-
పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు తీపికబురు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ను తప్పనిసరి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఫిబ్రవరి 15 అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్ లేకుండా ఏ జాతీయ లేదా రాష్ట్ర రహదారిపై వాహనాలను అనుమతించడం లేదు. ఒకవేళ ఫాస్టాగ్ లేకుండా ప్రయాణించాల్సి వస్తే టోల్ ప్లాజా వద్ద రెట్టింపు జరిమానా వసూలు చేస్తున్నారని వాహనదారులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో వాహనదారుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఫాస్టాగ్ లేని కారణంగా రెట్టింపు టోల్ ఫీజు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులలో వాహనదారులు పేర్కొన్నారు. ఫాస్టాగ్ లేని వారి భాద ఈ విదంగా ఉంటే, ఫాస్టాగ్ తీసుకున్న వారి భాద మరో విదంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం పలు బ్యాంకులు, మొబైల్ యాప్ల నుంచి ఫాస్టాగ్ కొనుగోలుచేయడానికి అవకాశం కల్పించింది. ఫాస్టాగ్ తీసుకున్నవారు టోల్ గేట్ దాటుతున్న సమయంలో ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖాతా నుంచి కట్ అయ్యినట్లు పిర్యాదు చేస్తున్నారు. ఇందులో పేటీఎం నుంచి ఫాస్టాగ్ తీసుకున్న వారు కూడా ఉన్నారు. పేటీఎం తన ఫాస్టాగ్ యూజర్లకు శుభవార్త తెలిపింది. మీ ఫాస్టాగ్ ఖాతా నుంచి అకారణంగా లేదా ఎక్కువ డబ్బు కట్ అయితే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాటిని తిరిగి చెల్లిస్తుంది అని పేర్కొంది. ఇప్పటికే 2.6 లక్షల (82 శాతం)కు పైగా వినియోగదారులకు కట్ అయిన నగదును వారికీ తిరిగి చెల్లించినట్లు పేర్కొంది. టోల్ ప్లాజాల నుంచి వస్తున్న ఫిర్యాదులు సహా ఇతరుల సమస్యల పరిష్కారం కోసం అన్ని విధాలుగా తమ వినియోగదారులకు సహాయం అందించేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సతీష్ గుప్తా తెలిపారు. చదవండి: క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు! ఫ్లిప్కార్ట్ లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ -
పరిహారం చెల్లించాలని ధర్నా
ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ వాటర్ప్రూఫ్ కార్మికులు ట్రేడర్స్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వివరాలు... నాగోలు జైపురికాలనీకి చెందిన అబ్బు నాగోలు చౌరస్తాలోని రాజరాజేశ్వరి ట్రేడర్స్ నిర్వాహకుడు సతీష్గుప్తా అబ్బును లాలాపేటలో నిర్వహించే బహుళ అంతస్తుల వద్దకు వాటర్ ప్రూఫింగ్ కోసం తీసుకెళ్లాడు. ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా పనులు చేయించాడు. పని చేస్తుండగా ప్రమాదవశాత్తు అబ్బు కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అబ్బును కాచిగూడలోని సాయికృష్ణ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన నిర్వాహకుడు సతీష్గుప్తాను నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ వాటర్ప్రూఫ్ అసోసియేషన్ సభ్యులు, ఎంఆర్పీఎస్ నాయకులు సోమవారం నాగోలులోని కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు చెర్కు ప్రశాంత్గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని నష్టపరిహారం చెల్లించాలని చెప్పడంతో త్వరలో పరిహారం చెల్లిస్తానని నిర్వాహకుడు ఒప్పుకున్నాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement