breaking news
RPF Inspector
-
యువతీయువకుల ఆత్మహత్య
నిజామాబాద్ సిటీ(నిజామాబాద్అర్బన్): ప్రేమ జంటగా భావిస్తున్న యువతీయువకులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. నగరంలోని కంఠేశ్వర్ రైల్వే కమాన్ ప్రాంతంలోని సోని ఫంక్షన్హాల్ (ఎల్లమ్మగుట్ట) వద్ద మంగళవారం తెల్లవారుజామున రైలు పట్టాలపై యువతి, యువకుడి మృత దేహాలను గుర్తించిన రైలు కో పైలట్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే ఎస్సై ప్రణయ్కుమార్ ఉదయం 4 గంటల ప్రాంతంలో సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. యువకుడికి 23, యువతికి 20 సంవత్సరాలు వయస్సు ఉండొచ్చని ఎస్సై పేర్కొన్నారు. అయితే ఘటన స్థలంలో మృతుల వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాలకు సమీపంలో సెల్ఫోన్ పడిఉన్నప్పటికీ అందులో అందులో సిమ్కార్డు లేదు. మృతదేహాలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మృతుల ఆచూకీ కోసం ఫొటోలను సివిల్ పోలీసులకు పంపించారు. ఎలాంటి సమాచారం లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులుగా కేసు నమోదు చేశారు. మృతులు ప్రేమజంట అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ అరెస్ట్
విశాఖపట్నం : రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కే జోజి ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు సోమవారం రాత్రి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అనంతరం అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి... పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ను అరెస్ట్ చేసి సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా... నిందితునికి జడ్జి ఈ నెల 27 వరకు రిమాండ్ విధించారు. పోలీసుల కథనం ప్రకారం.... ఓ వ్యక్తి.. ఏలూరు - తాడేపల్లిగూడెం మధ్య నడిచే రైళ్లలో తినుబండారాలు విక్రయించేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ను కోరాడు. అందుకు రెండు నెలలకు గాను రూ. 6000 వేలు చెల్లించాలని జోజి డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని సదరు వ్యక్తి జోజిని తెలిపాడు. అంతకంటే తక్కువ ఇస్తే అనుమతి ఇచ్చేది లేదని జోజి చెప్పడంతో.. బాధితుడు సీబీఐను ఆశ్రయించాడు. దీంతో సీబీఐ వలపన్ని జోజిని అరెస్ట్ చేశారు.