నియమ నిబంధనలకనుగుణంగానే కార్లను తయారు చేశామని మారుతీ, రెనో, హ్యుందాయ్ కంపెనీలు పేర్కొన్నాయి. టాటా మెటాలిక్స్ విలీనానికి టాటా స్టీల్ స్వస్తి టాటా మెటాలిక్స్, టాటా మెటాలికస్ డీఐ పైప్స్.. ఈ రెండు కంపెనీలను విలీనం చేసుకునే యోచనను టాటా స్టీల్ కంపెనీ అటకెక్కించింది. ఈ విలీనానికి సంబంధించి, చట్ట, శాసనపరమైన ఆమోదాలు పొందడంలో జాప్యం కావడం, ఇతరత్రా కారణాల వల్ల ఈ విలీన యోచనను పక్కన పెట్టామని టాటా స్టీల్ తెలిపింది. స్టీల్ పైప్స్, ట్యూబ్స్పై యాంటీ డంపింగ్ సుంకం చైనా నుంచి దేశంలోకి దిగుమతి అవుతున్న స్టీల్ పైప్స్, సీమ్లెస్ ట్యూబ్స్పై కేంద్ర ప్రభుత్వం యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించింది. చౌక దిగుమతుల నుంచి దేశీ స్టీల్ పరిశ్రమను ఆదుకోవడానికి ఆయిల్, గ్యాస్ అన్వేషణలో ఉపయోగించే స్టీల్ పైప్స్, ట్యూబ్స్పై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించాలని డీజీఏడీ ఇటీవల రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఒక ప్రతిపాదన చేసింది. మార్కెట్లోకి మళ్లీ నోకియా ఫోన్స్ మళ్లీ నోకియా బ్రాండ్ ఫోన్లు, ట్యాబ్లు మార్కెట్లోకి రానున్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ నోకియా బ్రాండ్ హక్కులను హెచ్ఎండీ గ్లోబల్కు, ఫాక్స్కాన్ అనుబంధ సంస్థ ఎఫ్ఐహెచ్ మొబైల్కు 35 కోట్ల డాలర్లకు విక్రయించింది. నోకియా బ్రాండ్ ఎక్స్క్లూజివ్ గ్లోబల్ లెసైన్స్ను హెచ్ఎండీ గ్లోబల్కు పదేళ్లపాటు లీజ్కు ఇచ్చామని నోకియా పేర్కొంది. దీంతో హెచ్ఎండీ గ్లోబల్, ఎఫ్ఐహెచ్ మొబైల్ సంస్థలు ఇక నోకియా బ్రాండ్ మొబైళ్లను విక్రయిస్తాయి. పీ-నోట్ల నిబంధనలు మరింత కఠినం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి.. పీ-నోట్ల నిబంధనలను మరింత కఠినతరం చేసింది. పార్టిసిపేటరీ నోట్ల ద్వారా ప్రయోజనం పొందేవాళ్లు మనీల్యాండరింగ్ను నిరోధించే భారత చట్టాలకు బద్దులై ఉండడం తప్పనిసరని పేర్కొంది. ఆష్షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ (ఓడీఐ-వీటినే పీ-నోట్లగా వ్యవహరిస్తారు)కు సంబంధించి ఏవైనా సందేహాస్పద లావాదేవీలు ఉంటే, వీటిని జారీ చేసిన సంస్థలు తక్షణం తమకు నివేదించాలని సెబి ఆదేశాలు జారీ చేసింది. గూగుల్ అసిస్టెంట్ను ఆవిష్కరించిన పిచాయ్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ‘గూగుల్ అసిస్టెంట్’ అనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఆవిష్కరించారు. దీనితోపాటు ఆయన ‘గూగుల్ హోమ్’ అనే వైస్-యాక్టివేటెడ్ ప్రొడక్ట్ను, ‘అలో’ మేసేజింగ్ యాప్ను, ‘డుయో’ వీడియో కాలింగ్ యాప్ను, ఇన్స్టాంట్ యాప్స్ను, వీఆర్ ప్లాట్ఫామ్ ‘డేడ్రీమ్’ను, మొబైల్ సాఫ్ట్వేర్ ‘ఆండ్రాయిడ్ ఎన్’ను, వియరబుల్ ప్లాట్ఫామ్ ‘ఆండ్రాయిడ్ వియర్ 2.0’ను ఆవిష్కరించారు. కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో జరిగిన సంస్థ 10వ వార్షిక డెవలపర్ సమావేశంలో వీటి ఆవిష్కరణ జరిగింది. హెచ్ఎస్బీసీ విశాఖ బ్రాంచ్ మూసివేత ! బ్రిటిష్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ కన్సాలిడేషన్ ప్రక్రియలో భాగంగా ఇండియాలో కొన్ని శాఖల్ని మూసివేయనుంది. ప్రస్తుతం 29 పట్టణాల్లో 50 శాఖలను కలిగిన హెచ్ఎస్బీసీ.. తన బ్రాంచ్ల సంఖ్యను 26కి (14 పట్టణాల్లో) తగ్గించుకోనున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ మూసివేయనున్న బ్రాంచ్ల్లో విశాఖపట్నం శాఖ కూడా వున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో యాపిల్ మ్యాప్స్ సెంటర్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా మ్యాప్స్ అభివృద్ధి కార్యకలాపాల కోసం హైదరాబాద్లో తమ కార్యాలయాన్ని ప్రారంభించింది. మ్యాప్స్ డెవలప్మెంట్ సెంటర్పై పెట్టుబడులను వెల్లడించని యాపిల్... దీని ద్వారా దాదాపు 4,000 దాకా ఉద్యోగాలొస్తాయని తెలియజేసింది. కాగా కంపెనీ బెంగళూరులో ‘ఐఓఎస్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ సెంటర్’ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. మాల్యా మొత్తం కట్టాల్సిందే: పీఎన్బీ చీఫ్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన విజయ్మాల్యా... ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందేనని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఎండీ ఉషా అనంతసుబ్రమణ్యన్ స్పష్టం చేశారు. కొంత మొత్తాన్ని చెల్లిస్తామన్న మాల్యా ఆఫర్ను ఆమె తిరస్కరించారు. బ్యాంకింగ్ కన్సార్షియానికి నేతృత్వం వహించనప్పటికీ, అందులో ఒక భాగంగా వున్న తాము మాల్యా రుణ మొత్తం చెల్లించాల్సిందేనన్నది డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎన్ఎస్ఈలో వాటా విక్రయ దిశగా ఎస్బీఐ ఎన్ఎస్ఈలో కొంత వాటాను విక్రయించాలని ఎస్బీఐ యోచిస్తోంది. ఎస్బీఐకు 15 శాతం వాటా ఉంది. ఈ వాటాలో 5 శాతాన్ని కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా విక్రయించనున్నామని ఒక పబ్లిక్ నోటీస్ ద్వారా ఎస్బీఐ పేర్కొంది. ఈ వాటా విక్రయం ద్వారా రూ.1,000 కోట్లు వస్తాయని బ్యాంక్ అంచనా. డీల్స్.. * బయోఫార్మాస్యూటికల్ సంస్థ అనకార్ ఫార్మాస్యూటికల్స్ను ఫార్మా దిగ్గజం ఫైజర్ కొనుగోలు చేయనున్నది. అనకార్ ఫార్మాను 520 కోట్ల డాలర్లకు(రూ.34,320 కోట్లు సుమారుగా) అంతా నగదులోనే కొనుగోలు చేయనున్నామని ఫైజర్ తెలిపింది. * స్టార్టప్లలో రతన్ టాటా పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఆయన తాజాగా శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన అత్యవసర వైద్య సేవలందించే స్టార్టప్.. ఎంర్జెన్సీ ఇన్కార్పొలో పెట్టుబడులు పెట్టారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత చాట్బోట్, నికిడాట్ఏఐలోనూ ఇన్వెస్ట్ చేశారు. పెట్టుబడుల వివరాలు వెల్లడి కాలేదు. * టాటా కమ్యూనికేషన్స్ సంస్థ తన భారత్, సింగపూర్లకు చెందిన డేటా సెంటర్ వ్యాపారంలో 74 శాతం వాటాను ఎస్టీ (సింగపూర్ టెక్నాలజీస్ )టెలిమీడియాకు రూ.3,150 కోట్లకు విక్రయించింది. * క్యాస్ట్రాల్ ఇండియాలో 11.5 శాతం వాటాను ఇంగ్లండ్కు చెందిన బీపీ కంపెనీ విక్రయించింది. ఒక్కో షేర్ను రూ.365 చొప్పున 5.68 కోట్ల షేర్లను(11.5 శాతం వాటా)ను దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు విక్రయించామని బీపీ కంపెనీ పేర్కొంది. ఈ వాటా విక్రయ విలువ రూ.2,075 కోట్లని వివరించింది. -
20న ఎస్బీఐ గ్రూపు బ్యాంకుల సమ్మె
కర్నూలు(అగ్రికల్చర్): ఎస్బీఐలో స్టేట్ బ్యాంకు గ్రూపు బ్యాంకుల విలీన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 20న మెరుపు సమ్మెకు గ్రూపు బ్యాంకు లు నిర్ణయించాయి. స్టేట్బ్యాంకు గ్రూపులో జిల్లాకు సంబంధించి స్టేట్బ్యాంకు ఆఫ్ హైద్రాబాద్, స్టేట్బ్యాంకు ఆఫ్ మైసూర్ బ్రాంచిలున్నాయి. వీటిని ఎస్బీఐలో విలీనం చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయా బ్యాంకుల ఉద్యోగులు ఆందోళనకు నిర్ణయించారు. గురు, శుక్రవారాల్లో భోజన విరామ సమయాల్లో నల్లబ్యాడ్జిలతో నిరసన చేపడతారు. 20న ఆయా బ్యాంకుల అధికారులు, ఉద్యోగులు సమ్మె చేపట్టనున్నారు. సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఏఐబీఈఏ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు తెలిపారు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement