-
కేసీఆర్ x భట్టి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య సోమవారం అసెంబ్లీలో ఆసక్తికర సంవాదం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలోని శబరి నది విషయంలో.. వీరిద్దరి మధ్య సోమవారం ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఈ వాగ్వాదం చోటుచేసుకుంది. బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో ఇందిర స్రవంతి, రాజీవ్ స్రవంతి అంటూ సమైక్య సీఎంలు కుట్రలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. దుమ్ముగూడెం టెయిల్పాండ్ – నాగార్జునసాగర్కు నీటి మళ్లింపు కోసం తెలంగాణ వారిని మైమరిపించేందుకు ఈ ప్రాజెక్టులు తెచ్చారన్నారు. నాడు కేంద్రంలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నా.. మహారాష్ట్రతో నీటి ఒప్పందం చేసుకోలేకపోయారన్నారు. దీంతో.. అంబేడ్కర్ సుజల స్రవంతి కాస్తా కాగితం స్రవంతిగా మారిపోయిందన్నారు. ఇందిరాసాగర్ దుమ్ముగూడెంలో కొట్టుకుపోయిందన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర తట్టెడు మట్టి తవ్వకుండా ఎక్కడో చేవెళ్ల దగ్గర కాలువ తవ్వడం కాంగ్రెస్ వాళ్ల తెలివి అని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో, బయటా టీఆర్ఎస్ పోరాడిందన్నారు. 2014లో అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల రీ–డిజైన్పై అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇస్తే దానికి కాంగ్రెస్ సభ్యులు ఎందుకు హాజరుకాలేదని సీఎం ప్రశ్నించారు. గోదావరి నుంచి 160 టీఎంసీలే కాదు 400 టీఎంసీలు తీసుకునేలా ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. 15–20 రోజుల్లోనే మేడిగడ్డ పనులు చేపడతామన్నారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ అన్యాయంగా కేసులు వేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 200 కేసులు వేశారని, వారిలో కాంగ్రెస్ ఆఫీస్బేరర్లు ఉన్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు ఒక కంటితుడుపుగానే మిగిలిందన్నారు. సీతారామప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాకు, నాగార్జునసాగర్ ఆయకట్టు పటిష్టం చేయడం ద్వారా రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు. ఈ వర్షాకాలం జూన్, జూలైలలో నాగార్జునసాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలిచ్చి.. మధిరతో పాటు వివిధ నియోజకవర్గాలకు నీళ్లు ఇస్తామన్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కాకపోయినా తెలియని విషయాలు తెలుసుకున్నానని నీటిపారుదలరంగంపై పట్టుసాధించానని, ఈ విషయంలో కాంగ్రెస్ నాయకులు బాధ్యతారహిత ప్రకటనలు చేయొద్దని సీఎం హితవుపలికారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్లను పునర్వ్యవస్థీకరిస్తామని, గ్యాప్ ఆయకట్టును పూర్తిచేయడం తమ కమిట్మెంట్ అని కేసీఆర్ స్పష్టంచేశారు. అంబేడ్కర్ సుజల స్రవంతి ద్వారా రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని, ఈమేరకు మహారాష్ట్రతో ఒప్పందం కుదిరిందని ఆయన పేర్కొన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు వస్తే, రాకపోతే అనే రెండుపద్ధతుల్లో ఆలోచించాలని భట్టి విక్రమార్క సూచించారు. ఖమ్మం జిల్లా రుద్రమకోట దగ్గర శబరి నదిలో ఏడాదంతా అందుబాటులో ఉండే 4.5 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవాలన్నారు. గోదావరిలో ఆ పాయింట్ను తెలంగాణ కోల్పోవద్దని పునర్విభజన చట్టంలోనూ ఉన్న ఈ హక్కును చేజారుకోవద్దన్నారు. దుమ్ముగూడెం, సీతారామప్రాజెక్టుల ద్వారా 2.5లక్షల నుంచి 8లక్షల ఎకరాల దాకా నీరు ఇవ్వొచ్చునన్నారు. రాజీవ్సాగర్కు రూ.200 కోట్ల నిధులు కేటాయిస్తే పూర్తి అవుతుందని దాని ద్వారా ప్రయోజనం చేకూరుతుందన్నారు. కోర్టులో కేసు వేసిన సత్యనారాయణ టీఆర్ఎస్లోనే ఉన్నారని, ఆయన భార్య చేవెళ్ల జడ్పీటీసీ టీఆర్ఎస్లోనే ఉన్నారని భట్టి పేర్కొన్నారు. గతంలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇచ్చినపుడు, తమ వాదన వినిపించేందుకు తమకు ప్రజెంటేషన్ అవకాశమివ్వాలని సీఎల్పీ తరఫున లేఖ ఇచ్చినా స్పీకర్ నుంచి స్పందన లేకపోవడం వల్లే తాము హాజరుకాలేదని భట్టి స్పష్టం చేశారు. ఎక్కడీ శబరి? ఈ సందర్భంగా కేసీఆర్ జోక్యం చేసుకుంటూ భట్టి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో వద్దని.. కమిటీ హాల్లో ప్రజెంటేషన్ పెట్టాలని వితండవాదం చేసింది కాంగ్రెస్ వాళ్లేనన్నారు. రుద్రమకోట, శబరి నది ఎక్కడ? ఈ విషయంలోనూ సభను తప్పుదోవ పట్టిస్తారా అని విమర్శించారు. శబరినది గోదావరిలో కలిసే స్థానం ఏపీలో ఉందని.. భౌగోళిక వాస్తవాలు తెలుసుకోకుండా ఎలా మాట్లాడతారని సీఎం ప్రశ్నించారు. పాపికొండల దగ్గర శబరి కలుస్తుందన్నారు. మరోసారి ధ్రువీకరించుకోవాలని భట్టికి సూచించారు. ఖమ్మం జిల్లాకు రెండేళ్లలో నీళ్లిచ్చి భట్టిని వెంట తీసుకెళతామన్నారు. ఖమ్మంకు వచ్చి చూడండి! సీఎం ఖమ్మం జిల్లాకు వచ్చి గతంలోని ప్రాజెక్టుల పాయింట్లను చూడాలన్నారు. రుద్రంపేట, శబరి దగ్గర చెబుతున్న ప్రాంతాలు మునిగిపోతాయని, పోలవరం పూర్తయితే అది 30 మీటర్ల అడుగుకు పోతుందన్నారు. ఆ ప్రాంతం ప్రాజెక్టుల నిర్వహణకు ఏమాత్రం ప్రయోజనకరం కాదన్నారు. అయితే.. భట్టి కంటే తానే ఆ ప్రాంతంలో ఎక్కువ పర్యటించానని సీఎం చెప్పారు. కాంగ్రెస్ వారి కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకుని రక్షణశాఖను బతిమిలాడి లైడర్ సర్వే చేయించానన్నారు. గోదావరికి సంబంధించి అక్షాంశాలు, రేఖాంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు సీఎం తెలిపారు. పోలవరం ముంపుప్రాంతాలే కాకుండా తీసుకున్న ఇతర ప్రాంతాల గురించి గతంలో సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు.. కాంగ్రెస్తో దోస్తీ కట్టాక భిన్నంగా ప్రవర్తిస్తున్నారన్నారు. రెండున్నరేళ్లలో పదిలక్షల ఎకరాలకు (సాగర్ ప్రాంతంతో సహా) నీళ్లు అందించాక.. భట్టి వెంట రాకపోయినా లాక్కెళ్తానని సీఎం చమత్కరించారు. తాను పిలిస్తే వస్తానని, బలవంతంగా తీసుకెళ్లాల్సిన అవసరంలేదని భట్టి కూడా అదే రీతిలో స్పందించారు. మరోసారి రుద్రమకోట గురించి పరిశీలించాలని సీఎంకు సూచించారు. అయితే.. ఈ అంశంపై తాను చెప్పేదేమీ లేదంటూ సీఎం కేసీఆర్ పేర్కొనడంతో వీరిద్దరి మధ్య సంవాదం ముగిసింది. కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే: భట్టి శాసనసభలో చర్చ సందర్భంగా కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని, కేసీఆర్ అబద్ధాలను నిర్భయంగా చెబుతారని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. శబరి నది గురించి కేసీఆర్ సభలో చెప్పింది అబద్ధమని నిరూపిస్తానన్నారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం సీఎల్పీ కార్యాలయంలోని తన చాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే మీడియాను శబరి నది వద్దకు తీసుకెళ్తానని చెప్పారు. సీఎం కేసీఆర్ను కూడా తీసుకెళ్లి శబరి నది ఎక్కడ ఉందో చూపిస్తానన్నారు. పాత ప్రాజెక్టులను కొనసాగిస్తూనే శబరి నీటిని వాడుకునే వీలుందని చెప్పారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులను కొనసాగించవచ్చని స్పష్టం చేశారు. -
రుద్రమకోటలో అతి పురాతన సమాధులు
కుక్కునూరు : ప్రపంచంలో కెల్లా అతిపురాతనమైన సమాధులు ఈజిప్టు తర్వాత వేలేరుపాడు మండలంలోని రుద్రమకోటలో ఉన్నాయని పురావస్తుశాఖ కమిషనర్ వాణీమోహన్ అన్నారు. బుధవారం రుద్రమకోటలోని పురాతన సమాధుల తవ్వకాలను థాయిలాండ్, దక్షిణకొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్కు చెందిన అంతర్జాతీయ ఆర్కియాలజిస్టులతో కలిసి ఆమె సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మూడునెలలుగా ఇక్కడ పురావస్తుశాఖ తవ్వకాల్లో బయటపడిన వస్తువులు, ఆదిమానవుల అవశేషాలు, వారు వాడిన వస్తువులు తదితర సామగ్రిని పోలవరం, రాజమండ్రిల్లో మ్యూజియాలు ఏర్పాటుచేసి ప్రదర్శనకు ఉంచుతామన్నారు. అవశేషాలను హైదరాబాద్కు తరలించి వాటి డీఎన్ఏలపై పరిశోధనలు చేసి అప్పటి మానవుల ఆహారపు అలవాట్లు, జీవన విధానం తదితర విషయాలు తెలుసుకుంటామన్నారు. కొన్ని అవశేషాలను పూనేలోని ఆర్కియాలజీ కేంద్రానికి తరలించామన్నారు. ఇక్కడి సమాధులు క్రీస్తు పూర్వం వెయ్యి ఏళ్ల ముందువని, అప్పటి మహిళలు వాడిన పూసలను కార్మేలియన్ రాయి నుంచి తయారుచేశారని చెప్పారు. కార్మేలియన్ రాయి గుజరాత్లో మాత్ర మే లభిస్తుందని, దీని ద్వారా రుద్రమకోట నుంచి గుజ రాత్కు వాణిజ్య సంబంధాలు ఉన్నట్టు గుర్తించామన్నారు. విదేశీ ఆర్కియాలజిస్టులు మాట్లాడుతూ తవ్వకాల్లో దొరికిన ఎముకలను బట్టి చూస్తే అప్పటివారు దృఢమైన శరీరాకృతిని కలిగి ఉన్నట్టు అర్థమవుతుందన్నారు. పొక్లయిన్ సా యంతో తప్ప మోయలేని బండరాళ్లను సమాధుల మీద ఏర్పాటుచేసిన విధానం చూస్తే వారు ఎంత బలవంతులో అర్థం చేసుకోవచ్చన్నారు. రుద్రమకోట అద్భుతమైన చరి త్రగల గ్రామామన్నారు. ఆర్కియాలిజీ పరిశోధన కళాశాలలకు చెందిన విద్యార్థులు, ప్రొఫెసర్లు, పురావస్తుశాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
రుద్రమ్మ కోటలో రాతియుగం నాటి సమాధులు
నిర్ధారించిన పురావస్తు శాఖ వేలేరుపాడు : పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం రుద్రమ్మకోట గ్రామంలో రాతియుగం నాటి సమాధులను పురావస్తు శాఖాధికారులు బుధవారం గుర్తించారు. ఇవి 22 వేల సంవత్సరాలకు పూర్వం నాటి ఆది మానవుల సమాధులని నిర్ధారించారు. వీటిని ’మెగాలితిక్ బరియల్స్’ అంటారని అధికారులు తెలిపారు. ఆదిమానవుల కాలంలో ఎవరు చనిపోయినా పెద్ద గొయ్యి తీసి.. దానిచుట్టూ రాళ్లు పేర్చి దానిపై పెద్ద బండను మోపేవారని, చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన సామగ్రి అంతా అందులోనే పూడ్చిపెట్టేవారని వివరించారు. 15 ఏళ్ల క్రితమే ఈ సమాధులు ఉన్నట్టు గుర్తించామని, వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామని చెప్పారు. వేలేరుపాడు మండలం పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రాంతంలో ఉన్నందున ఈ సమాధులు, వాటి చరిత్ర కనుమరుగు కాకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపడతామన్నారు. నీటి పారుదల శాఖ అదికారుల అనుమతి పొంది, వీటి తవ్వకాలు చేపడతామని వివరించారు. రాతి యుగం నాటి సమాధులను పరిశీలించిన వారిలో కాకినాడ పురావస్తు శాఖాధికారులు తిమ్మరాజు, భాస్కర్నాయక్ , డీవీ సుబ్బారావు ఉన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement