-
తల్లీబిడ్డల సజీవ దహనం: వీడిన మిస్టరీ
సాక్షి, ప్రకాశం: జిల్లాలోని మద్దిపాడు మండలం పేర్లమెట్ట- లింగంగుట్ల వద్ద తల్లీబిడ్డ హత్య కేసును ప్రకాశం పోలీసులు ఛేదించారు. భార్యపై అనుమానంతో వివాహిత భర్తే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గుర్తించారు. వివరాలు... ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్లమెట్ట శివారులో బురదతో ఉన్న డొంక దారిలో ఈ నెల మూడో తేదీ సాయంత్రం ఐదు గంటల సమయంలో ఓ మహిళ, ఏడాది వయసున్న బిడ్డ మంటల్లో తగులబడుతున్న దృశ్యాన్ని సమీపంలో ఉన్న కొందరు రైతులు చూశారు. ఆ సమాచారాన్ని గ్రామస్తులకు అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ రెండు మృతదేహాలూ దాదాపు కాలిపోయాయి. ఈ క్రమంలో ఘటన జరిగిన సమయంలో అటుగా వెళ్లిన కొందరిని పోలీసులు విచారించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న ఇద్దరు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తును వేగవంతం చేశారు. తాము ఆ బురద దారిలో వెళుతున్నప్పుడు ఓ యువకుడు, ఓ యువతి, ఓ చంటిబిడ్డతో మోటారు సైకిల్పై వస్తూ ఆగి కోపంతో వాదించుకుంటున్నారని ఆ స్వాములు పోలీసులకు తెలిపారు. ‘‘ఈ బురద దారిలో గొడవేమిటి? మీరెవరు?’’ అని తాము అడగగా.. తాము భార్యాభర్తలమని, అటుగా పనుండి వెళ్తున్నామని వారు చెప్పారని స్వాములు వివరించారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు.. యువతి భర్తే తల్లీబిడ్డలను సజీవ దహనం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని కోటేశ్వరరావుగా గుర్తించారు. అతడు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడని.. అతడిది అద్దంకి మండలం దామావారిపాలెం అని పేర్కొన్నారు. కోటేశ్వరరావు చేతులకు కాలిన గాయాల ఆధారంగా దర్యాప్తు చేయడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. భార్యపై అనుమానంతో అతడు భార్యాబిడ్డలను చంపేసినట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు వెల్లడించారు. -
బైక్ మీద బాలికను వెంటాడి...అఘాయిత్యం
సాక్షి, చీమకుర్తి: ముగ్గురు కలిసి బైకుపై ఓ బాలికపై వెంటపడ్డారు. వారి బైకు బాలిక సమీపానికి చేరుకోగానే నిందితుడికి సహకరించే వ్యూహంలో భాగంగా మిగిలిన ఇద్దరు వెళ్లిపోయారు. నిందితుడు మాయమాటలు చెప్పి బాలికను బైకుపై ఎక్కించుకున్నాడు. సంతనూతలపాడు జిల్లా పరిషత్ హైసూ్కల్ వెనుక ఉన్న పాత కొష్టాల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు 13 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి సంతనూతలపాడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన గురువారం రాత్రి 9 గంటల సమయంలో సంతనూతలపాడులో జరిగింది. నిందితుడిపై ఫోక్సా చట్టం, 376 యాక్ట్ (లైంగిక దాడి, అపహరణ) నేరం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. స్థానికంగా నివాసం ఉండే 7వ తరగతి చదువుతున్న బాలిక గురువారం రాత్రి 8 గంటల సమయంలో సంతనూతలపాడు గానుగపాలెంలోని తన స్నేహితురాలి వద్దకు పుస్తకాల కోసం వెళ్లి తిరిగి ఇంటికొస్తోంది. గమనించిన ముగ్గురు యువకులు బైకుపై బాలిక వెంటపడ్డారు. బాలిక వద్దకు చేరగానే బైకుపై ఉన్న ఇద్దరు దిగి వెళ్లిపోయారు. బైకుపై ఉన్న 23 ఏళ్ల యువకుడు మాయమాటలతో బాలికను బైకుపై ఎక్కించుకున్నాడు. సమీపంలో నున్న సంతనూతలపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ వెనుక భాగంలో పొదలు, పాత కొష్టం ఉంటే దానిలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఇంటికి వెళ్లి గుర్తు తెలియని వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు తల్లిదండ్రులకు చెప్పుకుని కన్నీటిపర్యంతమైంది. రాత్రి 10 గంటల సమయంలో బాలిక, తల్లిదండ్రులు కలిసి పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల కోసం రిమ్స్కు తరలించారు. శుక్రవారం విషయం తెలుసుకున్న డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్, సీఐ పి.సుబ్బారావు, చీమకుర్తి టౌన్ ఎస్ఐ షేక్ రజియా సుల్తానాబేగం సంతనూతలపాడు పోలీసుస్టేషన్కు వెళ్లారు. ఘటన జరిగిన హైసూ్కల్ వెనుక ప్రాంతాన్ని డీఎస్పీతో పాటు ఇతర పోలీస్ అధికారులు పరిశీలించారు. వారితో పాటు సంతనూతలపాడు నియోజకవర్గంలోని జియో సిబ్బంది వచ్చి లైంగిక దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఇంతలో బాలిక ఫిర్యాదు చేసిన అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. దీనిపై డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్నామని,పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. -
కొందరివాడు బీఎన్.. అందరివాడు టీజేఆర్
సాక్షి, చీమకుర్తి (ప్రకాశం): సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన వైఎస్సార్కాంగ్రెస్పార్టీ తరపున టీజేఆర్ సుధాకర్బాబు, టీడీపీ తరపున బీఎన్.విజయ్కుమార్ ప్రధానంగా పోటీపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇరుపార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీకి గత ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి గణాంకాలను పరిశీలించినట్లయితే సంతనూతలపాడు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్నట్లు విధితమవుతుంది. నామినేషన్లను వేసినప్పటి నుంచి నియోజకవర్గంలోని చీమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం అనంతరం వైఎస్సార్సీపీ వైపే గాలివాటం ఉన్నట్లు విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఇరుపార్టీలు, అభ్యర్థుల బలాబలాలను అంచాని వేసినట్లయితే ఈవిధంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. సమస్యల మీద అలుపెరుగని పోరాటం .. ♦ కొత్తగా పోటీచేస్తుండటం వలన నియోజకవర్గంలో ఎలాంటి వ్యతిరేక ఓటు ప్రభావం లేకపోవడం కలిసొచ్చే అంశం. ♦ 9 సంవత్సరాల నుంచి ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలనే జనాభిప్రాయం అభ్యర్థికి బలాన్నిస్తుంది. ♦ జగన్ మోహన్రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో అన్ని రకాల ప్రజల మనోభావాలకు దగ్గరగా ఉండటం కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ♦ నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో ఎలాంటి అసమ్మతి వర్గాలు లేకపోవడం శుభపరిణామం ♦ టిక్కెట్టు ఖరారు కాకుముందే సమన్వయకర్తగా ఏడాదికి పైగా నియోజకవర్గంలో తిరుగుతూ గ్రామాల్లో పట్టు సాధించటం అనుకూలం. ♦ సుధాకర్బాబు వాగ్దాటి కలిగిన ప్రసంగాలతో ఓటర్లను ఆకర్షించటం. ♦ నియోజకవర్గంలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న బూచేపల్లి కుటుంబం అండదండలు సుధాకర్బాబుకు పుష్కలంగా లభించటం మరో ప్రధాన బలంగా చెప్పవచ్చు ♦ నాలుగు మండలాల కన్వీనర్లు, ప్రధాన నాయకులతో పాటు గ్రామస్థాయి నాయకులతో చొరవగా కలుపుగోలుగా కలిసిపోవడం మరింత బలం. ♦ స్థానిక సమస్యలను ఎక్కువుగా ప్రజలలోకి తీసుకుపోయేందుకు తగిన సమయం లేకపోవడం ప్రతికూలతలుగా చెప్పుకోవచ్చు. వ్యతిరేక వర్గంతో ఉక్కిరిబిక్కిరి.. ♦ నియోజకవర్గంలో పదేళ్ల నుంచి పనిచేస్తున్నందున దానికి సంబంధించిన అనుభవం ఉపయోగపడే అవకాశం ఉంది ♦ ఎస్సీ, బీసీలను ఆకట్టుకున్నా ఓసీ సామాజికవర్గంలో వ్యతిరేకత ఉంది. ♦ ఐదేళ్ల పాటు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ప్రభావం అభ్యర్థిపై చూపడం ప్రతికూలాంశం. ♦ ఆది నుంచి అసమ్మతి నాయకుల తారస్థాయి వ్యతిరేక ప్రచారం అభ్యర్థికి ఇబ్బందికరంగా మారటం. ♦ కలిసిపోయినట్లు నటిస్తున్న అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉండి వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం. ♦ పదేళ్ల క్రితం ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉపయోగపడినా ఐదేళ్ల క్రితం నుంచి ఇన్చార్జిగా పనిచేసినా అధికార పార్టీలోనే వ్యతిరేక పవనాలు ఆందోళన కలిగించే అంశం. -
సంతనుతలపాడు ఎన్నికల ప్రచార సభలో వైఎస్ జగన్
-
‘అమరావతి పేరుతో అమరేశ్వరుని భూములు కొల్లగొట్టారు’
సాక్షి, ప్రకాశం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పేరుతో అమరేశ్వర స్వామి భూములు కొల్లగొట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. చంద్రబాబును రాజధాని గురించి అడిగితే గ్రాఫిక్స్ పేరుతో భ్రమలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని అంటే సినిమా చూపెడతారు, కట్టు కథలు చెబుతారని విమర్శించారు. రాజధాని పేరుతో నలభై దేవాలయాలు కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా సంతనుతలపాడులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకువచ్చిన ఆయన.. తన కోసం ఎండను కూడా లెక్క చేయకుండా వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు రైతలును పట్టించుకున్న పాపాన పోలేదు.. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ నియోజకవర్గంలో సాగునీరుకే కాకుండా తాగునీరుకు ఇబ్బందే. గతంలో ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి పట్టించుకుని విధంగా ఈ నియోజకవర్గానికి సాగునీరు, తాగునీరు అందించేందుకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రామతీర్థం, గుండ్లకమ్మ ప్రాజెక్టులను తెచ్చారు. కనీసం సాగర్ నుంచి నీరు ఇప్పించుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందంటే ఇంతకంటే అన్యాయమైన పాలన ఉంటుందా?. వెలిగొండ ప్రాజెక్టు కింద పంట కాల్వలు కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. ఇవన్నీ చూస్తుంటే ఈ జిల్లా మీద, ప్రజల మీద చంద్రబాబుకు ఉన్న ప్రేమ ఏ పాటిదో తెలుస్తుంది. ఈ ఐదేళ్లలో పొగాకు రైతులు పెట్టుబడులు రాక, బతుకు కష్టమై ఆత్మహత్యలు చేసుకున్నారు. రమణారెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు. పరిహారం కోసం పోరాటం చేస్తే కేసులు పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిది. జగన్ అనే వ్యక్తి వచ్చి పోరాటం చేస్తే తప్ప పొగాకుకు కనీస పెట్టుబడి ధర పెరగలేదు. కంది రైతులకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేదు. వైఎస్సార్ హయంలో సుబాబుల్ కనీస ధర 4వేల రూపాయలు పలికితే నేడు కనీసం 2500 రూపాయలు కూడా పలకడం లేదు. శనగ రైతలకు కూడా కనీస ధర లేకుండా పోయింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఒక్కరోజు కూడా రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా? ఇదే నియోజకవర్గంలో చీమకుర్తి గుండా నా పాదయాత్ర సాగింది. చీమకుర్తిలో క్వారీలు, పాలిషింగ్ యూనిట్లు మూతపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నాలుగైదు వందల పాలిషింగ్ యూనిట్లు మూతపడిన పరిస్థితి నెలకొంది. పరిస్థితులు ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం 20లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి.. 40లక్షల ఉద్యోగాలు వచ్చాయని గొప్పలు చెబుతున్నారు. ఉద్యోగాలు దొరక్క యువత బాధపడుతుంటే.. పరిశ్రమలు మూతపడుతుంటే చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా?. పెద్ద సైజు గ్రానైటు రాయల్టీ రూ. 1980 ఉంటే 5వేల రూపాయలు చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. రైతుల అప్పులు లక్షా 50 వేల కోట్లకు చేరాయి. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయరు. చంద్రబాబు హయంలో కరెంట్ చార్జీలు పెరిగి పరిశ్రమలు మూతపడుతున్నాయి. బాబు వచ్చాడు ఉన్న జాబులన్నీ ఉడగొడుతు పోతున్నారు. నిరుద్యోగ భృతి రెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు ప్రతి నిరుద్యోగికి లక్షా 20వేల రూపాయలు ఎగ్గొట్టారు. డ్వాక్రా రుణాలు భారం వడ్డీలతో కలిపి 26వేల కోట్లకు పెరిగింది. పొదుపు సంఘాల అక్కాచెల్లమ్మలకు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే పద్దతి లేకుండా పోయింది. పక్క రాష్ట్రాల్లో చికిత్స చేయించుకున బిల్లులు ఇవ్వరు.. ఎన్నికలకు ముందు మహిళ భద్రత అని చెప్పిన చంద్రబాబు.. మహిళ ఎమ్మార్వోను జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్లిన, విజయవాడలో కాల్ మనీ రాకెట్టు యథేచ్ఛగా జరిగిన ఆయన చర్యలు తీసుకోరు. బీసీ పిల్లలు కనీసం ఫీజు రీయింర్స్మెంట్ కూడా అందక అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో గవర్నమెంట్ బడులు తగ్గిపోయాయి.. మద్యం షాపులు పెరిగిపోయాయి. నారాయణ స్కూళ్లలో ఫీజులు గుంజడానికి 6 వేల స్కూళ్లను మూసివేశారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసిన బెల్ట్ షాపులే కనబడుతున్నాయి. పోలీసు స్టేషన్లు పెరగకపోయినా.. ప్రతి గ్రామంలో జన్మభూమి కమిటీల మాఫియా మాత్రం పెరిగిపోతుంది. బాబు ప్రత్యేక విమానంలో తిరగుతారు.. కానీ 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. మంత్రి యనమల రామకృష్ణుడు పంటి నొప్పి వస్తే విదేశాల్లో చికిత్స చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పేదవారు పక్క రాష్ట్రంలో చికిత్స చేసుకుంటే బిల్లులు ఆపేస్తారు. చంద్రబాబు హయంలో ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్నులు, పెట్రోలు ఇలా అన్ని రెట్లు పెరిగిపోయాయి. ఢిల్లీ నాయకులను వెంట తీసుకుని వస్తున్నారు.. రాజధాని గురించి అడిగితే రోజుకో డ్రామా చూపెడతారు. గ్రాఫిక్స్ పేరుతో భ్రమలు కల్పిస్తారు. రాజధానిలో నలభై దేవాలయాలను కూలగొట్టారు. రియల్ ఎస్టేట్ కోసం రాజధాని ఉపయోగించుకుంటున్నారు. లక్షల కోట్లతో లోకేశ్ స్థిరీకరణ నిధి తీసుకొచ్చారు. ప్రతిపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు.. నేడు ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఒంటరిగా ప్రచారానికి వెళ్లలేక ఢిల్లీ నుంచి నాయకులను వెంట తీసకుపోయే పరిస్థితి నెలకొంది. 600 వాగ్ధానాలు చేసిన చంద్రబాబు.. వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు మీ భవిష్యత్తు నా భరోసా అంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది చంద్రబాబు చేయని మోసం, చెప్పని అబద్దం ఉండదు. రానున్న రోజుల్లో ఈ కుట్రలు ఇంకా పెరుగుతాయి. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం.. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి. ఇరవై రోజులు ఓపిక పట్టమని చెప్పండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. గతంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇప్పుడు అది కనిపించని పరిస్థితి. ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మీ చేతికే అందిస్తాం. అంతేకాకుండా మళ్లీ బ్యాంకుల వద్ద నుంచి సున్నా వడ్డీకే రుణాలు వస్తాయని చెప్పండి. మహిళలను లక్షాధికారులను చేయాలనే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. పసుపు కంకుమ డ్రామాకు మోసపోవద్దని ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. రైతలకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా.. గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ కూడా ఇస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్ని, ఎంపీ అభ్యర్థి సురేశ్ని ఆశీర్వదించమ’ని కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement