breaking news
Rs 10 cr gift
-
అదృష్టం అంటే వీళ్లది.. రూ. 10కోట్ల జాక్పాట్ కొట్టేశారు
అదృష్టం ఉండాలేగానీ.. డబ్బు దానంతట అదే మనల్ని చేరుకుంటుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ ఎలా ఎవరి తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. తాజాగా అలాంటి ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన డా.ఎం ప్రదీప్, అతని బంధువు ఎన్ రమేశ్కు కేరళలో రూ.10కోట్ల లాటరీ తగిలింది. అయితే, వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం విదేశం నుంచి వచ్చిన తమ బంధువును ఇంటికి తీసుకువచ్చేందుకు కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయానికి వెళ్లారు. ఆ సమయంలో కేరళ విషు బంపర్ లాటరీ టికెట్ నడుస్తోంది. ఈ క్రమంలో వారిద్దరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఓ ఏజెంట్ వద్ద లాటరీ టికెట్ను కొనుగోలు చేశారు. ఇక, ఈ నెల 15వ తేదీన లాటరీ డ్రాలో ఊహించని రీతిలో వీరిద్దరికి జాక్పాట్ తగిలింది. డ్రాలో వీరి టికెట్కు రూ.10కోట్ల లాటరీ తగిలింది. ఈ క్రమంలోనే లాటరీ నిర్వాహకులు వీరిని విజేతలుగా ప్రకటించారు. దీంతో వారు సోమవారం లాటరీ భవన్కు వెళ్లి టికెట్తో పాటు అవసరమైన పత్రాలు సమర్పించి రూ.10 కోట్లు తీసుకెళ్లారు. ఇది కూడా చదవండి: 35 రూపాయల కోసం ఐదేళ్ల పోరాటం -
'ఇవ్వకుండానే ఇచ్చారంటే ఎలా'
బాలీవుడ్ డస్కీ బ్యూటి బిపాషా బసు మరోసారి మీడియాపై ఫైర్ అయ్యింది. బిప్స్ పెళ్లి మొదలు...ఏదో ఒక సందర్భంలో మీడియాలో వస్తున్న వార్తలు, ఈ హాట్ బ్యూటీని హర్ట్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా బిపాషా, కరణ్ సింగ్ గ్రోవర్ల పెళ్లి సందర్భంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, ఓ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడన్న వార్త బాలీవుడ్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై స్పందించిన బ్లాక్ బ్యూటీ ఈ మధ్య కాలంలో తాను విన్న అతి పెద్ద రూమర్ ఇదేనంటూ కామెంట్ చేసింది. అంతేకాదు ఇలాంటి గిఫ్ట్ ఎవరిచ్చినా తాను తీసుకోనంటూ తేల్చి చెప్పింది. గిఫ్ట్ ఇవ్వకుండా ఇచ్చారంటూ ప్రచారం చేస్తే ఎలా అంటూ సీరియస్ అయ్యింది. మరి బిపాషా స్టేట్ మెంట్తో అయినా ఈ రూమర్స్కు తెరపడుతుందేమో చూడాలి. This is the biggest hogwash that I have ever read. Why would I take a gift like this ever from anyone?!?? https://t.co/Et1ccoNeUE — Bipasha Basu (@bipsluvurself) 16 June 2016