breaking news
sakinaka police station
-
మనిషే కాదు వీడు.. వింటే వెన్నులో వణుకుపుట్టడం ఖాయం
Sakinaka Case: వావీవరుసలు లేని మానవ మృగం.. ఒంటరి మహిళపై అఘాయిత్యానికి తెగపడింది. అంతటితో ఆగలేదు.. పైశాచికత్వం ప్రదర్శించింది. వదిలేయమని బాధితురాలు బతిమాలినా వినలేదు. ఫలితం.. ప్రాణం కోసం పోరాడి కన్నుమూసింది. సంచలనం సృష్టించిన సాకినక ‘నిర్భయ’ కేసులో దోషికి మరణ శిక్ష ఖరారైంది. బాధిత కుటుంబం, న్యాయం కోసం తొమ్మిది నెలలపాటు పోరాడిన వాళ్ల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన.. సాకినక(ముంబై, అంధేరీ) అత్యాచారం, హత్య కేసులో దోషి మోహన్ కథ్వారు చౌహాన్ .. దిన్దోషి కోర్టు గురువారం మరణ శిక్ష ఖరారు చేసింది. ఇది అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించిన అదనపు సెషన్స్ జడ్జి హెస్.సి.షిండే.. ఇలాంటి సంఘటనల్లో దోషిపై కనికరం చూపాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పింది. స్వయానా నిందితుడి తండ్రే.. తన కొడుకును ఛీదరించుకున్నాడని, ఉరి తీయాలంటూ వ్యాఖ్యానించాడని, పైగా తన సోదరుడి కూతురిని అత్యాచారం చేస్తానని బెదిరించడం.. అతని స్వభావానికి అద్దం పడుతోందని, ఇంతకన్నా అతనికి మరణ శిక్ష విధించడానికి కారణాలు అక్కర్లదేని ఆయన అన్నారు. ‘‘ఇదొక భయానకం. బాధితురాలితో చౌహాన్ రాక్షసంగా ప్రవర్తించాడు. వీడు మనిషి కాదు.. కిరాతకుడు. అత్యాచారానికి పాల్పడ్డ తీరును తలచుకొంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ఇది అత్యంత అరుదైన కేసు కిందికి వస్తుంది’’ అని పేర్కొన్నారు. మరణ శిక్ష విధిస్తేనే సమాజంలోకి సరైన సందేశం వెళ్తుందన్నారు. మరణ శిక్షతో పాటు 32 వేల రూపాయల జరిమానా విధించారు జడ్జి. ఘోరంగా.. మోహన్ కథ్వారు చౌహాన్ (45).. యూపీకి చెందిన వ్యక్తి. అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఇంట్లోంచి గెంటేశారు. దీంతో భార్యాపిల్లలతో సహా ముంబై వచ్చి.. కూలీ పనులు చేసుకుంటున్నాడు. 2021 సెప్టెంబర్ 10న ముంబైలో నిలిపి ఉంచిన టెంపోలో.. 34 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై పదునైన వస్తువులతో ఆమె జనానాంగాలను గాయపరిచాడు. ఈ ఘోరంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలు.. చికిత్స పొందుతూ కన్నుమూసింది. మరో నిర్భయ ఘటనగా ఇది సంచలనం సృష్టించింది. బాధితురాలు దళితురాలు కావడంతో ఈ కేసు.. ప్రముఖంగా చర్చల్లో నిలిచింది. దీంతో ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక చొవర చూపించారు సీఎం ఉద్దవ్ థాక్రే. ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడు మోహన్ చౌహాన్. ఈ కేసులో చౌహాన్ తరపున వాదించేందుకు లాయర్లు ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వమే.. న్యాయవాదిని ఏర్పాటు చేసింది. అడ్వొకేట్ కల్పన వాస్కర్.. చౌహాన్ తరపున వాదనలు వినిపించారు. అతని ఆర్థిక స్థితి, భార్య అనారోగ్యం దృష్టిలో ఉంచుకుని శిక్షను ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. కానీ, కోర్టు ఆమె వాదనను తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే.. వాదనల సమయంలోనూ చౌహాన్ పదే పదే జోక్యం చేసుకోవడం న్యాయమూర్తిని చిరాకు తెప్పించింది. తాను అమాయకుడినని, మద్యం మత్తులో అలా జరిగిపోయిందని, పోలీసులు ఈ కేసులో పోలీసులు గోల్మాల్ చేశారంటూ మాట్లాడాడు. దీంతో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ ఫుటేజీ మీద ఏం స్పందిస్తావ్ అంటూ నిలదీశారు. పైగా సొంత అన్న కూతురిపైనే అఘాయిత్యం చేస్తానని మోహన్ బెదిరించడాన్ని ప్రస్తావించారు. మహిళలపట్ల ఏమాత్రం గౌరవం లేని మృగంగా అభివర్ణించింది చౌహాన్ను న్యాయస్థానం. -
ముంబైకి జాతీయ మహిళా కమిషన్ బృందం
ముంబై: ముంబైలో ఇటీవల ఓ మహిళపై పాశవికంగా హత్యాచారం చేసిన ఘటనకు సంబంధించిన వ్యవహారంపై కేంద్ర జాతీయ మహిళా కమిషన్ బృందం ముంబై చేరుకుంది. బాధితురాలి కుటుంబాన్ని కలసి పరామర్శించిందని పోలీసులు వెల్లడించారు. నగరంలోని సాకినాక ప్రాంతంలో నివాసముంటున్న బాధితురాలి కుటుంబాన్ని కలసి పరామర్శించి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం నగరంలోని రాజవాది ఆస్పత్రికి వెళ్లారు. బాధితురాలు మరణించే వరకు అక్కడే 36 గంటల పాటు ప్రాణాల కోసం పోరాడారు. అక్కడ వైద్యుల నుంచి పలు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం సాకినాక పోలీస్ స్టేషన్కు కూడా వెళ్లారు. కేసుకు సంబంధించిన పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ హత్యాచార కేసుకు సంబంధించి రాష్ట్ర డీజీపీ సంజయ్ పాండేని కలిసిందని అధికారులు వెల్లడించారు. ఆర్థిక రాజధానిలో జరిగిన ఈ ఘటన 2012లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక హత్యాచారంలాగే అత్యంత అమానవీయంగా జరిగిన సంగతి తెలిసిందే. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. -
పోలీస్ స్టేషన్లో మోడల్పై గ్యాంగ్ రేప్
-
పోలీస్ స్టేషన్లో మోడల్పై గ్యాంగ్ రేప్
రక్షక భటులే రాక్షసులుగా మారారు. కన్నూమిన్నూ కానకుకండా ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే ఓ మోడల్ పై అత్యాచారం జరిపి, రూ.4.5 లక్షల నగదు, నగలు దోచుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కీచకపర్వంలో ఒక మహిళా అధికారి సహా ఆరుగురు పోలీసులు గురువారం అరెస్టయ్యారు. తూర్పు ముంబై ప్రాంతంలోని సకినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 3న ఈ ఘటన జరిగింది. సినిమాలో చాన్స్ కోసం ఓ సార్ట్ హోటల్కు వెళ్లి తిరిగొస్తున్న 29 ఏళ్ల మోడల్ను సివిల్ దుస్తుల్లో ఉన్న ఏఎస్ ఐలు సూర్యవంశి, కతాపే, కానిస్టేబుల్ కొడే అటకాయించారు. తమతో రాకుంటే తప్పుడు కేసు బనాయిస్తామని బెదిరించి, బలవంతంగా జీప్ ఎక్కించుకున్నారు. ఏంఐడీసీ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి నాలుగో తేది ఉదయం వరకు సామూహిక అత్యాచారం జరిపారు. విడిపెట్టాలంటే డబ్బులివ్వాలని డిమాండ్ చేయడంతో ఆ మోడల్.. తన బాయ్ప్రెండ్కు ఫోన్ చేసి రూ. 4.5 లక్షలు తెప్పించి, పోలీసులకు ఇచ్చింది. ఒంటిమీద నగలు, ఉంగరాలు కూడా ఇచ్చేసింది. ఈ దోపిడీ పర్వంలో ఆ ముగ్గురు కీచకులకు మరో పోలీసు, ఓ మహిళ కూడా సహాయపడినట్లు తెలిసింది. ఈ దారుణం తర్వాత ప్రాణభయంతో దేశం విడిచివెళ్లిన మోడల్.. కుటుంబ సభ్యులు, స్నేహితులిచ్చిన ధైర్యంతో ఏప్రిల్ 22న ముంబై పోలీస్ కమిషర్ కు ఫిర్యాదుచేసింది. ఎస్సెమ్మెస్ రూపంలో తనపై .జరిగిన అకృత్యాన్ని గురించి ఫిర్యాదుచేసింది. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషనర్ రాకేశ్ మారియా.. నిదితుల్ని అరెస్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. అరెస్టు చేసిన ముగ్గురు పోలీసుల్ని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు.