breaking news
Sara sale
-
సారా రక్కసిపై గ్రామస్తుల ఉక్కుపాదం: పోలీస్స్టేషన్ ముట్టడి
జయపురం: సారా తయారీ, విక్రయాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఒడిశాలోని జయపురం జిల్లా కొట్పాడ్ పంచాయతీకి చెందిన మహిళలు అదే పంచాయతీలోని పోలీస్స్టేషన్ని శుక్రవారం ముట్టడించారు. అంతకుముందు వీరంతా అబ్కారీ కార్యాలయానికి వెళ్లి, ఆందోళన చేసేందుకు ప్రయత్రించగా అక్కడ కార్యాలయానికి తాళం వేసి ఉంది. దీంతో మళ్లీ వారంతా అక్కడి నుంచి పోలీస్స్టేషన్కి చేరుకుని, నిరసన చేపట్టారు. చదవండి: Elephant Water Pumping Video: ఈ ఏనుగు చాలా స్మార్ట్! తమ ప్రాంతాల్లో జోరుగా విదేశీ మద్యం, సారా ప్యాకెట్ల విక్రయాలు సాగుతున్నాయని, దీంతో తమ కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ పంచాయతీలోని సారా దుకాణాలను బంద్ చేయకపోతే రాస్తారోకో చేపడతామని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రతీ గ్రామంలో సారా విక్రయాలు కొనసాగడంతో విద్యార్థులు కూడా తాగుడుకి బానిసలవుతున్నారని, తద్వారా వారి బంగారు భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని వాపోయారు. దీనిపై స్పందించిన కొట్పాడ్ పోలీస్ అధికారి సారా విక్రయాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన నిరసనకారులు ఇంటిబాట పట్టారు. కలెక్టర్కి సర్పంచ్ల వినతిపత్రం.. కొరాపుట్: బంధుగాం, నారాయణ పట్నం సమితుల్లో సారా బట్టీలు నిర్మించొద్దని 13 గ్రామ పంచాయతీల సర్పంచ్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విషయమై వీరంతా శుక్రవారం కలెక్టరేట్కి చేరుకుని, కలెక్టర్ పేరిట రాసిన వినతిపత్రాన్ని అక్కడి ఓ అధికారికి అందజేశారు. ప్రభుత్వం ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేసే సారాబట్టీలతో యువత, ఇంటి పెద్దలు తాగుడుకి బానిసవుతున్నారని, దీంతో ఇంట్లో వారి మధ్య సఖ్యత కొరవడుతోందన్నారు. దీంతో పాటు గ్రామాల్లో తాగుబోతుల గొడవలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమ ప్రాంతాల్లో సారాబట్టీల నిర్వహణ వద్దని కోరారు. చదవండి: అప్పటికి మూడో వేవ్ ముగుస్తుంది: సుప్రీంకోర్టు -
అంత్వార్లో సారాను నిషేధిస్తూ తీర్మానం
విక్రయిస్తే ఆందోళన చేస్తామంటూ మహిళల హెచ్చరిక నారాయణఖేడ్ : సారా విక్రయం లేదా తాగడం చేస్తే ఆందోళనలతో పాటు దాడులు చేస్తామని మండలంలోని అంత్వార్ గ్రామానికి చెందిన మహిళలు హెచ్చరించారు. గ్రామస్తులు పాటు ఖేడ్ ఎస్ఐ బాల్రెడ్డి సమక్షంలో శుక్రవారం గ్రామం లో సారా విక్రయాలు జరపరాదని, సారాను తాగరాదని తీర్మానం చేశారు. సారాను విక్రయిస్తే రూ. 5 వేలు, సారా సేవిస్తే రూ.2 వేల జరిమానా విధించాలని నిర్ణయించారు. అనంతరం తీర్మాన పత్రంలో గ్రామస్తుల సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ఎస్సీ కాలనీలో నలుగురు వ్యక్తులు సారాను విక్రయిస్తున్నారన్నారు. దీనికి కారణంగా ఎస్సీ కాలనీ ప్రజలు సారాకు బానిసై రోజూ భార్య బిడ్డలతో గొడ వలు పడుతున్నారని తెలిపారు. గ్రామంలో నాటుసారా విక్రయిస్తున ్నట్లు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. అంతకుముందు గ్రామంలో సారాను పారబోసి నిరసన తెలిపారు. మళ్లీ సారా విక్రయాలు ప్రారంభిస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళలు రాణమ్మ, దుర్గమ్మ, అనిత, జయశీల, కాంతమ్మ, స్వరూపరాణి, శక్కమ్మ, అనితమ్మ, రూథమ్మ, పీరమ్మ, శామమ్మ, పద్మమ్మ, గ్రామ ఎంపీటీసీ డేవిడ్, సర్పంచ్ నిజలింగప్ప, ఉప సర్పంచ్ లింగమ్మ, ఖేడ్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు ప్రసన్నకుమార్, గ్రామ పెద్దలు శంకర్రావు పాటిల్, శివరావ్, సాల్మన్, రాములు, వినోద్కుమార్, తదితరులు ఉన్నారు. సారాతో కాలనీలో శాంతి లేదు సారాతో మా కాలనీల్లో ప్రశాంతత లేదు. రోజూ ఎవరో ఒకరు సారా తాగి గొడవలకు పాల్పడుతున్నారు. సారా విక్రయాలు నిలిపివేయాలని గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో మహిళలంతా ఏకమై సారాను దూరం చేయాలని తీర్మానం చేశాం. - రాణమ్మ, అంత్వార్ గ్రామ మహిళ కుటుంబాల్లో సారా చిచ్చుపెడుతోంది సారా తాగడంతో కుటుంబాల్లో కలహాలు జరుగుతున్నాయి. సారా తాగిన వారు సైతం అనారోగ్యానికి గురవుతున్నారు. సారా విక్రయాలు లేకపోతే మా గ్రామంలో ఎలాంటి గొడవలు ఉండవనే ఉద్దేశంతో తీర్మానం చేసేందుకు ముందుకు వచ్చాం. మాకు అధికారులు సహకారం కావాలి. - దుర్గమ్మ, మహిళ, అంత్వార్