breaking news
save girl child
-
మేరీ జిందగీ..వేకప్ గరల్స్
అవేకెండ్ హిందుస్థాన్ ఈజ్ అవేక్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హాజ్ అవేకెండ్ ద ఎర్త్ యాజ్ అవేకెండ్ అండ్ ది స్కై ఈజ్ అవేక్... సో యూ ఆల్సో వేకప్!! అంటూ ఈ ట్యూన్.. కశ్మీరి బాలికల్లో మానసిక ధైర్యాన్ని నూరిపోస్తోంది. కశ్మీకు ఉన్న ప్రత్యేక రాష్ట్ర హోదా ఎత్తి వేసిన తరువాత కూడా అక్కడి పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. వీలైనంత త్వరగా అక్కడి పరిస్థితులను అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా మార్చేందుకు కేంద్రప్రభుత్వం, ఇండియన్ ఆర్మీ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే లక్నోకు చెందిన ‘మేరి జిందగీ’ బ్యాండ్ను కశ్మీకు పంపి అక్కడి బాలికల్లో అనేక అంశాలపై అవగాహన కలి్పస్తోంది. రేపటి (అక్టోబర్ 11) అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ ఆర్మీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం విశేషం. విన్నింగ్ హార్ట్స్ అండ్ మైండ్స్ ఆర్మీ సరిహద్దుల్లో ఉండి పోరాడుతూ దేశప్రజలు, కశీ్మరీల ప్రాణాలకు రక్షణ కల్పించడంతోపాటు, అక్కడి మహిళలు, బాలికల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కృషిచేస్తోంది. ఈ క్రమంలోనే ‘‘విన్నింగ్ హార్ట్స్ అండ్ మైండ్స్ (డబ్ల్యూహెచ్ఏఎమ్), సద్భావన’’ పేరుతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా..‘మేరీ జిందగీ’ బ్యాండ్ను కశ్మీర్లోని మారుమూల ప్రాంతాల్లో రెండు రోజులపాటు (9, 10) పర్యటిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి.. విద్య, ఆత్మరక్షణ, ప్రాథమిక హక్కులు, సమానత్వం, మెన్స్ట్రువల్ హైజీన్ వంటి విషయాలపై అక్కడి మహిళలు, బాలికల్లో పాటల ద్వారా రాక్ బ్యాండ్ అవగాహన కలి్పస్తోంది. తమని తాము రక్షించుకోవడానికి ఉపయోగపడే ఆత్మరక్షణ మెళకువలను పాటల ద్వారా నేరి్పంచడం, మహిళలను చుట్టుముట్టే సమస్యలపై సంగీత కచేరీల ద్వారా విభిన్న కోణాల్లో వివరించడం, కొంతమంది విద్యారి్థనులతో ముచ్చటించి ఆరోగ్యం, విద్య, సమానత్వం వంటివాటి ప్రాముఖ్యతను తెలియజెబుతోంది. మేరీ జిందగీ.. దేశంలో తొలి మహిళా రాక్ బ్యాండ్ మేరి జిందగీ. దీనిని 2010లో డాక్టర్ జయ తివారీ స్థాపించారు. ‘సేవ్ ది గర్ల్ చైల్డ్’ లక్ష్యంగా ఏర్పడిన మహిళా బ్యాండ్ వివిధ అంశాల్లో మహిళలు, బాలికలకు అవగాహన కలి్పంచేందుకు ప్రత్యేకమైన పాటలు, సంగీతాన్ని రూపొందించి, పాటల రూపంలో ప్రదర్శిస్తుంది. ఇప్పటిదాక 350పైగా షోలను బ్యాండ్ నిర్వహించింది. బ్యాండ్ లీడర్ జయ స్వయంగా పాటలను రచించి, వాటికి ట్యూన్లు రూపొందించడం విశేషం. ఇంకా ఈ బ్యాండ్లో నిహారిక దుబే, పుర్వి మాలి్వయా, సౌభాగ్యా దీక్షిత్, మేఘన శ్రీవాస్తవ లు ఉన్నారు. ఈ బ్యాండ్ మహిళలకు మరింత దగ్గరయ్యేందుకు పింక్ డ్రెస్కోడ్ని ధరించడం విశేషం. ఈ ఐదుగురు కలిసి వివిధ రకాల సంగీత వాయిద్యాలతో మహిళలు, బాలికలకు అవగాహన కల్పిస్తున్నారు. -
నిద్రలో కనేది కల.. సమాజాన్ని తట్టిలేపేది కళ
నిద్రలో కనేది కల. నిద్రాణమైన సమాజాన్ని తట్టిలేపేది కళ. సామాజిక చైతన్యమే దాని ప్రధాన ఉద్దేశం. కొంతమంది కళాకారులు తమ చిత్రాల్లో ప్రకృతికి పెద్దపీట వేస్తారు. కానీ ఆయన మాత్రం బాలికలపై సాగుతున్న వివక్షను రూపుమాపేందుకు తన కుంచెను ఎంచుకున్నారు. తన చిత్రాలతో సమాజానికి చక్కని సందేశాన్ని అందజేస్తున్నారు చిత్ర కళాకారుడు మహేష్అలియాస్ తుపాకుల మహేష్, రామాంజనేయరెడ్డి. తన కుంచె నుంచి జాలువారుతున్న ప్రతి చిత్రంలోనూ ‘సేవ్ గర్ల్ చైల్డ్’ నినాదాన్ని చేర్చి సమాజమనే కాన్వాస్పై అర్థవంతమైన సందేశాలను తీర్చిదిద్దుతున్నారు. తను గీసే ప్రతి చిత్రంలోనూ సేవ్గర్ల్ చైల్డ్ అనే లోగో తప్పక ఉండితీరుతుంది.ఈ చిత్రాలను చూసిన ప్రతిసారి ఆడపిల్లల కోసం మనం చేయాల్సింది ఎంతో ఉందని చెబుతుంటారు ప్రొద్దుటూరు చెందిన మహేష్. బంజారాహిల్స్ :చదువుతోనే ఆడపిల్లలు తమపై జరుగుతున్న వివక్షను తిప్పికొడతారనే అంశాన్ని చిత్రకారుడు మహేష్ గట్టిగా విశ్వసిస్తారు. ఈ తపనే ఆయనను చిత్రకళ వైపు మళ్లించాయి. సేవ్ గర్ల్ చైల్డ్ అనే నినాదంతో సమాజానికి సందేశాన్ని ఇస్తున్న ఆయన చిత్రాలు పలువురు ప్రముఖుల ప్రశంసలను అందుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఆయన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, సంగీత విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా, సినీనటి కరీనాకపూర్, తమన్నా, బ్రహ్మానందం, గాయకులు ఎస్.జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సినీ నటులు విక్రమ్, కీర్తిసురేష్, ఐపీఎస్ అధికారిణి స్వాతి లక్రా, అంజనీకుమార్ తదితరుల చిత్రాలను వేసి సేవ్ గర్ల్ చైల్డ్పై ఉద్ధృత ప్రచారం నిర్వహించారు. కే. వలం సెలబ్రిటీలే కాకుండా స్ఫూర్తినిచ్చే మహిళలు శ్రమైక జీవనానికి ప్రతీకగా నిలిచే సామాన్యులకు సైతం తను ఎంతో కష్టపడి గీసిన విలువైన చిత్రాలను అందిస్తూ పెద్దా చిన్నా అనే తారతమ్యం లేకుండా ఈ ప్రచారంలో అందరినీ భాగస్వాములను చేస్తున్నారు. హైదరాబాద్లో ఇప్పటికే పలువురు ప్రముఖులను కలిసి ఈ చిత్రాలను అందజేశారు. ఇల్లాలితోనే అంకురార్పణ.. మహేష్ భార్య ఇంటర్మీడియెట్ తర్వాత చదువు నిలిపివేశారు. తాను పెద్దగా చదువు లేకపోయినా ఆమెను చదివించాలన్న లక్ష్యంతో పీజీ పూర్తి చేయించారు. అనంతరం పోటీ పరీక్షలు రాయించి ఆమె తహసీల్దార్ అయ్యేలా ప్రోత్సహించారు. తన భార్యే తనకు స్ఫూర్తిగా నిలవడం ఆనందంగా ఉందంటారు మహేష్. ఆడపిల్లలు చదువుకుంటే సమాజం బాగుపడుతుందన్న ఉద్దేశంతో ఈ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారాయన. తన భార్య ఆరేళ్ల క్రితం గెజిటెడ్ పోస్టు సాధించినప్పుడు ఆమెను కలవడానికి చాలా మంది ఇంటికివస్తుంటే ఎంతో ఆనందాన్ని అనుభవించారు. ఏదైనా సాధించాలంటే సంకల్పం ఉండాలని, దానికి స్త్రీ, పురుష బేధం లేదని చెప్పుకొచ్చారు. మార్పు కోసం తొలి అడుగు తన ఇంటి నుంచే మొదలైందంటారు మహేష్. ఇందులో తన మిత్రుల సహకారం మరువలేనిదని చెబుతుంటారు. పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల చిత్రాలను కూడా గీసి సందేశాన్ని ప్రచారం చేస్తున్నానని, సమాజానికి మంచి చేసే వ్యక్తుల గురించి తెలిస్తే 98669 13354ను సంప్రదించవచ్చని చిత్రకారుడు మహేష్ విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఆడపిల్లని కాపాడదాం
‘సేవ్ గర్ల్ చైల్డ్’.. అంటే ఆడపిల్లని కాపాడదాం అని. ఇదే నినాదంతో ‘సమాజానికో హెచ్చరిక’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. చామకూరి కంబైన్స్ పతాకంపై చామకూరి. యమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పాటల రికార్డింగ్ హైదరాబాద్లోని ఎస్.ఏ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు శివకృష్ణ, జబర్దస్త్ అప్పారావు, రాకింగ్ రాజేశ్, అలేఖ్య, ప్రియాంక, నటి గీతాసింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చామకూరి. యమ్ మాట్లాడుతూ– ‘‘ముగ్గురు యువకులు తమ కాళ్ల మీద తాము నిలబడుతూ, సమాజానికి ఎలా ఉపయోగపడ్డారో తెలియజేసే సినిమా ఇది. ఈ చిత్రానికి కథ, మాటలు నేను అందిస్తున్నా’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, పాటలు: సురేంద్ర కృష్ణ. -
బాలిక.. బతకాలిక !
బాలికలు, మహిళలపై రోజురోజుకూ వేధింపులు, అఘాయిత్యాలు పెచ్చుమీరుతున్నాయి. సమాజంలో వీరి భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. అమ్మాయిల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ‘సేవ్ గర్ల్ చైల్డ్’ నినాదాన్ని తలకెత్తుకున్నారామె. బాలికల సంరక్షణకు నడుం కట్టారు.అవగాహన సదస్సులు, సోషల్ మీడియాలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆడవాళ్లభద్రతకు తనవంతు బాధ్యతగాముందుకెళ్తున్నారు హైదరాబాద్కు చెందిన బొట్ల లతా చౌదరి. నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ‘ఆడపిల్లను రక్షించుకుందాం’ అనే నినాదంపై అవగాహన కల్పిస్తున్నారు. సమాజంలో వారికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రొజెక్టర్ల ద్వారా ప్రదర్శిస్తూ చైతన్యం తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నారామె. ప్రతి అత్తా ఒక తల్లిలాఆలోచించాలని హితవు చెబుతున్నారు. హిమాయత్నగర్: కూకట్పల్లిలోని బాచుపల్లికి చెందిన లతా చౌదరి ‘ఉమెన్ వెల్ఫేర్ సర్వీస్ ఆర్గనైజేషన్’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. పలువురు మహిళలను వలంటీర్లుగా నియమించుకున్నారు. ‘సేవ్ ఎ గర్ల్’ నినాదంతో నగరంలోని బాచుపల్లి, నిజాంపేట్, బోరంపేట, కూకట్పల్లి ప్రాంతాలతో పాటు ఏపీలోని విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. రెండునెలలకోసారి ఓ ప్రాంతాన్ని ఎంచుకుని సంస్థ వలంటీర్లతో కలిసి గ్రామీణ మహిళలతో సమావేశమవుతుంటారు. ‘అసలు ఆడపిల్లలను ఆడదే చంపుతోంది’ అనే విషయాన్ని లేవనెత్తుతూ ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలపై జరిగిన దాడులకు సంబంధించిన వీడియోలను ప్రొజెక్టర్లతో ప్రదర్శిస్తున్నారు. ప్రతి అత్తా తల్లిలా భావిస్తే సమాజంలో ఆడపిల్లకు ఎటువంటి అన్యాయం జరగదు. కలకాలం ఆడపిల్ల మనముందు కదలాడుతుందనే విషయంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇలా అవగాహనలో కల్పిస్తుండటంతో ఎన్నో కుటుంబాల్లో మార్పు వచ్చిందని లతా చౌదరి చెబుతున్నారు. వారు ఆరోగ్యంగా ఉంటేనే.. ‘సేవ్ ఎ గర్ల్’ క్యాంపెయిన్ ముగిశాక మరో ప్రాంతంలో ‘హెల్త్ అండ్ న్యూట్రిషియన్’ పేరుతో మరో క్యాంపెయిన్కు శ్రీకారం చుడుతున్నారు లతా చౌదరి. 20 ఏళ్లు దాటిన యువతులు, మహిళలతో సమావేశమవుతారు. గ్రామాల్లోని మహిళలు రక్తహీనతకు ఎందుకు గురవుతున్నారనే విషయాలను వారికి వివరిస్తుంటారు. ఆరోగ్యపరమైన అంశాలను వారికి చెబుతుంటారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో కొన్ని నిత్యావసర సరుకులు అందిస్తుంటారు. అలాగే ఇళ్లల్లో వాడి పడేసిన, అవసరం లేని వస్తువులను సేకరించి పేదలకు అందజేస్తున్నారు. ఇలా ‘దుస్తులు, పాదరక్షలు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్రిజ్లు, నిత్యావసర సరుకులు’వంటి వాటిని పేదలకు ఇస్తున్నారు లతాచౌదరి. ఈ ఏడాది సుమారు 3వేల మందికి వీటిని అందజేసినట్లు ఆమె పేర్కొన్నారు. మార్పు కోసమే ఇదంతా.. ఇదంతా మార్పు కోసమే చేస్తున్నా. చాలావరకు ఆడపిల్లల జీవితాలు ఇంట్లోని ఆడవాళ్ల కారణంగానే నాశనమవుతున్నాయి. ఇరువురి మధ్య సఖ్యత అనేది చాలా ప్రాముఖ్యం. దీనిని వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నాం. అన్ని వర్గాల నుంచి ఆదరణ వస్తోంది. నా వల్ల సమాజంలో కొంత మార్పు వచ్చినా చాలు. – లతా చౌదరి, ఫౌండర్, ఉమెన్ వెల్ఫేర్ సర్వీస్ ఆర్గనైజేషన్ సాయిబాబా ఆలయ నిర్మాణానికి కృషి.. నిజాంపేటలోని బాబా టెంపుల్ లైన్లో ఉన్న బాబా మందిరం ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేది. ఈ ప్రాంతంలో ఎందరో కోటీశ్వరులు ఉన్నప్పటికీ ఎవరూ దీనిని పట్టించుకోలేదు. దీంతో లతా చౌదరి ‘షిరిడీ సాయి సేవా ట్రస్టు’ను ఏర్పాటు చేసి దీని ద్వారా విరాళాలు సేకరించారు. సుమారు రూ.కోటితో కొత్తగా దేవాలయాన్ని నిర్మించడంలో తన వంతు పాత్ర పోషించారు. -
'సాక్షి టీవి ప్రోమో ఆలోచింప చేసేలాఉంది'
-
'ఆడపిల్ల పుడితే ఫీజు తీసుకోం'
పుణే: అతడో మంచి డాక్టర్. తన పరిధిలో మంచి పనులు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. లింగవివక్షను రూపుమాపేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన పేరు గణేశ్ రాఖ్. మహారాష్ట్రలోని పుణేలో హదాప్సర్ ప్రాంతంలో ఆయనకు ఆస్పత్రి ఉంది. ఇందులో కాన్పు చేసుకున్న మహిళలకు ఆడపిల్ల పుడితే ఆయన ఫీజు తీసుకోరు. సాధారణ ప్రసవానికి రూ.10 వేలు, సిజేరియన్ కు రూ.25 వేలు తీసుకుంటారు. కానీ ఆడపిల్ల పుట్టిన దంపతుల నుంచి రూపాయి కూడా తీసుకోరు. పాప పుడితే ఆస్పత్రి సిబ్బంది స్వీట్లు, కేసులు పంచుతారు. ఇప్పటివరకు ఆయన 432 మంది మహిళలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. 'ప్రసవ సమయంలో పుట్టేది బాబా, పాపా అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. అబ్బాయి పుడితే ఆనందపడతారు. అమ్మాయి పుడితే బాధపడతారు. అబ్బాయి పుడితే ప్రసవ బాధలను కూడా మర్చిపోయి మురిసిపోతారు. ఆడపిల్ల అయితే కన్నీరుమున్నీరవుతారు. ఇది నిజంగా బాధాకరం. లింగ వివక్షను రూపుమాపాలని నా వంతు ప్రయత్నంగా 2007 నుంచి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నా' అని డాక్టర్ గణేశ్ రాఖ్ తెలిపారు. ప్రజల ఆలోచనా విధానం మారాలని ఆయన అన్నారు. ఆడపిల్ల వద్దనుకునే తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఆయన ఆస్పత్రి వెబ్ సైట్ ద్వారా కూడా ఆడపిల్ల రక్షణ కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. -
ఆడపిల్లను.. చంపేస్తున్నారు!
విజయవాడ : ఆడపిల్ల పుట్టిందంటే ఆ ఇంట లక్ష్మీదేవి పుట్టిందని.. ఆడపిల్ల ఇంట్లో తిరుగుతుంటే లక్ష్మీకళ ఉట్టిపడుతుందని పెద్దలు చెబుతారు. నేడు ఆ పరిస్థితులు మారిపోతున్నాయి. ఆడపిల్ల అంటే బతకనిచ్చే పరిస్థితులే కనిపించడం లేదు. కొందరు పేగుబంధాన్ని తెంచుకుని చెత్తకుప్పల పాలు చేస్తుంటే.. మరికొందరు గర్భంలో ఉండగానే చిదిమేస్తున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆడపిల్ల పుట్టి ప్రపంచాన్ని చూడటమే గగనంగా మారుతోంది. జిల్లాలో ఆరేళ్లలోపు బాలిబాలికల నిష్పత్తి కూడా ఆందోళనకరంగానే ఉంది. ప్రతి వెయ్యి మంది బాలురకు 935 మంది బాలికలు ఉండటం గమనార్హం. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సేవ్ గర్ల్ చైల్డ్ అంటూ ఎంత ప్రచారం నిర్వహించినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. ఇటీవల వెలుగుచూసిన దారుణాలివీ... నెల రోజుల కిందట వేకున జామున వర్షపు జల్లులు కురుస్తున్న వేళ విజయవాడ రాణీగారితోటలో ఓ కన్నతల్లి పేగుబంధాన్ని తెంచుకుని తన బిడ్డను చెత్తకుప్పలో వేసింది. ఆ శిశువు ఏడుపు విన్న పారిశుధ్య కార్మికులు అక్కడికి చేరుకొని ఆ బిడ్డను కాపాడారు. అనంతరం శిశువును చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి రెండు రోజుల చికిత్స అనంతరం శిశు భవన్కు తరలించారు. ఆ బిడ్డ ఆడపిల్ల. ►పది రోజుల కిందట గూడూరు మండలానికి చెందిన దుర్గాదేవికి ఆమె భర్త, అత్తింటి వారు ఆరో నెల గర్భంతో ఉండగా గర్భనిర్ధారణ పరీక్షలు చేయించారు. గర్భంలో ఉన్నది ఆడపిల్లని తెలియడంతో గర్భస్రావం చేయించారు. ఈ ఘటనలో దుర్గాదేవికి ప్రాణాపాయ స్థితి ఏర్పడింది. మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించగా, భ్రూణహత్య చేసిన విషయం వెల్లడైంది. ►తాజాగా బుధవారం వేకువ జామున రెండు గంటలకు కడుపు నొప్పి వస్తోందంటూ ప్రభుత్వాస్పత్రి అత్యవసర చికిత్సా విభాగానికి వచ్చిన దుర్గ (30) అనే మహిళ టాయిలెట్కు వెళ్లి గుట్టుచప్పుడు కాకుండా ప్రసవించడంతో పాటు, పుట్టిన బిడ్డను కమోట్లో కుక్కి, ఎవరికీ తెలియకుండా అదృశ్యమైంది. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో టాయిలెట్ బ్లాక్ అయిందని శానిటరీ సిబ్బంది చూడగా, లోపలి నుంచి శిశువు రావడంతో కంగుతిన్నారు. గత నెల రోజుల కాలంలోనే జిల్లాలో మూడు వరుస దారుణాలు చోటుచేసుకోవడం చూస్తుంటే.. వెలుగు చూడని ఘటనలు ఇంకెన్నో అని జనంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో అధికారులు అప్రమత్తం కాకుంటే రానున్న కాలంలో ఆడపిల్ల పుట్టడమే కష్టతరంగా మారే పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంటున్నారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపై విస్తృత ప్రచారం చేయడంపై ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు దృష్టిపెట్టాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మరోసారి ఈ తరహా దారుణాలకు ఆస్కారం లేకుండా అడ్డుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం ఆడపిల్లల్ని పుట్టిన వెంటనే చంపేసినట్లు నిర్ధారణ అయితే అందుకు కారణం తెలుసుకుని చర్యలు తీసుకుంటాం. భ్రూణ హత్యలను ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. లింగనిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. - డాక్టర్ ఆర్.నాగమల్లేశ్వరి, జిల్లావైద్య ఆరోగ్య శాఖాధికారి -
‘నాటా’ కృషి శ్లాఘనీయం
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛందంగా సామాజిక సేవ చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) కృషి శ్లాఘనీయమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి కొనియాడారు. సామాజిక సేవ చేసేందుకు మరిన్ని సంస్థలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి 29 వరకు నాటా ఆధ్వర్యంలో జరిగిన వివిధ సేవా కార్యక్రమాల ముగింపు సభ ఆదివారం ఇక్కడ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జస్టిస్ సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, అమెరికాలో క్షణం తీరిక లేకుండా గడిపే తెలుగువారు పుట్టిన గడ్డపై మమకారంతో పలు సామాజిక సేవలు చేయడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వాలే అన్నీ చేయలేవని, స్వచ్ఛంద సంస్థలు కూడా సామాజిక సేవలో ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంక టరమణారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అనివార్యమని, అయినప్పటికీ తెలుగువారు రెండు రాష్ట్రాల్లోనూ కలసిమెలసి ఉంటారన్నారు. ప్రముఖ వ్యాపార వేత్త సజ్జల దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, ‘సహీ’ సంస్థ పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తోందన్నారు. చెవిటి పిల్లల సహాయానికి, వారి ఆరోగ్యం బాగు కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల సంరక్షణ కోసం వైద్యపరీక్షలు, యంత్రాల పంపిణీ లాంటివి చేపడుతున్నామని తెలిపారు. 20 ఏళ్లుగా ఇంగ్లండ్లో ఉన్న తాను మాతృభూమిపై మమకారంతో ఇక్కడకు వచ్చి అధునాతన టెక్నాలజీతో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు మ్యాక్సి విజన్ గ్రూప్ అధినేత డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి తెలిపారు. నాటా సేవలు అభినందనీయమని సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. తెలుగు ప్రజల సేవే నాటా లక్ష్యమని నాటా అధ్యక్షుడు డాక్టర్ టి.సంజీవ రెడ్డి ఉద్ఘాటించారు. ఈ నెల 16 నుంచి చేపట్టిన కార్యక్రమాల్లో రూ.3.5 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. అనంతరం, రూ.70 లక్షల చెక్కును సజ్జల దివాకర్రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, రాంబాబులకు నాటా నిర్వాహకులు అందించారు. ఈ సందర్భంగా జస్టిస్ సుభాష్ రెడ్డి, డాక్టర్లు మల్లారెడ్డి, సంజీవ రెడ్డి చేతుల మీదుగా డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డికి నాటా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును, శేఖర్ కమ్ముల, ఎమ్మెల్సీ వి.నారాయణ రెడ్డిలకు నాటా ఎక్సలె న్సీ అవార్డులను ప్రదానం చేశారు. వ్యాపార వేత్త సజ్జల దివాకర్ రెడ్డి, నాటా అధ్యక్షుడు డాక్టర్ సంజీవ రెడ్డి తదితరులను సత్కరించారు. రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కాగా, నాటా సేవా డేస్ ముగింపు సందర్భంగా హైదరాబాద్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నిర్వహించిన ‘సేవ్ గర్ల్ చైల్డ్’ అవగాహన నడక కార్యక్రమంలో మంత్రి డీకే అరుణ పాల్గొన్నారు. గ్రామాల్లో ఇప్పటికీ బాలికల పట్ల వివక్ష కొనసాగుతోందని, దీనిని నిర్మూలించాలని అన్నారు. వైద్య రంగంపై నిర్వహించిన సదస్సులో ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్ మాట్లాడారు. -
ఆడపిల్లే భారమా?