breaking news
Rs 2000 bank note
-
వ్యవస్థలో మూలుగుతున్న రూ.2000 నోట్లు!
రెండు వేల రూపాయల నోట్లకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక గణాంకాలు వెల్లడించింది. రూ.2000 నోట్లు రద్దయి రెండేళ్లు గడిచినా ఇంకా చెలామణిలో ఉన్నాయని ఆర్బీఐ సోమవారం విడుదల చేసిన రిపోర్ట్లో తెలిపింది. మే 31, 2025 వరకు ఇంకా వ్యవస్థలో రూ.6,181 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఉన్నాయని చెప్పింది. 2023 మే 19 నాటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 98.26% మాత్రమే తిరిగి వచ్చాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.2023 మే 19న చలామణిలో ఉన్న రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ ప్రకటన రోజున చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్ల నుంచి 2025 మే 31 నాటికి రూ.6,181 కోట్లకు పడిపోయిందని ఆర్బీఐ పేర్కొంది. రూ.2000 నోట్ల రద్దు సమయంలో 2023 అక్టోబర్ 7 వరకు బ్యాంకు శాఖల్లో వీటి డిపాజిట్ లేదా మార్పిడి చేసుకునే అవకాశం ఉందని ఆర్బీఐ తెలిపింది. దాంతో చాలామంది వారి వద్ద ఉన్న నోట్లను సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి మార్చుకున్నారు. అప్పటికీ మార్చుకోలేనివారు ఆ తేదీ తరువాత దేశవ్యాప్తంగా ఆర్బీఐకు చెందిన 19 కార్యాలయాల్లో ఈ నోట్లను మార్చుకునే వీలు కల్పించింది.ఇదీ చదవండి: నెలలో 22,315 యూనిట్లు సరఫరా2023 అక్టోబరు 9 నుంచి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు రూ.2000 నోట్లను బ్యాంక్ ఖాతాలలో డిపాజిట్ చేయడానికి స్వీకరిస్తున్నాయి. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో 19 ఆర్బీఐ కార్యాలయాలు ఉన్నాయి. నేరుగా వీటి ద్వారా రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు. లేదా పోస్ట్ ద్వారా ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలకు పంపవచ్చు. -
రూ. 2 వేల నోట్లు: ఆర్బీఐ కీలక ప్రకటన
అతిపెద్ద కరెన్సీ నోటు రూ.2,000 నోట్లను (మే 19న) ఉపసంహరించుకున్న తర్వాత రిజర్వ్బ్యాంకు ఆఫ్ ఇండియా సోమవారం కీలక ప్రకటన చేసింది. జూన్ 30 నాటికి 76 శాతం వరకు పింక్ నోట్స్ బ్యాంకులకు అందాయని సోమవారం తెలిపింది. ఇప్పటివరకు తిరిగి వచ్చిన మొత్తం నోట్ల విలువ రూ. 2.72 లక్షల కోట్లని ఆర్బీఐ తెలిపింది. (స్టార్ క్రికెటర్ కోహ్లీ, ఫస్ట్ కారు ఏదో తెలుసా? దుమ్మురేపే లగ్జరీ కార్ల కలెక్షన్) మార్చి 31, 2023న రూ. 3.62 లక్షల కోట్లకు చలామణిలో ఉన్న రూ. 2,000 నోట్ల మొత్తం విలువ మే 19, 2023న వ్యాపారం ముగిసే సమయానికి రూ. 3.56 లక్షల కోట్లకు తగ్గింది. బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం మే 19న ప్రకటన తర్వాత 2023 జూన్ 30 వరకు చెలామణి నుండి తిరిగి పొందిన రూ. 2,000 నోట్ల మొత్తం విలువ రూ. 2.72 లక్షల కోట్లు. తత్ఫలితంగా, జూన్ 30న వ్యాపారం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లు రూ.84,000గా ఉన్నాయనీ మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లలో 76శాతం తిరిగి వచ్చాయని ఆర్బిఐ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే చెలామణి నుండి తిరిగి వచ్చిన రూ. 2,000 మొత్తం నోట్లలో 87శాతం డిపాజిట్ల రూపంలో ఉండగా, మిగిలిన 13శాతం ఇతర డినామినేషన్ నోట్లలోకి మార్పిడి జరిగినట్టు ఆర్బీఐ వెల్లడించింది. సెప్టెంబర్ 30, 2023 నాటికి రెండు వేల నోట్ల మార్పిడికి ముగియనున్న సంగతి తెలిసిందే. కనుక ప్రజలు తమవద్ద ఉన్న రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయడానికి /లేదా మార్చుకోవడానికి వచ్చే మూడు నెలల సమయాన్ని ఉపయోగించుకోవాలని ఆర్బిఐ ఒక ప్రకటనలో తెలిపింది.(Tata Motors Price Hike: కొనుగోలుదారులకు టాటా మోటార్స్ షాక్!) కాగా చలామణీలో ఉన్న రూ. 500, 1000 నోట్ల రద్దు తరువాత నవంబర్ 2016లో రూ. 2 వేల నోటును తీసుకొచ్చిన సంగతి తె లిసిందే. అయితే 2018-19లో రూ. 2,000 నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది. -
ఐడీ ప్రూఫ్ లేకుండా రూ.2000 నోటు మార్పిడి.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: రూ. 2 వేల నోట్ల మార్పిడికి ఐడీ ప్రూఫ్ తప్పనిసరా కాదా అనే అంశంపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఎలాంటి రిక్విజిషన్ స్లిప్, ఐడీ ప్రూఫ్ లేకుండా రూ. 2,000 నోట్లను మార్చుకోవడానికి హైకోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిల్ను ధర్మాసనం కొట్టివేసింది. నోట్ల రద్దు అనంతరం.. ఎలాంటి గుర్తింపు కార్డు అవసరం లేకుండానే 2,000 రూపాయల నోట్ల మార్చుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. ఇదే దారిలో ఎస్బీఐ కూడా నడిచింది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆర్బీఐ, ఎస్బీఐ నోటిఫికేషన్లు ఏకపక్షంగా, అహేతుకంగా ఉన్నాయని, రాజ్యాంగంలోని 14వ అధికరణను ఉల్లంఘించేలా ఉందని అందులో పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరారు. ఆర్బీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రూ.2,000 నోట్లను ఉపసంహరించుకోవడం నోట్ల రద్దు కాదని, చట్టబద్ధమైన చర్య అని ఆయన వాదించారు. చివరికి ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. ఎలాంటి ఐడీ ప్రూఫ్ లేకపోయినా రెండు వేల రూపాయల నోట్లు మార్చుకోవచ్చని తీర్పు వెలువరించింది. చదవండి: కరెంట్ బిల్లులు చెల్లించకపోతే నెక్స్ట్ జరిగేది ఇదే: విద్యుత్ శాఖ వార్నింగ్! -
రూ.2 వేల నోటు: జూన్ బ్యాంకు హాలిడేస్ లిస్ట్ చూస్తే షాకవుతారు!
సాక్షి,ముంబై: ప్రతీ నెల చివరి వారంలో తదుపరి నెలలోని పండుగలు, బ్యాంకు హాలిడేస్పై ఆసక్తి ఉంటుంది. అందులోనూ పెద్ద నోటు రూ.2 వేల రీకాల్ నేపథ్యంలో జూన్ నెలలో బ్యాంకుల సెలవులకు మరింత ప్రాధాన్యత నెలకొంది. జూన్లో ఏకంగా 12 రోజులు బ్యాంకులు మూతపడనుండటం ఒక విధంగా నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తున్న ఖాతాదారులకు షాకింగ్ అనే చెప్పాలి. (ఐపీఎల్ 2023: ముంబై ఇండియన్స్ ద్వారా అంబానీల సంపాదన ఎంతో తెలుసా?) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన ప్రకారం ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్ల మార్పిడికి, డిపాజిట్లకు గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రెండు , నాలుగు శనివారాలు, ఆదివారాలతో కలిపి జూన్ నెలలో మొత్తం 12 రోజుల సెలవుల వివరాలు మీకోసం.. జూన్ నెలలో బ్యాంకుల సెలవులు జూన్ 4: ఆదివారం జూన్ 10: రెండో శనివారం జూన్ 11: ఆదివారం జూన్ 15: రాజా సంక్రాంతి కారణంగా మిజోరం, ఒడిశాలో బ్యాంకులకు సెలవు జూన్ 18: ఆదివారం జూన్ 20: రథయాత్ర ఒడిశా, మణిపూర్లో సెలవు జూన్ 24: చివరి, నాలుగో శనివారం జూన్ 25: ఆదివారం జూన్26: త్రిపురలో మాత్రమే సెలవు జూన్ 28: ఈద్ ఉల్ అజా, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్, కేరళల బ్యాంకులకు సెలవు జూన్ 29: బక్రీద్ దేశవ్యాప్తంగా సెలవు జూన్ 30: రెమ్నా ఈద్-ఉల్-అజా మిజోరం, ఒడిశాలో సెలవు. ఇదీ చదవండి: మరో 9 వేల మందికి పింక్ స్లిప్స్ సిద్ధం: రూ 2 వేల కోట్ల డీలే కారణమా? Neuralink మనిషి మెదడులో చిప్ ప్రయోగాలు: మేము సైతం అంటున్న ట్వీపుల్ -
Rs 2000 notes withdraw: బ్యాంకులు ఈ నోట్లను తిరస్కరిస్తే ఏం చేయాలో తెలుసా?
సాక్షి,ముంబై: 2 వేల రూపాయల నోటును రీకాల్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోటును అన్ని బ్యాంకు శాఖలతో పాటు దేశవ్యాప్తంగా ఆర్బీఐకి ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లో మార్పిడి చేసుకోవచ్చని, డిపాజిట్ చేసుకోవచ్చని కూడా ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. దీనికి సంబంధించిన గడువు సెప్టెంబర్ 30వ తేదీతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో 2 వేల రూపాయల నోటు 2023 అక్టోబరు ఒకటి నుంచి చెల్లుబాటులో ఉండవు. మే 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు బ్యాంకుల్లో ఈ రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు. అయితే, ఒక రోజులో ఒకవ్యక్తి గరిష్టంగా రూ. 20 వేల విలువైన నోట్ల వరకు మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది. అయితే డిపాజిట్ల విషయంలో ఎలాంటి పరిమితి లేదు. దీనికి సంబంధించి కీలక ఆదేశాలు బ్యాంకులకు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: జేబులోనే పేలిన మొబైల్: షాకింగ్ వీడియో వైరల్ రూ. 2000 నోటు మార్పిడికి డిపాజిట్లకు బ్యాంకులు నిరాకరిస్తే? ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంరూ. 2 వేల నోట్లను గడుపు లోపల తీసుకునేందుకు నిరాకరించవు. ఒక వేళ బ్యాంకులు నిరాకరిస్తే ఏంచేయాలనేది వినియోగదారులకుపెద్ద ప్రశ్న. రూ. 2వేల నోటును మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి బ్యాంకు నిరాకరించినట్లయితే, సంబంధిత బ్యాంకులో ఫిర్యాదు చేయవచ్చు. (రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా?) అలాంటి అనుభవం ఎదురైతే కొత్త వన్ నేషన్, వన్ అంబుడ్స్మన్ స్కీమ్ కింద నాలుగు మార్గాల్లో ఫిర్యాదును నమోదు చేయవచ్చు. టోల్ ఫ్రీ నంబర్ 14448కి ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:15 గంటల మధ్య కాల్ చేయవచ్చు. అలాగే ఆర్బీఐకి ఈ ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే సెంట్రలైజ్డ్ రసీదు అండ్ ప్రాసెసింగ్ సెంటర్', రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 4వ అంతస్తు, సెక్టార్ 17, చండీగఢ్ - 160017 అనే చిరునామాకు పోస్ట్ ద్వారా భౌతిక ఫిర్యాదును పంపవచ్చు. -
రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా?
