breaking news
sanga reddy court
-
సంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు..
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మైనర్ బాలికపై హత్యాచారం కేసులో దోషికి జిల్లా కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. నిందితుడు చేసిన నేరం తీవ్రమైనదిగా పరిగణించి ఊరి శిక్షను ఖరారు చేసింది.కాగా, బీహార్కు చెందిన గఫార్ అలీ.. ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబుతుందనే కారణంగా కూల్ డ్రింక్లో మద్యం కలిపి తాగించి ఆమెను హత్యచేశాడు. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో గఫార్ అలీని దోషిగా నిర్ధారించింది. బాలికపై హత్యాచారం తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ సంగారెడ్డి కోర్టు అతడికి ఉరిశిక్ష విధించింది. ఇక, ఈ ఘటన జరిగిన 11 నెలలు అవుతోంది. తక్కువ సమయంలోనే దోషికి ఉరిశిక్ష పడటంతో బాలిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు.. సంగారెడ్డి జిల్లాలో 27 ఏళ్ల తర్వాత మరణ శిక్ష విధించారు. ఇది కూడా చదవండి: స్థానికత రిజర్వేషన్: సుప్రీంకు తెలంగాణ సర్కార్ -
సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. చిన్నారి మృతి
సంగారెడ్డి(మెదక్ జిల్లా): సంగారెడ్డి కోర్టు వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని తప్పించబోయి బైక్ డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తోన్న రిన్షా అనే ఏడాదిన్నర వయస్సు ఉన్న చిన్నారి అక్కడికక్కడే మృతిచెందగా..మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.