'కరువు సహాయక చర్యల్లో లోపాలున్నాయి'
హైదాబాద్: తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న కరువు పరిస్థితుల పై చర్చించడానికి త్వరలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం తెలిపారు. తెలంగాణలో కరువు తీవ్రంగా ఉందన్నారు. కరువు సహాయక చర్యల్లో లోపాలున్నాయని తెలిపారు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. పాలేరు ఉప ఎన్నికతో తమకు సంబంధం లేదన్నారు.
జూన్ 2న ఉద్యమకారుల ఆత్మగౌరవ దినంగా నిర్వహిస్తామన్నారు. ఉద్యమకారుల త్యాగాలను ఆ రోజు గుర్తు చేసుకుంటామన్నారు.