సాక్షి,ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2 వేల కరెన్సీ నోట్లను ఉపసంహరించు కుంటున్నట్టు చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. 2018 నుంచి రూ. 2 వేల నోట్లను ముద్రణను నిలిపివేసిన నేపథ్యంలో గత కొంతకాలంగా ఈ నోట్ల రద్దుపై భారీ ఊహాగానాలున్నాయి. అయితే తాజాగా రూ. 2000 నోట్లను చలామణి నుంచి విత్ డ్రా చేస్తున్నట్టు, అయితే సెప్టెంబరు 30 వరకు చట్టబద్ధంగా కొనసాగుతాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. తక్షణమే 2,000 నోట్ల జారీ నిలిపివేయాలని కూడా బ్యాంకులకు ఆదేశించింది. అలాగే డిపాజిట్ /లేదా మార్పిడి సదుపాయాన్ని అందించాలని బ్యాంకులను కోరింది. ('క్లీన్ నోట్ పాలసీ' అంటే? ఆర్బీఐ బ్యాంకులకిచ్చిన కీలక ఆదేశాలు తెలుసుకోండి!) అయితే దీనిపై ప్రముఖ ఎనలిస్ట్ లతా వెంకటేశ్ దీనిపై ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. 2000రూపాయి నోట్లు చలామణి నుండి ఉపసంహరణ తప్ప నోట్ల డీమోనిటైజేషన్ కాదని దయచేసి గమనించాలని ఆమె పేర్కొన్నారు. అవి చట్టపరమైన టెండర్గా ఉంటాయి. అంటే మీరు దుకాణానికి వెళ్లి దానితో వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ప్రజలు భయాందోళన చెందకముందే దయచేసి ఈ విషయంపై అవగాహన కల్పించాలంటూ ట్వీట్ చేశారు. అంతేకాదుఆర్బీఐ ప్రకటన తరువాత ఏ దుకాణదారుడు ఇప్పటి నుండి అంగీకరించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30, 2023 లోపు బ్యాంకుకు వెళ్లి మార్పిడి లేదా డిపాజిట్ చేయవచ్చు అని ఆమె వివరించారు. ఏ షాప్ ఓనర్ అంగీకరిస్తాడు అయితే కొనుగోలు సమయంలో ఏ దుకాణ దారుడు వీటిని అంగీకరిస్తాడు అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే ఈనోట్లను సెప్టెంబర్ 30 వరకు మాత్రమే. ఆ తర్వాత అది ఉనికిలో ఉండదు. అంటే రిస్క్ అతని చేతిలో ఉంటుంది. ఎందుకంటే షాప్ ఓనరే ఆయా నోట్లను డిపాజిట్ చేయాలి. లేదా మార్పిడి చేసుకోవాలి. అయితే డిపాజిట్ల విషయంలో పరిమితి ఏదీ లేనప్పటికీ, మార్పిడి మాత్రం ఒకసారి 20000 (అంటే 10 నోట్లు) మాత్రమే అవకాశం. (Rs 2000 Note Ban: రూ. 2 వేల నోట్లు రద్దు) వెన్నాడుతున్న డీమానిటైజేషన్ భయాలు 2016 లో డీమానిటైజేషన్ దేశవ్యాప్తంగా పెద్ద ప్రకంపనలు రేపింది. ఇచ్చిన గడువులోగా తమ దగ్గర ఉన్న రూ. 500, 1000 నోట్లమార్పిడి కోసం బ్యాంకుల వద్ద వినియోగదారులు క్యూలైన్లలో బారులు తీరారు. కొంతమంది క్యూలైన్లలోనే ప్రాణాలు విడిచిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించిన అనేక దృశ్యాలు, విషాద ఘటనలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. Once again, no need to panic. Old notes with lower safety features were withdrawn even in the past. But they remain valid currency. Deadline given, I think, only to encourage people to exchange their notes by Sept. But rest assured, they are valid currency And will remain so. — Latha Venkatesh (@latha_venkatesh) May 19, 2023 2016: New note is coming! This will totally eliminate black money. What a Masterstroke! 2023: New note is going away! This will totally eliminate black money. What a Masterstroke! — Dhruv Rathee (@dhruv_rathee) May 19, 2023 -
'క్లీన్ నోట్ పాలసీ' అంటే? ఆర్బీఐ బ్యాంకులకిచ్చిన కీలక ఆదేశాలు తెలుసుకోండి!
సాక్షి,ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2వేల కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుని మరోసారి షాకిచ్చింది. అయితే ఇది చట్టబద్ధమైన టెండర్గా కొనసాగుతుందని తెలిపింది. 'క్లీన్ నోట్ పాలసీ' లో భాగంగానే ఈనిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ శుక్రవారం నాటి ప్రకటనలో వెల్లడించింది. అంతేకాదు కస్టమర్లకు రూ. 2వేల నోట్లను జారీని తక్షణమే నిలిపివేయాలని బ్యాంకులకు ఆదేశించింది.అలాగే అన్ని బ్యాంకులు సెప్టెంబర్ 30, 2023 వరకు 2,000 నోట్లకు డిపాజిట్ /లేదా మార్పిడిని అవకాశాన్ని కల్పించాలని కూడా ఆదేశించింది. అలాగే మే 23, 2023 నుండి ఏ బ్యాంక్లోనైనా రూ. 2000 నోట్లను ఇతర డినామినేషన్ల నోట్లలోకి మార్చుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. 'క్లీన్ నోట్ పాలసీ' అంటే ఏమిటి? ప్రజలకు మంచి నాణ్యమైన నోట్లు అందుబాటులో ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుసరించే విధానమే క్లీన్ నోట్ పాలసీ. 2016 నోట్లు రద్దు తరువాత రూ.2 వేల నోటునుతీసుకొచ్చింది ఆర్బీఐ. అయితే ఇతర డినామినేషన్లలోని నోట్లు తగిన పరిమాణంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత , 2018-19లో 2,000 నోట్ల ముద్రణ నిలిపివేసినట్టు ఆర్బీఐ పేర్కొంది. 2017 మార్చిలో 89 శాతం జారీ చేయగా వాటి జీవిత కాలం 4-5 సంవత్సరాల అంచనా వేసింది. 2018 మార్చి 31, నాటికి గరిష్టంగా ఉన్న రూ. 6.73 లక్షల కోట్ల (చెలామణీలో ఉన్న నోట్లలో 37.3 శాతం) మొత్తం విలువ రూ. 6.73 లక్షల కోట్ల నుంచి రూ. 3.62 లక్షల కోట్లకు తగ్గింది, ఇది కేవలం 10.8 శాతం మాత్రమే. 2016 నవంబరులో అప్పటిదాకా చలామణిలో ఉన్న పెద్ద నోట్లు రూ. 500, 1,000 నోట్లను రద్దు చేసింది. (Rs 2000 Note Ban: రూ. 2 వేల నోట్లు రద్దు) మరోవైపు రూ. 2వేల నోటు వితడడ్రా ప్రకటించిన వెంటనే ఆర్బీఐ వెబ్సైట్ క్రాష్ కావడం గమనార్హం. భారీ ట్రాఫిక్ కారణంగా ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ క్రాష్ అవడంతో యూజర్లు ఇబ్బందులు పడ్డారు. -
రూ.2 వేల నోట్లు: షాకింగ్ ఆర్టీఐ సమాధానం
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తరువాత చలామణిలోకి వచ్చిన 2 వేల రూపాయల కరెన్సీ నోట్లకు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. 2019-20, 2020-21, 2021-22లో ఒక్క రూ.2 వేల నోటు కూడా ముద్రించలేదట. ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు బదులుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ (పి) లిమిటెడ్ ఈ విషయాన్ని వెల్లడించింది. (Audi Q5Special Edition:స్పెషల్ ప్రైస్..లిమిటెడ్ పీరియడ్, త్వరపడండి!) 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్ 2వేల రూపాయల నోట్లను ముద్రించగా, ఈ సంఖ్య 2017-18లో 111.507మిలియన్లు తగ్గిపోయిందనీ, అలాగే 2018-19 ఏడాదిలో ఇది 46.690 మిలియన్ నోట్లుగా ఉందని ఐఏఎన్ఎస్ దాఖలు చేసిన RTI క్వెరీ లో తెలిపింది. మరోవైపు ఎన్సీఆర్బీ డేటా ప్రకారం దేశంలో స్వాధీనం చేసుకున్న 2 వేల రూపాయల నకిలీ కరెన్సీ నోట్ల సంఖ్య 2016-2020 మధ్య 2,272 నుండి 2,44,834కు గణనీయంగా పెరిగిందని పార్లమెంటులో ఇటీవల (ఆగస్టు 1న) సర్కార్ తెలిపింది.డేటా ప్రకారం, 2016లో దేశంలో పట్టుబడిన మొత్తం రూ.2,000 నకిలీ నోట్ల సంఖ్య 2,272 కాగా, 2017లో 74,898కి పెరిగి 2018లో 54,776కి తగ్గింది. 2019లో ఈ సంఖ్యలు 90,566గా ఉండగా, 2020గా ఈ సంఖ్య ఏకంగా 2,44,834గా ఉంది. (SuperMeteor 650: రాయల్ఎన్ఫీల్డ్ సూపర్ బైక్,సూపర్ ఫీచర్లతో) కాగా నవంబర్ 8, 2016న అప్పటికి చలామణీలో ఉన్న రూ. 500, రూ. 1,000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తరువాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2,000 నోటును ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. -
రూ. రెండువేల నోటు ఇలా ఉంటుంది!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) త్వరలోనే రెండువేల రూపాయల నోటు విడుదల చేస్తున్నదన్న వార్త ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో రాబోతున్న రూ. రెండువేల నోటు ఇదిగో ఇలా ఉంటుంది అంటూ కొన్ని ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. మొట్టమొదటిసారిగా మార్కెట్లోకి విడుదల అవుతున్న రెండువేల రూపాయల నోటు గులాబీ, తెలుపురంగుల్లో ఇలా ఉంటుందని పలు ఫొటోలు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి. ఆర్బీఐ కొత్తగా రెండువేల నోట్లకట్టలను విడుదల చేయబోతున్నదని, ఇప్పటికే మైసూర్లోని కరెన్నీ ప్రింటింగ్ ప్రెస్లో వీటి ముద్రణ కూడా పూర్తయిందని, త్వరలోనే ప్రజల్లోకి రానున్నాయని గత నెల 21న ‘ద హిందూ బిజినెస్లైన్’ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే, ఇటు కేంద్ర ప్రభుత్వం గానీ, అటు ఆర్బీఐగానీ ఈ కథానాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ అప్పుడు రూ. రెండువేల నోట్లు ముద్రణ అయ్యాయని, త్వరలోనే ప్రజల్లోకి రానున్నాయంటూ ఫేస్బుక్, వాట్సాప్లలో ఈ ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. ఇవి నిజమైన నోట్లా? కాదా? అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. New 2000 Rupees notes, will be available in a fortnight's time Aur yaha 1000 ka note jeb mein aye arsa ho gaya pic.twitter.com/JJaWog4cFI — Mohit Gulati