breaking news
savalu
-
అయోధ్య భద్రత ఒక సవాలు: సీఆర్పీఎఫ్
అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆలయంలో భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన మౌలిక సదుపాయాల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా 27 ఎకరాల్లో అభివృద్ధి చేసిన క్యాంప్ను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జనరల్ సత్యపాల్ రావత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి పలు విషయాలు తెలియజేశారు. రామ మందిర నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుందని, అది ఇక్కడ పనిచేసే భద్రతా బలగాలకు సవాల్గా మారుతుందని సత్యపాల్ తెలిపారు. అయోధ్యలో పలు భద్రతా సంస్థలు పనిచేస్తున్నాయని, వీటిలోని సిబ్బంది మధ్య ఎంతో సమన్వయం ఉందన్నారు. భద్రతా పరంగా ఇక్కడ నూతన ఏర్పాట్లు జరుగుతున్నాయని, దీనిలో భాగంగా భద్రతకు ఉపయుక్తమయ్యే ఆధునిక పరికరాలు కూడా తీసుకురానున్నామన్నారు. అయోధ్యలో భద్రత గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సీఆర్పీఎఫ్ అన్నివేళలా, అన్ని పరిస్థితుల్లో సన్నద్ధంగా ఉంటుందన్నారు. ఇది కూడా చదవండి: మణిపూర్లో మళ్లీ హింస: నలుగురి అపహరణ, కాల్పుల్లో ఏడుగురికి గాయాలు! -
యథావిధిగా రెవెన్యూ సేవలు
డిజిటల్ కీ వెనక్కి తీసుకున్న తహసీల్దార్లు ఏసీబీ వలలో వీఆర్వో, వీఆర్ఏ విధుల్లో చేరిన కొద్దిసేపటికే పట్టుబడిన వైనం పట్టా పుస్తకం కోసం రూ.నాలుగువేలు లంచం ముకరంపుర : వెబ్ల్యాండ్లో నెలకొన్న సాంకేతిక సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెకు దిగిన తహసీల్దార్లు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఆర్డీవోకు ఇచ్చిన డిజిటల్ ‘కీ’ని వెనక్కి తీసుకున్నారు. శనివారం ఎప్పటిలాగే రెవెన్యూ సేవలను అందించారు. విద్యార్థులకు అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు, పహాణీలు, మీసేవకు అనుసంధానమైన తదితర సేవలన్నీ కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆందోళనను తాత్కాలికంగా విరమించామని తహసీల్దార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బైరం పద్మయ్య తెలిపారు. సమస్యల పరిష్కారంపై ఆగస్టు 3న సీసీఎల్ఏతో చర్చిస్తామన్నారు. సీబీఐ వలలో వీఆర్వో, వీఆర్ఏ ‘మేం మంచివాళ్లం.. ప్రజలకు నిస్వార్థ సేవలు అందస్తున్నం. అలాంటి మాపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు..’ అంటూ రెవెన్యూ అధికారులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి రోజైనా గడవకముందే ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ వీఆర్వో, వీఆర్ఏ అవినీతి నిరోధక అధికారులకు పట్టుబడడం చర్చనీయాంశమైంది. హుజూరాబాద్ మండలం కందుగుల వీఆర్ఏ రవీందర్, వీఆర్వో రాజేందర్ ఓ రైతుకు పట్టాదార్ పాస్పుస్తకం ఇచ్చేందుకు రూ.నాలుగు వేలు లంచం డిమాండ్ చేసి.. రైతు నుంచి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హుజూరాబాద్ వీఆర్వోగా పనిచేసిన ఓ ఉద్యోగిపై పోలీసులు చర్య తీసుకోవడాన్ని నిరసిస్తూ వీఆర్వోల సంఘం ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తిరిగి అదే హుజూరాబాద్లో రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడడం ఆ శాఖ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు. రెవెన్యూశాఖ పరువు నిలబెట్టేలా సిబ్బంది వ్యవహరించాలని, లంచాలు తీసుకోవద్దని పేర్కొంటూ తహశీల్దార్ల సంఘం, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బాధ్యులు వీఆర్వోలకు జిల్లాకేంద్రంలో శుక్రవారం హితోపదేశం చేశారు కూడా. కానీ.. అధికారుల మాటలను ఓ చెవితో విని మరో చెవితో విడిచిపెట్టి మరీ లంచం తీసుకోవడం రెవెన్యూ తీరును బజారుకీడ్చినట్లయ్యింది. ఎప్పటిలాగే రెవెన్యూపై ఉన్న అవినీతి మచ్చ.. మాయని మచ్చలాగే మిగిలింది.