వ్యవస్థలో మూలుగుతున్న రూ.2000 నోట్లు! | Rs 6181 crore worth Rs 2000 banknotes remain in circulation | Sakshi
Sakshi News home page

వ్యవస్థలో మూలుగుతున్న రూ.2000 నోట్లు!

Jun 2 2025 3:13 PM | Updated on Jun 2 2025 3:43 PM

Rs 6181 crore worth Rs 2000 banknotes remain in circulation

రెండు వేల రూపాయల నోట్లకు సంబంధించి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక గణాంకాలు వెల్లడించింది. రూ.2000 నోట్లు రద్దయి రెండేళ్లు గడిచినా ఇంకా చెలామణిలో ఉన్నాయని ఆర్‌బీఐ సోమవారం విడుదల చేసిన రిపోర్ట్‌లో తెలిపింది. మే 31, 2025 వరకు ఇంకా వ్యవస్థలో రూ.6,181 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఉన్నాయని చెప్పింది. 2023 మే 19 నాటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 98.26% మాత్రమే తిరిగి వచ్చాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.

2023 మే 19న చలామణిలో ఉన్న రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ ప్రకటన రోజున చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్ల నుంచి 2025 మే 31 నాటికి రూ.6,181 కోట్లకు పడిపోయిందని ఆర్‌బీఐ పేర్కొంది. రూ.2000 నోట్ల రద్దు సమయంలో 2023 అక్టోబర్ 7 వరకు బ్యాంకు శాఖల్లో వీటి డిపాజిట్ లేదా మార్పిడి చేసుకునే అవకాశం ఉందని ఆర్‌బీఐ తెలిపింది. దాంతో చాలామంది వారి వద్ద ఉన్న నోట్లను సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి మార్చుకున్నారు. అప్పటికీ మార్చుకోలేనివారు ఆ తేదీ తరువాత దేశవ్యాప్తంగా ఆర్‌బీఐకు చెందిన 19 కార్యాలయాల్లో ఈ నోట్లను మార్చుకునే వీలు కల్పించింది.

ఇదీ చదవండి: నెలలో 22,315 యూనిట్లు సరఫరా

2023 అక్టోబరు 9 నుంచి ఆర్‌బీఐ ఇష్యూ కార్యాలయాలు రూ.2000 నోట్లను బ్యాంక్ ఖాతాలలో డిపాజిట్ చేయడానికి స్వీకరిస్తున్నాయి. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో 19 ఆర్బీఐ కార్యాలయాలు ఉన్నాయి. నేరుగా వీటి ద్వారా రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు. లేదా పోస్ట్ ద్వారా ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలకు పంపవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement