breaking news
s jagan mohan reddy
-
జక్కంపూడి రాజాకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
రాజమండ్రి : మాజీ మంత్రి, దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు, పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మిల కుమారుడు, పార్టీ కార్యదర్శి రాజా వివాహ వేడుకకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన మధురపూడి విమానాశ్రయం చేరుకున్న అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రి చేరుకున్నారు. జక్కంపూడి నివాసంలో నూతన వరుడు రాజను ఆశీర్వదింది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బయల్దేరి వెళ్లారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుమారుడు ప్రవీణ్ రెడ్డి వివాహానికి వైఎస్ జగన్ హాజరు కానున్నారు. -
ఎందాకైనా పోరాడతా
రాజధాని ప్రాంత రైతులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా బలవంతంగా భూములు తీసుకోవడం ముమ్మాటికీ అన్యాయమే చంద్రబాబు మోసాలు ఇంకా తగ్గలేదు.. ఈ సర్కారు కూలిపోవడం ఖాయం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బాబుకు డిపాజిట్లు దక్కవు వినుకొండలో 18 వేల ఎకరాల డీనోటిఫైడ్ భూములున్నాయి.. అక్కడ కట్టుకోవచ్చు కదా! సన్న, చిన్నకారు రైతుల పొట్టలు కొట్టడం ఎందుకు? మా పార్టీ అధికారంలోకి రాగానే లాక్కున్న భూములను వెనక్కు ఇచ్చేస్తాం సర్కారుపై ప్రతిపక్ష నేత నిప్పులు.. రాజధాని గ్రామాల్లో విస్తృత పర్యటన సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతంలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఎంతవరకైనా పోరాటం చేస్తామని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. రైతులకు ఇష్టం లేకుండా భూములు తీసుకోవడం ముమ్మాటికీ అన్యాయమేనని స్పష్టంచేశారు. ‘‘ముఖ్యమంత్రి రకరకాలుగా ప్రజలను మోసం చేస్తున్నారు. రాజధాని పేరుతో రైతుల ఇష్టానికి భిన్నంగా సాగు భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. ఈ విధానాన్ని గట్టిగా నిలదీస్తాం. ఈ అన్యాయంపై అందరం కలిసికట్టుగా ఎందాకైనా పోరాటం చేద్దాం. బలవంతంగా భూములు తీసుకోవడం సాధ్యం కాదు. న్యాయస్థానాలున్నాయి. ఏం భయపడొద్దు. చంద్రబాబు చేస్తున్న ఈ అన్యాయంపై రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని విజ్ఞులంతా ఆలోచించాలి’’ అని కోరారు. మంగళవారం జగన్మోహన్రెడ్డి రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం తదితర గ్రామాల్లో పర్యటించారు. రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు ఆవేదనాభరితంగా చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం అప్రజాస్వామిక వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేద్దామంటూ రైతులకు భరోసా కల్పించారు. బహుళ పంటలు పండించే భూములను సేకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఈ ప్రాంత రైతులకు అండగా నిలుస్తామని, పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ‘‘రైతుల ఇష్టం లేకుండా భూములను తీసుకోవడం అన్యాయం. దీన్ని మొదట్నుంచీ మేం ఒప్పుకోవడం లేదు. ముఖ్యమంత్రి మోసాలు ఇంకా తగ్గలేదు. ప్రజలను రకరకాలుగా మోసం చేస్తూనే ఉన్నాడు. త్వరలోనే చంద్రబాబు ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. అది రెండేళ్లకో, మూడేళ్లకో చెప్పలేను కానీ ఇన్ని దాష్టీకాలు సాగిస్తున్న ప్రభుత్వం కచ్చితంగా పడిపోతుంది. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబుకు డిపాజిట్లు కూడా దక్కవు. మన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఇప్పుడు బలవంతంగా తీసుకున్న భూములను తిరిగి వెనక్కి ఇచ్చేస్తాం’’ అని జగన్ అన్నారు. ‘‘మనసున్న వాడెవడూ భూములు తీసుకోవడానికి ఒప్పుకోడు. చంద్రబాబుకు నిజంగా మానవత్వం లేదు. ఇటువంటి పనిని ఏకంగా ఒక ముఖ్యమంత్రే చేస్తే ఆ మనిషిని ఏమనాలి. రాజధానిని ఇక్కడే కట్టాలి. వాస్తు బాగుంటుందని, రివర్ ఫ్రంట్ రాజధాని కావాలనే దిక్కు మాలిన ఆలోచనతో మూడు, నాలుగు పంటలు పండించే రైతుల పొట్ట గొట్టడం అన్యాయం. రైతు కూలీ కుటుంబంలో భర్త రోజుకు 500, భార్య రూ 300 చొప్పున నెలకు రూ.24 వేలు సంపాదిస్తున్నారు. వీరికి నెలకు 1,500, రెండు వేలు ముష్టి వేస్తామని చంద్రబాబు చెబుతున్నాడు. నిర్దాక్షిణ్యంగా వారి కడుపు కొడుతున్నారు. చంద్రబాబు పుణ్యమా అని రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు, బంగారు రుణాలు మాఫీ కాలేదు. ఇవన్నీ జరక్క పోగా ఇప్పుడు భూములు కూడా లాక్కుంటున్నారు’’ అనిదుయ్యబట్టారు. సీఎం రియల్ ఎస్టేట్ వ్యాపారమా? రైతుల భూమితో ముఖ్యమంత్రి చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారా అని జగన్ నిలదీశారు. ‘‘ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా ఇంతకుముందు వైఎస్సార్సీపీ నాలుగుసార్లు ఇక్కడ పర్యటించింది. 42 మంది ఎమ్మెల్యేలు ధర్నా, పాదయాత్ర చేశారు. ఎమ్మెల్యే ఆర్కే నిరాహారదీక్ష కూడా చేశారు. చంద్రబాబును ఇంకా గట్టిగా నిలదీస్తాం. ఇక్కడ ఆయనకు ఒకటి అర్థం కావాలి. రాజధాని కోసమని 50 వేల ఎకరాలు తీసుకుంటున్నారు. అందులో సగం రోడ్లు, ఇతర అవసరాలకు పోతాయి. 12 వేల ఎకరాలు మాత్రమే రైతులకు చిల్లర వేసినట్లు పడేస్తామంటున్నారు. మిగిలిన 13 వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా..? ఒక సీఎం చేయాల్సిన పనేనా ఇది. రాజధానికి నీక్కావాల్సిన వెయ్యో, రెండు వేల ఎకరాలో తీసుకో. మిగిలిన దాన్ని జోనింగ్ చేసి రోడ్లు వేసి వదిలేయ్. ఆ భూముల్లో రైతులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారో, ఏమి చేసుకుంటారో వారిష్టం. రైతులకు స్వాతంత్య్రం ఇవ్వు. మీరెందుకు రైతుల భూమితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి? ఇంతమంది రైతుల కడుపుకొట్టి బలవంతంగా భూములు తీసుకుంటారా? ఇదే జిల్లా వినుకొండలో 18 వేల ఎకరాల డీనోటిఫైడ్ ఫారెస్ట్ భూములున్నాయి. సింగపూర్, జపాన్ లాంటి రాజధానులు కడతానని చెబుతున్న చంద్రబాబు ఇంకా అవసరమైతే ఆ భూముల్లో అమెరికా లాంటి రాజధాని కట్టుకోవచ్చు. ఎవరూ ఏమీ అడగరు. కానీ ఇక్కడే రాజధాని కట్టుకోవాలనుకోవడం సరికాదు. ఇక్కడ మీరు తీసుకోవాలనుకుంటున్న 50 వేల ఎకరాల్లో 20 వేల మంది రైతులున్నారు. అందులో 2 ఎకరాల లోపు ఉన్న రైతులు 10 వేల మంది ఉన్నారు. 3 ఎకరాల లోపు రైతులు 10 వేల మంది ఉన్నారు. అందరూ చిన్న, సన్నకారు రైతులే. వాళ్ల భూములు లాక్కోవడం అన్యాయం కాదా’’ అని జగన్ ప్రశ్నించారు. ఉన్న జాబులు ఊడగొడుతున్నాడు.. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసుకున్న చంద్రబాబు.. గద్దెనెక్కాక ఉన్న జాబులను ఊడగొడుతున్నారని జగన్ మండిపడ్డారు. ‘‘ఇక్కడ సంవత్సరానికి మూడు పంటలు పండుతాయి. ఉండవల్లి గ్రామంలోని భూముల్లో సంవత్సరానికి నాలుగు పంటలు పండుతాయి. ఒక్క ఉండవల్లి గ్రామంలోనే రెండు వేల ఎకరాలున్నాయి. ఎకరానికి 4 లక్షల చొప్పున ఈ గ్రామం నుంచే సుమారు రూ.80 కోట్లు జమ అవుతోంది. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల్లో చెప్పారు. కానీ మూడు పంటలు పండే మంచి భూములను లాక్కుని వారి జాబులు ఊడగొడుతున్నారు. ఎకరం మీద రైతులు నాలుగు లక్షలు సంపాదించుకునే పరిస్థితిలో వారి భూములు లాగేసుకుంటే తర్వాత వాళ్లంతా ఎక్కడికి వెళ్తారు? మీ నుంచి భూములు బలవంతంగా తీసుకోలేరు. మీ వెంట మేముంటాం. ఎన్నికలకు ముందు మోసాలు, అబద్ధాలతో సీఎం కుర్చీ ఎక్కాడు చంద్రబాబు. ఇప్పుడు బలవంతంగా భూములు లాక్కుంటూ వీధి గూండాలా తయారయ్యాడు. ఒకవైపు డబ్బుల్లేవంటూనే మరోవైపు సింగపూర్లా చేస్తానంటున్నాడు. కేంద్రం కూడా నిరాశపరిచింది. కేంద్ర బడ్జెట్లో ఏమీ కేటాయించలేదు. బాబును నేనొక్కటే అడుగుతున్నా... సీఎంగా పరిపాలన చేస్తాడా? రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పరిపాలన సాగిస్తాడా? నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా. చంద్రబాబు మెడలు వంచైనా రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం. మీరెవ్వరూ అధైర్యపడొద్దు’’ అని రైతులకు జగన్ ధైర్యం చెప్పారు. బినామీల భూముల ధరలు పెంచేందుకే.. ‘‘చంద్రబాబు.. సుజనా చౌదరి వంటి బినామీల చేత భూములు కొనిపించారు. బాబు రాజధాని లైన్ ఎక్కడ గీస్తే దానికి ఆనుకుని సుజనా చౌదరి భూములు కొన్నారు. తన దగ్గర డబ్బులు ఉన్నాయనీ, భూములు కొంటే తప్పేంటని సుజనా చౌదరి నిస్సిగ్గుగా చెబుతున్నారు. సీఎం తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బినామీలకు మేలు చేయడం కోసం రైతుల నుంచి భూములు లాక్కోవడం ఎంత వరకు న్యాయం. చంద్రబాబు.. ఆయన బినామీల భూములకు ధరలు పెంచుకునేందుకే ఇక్కడ రాజధాని కడుతున్నారు. అందుకే రైతుల నోట్లో మట్టి కొడుతున్నాడు. చంద్రబాబు ఒత్తిడికో, భయానికో భూములిచ్చిన వారెవరైనా ముందుకు రావొచ్చు. తమ నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని ముందుకొస్తే వారి తరపున మేం కోర్టులో కేసు వేసి న్యాయ పోరాటం చేస్తాం. మీ ఎమ్మెల్యే ఆర్కే ఇక్కడే ఉంటారు. ఆయనను కలిసి మీ ఇబ్బంది చెప్పవచ్చు. ఆర్కే మీ తరఫున కోర్టుల్లో కేసు వేసి న్యాయపోరాటం చేస్తారు’’ అని జగన్ చెప్పారు. ‘‘ఈ గ్రామాల్లో రైతుల రుణాలు మాఫీ కాలేదు. డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదు. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి వచ్చిందా అని అడిగితే బంగారం కాదు వేలం నోటీసులు ఇంటి కొచ్చాయని మహిళలు చెబుతున్నారు’’ అని జగన్ పేర్కొన్నారు. పర్యటనలో జగన్ వెంట ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), కొడాలి నాని, కోన రఘుపతి, జ్యోతుల నెహ్రూ, మేకా వెంకట ప్రతాప అప్పారావు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రక్షణనిధి, జలీల్ ఖాన్, షేక్ ముస్తఫా, ఉప్పులేటి కల్పన, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, కొలుసు పార్థసారథి, ఎంవీఎస్ నాగి రెడ్డి, మేరుగ నాగార్జున, బాలశౌరి, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, వంగవీటి రాధాకృష్ణ, లేళ్ల అప్పిరెడ్డి, కొత్తపల్లి సుబ్బారాయుడు, తలశిల రఘురాం, పుత్తా ప్రతాపరెడ్డి, ఈవీ మహేశ్వరరెడ్డితోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
రానున్నది రైతు రాజ్యామే...
రైతు సంక్షేమమే వైఎస్ జగన్ ధ్యేయం అన్నదాత పక్షాన వైఎస్ తనయుడి నిత్య పోరాటాలు వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోనూ ప్రతిఫలించిన లక్ష్యం సాగును లాభదాయకం చేసేలా నిండైన భరోసా పిన్నింటి గోపాల్ 1. రైతులకు ఆసరాగా నిలవాల్సిందే. గిట్టుబాటు ధర కల్పించాల్సిందే. అందుకు 3 వేల కోట్ల రూపాయలతో మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం 2. కరువులు, వరదలు, ఇతర ప్రకృతి విపత్తుల్లో రైతులకు ఆసరాగా ఉండాలి. పంట నష్టాన్ని తక్షణం అంచనా వేసి, వీలైనంత త్వరగా పరిహారం చెల్లించాలి. అందుకు రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేస్తాం. తర్వాతి పంట నాటికల్లా పరిహారం రైతు చేతికందిస్తాం 3. వ్యవసాయానికి ఇద్దరు మంత్రులుంటారు. ఒకరు వ్యవసాయ ఉత్పత్తులను, మరొకరు ఆ వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు 4. {పాసెసింగ్, గ్రేడింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ సదుపాయాలు.. వ్యవసాయానికి విడిగా బడ్జెట్ 5. {పతి జిల్లానూ వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దుతాం. దేశంలో ఈ తరహా పద్ధతి మరెక్కడా లేదు. దీని వల్ల స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయి రాబోయే రైతు రాజ్యానికి సంకేతాలు ఇలా విత్తనం నుంచి పంట విక్రయం దాకా ప్రతి దశలోనూ అన్నదాతలకు అన్ని రకాలుగా భరోసా కల్పించే అంశాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నాయి. అందరికీ అన్నం పెట్టే రైతు కుటుంబంలో వెలుగులు నింపడమే లక్ష్యంగా వ్యవసాయానికి మేనిఫెస్టోలో ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. రైతు సమస్యల పరిష్కారం కోసం, వారి సంక్షేమం కోసం గత నాలుగేళ్లుగా నిత్యం గళమెత్తుతూ, పాలకులను నిలదీస్తూ సాగుతున్న రైతు పక్షపాతి జగన్. రైతు రాజ్యాన్ని స్థాపిస్తానన్న ఆయన వాగ్దానం అన్నదాతకు భరోసాగా నిలుస్తోంది. విత్తనాల దశ నుంచీ అన్ని రకాలుగా ప్రభుత్వ సాయం, గిట్టుబాటు ధర కోసం స్థిరీకరణ నిధి... ఇద్దరు మంత్రులతో పూర్తిస్థాయి పర్యవేక్షణ, సాగుకు విడిగా బడ్జెట్... సాగు చల్లగా సాగేందుకు పలు అంశాలతో జగన్ ఆవిష్కరించిన భావి ప్రణాళిక రైతన్నలో ధీమా నింపుతోంది. తాను అధికారంలోకి రాగానే రైతులు తిరిగి తలెత్తుకునేలా, అన్నదాత స్థైర్యాన్ని పెంచేలా నిర్ణయాలు తీసుకుంటామని జగన్ భరోసా ఇచ్చారు. వ్యవసాయ రంగంలో ఐదేళ్లుగా తిష్ట వేసిన పలు సమస్యల పరిష్కారం కోసం పలు మార్గాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. వాటన్నింటినీ కచ్చితంగా అమలు చేస్తామనే ధీమాను కూడా కల్పించారు. ఇవన్నీ ఎన్నికల గిమ్మిక్కులు కాదు. ఓట్ల ఎత్తుగడలు అసలే కావు. రైతు బాంధవుడైన వైఎస్ రాజశేఖరరెడ్డి తనయునిగా... రైతుల కోసం అనుక్షణం పరితపించే నైజం జగన్కు వారసత్వంగా వచ్చింది. పైగా వైఎస్ మాదిరిగానే రైతుల ఇక్కట్లను అతి దగ్గరగా చూశారు జగన్. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్న వాస్తవం ఆయనకు బాగా తెలుసు. అందుకే అన్నదాత సమస్యల పరిష్కారం కోసం పాలకులపై ఒత్తిడి తెచ్చారు. దీక్షలు చేశారు. ప్రకృతి విపత్తులు రైతులను కుంగదీసినప్పుడల్లా వారి మధ్యకు వెళ్లారు. మనో నిబ్బరం కల్పించారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు కనీస మద్దతు ధర దక్కక దిగాలు పడ్డ రైతుకు ధైర్యం చెప్పారు. వారి తరఫున తాను రోడ్డెక్కారు. కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించారు. న్యాయం కోసం ఢిల్లీ దాకా వెళ్లారు. ప్రధానిని కదిలించారు. ఏం చేసినా కదలికే లేని పాలకుల నిర్వాకాన్ని క ళ్లారా చూశారు. వైఎస్ హయాంలో మాదిరిగా వ్యవసాయాన్ని మళ్లీ పండుగలా మార్చాలంటే ఏం చేయాలో స్పష్టమైన అంచనాకు వచ్చారు. దాని ఫలితమే... వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో రైతు సంక్షేమానికి పెద్దపీట. మేనిఫెస్టోలోని మరికొన్ని కీలకాంశాలు.. 1. ఆరునూరైనా సాగుకు ఉచితంగా 9 గంటలు విద్యుత్. అందులో 7 గంటలు పగలే నిరంతరాయంగా సరఫరా 2. రైతులకు వడ్డీ లేని రుణాలు, యాంత్రీకరణను ప్రోత్సహించడానికి వ్యవసాయ యంత్రాల కొనుగోలుపై సబ్సిడీ 3. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతుల కోసం సరికొత్త రుణ మాఫీ పథకం కోసం కేంద్రంపై ఒత్తిడి 4. పెట్టుబడుల్లేని దుస్థితి నుంచి రైతులను గట్టెక్కించేందుకు విత్తు వేసేనాటికే రైతులకు బ్యాంకు రుణాలు 5. అదనంగా 40 లక్షల అడుగుల గిడ్డంగుల నిర్మాణానికి ప్రాధాన్యం. ఆధునిక, శీతల గిడ్డంగుల నిర్మాణం 6. రాష్ట్రంలో మూడు వ్యవసాయ వర్సిటీలు. రెండు జిల్లాలకో వ్యవసాయ డిగ్రీ కళాశాల, పరిశోధన కేంద్రం 7. రైతులకు సూచనలిచ్చేందుకు 102 మొబైల్ క్లినిక్లు. పొలాల వద్దకెళ్లి నమూనాల సేకరణ, భూసార పరీక్షలు 8. పశువులకు 103 సంచార వైద్యశాలలు. రైతుల చెంతకే పశు వైద్య సేవలు. మండలానికో పశు వైద్యశాల వైఎస్సే స్ఫూర్తి వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతు సంక్షేమానికి పాటుపడాలన్న వైఎస్ జగన్ తపనకు స్ఫూర్తి ఆయన తండ్రి, మహా నేత దివంగత వైఎస్సే. అన్నదాత బాగుండాలని నిత్యం తపించిన నిజమైన నాయకుడు వైఎస్సార్. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఆయన చిత్తశుద్ధితో పని చేశారు. సాగుకు ఉచిత విద్యుత్ను అమలు చేశారు. రూ.1,259 కోట్ల విద్యుత్ బకాయిలనూ రద్దు చేశారు. రైతులకు 7 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తే రాష్ట్రానికి మేలే తప్ప భారం కాదని రుజువు చేసి చూపారు. అదనులో పెట్టుబడి ఉంటేనే రైతులకు సాంత్వన అని గ్రహించి పంట రుణాలపై వడ్డీని పావలాకు తగ్గించారు. ప్రకృతి విపత్తుల బారి నుంచి రైతుకు రక్షణ కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా పంటల బీమా పథకాన్ని అమలు చేసిన ఆదర్శ పాలకుడు వైఎస్. ఆయన ప్రతి నిర్ణయమూ రైతుల ప్రయోజనమే పరమావధిగా జరిగింది. మోన్శాంటోకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వరకూ వెళ్లి మరీ అది దిగొచ్చేలా చేశారు. బీటీ పత్తి విత్తనాల ధరను రూ.750కి తగ్గించి రైతు ముఖంలో చిరునవ్వులు పూయించారు. జగన్ మాట... రెతును విస్మరిస్తే సర్కారుకు మూడినట్టే. సర్వం కోల్పోయి వారు అల్లాడుతుంటే, సగం ధాన్యమే కొంటానంటూ వ్యాపారుల కంటే అధ్వానంగా వ్యవహరిస్తోంది - విజయవాడ ‘లక్ష్య దీక్ష’లో రైతు కంట కన్నీరు రాష్ట్రానికే అరిష్టం. అన్నదాతను పట్టించుకోని ఈ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదిలో దూకడం మేలు - విజయవాడ ‘మహా ధర్నా’లో కేంద్రం పట్టించుకుంటే తప్ప పోలవరం ప్రాజెక్టును మీరు కట్టలేరా? - ‘హరితయాత్ర’లో రాష్ర్ట కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రశ్న ఇది ముందుచూపు ఏమాత్రమూ లేని గుడ్డి సర్కారు. పంట నష్టపోతే చచ్చేది రైతే కదా. చస్తే చావనీ అన్నట్టు వ్యవహరిస్తోందీ అధ్వాన ప్రభుత్వం - కడప కలెక్టరేట్ వద్ద ‘కరెంటు పోరు’లో రైతుల సమస్యలపై సర్కారు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. లేదంటే మేమే తెరిపిస్తాం బిల్లులు కట్టని రైతులను జైల్లో పెట్టాలన్న చంద్రబాబుకు వారి పేరెత్తే అర్హతే లేదు - ఆర్మూరు ‘రైతు దీక్ష’లో