-
‘మూన్ కింగ్’గా మళ్లీ శని గ్రహం.. 83 నుంచి 145కు చంద్రుల సంఖ్య
బ్రిటిష్ కొలంబియా: సౌర కుటుంబంలో అత్యధికంగా చంద్రులు పరిభ్రమిస్తున్న శని గ్రహం ‘మూన్ కింగ్’ కిరీటాన్ని తిరిగి చేజిక్కించుకుంది. ఈ గ్రహం చుట్టూ మరో 62 చంద్రులు పరిభ్రమిస్తున్నట్లు తాజాగా ఖగోళ పరిశోధకులు గుర్తించారు. దీంతో, శని చుట్టూ తిరుగుతున్న చంద్రుల సంఖ్య 83 నుంచి 145కు చేరుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా గుర్తించిన 12 చంద్రులతో కలిపి అత్యధికంగా 95 చంద్రులతో అగ్రభాగాన నిలిచిన గురుగ్రహం మూన్కింగ్గా కొనసాగుతోంది. అయితే, అకాడెమియా సినికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్కు చెందిన ఎడ్వర్డ్ ఏస్టన్ మరో 62 చంద్రులు శని గ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు గుర్తించారు. హవాయిలోని మౌనాకియాపై ఏర్పాటు చేసిన టెలీస్కోప్లో 2019–21 మధ్య నమోదైన డేటా ఆధారంగా సాగిస్తున్న పరిశోధనల్లో ఈ విషయం తేలిందన్నారు. సౌర కుటుంబంలో అత్యధిక చంద్రులతో ‘మూన్కింగ్’కిరీటాన్ని శని దక్కించుకున్నట్లయిందని ఆయన తెలిపారు. -
టైటాన్ సముద్రం లోతు ఎంతో తెలుసా?
శని గ్రహానికి ఉన్న 82 ఉపగ్రహాల్లో టైటాన్ ఉపగ్రహానికి పలు ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా దీనిపై వాతావరణం భూమి తొలినాళ్ల వాతావరణాన్ని గుర్తు చేస్తుంది. భవిష్యత్లో జీవ ఆవిర్భావానికి ఈ గ్రహంపై అనుకూలతలు ఎక్కువని శాస్త్రవేత్తలు అంచనా వేస్తుంటారు. జీవావిర్భివానికి సంబంధించిన అవకాశాల గురించి టైటాన్పై అతిపెద్ద సముద్రం క్రాకెన్ మారెపై సైంటిస్టులు పరిశోధన జరుపుతున్నారు. తాజాగా ఈ పరిశోధనల్లో ఈ సముద్ర కేంద్రం వద్ద వెయ్యి అడుగుల లోతు ఉంటుందని తేలింది. ఇంతవరకు దీని లోతు 300 అడుగులేనని భావించారు. దీంతో సముద్రం లోపలకి రోబోటిక్ సబ్మెరైన్ పంపి ప్రయోగాలు చేయవచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. టైటాన్ ఉత్తర ధృవం వద్ద ఉన్న ఈ సముద్ర విస్తీర్ణం దాదాపు 1.54 లక్షల చదరపు మైళ్లు. భూమిపై ఉన్న కాస్పియన్ సముద్రం కన్నా ఇది పెద్దది. ఇందులో ద్రవరూపం లో ఉండే ఈథేన్, మీథేన్ ఇతర హైడ్రోకార్బన్లున్నాయి. ఇవన్నీ జీవి పుట్టుకకు మూలపదార్ధాలుగా ఉపయోగపడేవి కావడం గమనార్హం. తాజా పరిశోధనతో సముద్రం లోతు తెలిసిందని, టైటాన్పై భూమి తొలినాళ్లలో ఉన్న వాతావరణం ఉందని సీసీఏపీఎస్ సంస్థ తెలిపింది. 1997లో నాసా పంపిన కసిని స్పేస్ ప్రోబ్ టైటాన్పై ఈ సముద్రాన్ని గుర్తించింది. 2008లో ఈ సముద్రానికి క్రాకెన్ మారె అని పేరుపెట్టారు. ఈ సముద్రం మధ్యలో మైడా ఇన్సులా అనే ద్వీపం కూడా ఉంది. ఈ సముద్రం లోతు తెలియడంతో ఈ దఫా పరిశోధనల్లో సముద్ర అంతర్భాగంలో తిరిగే విధంగా ఒక జలాంతర్గామిని పంపేందుకు సైంటిస్టులు యోచిస్తున్నారు. -
400 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ అద్భుతం..
న్యూయార్క్ : సోమవారం(రేపు) ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రెండు పెద్ద గ్రహాలైన శని, బృహస్పతిలు చాలా దగ్గరగా, ఒకే వరుసలోనికి రానున్నాయి. దీన్నే ‘క్రిస్మస్ స్టార్’ అని పిలుస్తారు. ఇది అత్యంత అరుదుగా జరిగే సంఘటన. ఇక మళ్లీ 60 ఏళ్ల తర్వాతే ఇది జరుగుంది. అంటే 2080లో శని, బృహస్పతిలు చాలా దగ్గరగా, ఒకే వరుసలోకి వస్తారన్న మాట. ఇలాంటి ఘట్టం దాదాపు 400 ఏళ్ల తర్వాత చోటుచేసుకోబోతోందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శని, బృహస్పతి దగ్గరగా, ఒకే వరుసలోకి వచ్చే సంఘటన రాత్రి పూట జరిగి దాదాపు 800 ఏళ్లు అయిందని పేర్కొన్నారు. గెలీలియో టెలీస్కోప్ను కనిపెట్టిన 13 ఏళ్ల తర్వాత 1623లో ‘క్రిస్మస్ స్టార్’ ఆవిష్కృతం అయిందని అంటున్నారు. -
రెండో ప్రపంచ యుద్ధం నాటి మొసలి..
-
హిట్లర్ పెంచుకున్న మొసలి ఇదేనా?
మాస్కో: రెండో ప్రపంచ యుద్ధం నుంచి బయటపడిన 84 ఏళ్ల మొసలి శుక్రవారం ఉదయం మరణించింది. ఈ మేరకు జూ అధికారులు ట్విటర్ వేదికగా సాటర్న్(మొసలి) మరణాన్ని వెల్లడించారు. గౌరవించే వయసులోనే చనిపోయిందని పేర్కొన్నారు. కాగా సాటర్న్ యునైటెడ్ స్టేట్స్లో జన్మించింది. 1936లో దీన్ని జర్మనీలోని బెర్లిన్ జూకు బహుమానంగా ఇచ్చారు. ఇక రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనన మయంలో జర్మనీపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఈ క్రమంలో బెర్లిన్ జూపైనా బాంబు దాడులు జరిగాయి. (ఎలుక పెయింటింగ్కు ఎంత డిమాండో..) ఎన్నో జీవులు బాంబు ధాటికి నేలకొరిగినప్పటికీ ఈ మొసలి మాత్రం చాకచక్యంగా తప్పించుకోగలిగింది. సుమారు మూడేళ్ల తరువాత బ్రిటీష్ సైన్యానికి కనిపించింది. దీంతో దాన్ని బ్రిటన్ తన మిత్రదేశమైన రష్యాకు బహుమానంగా అందించింది. అలా అది చివరికి మాస్కో జూకు చేరింది. అక్కడే 74 ఏళ్లు జీవించింది. అది చనిపోవడంతో జూ సిబ్బంది భావోద్వేగానికి లోనయ్యారు. సాటర్న్ను తమ చిన్ననాటి నుంచి చూస్తూ వచ్చామని దాని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కాగా ఇది నాజీల నాయకుడు అడాల్ఫ్ హిట్లర్కు చెందిన మొసలిగా ప్రాచుర్యం పొందినప్పటికీ అవన్నీ వుట్టి పుకార్లేనని జూ అధికారులు స్పష్టం చేశారు. (మొసలి నోట్లో తల పెట్టింది..)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement