-
రాజన్న క్యాంటీన్ రూ.4కే భోజనం
-
బయటపడిన నల్లధనం రూ.4,900 కోట్లే
న్యూఢిల్లీ: గతేడాది నవంబర్లో పెద్ద నోట్లను రద్దు చేసిన అనంతరం స్వచ్ఛందంగా నల్లధనం వెల్లడికి మోదీ సర్కారు తీసుకొచ్చిన ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ పథకానికి స్పందన స్వల్పంగానే ఉంది. 21 వేల మంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. రూ.4,900 కోట్ల మేర నల్లధనం వివరాలను వీరు స్వచ్ఛందంగా వెల్లడించారు. ఈ పథకం మార్చి 31తో ముగిసిపోయింది. ఇవి తుది వివరాలని, వీటి ఆధారంగా రూ.2,451 కోట్ల పన్ను రాబట్టినట్టు ఆదాయపన్ను శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. కొన్ని కేసుల్లో వివరాల ఆధారంగా న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించనున్నట్టు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం లెక్కల్లో చూపని ఆదాయాన్ని (బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లు సైతం) గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద స్వయంగా వెల్లడించి 50 శాతం పన్ను చెల్లింపుతో బయటపడొచ్చని కేంద్ర సర్కారు సూచించింది. మిగిలిన మొత్తంలో సగాన్ని నాలుగేళ్ల పాటు వడ్డీ రహితంగా ప్రభుత్వం వద్ద కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొంది. నల్లధనం కలిగిన వారికి ఇదే చివరి అవకాశమని, ఆ తర్వాత అధికారులు గుర్తిస్తే 200 శాతం వరకూ పన్ను చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఓ దశలో హెచ్చరిక కూడా చేసింది. ఈ పథకం మార్చిలో ముగియగా, వచ్చిన స్పందన ఆశాజనకంగా లేదని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా అప్పట్లోనే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
మూడు రెట్లు పెరిగిన ఓఎన్జీసీ లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ)నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో మూడు రెట్లు పెరిగింది. గత క్యూ3లో రూ.1,466 కోట్లుగా ఉన్న తమ నికర లాభం ఈ క్యూ3లో రూ.4,352 కోట్లకు ఎగసిందని ఓఎన్జీసీ తెలిపింది. ముడి చమురు ధరలు అధికంగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం వచ్చిందని వివరించింది. చమురు ఉత్పత్తి 2 శాతం క్షీణించి 6.4 మిలియన్ టన్నులకు తగ్గగా, గ్యాస్ ఉత్పత్తి 4.4 శాతం వృద్ధి చెంది 6.025 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పెరిగిందని పేర్కొంది. ఒక్కో షేర్కు రూ.2.25 డివిడెండ్: రూ. 5 ముఖవిలువ గల ఒక్కో షేర్కు రూ.2.25 రెండవ మధ్యతంర డివిడెండ్(45 శాతం)ను ఇవ్వనున్నామని కంపెనీ తెలిపింది. మొత్తం రూ.2,887 కోట్లు డివిడెండ్గా చెల్లించనున్నామని, దీంట్లో ప్రభుత్వం వాటా రూ.1,973 కోట్లని ఓఎన్జీసీ పేర్కొంది. -
విత్డ్రా పరిమితిపై ఆంక్షలు సడలింపు?
-
విత్డ్రా పరిమితిపై ఆంక్షలు సడలింపు?
బ్లాక్మనీపై సర్జికల్ స్ట్రైక్ ప్రకటిస్తూ నోట్ల రద్దుపై విధించిన తుది గడువు డిసెంబర్ 30 సమీపిస్తోంది. దాదాపు 50 రోజుల అనంతరం అంటే డిసెంబర్ 30న ప్రధాని నరేంద్రమోదీ డీమోనిటైజేషన్పై ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో మోదీ బ్యాంకులు, ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకునే నగదు పరిమితులను సడలించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం నిబంధనల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేలా ప్రధాని ప్రకటన చేయనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతమున్న రోజుకు రూ.2,500, వారానికి రూ.24,000 పరిమితిని సడలించి, రోజుకు రూ.4000, వారానికి రూ.40,000 తీసుకునేలా ప్రకటన వచ్చే అవకాశాలున్నాయంటున్నాయి. నవంబర్ 8న రాత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని సంచలన నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశాక, ద్రవ్య పరిస్థితిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి తనకు 50 రోజులు గడువు ఇవ్వాలని ప్రజలను కోరారు. అయితే ఇంకా నగదు సమస్య కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నగదు విత్డ్రాలపై విధించిన పరిమితిని పూర్తిగా ఎత్తివేయకుండా, దానిలో కొంత ప్రజలకు ఉపశమనం కలిగించేలా చేయాలని యోచిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని డిసెంబర్ 30న సాయంత్రం ప్రధాని ప్రజలనుద్దేశించి చేయబోయే ప్రకటనలో ఉండొచ్చని చెబుతున్నాయి. ప్రధాని ఆ రోజు రాత్రి 8 గంటలకు ప్రసంగించనున్నారు. నగదు కొరత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త రూ.500, రూ.2000 నోట్ల ప్రింటింగ్కు డిసెంబర్ 22 నుంచి టెండర్లు వేయనున్నారని తెలుస్తోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement