breaking news
Sachin Siwatch
-
CWG 2026: భారత్కు 19వ పతకం ఖరారు
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ పతకాల వేటను విజయవంతంగా కొనసాగిస్తోంది. ఏడో రోజు భారతకాలమానం ప్రకారం రాత్రి 7 గంటల సమయానికి భారత్కు 19 పతకాలు ఖాయమయ్యాయి. బాక్సింగ్లో సచిన్ సివాచ్ సెమీఫైనల్కు చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేశాడు.పురుషుల 60 కేజీల విభాగం క్వార్టర్ఫైనల్లో సచిన్ సివాచ్ విజయం సాధించి సెమీస్కు అర్హత సాధించాడు. ఇవాళే మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి, 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి కూడా సెమీస్కు చేరి భారత్కు పతకాలను ఖాయం చేశారు.ఇంకా ముగ్గురు భారత బాక్సర్లు తమ తమ క్వార్టర్ఫైనల్ పోటీల్లో విజయం సాధిస్తే భారత్ పతకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.అథ్లెటిక్స్లో పురుషుల షాట్పుట్ ఫైనల్కు తాజిందర్పాల్ సింగ్ తూర్, సమర్దీప్ సింగ్ గిల్ అర్హత సాధించారు. వీరిద్దరూ గురువారం జరిగే ఫైనల్లో పతకాల కోసం పోటీ పడనున్నారు.పారా స్విమ్మింగ్లో చైతన్య విశ్వాస్ కులకర్ణి, సుయశ్ నారాయణ్ జాధవ్ పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్7 ఫైనల్కు చేరుకున్నారు.పురుషుల లాంగ్జంప్లో భారత స్టార్ మురళీ శ్రీశంకర్ తొలి ప్రయత్నంలోనే అర్హత మార్క్ను అధిగమించి ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇప్పుడు అతనిపై భారత్కు మరో పతకం ఆశలు నెలకొన్నాయి.7వ రోజు (జులై 29) భారత్కు పతకాలు అందించే ఈవెంట్ల వివరాలు:సాయంత్రం 7:00 గంటలకు: బాక్సింగ్ - పురుషుల 80 కేజీల క్వార్టర్ ఫైనల్లో అంకుష్ యాదవ్ వర్సెస్ జేడ్ మైకాక్ (సెషెల్స్)సాయంత్రం 7:30 గంటలకు: బాక్సింగ్ - పురుషుల 90+ కేజీల క్వార్టర్ ఫైనల్లో నరేందర్ బెర్వాల్ వర్సెస్ మైఖేల్ సెకో (సమోవా)రాత్రి 11 గంటలకు: బాక్సింగ్ - మహిళల 57 కేజీల క్వార్టర్ ఫైనల్లో జైస్మిన్ లంబోరియా వర్సెస్ ఎలీస్ గ్లిన్ (ఇంగ్లాండ్)రాత్రి 11:54 గంటలకు: అథ్లెటిక్స్ - పురుషుల లాంగ్ జంప్ ఫైనల్లో శ్రీశంకర్ మురళి మరియు లోకేష్ సత్యనాథన్రాత్రి 12:31 గంటలకు: అథ్లెటిక్స్ - మహిళల షాట్ పుట్ ఫైనల్లో (పతకం ఈవెంట్) మన్ప్రీత్ కౌర్రాత్రి 12:46 గంటలకు: పారా స్విమ్మింగ్ - పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టైల్ S7 ఫైనల్లో సుయాష్ నారాయణ్ జాదవ్ మరియు చైతన్య విశ్వాస్ కులకర్ణిరాత్రి 12:55 గంటలకు: పారా అథ్లెటిక్స్ - పురుషుల డిస్కస్ త్రో F42-44/F61-64 ఫైనల్లో దేవేందర్ కుమార్ మరియు సాగర్ థాయత్ఉదయం 1:14: స్విమ్మింగ్ - పురుషుల 1500మీ ఫ్రీస్టైల్ ఫైనల్లో ఆర్యన్ నెహ్రాఉదయం 1:42: పారా అథ్లెటిక్స్ - పురుషుల 100మీ T47 ఫైనల్లో మహమ్మద్ బాసిల్ ఎం మరియు దిలీప్ మహాదు గావిత్ఉదయం 2:05: అథ్లెటిక్స్ - మహిళల 3000మీ స్టీపుల్చేజ్ ఫైనల్లో పరుల్ చౌదరి -
World Boxing Championships: ప్రిక్వార్టర్స్లో సచిన్
తాష్కెంట్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్షిప్లో సోమవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సచిన్ సివాచ్ (54 కేజీలు) శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... నవీన్ కుమార్ (92 కేజీలు), గోవింద్ సహని (48 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్ దాటలేకపోయారు. తొలి రౌండ్ బౌట్లో ప్రపంచ మాజీ యూత్ చాంపియన్ సచిన్ 5–0తో సెర్గీ నొవాక్ (మాల్డొవా)పై గెలుపొందగా... నవీన్ 0–5తో రేయస్ (స్పెయిన్) చేతిలో... గోవింద్ 0–5తో అల్ఖావెర్దోవి సాఖిల్ (జార్జియా) చేతిలో ఓడిపోయారు. -
బాక్సర్ సచిన్కు రజతం
బ్యాంకాక్: ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్ ఏకైక రజతం గెల్చుకుంది. ప్రపంచ యూత్ చాంపియన్ సచిన్ సివాచ్ రజతంతో సరిపెట్టుకున్నాడు. శుక్రవారం జరిగిన 49 కేజీల విభాగం ఫైనల్లో సచిన్ 0–5తో సమందర్ ఖోల్మురోడోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. ఓవరాల్గా భారత్ ఈ టోర్నీలో ఓ రజతం, ఐదు కాంస్యాలతో సరిపెట్టుకుంది. వరుసగా రెండో ఎడిషన్లో కూడా భారత్కు స్వర్ణం దక్కలేదు. అంకిత్ కుమార్ (60 కేజీలు), నవీన్ బూరా (69 కేజీలు), హర్ష్ప్రీత్ సరావత్ (+91 కేజీలు), మొహమ్మద్ ఖాన్ (56 కేజీలు), సచిన్ (75 కేజీలు) తమ విభాగాల్లో జరిగిన సెమీస్లో పరాజయం పాలై కాంస్యాలు సాధించారు.


