నెలలో 22,315 యూనిట్లు సరఫరా | Kia India Reports Strong Year on Year Growth in May | Sakshi
Sakshi News home page

నెలలో 22,315 యూనిట్లు సరఫరా

Jun 2 2025 2:27 PM | Updated on Jun 2 2025 3:21 PM

Kia India Reports Strong Year on Year Growth in May

భారత ఆటోమోటివ్ మార్కెట్‌లో కియా ఇండియా తన ఉనికిని బలోపేతం చేస్తున్నట్లు తెలిపింది. మే 2025లో దేశీయంగా డీలర్లకు పంపించిన కార్ల సరఫరాలో సంవత్సరం ప్రాతిపదికన 14% వృద్ధిని నమోదు చేసినట్లు పేర్కొంది. మే 2023లో 19,500 యూనిట్లతో పోలిస్తే మే 2025లో కంపెనీ 22,315 యూనిట్లను సరఫరా చేసినట్లు బిల్లులు దాఖలు చేసింది. ఈ పెరుగుదల కియా పోర్ట్‌ఫోలియోకు పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్‌ను ప్రతిబింబిస్తుందని కంపెనీ చెప్పింది.

ఇదీ చదవండి: పన్ను ఆదా కోసం ఫేక్‌ చేస్తే.. కొత్త రూల్స్‌తో కొరడా

కారెన్స్ క్లావిస్

కియా లైనప్‌లో ఇటీవల ఆవిష్కరించిన కారెన్స్ క్లావిస్ మోడల్‌ గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని అధికారులు చెప్పారు. ఈ మోడల్‌ స్టైల్, ఫంక్షనాలిటీ, అత్యాధునిక టెక్నాలజీ వినియోగదారులకు ఆకర్షిస్తుందని తెలిపారు. కాంపాక్ట్ ఎస్‌యూవీల నుంచి ప్రీమియం ఎంపీవీల వరకు వివిధ రకాల వాహనాలను అందించడంపై సంస్థ దృష్టి సారించిందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement