breaking news
Sangamitra express
-
సంఘమిత్ర ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
డోర్నకల్ (వరంగల్జిల్లా): సంఘమిత్ర ఎక్స్ప్రెస్ను దొంగలు బీభత్సం సృష్టించారు. ఎక్స్ప్రెస్ రైలును ఆపి అందులో ఉన్న ప్రయాణికులను బెదిరించి వారి వద్ద నుంచి బంగారం లాక్కెళ్లారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారు జామున వరంగల్జిల్లా గుండ్రాతిమడుగు వద్ద జరిగింది. పదిమంది గుర్తు తెలియని దుండగలు యస్వంత్పూర్-పాట్నా వెళుతున్న సంఘమిత్రా ఎక్స్ప్రెస్ రైల్ను డోర్నకల్-మహబూబాబాద్ స్టేషన్ల మధ్య అలారం చైన్ లాగి ఆపారు. రైళ్లు ప్రయాణిస్తున్న ప్రయాణికుల నుంచి భారీగా బంగారం లాక్కెళ్లారు.ఈ దోపిడీ ఎస్2, ఎస్ 12 బోగిల్లో జరిగింది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నిలిచిపోయిన సంఘమిత్ర ఎక్స్ప్రెస్
దొరవారిసత్రం(నెల్లూరు): పాట్నా నుంచి బెంగళూరు వెళ్లే.. సంఘమిత్ర ఎక్స్ప్రెస్ నెల్లూరు జిల్లా దొరవారిసత్రం రైల్వేస్టేషన్లో ఆగిపోయింది. దొరవారిసత్రం, పోలీరెడ్డిపాలెం గ్రామాల మధ్య అప్లైన్ మార్చుతుండటంతో.. ఈ అసౌకర్యం కలిగినట్టు స్టేషన్ మాస్టర్ తెలిపారు. రైలు రెండుగంటలకు పైగా నిలిచిపోవడంతో.. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.