-
యూపీఐ చార్జీలను రిఫండ్ చేయండి
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి 1 నుంచి రూపే కార్డులు, భీమ్–యూపీఐ విధానాల్లో చేసిన చెల్లింపులపై విధించిన చార్జీలను కస్టమర్లకు వాపసు చేయాలని బ్యాంకులకు ఆదాయ పన్ను శాఖ సూచించింది. భవిష్యత్లోనూ ఈ రెండు విధానాల్లో జరిపే లావాదేవీలపై ఎలాంటి చార్జీలు విధించవద్దని పేర్కొంది. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఈ మేరకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. 2020 జనవరి 1 తర్వాత నుంచి నిర్దేశిత ఎలక్ట్రానిక్ చెల్లింపులపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేటు) సహా ఇతరత్రా ఎలాంటి చార్జీలు వర్తించబోవని గతేడాది డిసెంబర్లోనే స్పష్టం చేసిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావించింది. దీనిపై ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ యూపీఐ లావాదేవీలపై కొన్ని బ్యాంకులు చార్జీలు విధిస్తున్న సంగతి తమ దృష్టికి వచ్చిందని సీబీడీటీ తెలిపింది. ఇది నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని, చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని పేర్కొంది. మరోవైపు, ఈ రిఫండ్ల వ్యవహారం బ్యాంకులపై అదనపు భారం మోపుతుందని నాంగియా ఆండర్సెన్ పార్ట్నర్ సందీప్ ఝున్ఝున్వాలా పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో 2019 ఆర్థిక చట్టంలో కేంద్రం ప్రత్యేక నిబంధన చేర్చింది. దీని ప్రకారం రూ. 50 కోట్ల టర్నోవరు దాటిన వ్యాపార సంస్థలు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ విధానంలో చెల్లింపులు జరిపేందుకు కస్టమర్లకు వెసులుబాటునివ్వాలి. -
ఆ పలుకే బంగారం
సాక్షి, రాజమండ్రి :ప్రారంభించేది కేంద్ర ప్రభుత్వ పథకమే అయినా పుష్కర సన్నాహాల వేళ జిల్లాకు.. అందునా పుష్కరాలకు ప్రధాన వేదిక వంటి రాజమండ్రి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకు సంబంధించి వరాల జల్లు కురిపిస్తారని భావించారు. అయితే పలుకే బంగారమైనట్టు- ఆయన తన ప్రసంగంలో పుష్కరాలకు సంబంధించిన ఊసే తేలేదు. జిల్లాకు సంబంధించిన ఏ విషయంపైనా నోరు మెదపలేదు. ఇలా వచ్చి జనధన పథకాన్ని ప్రారంభించి అలా వెళ్లిపోయారు. ఇటీవల ప్రతి చోటా చేస్తున్నట్టే.. కేంద్రాన్నీ, తననూ కీర్తించుకోవడానికే పరిమితమయ్యారు. గురువారం రాజమండ్రి చెరుకూరి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు ప్రధానమంత్రి జన-ధన యోజనను ప్రారంభించారు. లబ్ధిదారులకు పాస్ పుస్తకాలు, రూపీ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చంద్రబాబు సుమారు అరగంట ప్రసంగించారు. పుష్కరాలపై కీలక ప్రకటన చేస్తారని అటు జనం, ఇటు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు ఆశించారు. చివరి వరకూ ఆ ప్రస్తావన తేకపోవడంతోపక్కనే ఉన్న రాజమండ్రి రూరల్, సిటీ ఎమ్మెల్యేలు ఓ కాగితంపై రాసి ఇచ్చారు. దాన్ని చూ సిన చంద్రబాబు ‘ప్రతిష్టాత్మకమై న పుష్కరాలు వస్తున్నాయి. గతంలో నేను చేసిన అభివృద్ధి తప్ప ఒక్క అడుగు ముందుకు పడలే ద’ని మాత్రమే అన్నారు. కేంద్రం సహకారం తో రాజమండ్రిని అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాకు, రాజమండ్రికి కి తాబు ఉభయగోదావరి జిల్లాలు దేశంలో ధాన్యాగారాలుగా పేరొందాయని, కానీ నేడు దిగుబడి తగ్గిపోయిందని చంద్రబాబు అన్నారు. ఇక్రిశాట్ సహకారంతో ఈ పరిస్థితిని అధిగమిస్తామన్నారు. పోలవరం పూర్తయితే జిల్లాలో కరువనేదే ఉండదని పేర్కొన్నారు. ‘రాజమండ్రి అంటే రాజమహేంద్రి గురుకొ స్తుంది. నన్నయ్య ఇక్కడి వాడు. తెలుగు భాష ఇక్కడే నుడికారాలు దిద్దుకుంది. ఎన్టీఆర్ అభిమానించే జిల్లా. కందుకూరి స్ఫూర్తితో ఎన్నో సంస్కరణలు ఇక్కడ నుంచే చోటు చేసుకున్నాయి’ అంటూ కొనియాడారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎంపీలు మురళీమోహన్, తోట నరసింహం, రవీంద్రబాబు, ఎమ్మెల్సీలు చైతన్యరాజు, రవికిరణ్వర్మ, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆకుల సత్యనారాయణ, తోట త్రిమూర్తులు, మేయర్ రజనీ శేషసాయి, బీజేపీ జాతీయ కా ర్యవర్గసభ్యుడు సోము వీర్రాజు, జిల్లా అ ధ్యక్షుడు సూర్యనారాయణరాజు, మాజీ మం త్రులు మెట్ల సత్యనారాయణ, చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే చందన రమేష్, కలెక్టర్ నీతూ ప్రసాద్, జేసీ ముత్యాల రాజు, జన-ధన మిషన్ డెరైక్టర్ పి.వి.రమేష్, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆహ్వానం అందలేదని గన్ని అసంతృప్తి ముఖ్యమంత్రి కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గన్ని కృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వి మానాశ్రయంలో కూడా తనను పోలీసులు అ డ్డుకున్నారని మండిపడ్డారు. తన వంటి ప్ర ముఖులను కూడా అడ్డగించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పట్ల కొందరు పార్టీనేతలు అనుచితంగా వ్యవహరిస్తున్నారని మీడియా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కార్యక్రమం సాగింది ఇలా.. చంద్రబాబు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4.00 గం టలకు మధురపూడి విమానాశ్రయం చే రుకున్నారు. అక్కడి నుంచి 4.20 గం టలకు సభాస్థలికి చేరుకున్నారు. ఆంధ్రాబ్యాంకు సీఎండీ రాజేంద్రన్ మాట్లాడాక చంద్రబాబు ప్రసంగం ప్రారంభించి ఐదు గంటలకు పూర్తి చేశారు. తర్వాత ఆంధ్రా బ్యాంకు నుంచి జన-ధన యోజనలో ఖాతా తెరిచిన వెలుగుబంటి అమ్మాజీకి తొలి పాస్పుస్తకం, రూపీ కార్డు(డెబిట్ కార్డు) అందచేయడం ద్వారా సీఎం ఈ పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించారు. అనంతరం ఎస్బీహెచ్ ఖాతాదారు ఎం.అమ్మాజీకి, వివిధ బ్యాం కుల్లో ఖాతాలు పొందిన వారికి పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం అభిమానులు అందించిన ఎన్టీఆర్, బసవతారకం చిత్రపటాన్ని స్వీకరించారు. అధ్యక్షత వహించిన ఆంధ్రా బ్యాంకు సీఎండీ రాజేంద్రన్ మాట్లాడుతూ 51 ప్రభుత్వ, ప్రైవేట్, సహకార బ్యాంకులు జన-ధనలో ఖాతాలు తెరిపిస్తున్నాయన్నారు. బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన చంద్రబాబు 5.20 గంటలకు మధురపూడి బయలేదేరి, 5.40 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement