breaking news
rs.crore
-
జీఎస్టీ లాటరీ : ఇలా చేస్తే కోటి రూపాయలు మీవే!
సాక్షి, న్యూఢిల్లీ: ఒక దేశం, ఒకే పన్ను అంటూ బీజేపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ)పై మరోసారి వినియోగదారులకు, వ్యాపారులకు బంపర్ ఆఫర్ గెల్చుకునే అవకాశాన్ని కేంద్రం పరిశీలీస్తోంది. జీఎస్టీ వినియోగదారుల లావాదేవీలు (బీ టూ సీ) , వ్యాపారాల ఇన్వాయిస్లపై ప్రతి నెలా లక్కీ డ్రాలు నిర్వహించనుంది. ఏప్రిల్ 1 నుంచి రూ .10 లక్షల నుంచి రూ .1 కోట్ల మధ్య లాటరీ ఆఫర్లను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వస్తువుల కొనుగోళ్లు సందర్భంగా తప్పనిసరిగా బిల్లులు తీసుకునేలా వినియోగదారులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. వస్తువులు కొన్న తర్వాత వినియోగదారులు తీసుకునే బిల్లు ద్వారా లాటరీని గెల్చుకోవడానికి అర్హత పొందుతారు. ఈ పథకం కింద, రెవెన్యూ విభాగం నెలవారీ లక్కీ డ్రాలను నిర్వహిస్తుంది. ఇందులో ఒక బంపర్ బహుమతితోపాటు, రెండవ, మూడవ బహుమతులు రాష్ట్రాల వారీగా ఉంటాయని ఒక అధికారి తెలిపారు. లాటరీ ఆఫర్లు రూ .10 లక్షల నుంచి రూ .1 కోట్ల మధ్య ఉంటాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (సీబీఐసీ) సభ్యుడు జాన్ జోసెఫ్ గత నెలలోనే ప్రకటించడం గమనార్హం. దీని ప్రకారం కస్టమర్ మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు బిల్లును స్కాన్ చేసి జీఎస్టీ నెట్వర్క్ (జీఎస్టీఎన్)లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ యాప్ ఈ నెల చివరి నాటికి ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. లక్కీ డ్రాకు అర్హత పొందడానికి ఇన్వాయిస్ విలువపై ఎటువంటి పరిమితి లేదు. -
చలివేంద్రాల నిర్వహణకు రూ.కోటి
అనంతపురం అర్బన్ : వేసవిలో చలివేంద్రాలు, మజ్జిగ సరఫరా, ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ, షెల్టర్లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లాకు రూ.కోటి మంజూరు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయదగిన పనులు, చేయకూడనవి ప్రజలకు తెలియజేస్తూ కరపత్రాలు పంచాలని, బ్యానర్లను ఏర్పాటు చేయాలని సూచించింది. -
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రూ.కోటి బంగారం పట్టివేత
శంషాబాద్ ఎయిర్పోర్టులో బుధవారం ఉదయం ఓ ప్రయాణీకుడిని నుంచి భారీ ఎత్తున బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన రషీద్ అనే ప్రయాణీకుడితోపాటు అతని లగేజీని తనిఖీ చేయగా పెద్ద ఎత్తున అభరణాలు కనుగొన్నామని తెలిపారు. ఉదయం 7.30 గం.లకు ఎయిర్ పోర్ట్ లో దిగిన అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం ఆభరణాల విలువ రూ. కోటి పైగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెప్పారు. అనంతరం అతడిని ఎయిర్పోర్ట్లోని పోలీసులకు అప్పగించామన్నారు. రషీద్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు తెలిపారు.