breaking news
rs.1 lakh
-
తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్!
భారతదేశంలో ద్విచక్ర వాహన మార్కెట్ ఎప్పుడూ బడ్జెట్ వినియోగదారుల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఎక్కువ మంది కొనుగోలుదారులు తక్కువ ధరలో మంచి మైలేజ్, నమ్మకమైన పనితీరు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ఉన్న బైకులను కోరుకుంటారు. ఈ కారణంగానే కమ్యూటర్ బైక్స్ చాలాకాలంగా మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ కథనంలో రూ.1 లక్ష కంటే తక్కువ ధరలో లభించే బైకుల గురించి తెలుసుకుందాం.టీవీఎస్ స్పోర్ట్ (రూ.55,500 - రూ.57,500)టీవీఎస్ స్పోర్ట్ అనేది బడ్జెట్ సెగ్మెంట్లో అత్యంత తక్కువ ధరలో లభించే కమ్యూటర్ బైక్లలో ఒకటి. ఇది ముఖ్యంగా రోజువారీ ఆఫీస్ వెళ్లేవాళ్లు, ఎక్కువ దూరం ప్రయాణించే వినియోగదారుల కోసం రూపొందించారు. ఇది 109.7cc ఇంజిన్తో 8.1 హార్స్ పవర్ అందిస్తుంది. పెద్దగా స్పోర్టీ ఫీచర్లు లేకపోయినా, దీని అసలు బలం మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులోనే ఉంటుంది. సిటీ ట్రాఫిక్లో సులభంగా నడపగలిగేలా ఇది చాలా లైట్గా ఉంటుంది.హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (రూ.58,977 - రూ.71,470)హీరో హెచ్ఎఫ్ డీలక్స్ భారతదేశంలో అత్యంత పాపులర్ కమ్యూటర్ బైక్లలో ఒకటి. దీని సింపుల్ డిజైన్, నమ్మకమైన పనితీరు దీన్ని చాలా మంది మొదటి ఎంపికగా మార్చాయి. ఇందులోని 97.2cc ఇంజిన్ 7.9 హార్స్ పవర్ అందిస్తుంది. మంచి మైలేజ్ అందించే ఈ బైక్ మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువే. ఇందులో ఎల్ఈడీ హెడ్లైట్, స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ కూడా ఉన్నాయి.బజాజ్ ప్లాటినా 100 (రూ.65,407)బజాజ్ ప్లాటినా 100 అనేది కంఫర్ట్ రైడింగ్ కోసం రూపొందించిన సింపుల్ కమ్యూటర్ బైక్. దీని 99.59cc ఇంజిన్ సుమారు 7.9hp పవర్ అందిస్తుంది. ఈ బైక్ సాఫ్ట్ సస్పెన్షన్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది. రోడ్లు కొంత కఠినంగా ఉన్నప్పటికీ ఇది సౌకర్యవంతంగా ప్రయాణించడానికి సహాయపడుతుంది.బజాజ్ ప్లాటినా 110 (రూ.69,284)బజాజ్ ప్లాటినా 110 అనేది ప్లాటినా 100 కంటే కొంచెం అప్గ్రేడ్ వెర్షన్. ఇందులో 115.45cc ఇంజిన్ ఉంటుంది, ఇది 8.6hp పవర్ అందిస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్బాక్స్ ఉండటం వల్ల హైవే రైడింగ్ కూడా కొంచెం స్మూత్గా ఉంటుంది. సస్పెన్షన్ కూడా మెరుగ్గా ఉండటం వల్ల ఎక్కువ దూరం ప్రయాణానికి ఇది అనుకూలంగా ఉంటుంది.బజాజ్ పల్సర్ 125 (రూ.79,048 - రూ.87,527)పల్సర్ 125 ఈ జాబితాలో స్పోర్టీ లుక్ కలిగిన బైక్. ఇది 124.4cc ఇంజిన్తో 11.8hp పవర్ అందిస్తుంది. ఇది కేవలం కమ్యూటర్ బైక్ మాత్రమే కాదు, కొంచెం స్టైల్ అండ్ రోడ్ ప్రెజెన్స్ కూడా ఇస్తుంది. డిజైన్ కూడా పెద్ద పల్సర్ 150 మాదిరిగా ఉంటుంది. యువతకు బాగా నచ్చిన బైకుల్లో ఇది ఒకటి. -
పండుగల సీజన్లో ‘మారుతీ’ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) తాజాగా మరో విడత భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. పండుగల సీజన్లో బంపర్ ఆఫర్ ఇచ్చింది. తాజాగా తన బాలెనో మోడల్ కారు ధరను రూ. 1,00,000 తగ్గించినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఈనెల 25న (బుధవారం) ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను రూ.5,000 వరకూ తగ్గించామని మారుతీ సుజుకీ ప్రకటించిన విషయం తెలిసిందే కాగా, ఇందుకు అదనంగా తాజా తగ్గింపు ఉంటుందని శుక్రవారం ప్రకటించింది. ఆల్టో 800, ఆల్టో కే10, స్విఫ్ట్ డీజిల్ సెలెరియో, బాలెనో డీజిల్, ఇగ్నిస్, డిజైర్ డీజిల్, టూ ర్ ఎస్ డీజిల్, విటారా బ్రెజా, ఎస్–క్రాస్ మోడళ్ల ధరలను రూ. 5వేల వరకు ఈ వారంలో తగ్గించిం ది. ఆటో పరిశ్రమ సంక్షోభాన్ని చవిచూస్తోన్న నేపథ్యంలో తమ కంపెనీ అమ్మకాలను పెంచే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. -
ఇక అరుణ పేరిట అవార్డు
భోపాల్: 42 ఏళ్ల పాటు జీవచ్ఛవంలా బతికి, కన్నుమూసిన అరుణా షాన్ బాగ్కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం గొప్ప నివాళి అర్పించింది. ఆమె పేరిట గొప్ప అవార్డును ప్రకటించింది. ఇక మహిళలపై దోపిడికి వ్యతిరేకంగా పోరాడే ఏ స్వచ్ఛంద సంస్థకై ప్రతి యేటా అరుణా షాన్ బాగ్ పేరిట రూ.లక్షతో అవార్డు ఇస్తామని చెప్పింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అరుణకు ఘన సంతాపం వ్యక్తం చేశారు. ఆమె జీవితంలో జరిగిన ఘటన అత్యంత బాధాకరమని చెప్పారు. గౌరవానికి అరుణ చిహ్నం అని అభివర్ణించారు. చట్టాల్లో మార్పు తీసుకురావాల్సిన తరుణం వచ్చిందని చెప్పారు. సమాజంలో మహిళలపట్ల ఆలోచన ధోరణి మారాల్సిన అవసరం ఉందన్నారు. ప్రేమించిన డాక్టరు సందీప్ను పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో హాయిగా ఉండాల్సిన అరుణ, ఓ దుర్మార్గుడి దురాగతంతో అచేతనంగా మారిపోయింది. దాదాపు 42 ఏళ్లపాటు జీవచ్ఛవంలా బతికి చివరకు ప్రాణాలు విడిచింది.


