breaking news
rtc Mazdoor Union
-
‘సకలజనుల సమ్మె’ను సెలవుగా ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చేపట్టిన సకల జనుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా ప్రకటించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. సింగరేణి, ట్రాన్స్కోలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు 42 రోజుల సమ్మెకాలాన్ని వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం ఆర్టీసీకి ఎందుకు వర్తింపజేయలేదని ఆ సంఘం నేతలు బాబు, రాజిరెడ్డి ప్రశ్నిం చారు. ఆర్టీసీ కార్మికులకు కూడా ప్రత్యేక సెలవుగా ప్రకటించాలని శనివారం ఇక్కడ జరిగిన సంతకాల సేకరణ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ నెల ఐదో తేదీన ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 30 వేల మంది సంతకాలు చేశారని, దీన్ని 25వ తేదీ వరకు పొడిగిస్తున్నామని వెల్లడించారు. డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తెండి: ఎన్ఎంయూ డీజిల్ను జీఎస్టీ (12 శాతం పన్ను) పరిధిలోకి తేవటం వల్ల దాని ధర భారీగా తగ్గించి ప్రజలకు మేలు చేసే వెసులుబాటు కలుగుతుందని ఆర్టీసీ ఎన్ఎంయూ డిమాండ్ చేసింది. ముఖ్యంగా డీజిల్ ధర తగ్గి ఆర్టీసీకి సాలీనా రూ.500 కోట్ల మేర భారం తగ్గుతుందని ఆ సంఘం నేతలు నాగేశ్వరరావు, కమాల్రెడ్డి, నరేందర్ మౌలానా ఒక ప్రకటనలో తెలిపారు. -
జగన్తోనే ఆర్టీసీకి భరోసా
కర్నూలు(రాజ్విహార్), న్యూస్లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే ఆర్టీసీ మనుగడకు భరోసా లభిస్తుందని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎం.వి.కుమార్ అన్నారు. ఇటీవలే వైఎస్సార్సీపీలో చేరిన ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ మహమూద్ను ఆయన బుధవారం హైదరాబాదులో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎంయూ, వైఎస్సార్ఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్లు కూడా జగన్ ముఖ్యమంత్రి కావాలని జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సంస్థ మనుగడ కోసం యూనియన్లను పక్కనపెట్టి వైఎస్సార్సీపీని గెలిపించాలని సయ్యద్ మహమ్మద్ కార్మికులకు సూచించినట్లు ఎంవీ కుమార్ తెలిపారు.